25-01-2026, 11:56 PM
Part - 61
అవని గ్లాస్ వంకా వాళ్ళ అత్తయ్య గారు వంక చూస్తూ బిక్క మొహం వేస్తోంది. అక్కడికి మాధవి వచ్చి ఏమైంది అని అడుగుతుంది.
దానికి లలిత చూడు.. నీ కూతురు పాలు తాగమంటే నా మొహం వంక చూస్తుంది. ముందు ఆ పాలు తాగించు. ఎలా ఉందో చూడు.
గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతుంది. నా కొడుకు పక్కన అనాలి కదా.. తాగించు తాగించు అని చెబుతుంది. మాధవి కూడా తాగు అన్నట్టుగా చూస్తే...
ప్లీజ్ అమ్మ ఈరోజుకి వదిలేయండి. రేపటి నుంచి మీరు ఎలా చెబితే అలా తాగుతాను. ఒక్కసారిగా ఫుడ్ అంత మార్చితే నాకు కూడా కష్టం కదా అర్థం చేసుకో అమ్మ అని బ్రతిమాలతూ ఉంటుంది.
అవిని పరిస్థితి అర్థం అయ్యి సరే అయితే.. రేపటి నుంచి నీ డైట్ చార్ట్ ప్రిపేర్ చేస్తాము. అలాగే తినాలి. అలాగే తాగాలి.అర్థమైందా...
వెళ్లి రెస్ట్ తీసుకో. లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత పిలుస్తాము అని చెబుతారు. పర్వాలేదు అమ్మ నేను హెల్ప్ చేస్తాను అంటే..
వద్దు వద్దు వెళ్లి రెస్ట్ తీసుకో. ఇక్కడే పనేమీ లేదు. సర్వెంట్స్ ఉన్నారు కదా... వెళ్ళు అని బలవంతంగా గదిలోకి పంపించేస్తుంది.
ధనుంజయ్ హాల్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి సత్యవతి గారు వచ్చి ధనుంజయ్ అని పిలుస్తారు.
చెప్పమ్మా అనగానే..భార్గవి గురించి ఏం ఆలోచించావు రా అని అడుగుతారు. ఆలోచించడానికి ఏమీ లేదు. జరగవలసిందే జరుగుతుంది అని చెబుతాడు.
అలా కాదురా..మారుతుందేమో ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని అంటారు. నువ్వు భార్గవి మీద జాలి పడుతున్నావా అమ్మ అని ఆశ్చర్యంగా అడుగుతాడు.
జాలి కాదురా.. ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నాను. మన బంధువులు అందరికీ భార్గవి తెలుసు. ఇప్పుడు భార్గవి ఎందుకు జైల్లో ఉంది అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి.
ఆ మాటలకు విరక్తిగా నవ్వుతూ పరువు.. ఆ పదానికి అసలు అర్థం ఏంటమ్మా..ఎన్ని తప్పులు చేసినా సరే కళ్ళు మూసుకుని కూర్చోవడమా...
నా పేరు చెప్పి అవిని నీ భయపెట్టి బయటికి రాకుండా చేసింది. అసలు అవని అనే ఇంకొక కూతురు ఉంది అని మన బంధువుల్లో ఎంతమందికి తెలుసు అమ్మ.
ఇప్పుడా అందరికీ అవని గురించి చెబితే అప్పుడు పోదా నా పరువు. మొదటి భార్య కూతుర్ని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేశాడు. ఈ మనిషి అని నా వెనకాల మాట్లాడుకోరా.. అప్పుడు మన పరువు ఏ గంగలో కలుస్తుంది.
తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. నాకా ఆ ధైర్యం ఉంది. నేను అలా ప్రవర్తించు ఉండి ఉంటానో లేదో అని మీరు తెలుసుకోకుండా మౌనంగా ఉండిపోయారు.
ఏరోజైనా సరే నా చొక్కా పట్టుకుని ఒరేయ్ ధనుంజయ్.. ఏంట్రా నువ్వు చేసేది అవని విషయంలో అని మీరు ధైర్యంగా అడగలేకపోయారు.
అడిగి ఉండుంటే కథ ఇంకొక లాగా ఉండి ఉండేది కదా..
నీ కడుపున పుట్టిన నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలియదా..నీకే తెలియనప్పుడు ఇంకా నా కూతురికి ఏం తెలుస్తుంది.
చాలా కష్టంగా ఉందమ్మా అవని నన్ను సార్ అని పిలుస్తూ ఉంటే.. అవని అసహ్యాన్ని భరించలేకపోతున్నాను.
ఇదంతా నా చేతలారా చేసుకుందే కదా...ఈరోజు నేను వెళ్లి నిజం చెప్పినా అవని నమ్మని స్థితిలో కి వచ్చాను .
నా కన్నీళ్లు చూసినా సరే అది ఒక నాటకం అనుకుంటుంది. నేను ఆ రాక్షసులు ఇద్దరు కోసమే తన ముందు నటిస్తున్నాను అనుకుంటుంది.
ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు కదా అని బాధగా కళ్ళు మూసుకుంటాడు. ఆ కనురెప్పల నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి.
సత్యవతి గారికి కూడా బాధగా అనిపించి ధనుంజయ్ భుజం మీద చెయ్యి వేస్తారు. ఇంకా ధనుంజయ్ తట్టుకోలేక తల్లి ఒడిలో పడుకొని గుక్క పెట్టి ఏడుస్తాడు.
శేషగిరి గారు కూడా ఏమీ మాట్లాడలేక పోతారు. ఇటు కొడుకు బాధలోనూ న్యాయం ఉంది. అటు అవని బాధలోనూ న్యాయం ఉంది.
ఈ సమస్యకు కాలమే పరిష్కారం చూపించాలి. తండ్రి కూతుర్లు కలపమని ఆ భగవంతున్ని కోరుకోవడం తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అని బాధగా కొడుకు వైపు చూస్తూ ఉంటారు.
కొంచెం సేపటికి ధనుంజయ్ సర్దుకుని పరవాలేదు అమ్మ నేను బాగానే ఉన్నాను. మీరు నా గురించి టెన్షన్ పడకండి అని చెబుతాడు.
మరి శిల్ప సంగతి ఏమిటిరా అని అడిగితే.. అది ఎప్పుడో దారి తప్పింది. ఏమైనా మారితే మనతో పాటు ఉంటుంది.
లేకపోతే తల్లిదారిలోనే అది కూడా.. ఇద్దరికీ నీళ్లు వదిలేయడం తప్ప ఇంకా ఏమీ చేయలేను. కళ్ళున్న గుడ్డివాడిని కదా... ఆ గుడ్డితనంతోనే నా రోజులు వెళ్ళదీయాలి.
భార్గవి మారుతుందేమో ఆశ అయితే నాకు లేదు. ఇప్పటికి కూడా నాటకాలు ఆడి నన్ను రప్పించుకోవాలని చూస్తుంది కానీ..చేసిన తప్పులు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలని మాత్రం అనుకోవడం లేదు.
వాళ్ళిద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెబుతాడు. వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే సెక్యూరిటీ నుంచి ఫోన్ వస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే... సార్ బిందు మేడం మన గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలి అని బ్రతిమాలుతున్నారు.. ఏం చేయమంటారు అని అడుగుతాడు.
లోపలికి పంపించండి అని చెబుతాడు. ఎవర్రా అని అడిగితే బిందు అని చెబుతాడు. బిందు పేరు వినగానే సత్యవతి గారికి, శేషగిరి గారికి చాలా కోపం వస్తుంది.
ఎందుకురా ఆ పాపిస్టిదాన్ని లోపలికి రమ్మంటున్నావు అంటే... ఏం చెబుతుందో వినాలి కదా... ఎవరి చేసిన పాపం వాళ్లు నోట వెంట వస్తేనే బాగుంటుంది కదా అమ్మ అని బిందు కోసం చూస్తూ ఉంటాడు.
లోపలికి వచ్చిన బిందు అక్కడున్న ముగ్గురిని చూసి భయపడుతుంది. కొంచెం ధైర్యం చేసుకుని బాగున్నారా అన్నయ్యగారు, పెద్దమ్మ గారు, పెదనాన్నగారు అని పలకరిస్తుంది.
ఎందుకొచ్చావో చెప్పు నీలాంటి దాని మొఖం చూస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. తొందరగా వచ్చిన పని చెప్పి వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాలని చిరాగ్గా అంటారు.
ఎందుకు పెద్దమ్మ గారు మీకు అంత కోపం. ఇప్పుడు నేనేమి చేశాను అని బాధగా అడుగుతుంది. నువ్వేం చేసావో నీకు తెలియదా..
నీ కొడుకు నా మనవరాలపై అంత అఘాయిత్యం చేస్తూ ఉంటే.. సినిమా చూసినట్టు చోద్యం చూసావు కానీ ఇది తప్పురా అని చెప్పావా...
మీ మొగుడు పెళ్ళానికి నా కొడుకు ఏమి తక్కువ చేశాడు. ఏది కావాలంటే అది అరేంజ్ చేశాడు. నీ మొగుడికి కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. నీ కొడుకుని నా మనవరాలు తో సమానంగా చూశాడు.
అయినా మీ దాహం తీరలేదా.. నా బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఏం మనుషులే మీరు అని తిడతారు.
ఆ మాటలకి సిగ్గుతో తలవంచుకొని మీరన్న ప్రతి మాట నిజమే పెద్దమ్మ గారు. ఒక ఆడదాన్ని అయ్యుండి మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ ఉంటే ఎంజాయ్ చేశాను. అందుకు తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను.
మనం చేసిన పాపమైన, పుణ్యమైన ఇక్కడే అనుభవించాలి అంటారు. ఈ నిమిషం మనం చేసే ప్రతి పని మనకు సంతోషాన్నివ్వచ్చేమో గానీ...
దాని ప్రతిఫలం మాత్రం ముందు ముందు అనుభవించాలి అన్న విషయం మరిచిపోయి అవిని విషయంలో చాలా నీచంగా ప్రవర్తించాను.
భార్గవి అవని జీవితాన్ని నాశనం చేయాలి అని చిన్నప్పటినుండే ఉదయ్ ని ఉసుగలుపుతుంటే తప్పు అని చెప్పలేదు.
మా సుఖాలు మేము చూసుకున్నాము. అందుకే ఇప్పుడు నా భర్త జైల్లో కూర్చున్నాడు. నా కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అయిపోయింది అని ఏడుస్తుంది.
సత్యవతి గారి ఆశ్చర్యంగా ఏమంటున్నావ్ నువ్వు అని అడిగితే.. నేను నిజమే చెబుతున్నాను పెద్దమ్మ గారు. ఉదయ్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత విక్రమ్ గారే ట్రీట్మెంట్ ఇప్పించారు.
కొన్ని రోజులకి ఏమైందో తెలియదు కానీ...విక్రమ్ చాలా కోపంగా వచ్చి... అప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నా నా కొడుకుని మళ్ళీ చితకబాది ఎక్కడికో తీసుకువెళ్లారు.
మీరు ఒక్కసారి మాట్లాడితే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. నా కొడుకుని తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది.
బిందు బాధ అర్థం అవుతున్నా సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ధనుంజయ్ బిందువైపు చూస్తూ నువ్వు నాకు ఒక సహాయం చేయగలుగుతావా... దానికి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నేను కనుక్కొని చెబుతాను అంటాడు.
బిందు సంతోషంగా చెప్పండి అన్నయ్య గారు.. నేను ఏం సహాయం చేయాలి అని అడిగితే...నా కూతురు దగ్గరికి వెళ్లి మీ నాన్నని క్షమించి నాన్న అని పిలువు అని అడగగలుగుతావా అని అంటాడు.
ఆ మాటలకి భయంగా చూస్తూ... అవని తో నేను ఎలా చెప్పగలుగుతాను. నేను చెప్పినంత మాత్రాన అవని నా మాట వింటుందా...మిమ్మల్ని నాన్న అని పిలుస్తుందా అని అడిగితే...
ఇప్పుడు అర్థమైంది కదా నేను వెళ్లి అడిగితే మాత్రం విక్రమ్ చెబుతాడు అని అనుకుంటున్నావా... తండ్రిగా నేను ఫెయిల్అయ్యాను గాని...
భర్తగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. నా కూతురు మరొకరికి దత్తత వెళ్లి నాన్న అని పిలుస్తుంది. అది నాకు ఎంత రంపపు కోతగా ఉందో మీకు తెలుసా...
మనిషికి స్వార్థం ఉండవచ్చు కానీ మీలాగా అత్యాశ ఉండకూడదు నా కూతుర్ని నా నుంచి దూరం చేసి ఏమి సాధించారు. 20 సంవత్సరాలు పైశాచిక ఆనందం పొందారు అంతే కదా...
వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ... వయసు అయిపోయేటప్పటికి మనకి తోడుగా ఎవరో ఒకరు ఉండాలి అనుకుంటాము.
అది లైఫ్ పార్టనర్ అయిన, మన పిల్లలైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీ స్వార్థం వలన ఈరోజు నాకు ఎవరూ లేకుండా అయిపోయింది.
ఇంత చేసిన మీరందరూ ఏమి సుఖపడ్డారు... చెట్టుకొక్కళ్ళు, పుట్టకొకళ్ళు అయినట్టు అయిపోయారు కదా అని బాధగా అడుగుతాడు.
దానికి లలిత చూడు.. నీ కూతురు పాలు తాగమంటే నా మొహం వంక చూస్తుంది. ముందు ఆ పాలు తాగించు. ఎలా ఉందో చూడు.
గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతుంది. నా కొడుకు పక్కన అనాలి కదా.. తాగించు తాగించు అని చెబుతుంది. మాధవి కూడా తాగు అన్నట్టుగా చూస్తే...
ప్లీజ్ అమ్మ ఈరోజుకి వదిలేయండి. రేపటి నుంచి మీరు ఎలా చెబితే అలా తాగుతాను. ఒక్కసారిగా ఫుడ్ అంత మార్చితే నాకు కూడా కష్టం కదా అర్థం చేసుకో అమ్మ అని బ్రతిమాలతూ ఉంటుంది.
అవిని పరిస్థితి అర్థం అయ్యి సరే అయితే.. రేపటి నుంచి నీ డైట్ చార్ట్ ప్రిపేర్ చేస్తాము. అలాగే తినాలి. అలాగే తాగాలి.అర్థమైందా...
వెళ్లి రెస్ట్ తీసుకో. లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత పిలుస్తాము అని చెబుతారు. పర్వాలేదు అమ్మ నేను హెల్ప్ చేస్తాను అంటే..
వద్దు వద్దు వెళ్లి రెస్ట్ తీసుకో. ఇక్కడే పనేమీ లేదు. సర్వెంట్స్ ఉన్నారు కదా... వెళ్ళు అని బలవంతంగా గదిలోకి పంపించేస్తుంది.
ధనుంజయ్ హాల్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి సత్యవతి గారు వచ్చి ధనుంజయ్ అని పిలుస్తారు.
చెప్పమ్మా అనగానే..భార్గవి గురించి ఏం ఆలోచించావు రా అని అడుగుతారు. ఆలోచించడానికి ఏమీ లేదు. జరగవలసిందే జరుగుతుంది అని చెబుతాడు.
అలా కాదురా..మారుతుందేమో ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని అంటారు. నువ్వు భార్గవి మీద జాలి పడుతున్నావా అమ్మ అని ఆశ్చర్యంగా అడుగుతాడు.
జాలి కాదురా.. ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నాను. మన బంధువులు అందరికీ భార్గవి తెలుసు. ఇప్పుడు భార్గవి ఎందుకు జైల్లో ఉంది అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి.
ఆ మాటలకు విరక్తిగా నవ్వుతూ పరువు.. ఆ పదానికి అసలు అర్థం ఏంటమ్మా..ఎన్ని తప్పులు చేసినా సరే కళ్ళు మూసుకుని కూర్చోవడమా...
నా పేరు చెప్పి అవిని నీ భయపెట్టి బయటికి రాకుండా చేసింది. అసలు అవని అనే ఇంకొక కూతురు ఉంది అని మన బంధువుల్లో ఎంతమందికి తెలుసు అమ్మ.
ఇప్పుడా అందరికీ అవని గురించి చెబితే అప్పుడు పోదా నా పరువు. మొదటి భార్య కూతుర్ని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేశాడు. ఈ మనిషి అని నా వెనకాల మాట్లాడుకోరా.. అప్పుడు మన పరువు ఏ గంగలో కలుస్తుంది.
తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. నాకా ఆ ధైర్యం ఉంది. నేను అలా ప్రవర్తించు ఉండి ఉంటానో లేదో అని మీరు తెలుసుకోకుండా మౌనంగా ఉండిపోయారు.
ఏరోజైనా సరే నా చొక్కా పట్టుకుని ఒరేయ్ ధనుంజయ్.. ఏంట్రా నువ్వు చేసేది అవని విషయంలో అని మీరు ధైర్యంగా అడగలేకపోయారు.
అడిగి ఉండుంటే కథ ఇంకొక లాగా ఉండి ఉండేది కదా..
నీ కడుపున పుట్టిన నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలియదా..నీకే తెలియనప్పుడు ఇంకా నా కూతురికి ఏం తెలుస్తుంది.
చాలా కష్టంగా ఉందమ్మా అవని నన్ను సార్ అని పిలుస్తూ ఉంటే.. అవని అసహ్యాన్ని భరించలేకపోతున్నాను.
ఇదంతా నా చేతలారా చేసుకుందే కదా...ఈరోజు నేను వెళ్లి నిజం చెప్పినా అవని నమ్మని స్థితిలో కి వచ్చాను .
నా కన్నీళ్లు చూసినా సరే అది ఒక నాటకం అనుకుంటుంది. నేను ఆ రాక్షసులు ఇద్దరు కోసమే తన ముందు నటిస్తున్నాను అనుకుంటుంది.
ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు కదా అని బాధగా కళ్ళు మూసుకుంటాడు. ఆ కనురెప్పల నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి.
సత్యవతి గారికి కూడా బాధగా అనిపించి ధనుంజయ్ భుజం మీద చెయ్యి వేస్తారు. ఇంకా ధనుంజయ్ తట్టుకోలేక తల్లి ఒడిలో పడుకొని గుక్క పెట్టి ఏడుస్తాడు.
శేషగిరి గారు కూడా ఏమీ మాట్లాడలేక పోతారు. ఇటు కొడుకు బాధలోనూ న్యాయం ఉంది. అటు అవని బాధలోనూ న్యాయం ఉంది.
ఈ సమస్యకు కాలమే పరిష్కారం చూపించాలి. తండ్రి కూతుర్లు కలపమని ఆ భగవంతున్ని కోరుకోవడం తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అని బాధగా కొడుకు వైపు చూస్తూ ఉంటారు.
కొంచెం సేపటికి ధనుంజయ్ సర్దుకుని పరవాలేదు అమ్మ నేను బాగానే ఉన్నాను. మీరు నా గురించి టెన్షన్ పడకండి అని చెబుతాడు.
మరి శిల్ప సంగతి ఏమిటిరా అని అడిగితే.. అది ఎప్పుడో దారి తప్పింది. ఏమైనా మారితే మనతో పాటు ఉంటుంది.
లేకపోతే తల్లిదారిలోనే అది కూడా.. ఇద్దరికీ నీళ్లు వదిలేయడం తప్ప ఇంకా ఏమీ చేయలేను. కళ్ళున్న గుడ్డివాడిని కదా... ఆ గుడ్డితనంతోనే నా రోజులు వెళ్ళదీయాలి.
భార్గవి మారుతుందేమో ఆశ అయితే నాకు లేదు. ఇప్పటికి కూడా నాటకాలు ఆడి నన్ను రప్పించుకోవాలని చూస్తుంది కానీ..చేసిన తప్పులు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలని మాత్రం అనుకోవడం లేదు.
వాళ్ళిద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెబుతాడు. వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే సెక్యూరిటీ నుంచి ఫోన్ వస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే... సార్ బిందు మేడం మన గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలి అని బ్రతిమాలుతున్నారు.. ఏం చేయమంటారు అని అడుగుతాడు.
లోపలికి పంపించండి అని చెబుతాడు. ఎవర్రా అని అడిగితే బిందు అని చెబుతాడు. బిందు పేరు వినగానే సత్యవతి గారికి, శేషగిరి గారికి చాలా కోపం వస్తుంది.
ఎందుకురా ఆ పాపిస్టిదాన్ని లోపలికి రమ్మంటున్నావు అంటే... ఏం చెబుతుందో వినాలి కదా... ఎవరి చేసిన పాపం వాళ్లు నోట వెంట వస్తేనే బాగుంటుంది కదా అమ్మ అని బిందు కోసం చూస్తూ ఉంటాడు.
లోపలికి వచ్చిన బిందు అక్కడున్న ముగ్గురిని చూసి భయపడుతుంది. కొంచెం ధైర్యం చేసుకుని బాగున్నారా అన్నయ్యగారు, పెద్దమ్మ గారు, పెదనాన్నగారు అని పలకరిస్తుంది.
ఎందుకొచ్చావో చెప్పు నీలాంటి దాని మొఖం చూస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. తొందరగా వచ్చిన పని చెప్పి వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాలని చిరాగ్గా అంటారు.
ఎందుకు పెద్దమ్మ గారు మీకు అంత కోపం. ఇప్పుడు నేనేమి చేశాను అని బాధగా అడుగుతుంది. నువ్వేం చేసావో నీకు తెలియదా..
నీ కొడుకు నా మనవరాలపై అంత అఘాయిత్యం చేస్తూ ఉంటే.. సినిమా చూసినట్టు చోద్యం చూసావు కానీ ఇది తప్పురా అని చెప్పావా...
మీ మొగుడు పెళ్ళానికి నా కొడుకు ఏమి తక్కువ చేశాడు. ఏది కావాలంటే అది అరేంజ్ చేశాడు. నీ మొగుడికి కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. నీ కొడుకుని నా మనవరాలు తో సమానంగా చూశాడు.
అయినా మీ దాహం తీరలేదా.. నా బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఏం మనుషులే మీరు అని తిడతారు.
ఆ మాటలకి సిగ్గుతో తలవంచుకొని మీరన్న ప్రతి మాట నిజమే పెద్దమ్మ గారు. ఒక ఆడదాన్ని అయ్యుండి మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ ఉంటే ఎంజాయ్ చేశాను. అందుకు తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను.
మనం చేసిన పాపమైన, పుణ్యమైన ఇక్కడే అనుభవించాలి అంటారు. ఈ నిమిషం మనం చేసే ప్రతి పని మనకు సంతోషాన్నివ్వచ్చేమో గానీ...
దాని ప్రతిఫలం మాత్రం ముందు ముందు అనుభవించాలి అన్న విషయం మరిచిపోయి అవిని విషయంలో చాలా నీచంగా ప్రవర్తించాను.
భార్గవి అవని జీవితాన్ని నాశనం చేయాలి అని చిన్నప్పటినుండే ఉదయ్ ని ఉసుగలుపుతుంటే తప్పు అని చెప్పలేదు.
మా సుఖాలు మేము చూసుకున్నాము. అందుకే ఇప్పుడు నా భర్త జైల్లో కూర్చున్నాడు. నా కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అయిపోయింది అని ఏడుస్తుంది.
సత్యవతి గారి ఆశ్చర్యంగా ఏమంటున్నావ్ నువ్వు అని అడిగితే.. నేను నిజమే చెబుతున్నాను పెద్దమ్మ గారు. ఉదయ్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత విక్రమ్ గారే ట్రీట్మెంట్ ఇప్పించారు.
కొన్ని రోజులకి ఏమైందో తెలియదు కానీ...విక్రమ్ చాలా కోపంగా వచ్చి... అప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నా నా కొడుకుని మళ్ళీ చితకబాది ఎక్కడికో తీసుకువెళ్లారు.
మీరు ఒక్కసారి మాట్లాడితే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. నా కొడుకుని తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది.
బిందు బాధ అర్థం అవుతున్నా సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ధనుంజయ్ బిందువైపు చూస్తూ నువ్వు నాకు ఒక సహాయం చేయగలుగుతావా... దానికి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నేను కనుక్కొని చెబుతాను అంటాడు.
బిందు సంతోషంగా చెప్పండి అన్నయ్య గారు.. నేను ఏం సహాయం చేయాలి అని అడిగితే...నా కూతురు దగ్గరికి వెళ్లి మీ నాన్నని క్షమించి నాన్న అని పిలువు అని అడగగలుగుతావా అని అంటాడు.
ఆ మాటలకి భయంగా చూస్తూ... అవని తో నేను ఎలా చెప్పగలుగుతాను. నేను చెప్పినంత మాత్రాన అవని నా మాట వింటుందా...మిమ్మల్ని నాన్న అని పిలుస్తుందా అని అడిగితే...
ఇప్పుడు అర్థమైంది కదా నేను వెళ్లి అడిగితే మాత్రం విక్రమ్ చెబుతాడు అని అనుకుంటున్నావా... తండ్రిగా నేను ఫెయిల్అయ్యాను గాని...
భర్తగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. నా కూతురు మరొకరికి దత్తత వెళ్లి నాన్న అని పిలుస్తుంది. అది నాకు ఎంత రంపపు కోతగా ఉందో మీకు తెలుసా...
మనిషికి స్వార్థం ఉండవచ్చు కానీ మీలాగా అత్యాశ ఉండకూడదు నా కూతుర్ని నా నుంచి దూరం చేసి ఏమి సాధించారు. 20 సంవత్సరాలు పైశాచిక ఆనందం పొందారు అంతే కదా...
వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ... వయసు అయిపోయేటప్పటికి మనకి తోడుగా ఎవరో ఒకరు ఉండాలి అనుకుంటాము.
అది లైఫ్ పార్టనర్ అయిన, మన పిల్లలైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీ స్వార్థం వలన ఈరోజు నాకు ఎవరూ లేకుండా అయిపోయింది.
ఇంత చేసిన మీరందరూ ఏమి సుఖపడ్డారు... చెట్టుకొక్కళ్ళు, పుట్టకొకళ్ళు అయినట్టు అయిపోయారు కదా అని బాధగా అడుగుతాడు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)