24-01-2026, 05:39 PM
అమ్మమ్మ కోరిక
#అమ్మమ్మకోరిక#
ఆపీసు నుండి ఇంటికి వచ్చాను.ఇంటి డోరు ముందు నిలబడి తలుపు తట్టాను.తలుపు తీసిన వ్యక్తిని చూసి నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను.ఎదురుగా అమ్మమ్మ.నా కు ఎంతో ప్రియాతి ప్రియమైన అమ్మమ్మ..ఒక్కసారిగా సంభ్రమాశ్చార్యంలో మునిగి పోయాను.
"అమ్మమ్మా! నువ్వెప్పుడొచ్చావు ..ఆత్రంగా అమ్మ మ్మని చుట్టేస్తూ అడిగాను
"అబ్ఫా ! వచ్చి గంటే అయ్యిందిలేవే..ముందు నువ్వు బట్టలవీ మార్చుకుని ఫ్రష్షై రా..అంటోంది అమ్మ..అమ్మమ్మకూడా ..నానుదుటిన ముద్దుపెట్టుకొని ..అమ్మలూ ..పొద్దునెప్పుడో వెళ్ళావు .వెళ్ళు మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని రా అంది ఆప్యాయంగా.ఇదిగో చిటికెలో వచ్చేస్తాను అంటూ బాత్రూంలోకి దూరాను నేను.
******
నేను ఫ్రష్షై వచ్చేసరికి అమ్మా , అమ్మ మ్మా టేబిల్ దగ్గర కూర్చొని ఉన్నారు.టేబిల్ పైన ప్లేట్లల్లో నాకిష్టమైన వేడి వేడి మిర్చి బజ్జీలున్నాయి. వచ్చి గబగబా ఒక మిర్చిబజ్జీని కొరుకుతూ .
"ఆ..ఇప్పుడు చెప్పు అమ్మమ్మా. ....ఎన్నాళ్ళైంది..! నువ్వొచ్చి ....ఎప్పుడూ మీ ఊరికి మేము రావటమే కాని నువ్వెప్పుడూ రావుగా..ఎప్పుడో నేను పెద్దమనిషినైనప్పుడు వచ్చి నా బలవంతం మీద ఓ పదిరోజులున్నావు మళ్ళీ ఎవరి పెళ్ళిళ్ళకన్నా వచ్చినా ఇలా వచ్చికనబడి మళ్ళీ పెళ్ళివారితోనే ఊరెళ్ళిపోయేదానివి..చాలా రోజులకు వచ్చావు..ఈసారి నువ్విక్కడ ఓ పది రోజులు ఉండాల్సిందే ..లేకపోతే నేనొప్పుకోను..అంతే అన్నా ...ముగ్గురం తినగా మిగిలిన చివరి బజ్జీని తింటూ.
"చాల్లేవే మా అమ్మ మీద నీ దబాయింపు ఏవిటే..అమ్మ మ్మ తాతయ్య గారి స్నేహితుడైన శేషగిరి బాబాయి మనవరాలి పెళ్ళికని పెద్ద మావయ్య వాళ్ళతో కలిసి వచ్చింది. తాతయ్యేమో నాట్లు వేసే సమయమని చాలా పన్లు ఉన్నాయని పెళ్ళికి ఎవరో ఒకరు వెళ్ళకపోతే బాగుండదని అమ్మ మ్మను వెళ్ళమంటే పె ళ్ళవగానే పెద్దమావయ్యతో నిన్ను చూడాలని ఉందని చెప్పిందట. అందుకే ఇక్కడ దించి వెళ్ళాడు.నేనూ ఉండమనే అన్నాను ఓ పది రోజులు..అక్కడ ఊర్లో మీ తాతయ్య ఒక్కరూ ఉన్నారుగా..ఎంత మా మేనత్త ఉన్నప్పటికీ ఆవిడకు డెభ్భై ఏళ్ళు.ఆవిడ నాన్నకు వండి పెట్టలేదు .కాస్త తనొచ్చేంతవరకూ వంటావిడకి ఇద్దరికీ వండి పెట్టమని చెప్పి వచ్చిందట.."!
అమ్మ ఇలా చెబుతుంటే ఊరు నుండి నాకోసం చేసి తీసుకొచ్చిన అరిసెలు, జంతికలు, సున్నిండల డబ్బాలను అమ్ములూ ఇంద అంటూ నా చేతికిచ్చింది అమ్మమ్మ..సంతోషంగా తీసుకున్నాను చిన్నపిల్లలా మురిసిపోతూ ..
అమ్మ మ్మ వచ్చింది కాబట్టి రెండు రోజులు ఆఫీసుకు సెలవ పెట్టేస్తాను తరువాత ఎలాగూ శని ఆదివారాలు నాకు సెలవేకాబట్టి నాల్రోజులు అమ్మ మ్మతో హ్యాపీ గా ఉండొచ్చు అని అమ్మతో చెప్పేశాను. నాన్న గారు ఆఫీసు పని మీద క్యాంప్ కు వెళ్ళారు ఆయన వారం రోజుల వరకూ రారు. నేనూ, అమ్మ , అమ్మమ్మ ముగ్గురమే ఉన్నాం కాబట్టి ఎంచక్కా కబుర్లెన్నో చెప్పుకోవచ్చు .రేపు అమ్మ మ్మను ఎక్కడకన్నా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. ఇంతలోఅమ్మ చక్కని ఫిల్టర్ కాఫీ పట్టుకొచ్చింది ముగ్గురికి. కాఫీ తాగుతూ అమ్మ ఎన్నో ఆరాలను అడుగుతోంది అమ్మమ్మని .ఇద్దరూ అలా మాట్లా డుకుంటూ ఉంటే చాలా ముచ్చటేసింది నాకు.తరువాత రాత్రి భోజనాలైన తరువాత ఊరి ప్రయాణ బడలిక వలన అమ్మమ్మ తొందరగా నిద్రపోయింది. .ప్రశాంత వదనంతో నిద్ర బోతున్న అమ్మమ్మను చూస్తూ అమ్మ ఇటీవల అమ్మ మ్మ గురించి చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఆలోచిస్తూ పడుకున్నాను.
*******
అమ్మమ్మకు తన పదిహేనో యేటే పెండ్లైయింది.వెంటనే కాపరానికి వచ్చిన ఆమెకు అత్తగారు, మావగారు, పెళ్ళై మొగుడు పోయిన తన భర్త అక్కగారు, పెళ్లి కాని ఆడపడుచు ఇద్దరు మరుదులు, వీళ్ళందరికీ వండి పెట్టడం చాకిరీతోనే జీవితంమొదలైందామెకు..అమ్మమ్మ చాలా మెతక మనిషి. అందరూ చెప్పిన పనులన్నీ ఎంతో ఓపిగ్గా చేసేది.ఎవరన్నా విసుక్కున్నా , తిట్టినా తలవంచుకు నిలబడేదే కాని పల్లెత్తు మాట కూడా అనేది కాదట..ఆడ పడుచు, పెళ్ళి మరుదుల చదువులు , పెళ్ళిళ్ళు, ఆ తరువాత అత్తగారు, మావగారు కాలం చేయటం. జరిగాయి. అమ్మమ్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. అమ్మమ్మ ఏనాడూ నోరెత్తి నాకు ఇది కావారని అడలేదు తాతయ్యని.సగటు ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ నెరవేర్చింది..
.తాతయ్య అక్క మొగుడు.పెళ్ళైన రెండు నెలలకే పోవడంతో, ఆచారం ప్రకారం ఆమెకు జుట్టు తీసి , తెల్లచీరకట్టించారు, అప్పట్లో.కాపరానికి వచ్చిన అమ్మమ్మను చూస్తే ఆవిడ కు చాలా అసూయ గా ఉండేది. ఆవిడకంటే అమ్మ మ్మ వయసులో ఐదేళ్ళే చిన్నది. ఇంచు మించు ఇద్దరూ ఒకే వయసు వారిలా ఉండేవాళ్ళు.ఆవిడ అమ్మమ్మను ఎప్పుడూ ఆడిపోసుకునేదట.కాళ్ళకు మెట్టెలతో పారాణి పాదాలకు పట్టీలు పెట్టుకుని పచ్చగా కాళ్ళకు పసుపు రాసుకుని చక్కగా లక్ష్మీ దేవిలా అమ్మ మ్మ తిరుగుతుంటే చూసి ఓర్వ లేకపోయేదట.ముఖ్యంగా ఘల్లు ఘల్లు మని పట్టీల మ్రోగుతుంటే అస్సలు సహించలేకపోయేదట..
ఒక రోజు పెద్ద గొడవ జరిగిందట ..ఆ రోజు ఇంటికెవరో దూరపు బంధువులు వచ్చారట.అందులో ఒకతను అమ్మ మ్మ అటూ ఇటూ తిరుగుతూ కాఫీలు అవీ ఇవీ అందిస్తుంటే ఆమె పట్టీలవంకే చూస్తూ ఉన్నాడట..వాళ్ళు వెళ్ళిపోగానే పెద్దాడబడుచు రయ్ మని లేచిందిట... ..
"ఇదేం ఇల్లనుకున్నావా , సానికొంప అనుకున్నావా" ...
నువ్వలా గజ్జెలు పెట్టుకుని వయ్యారంగా ఘల్లు ఘల్లుమని నడిస్తే మగ వెధవలు అందరూ నిన్నే చూస్తారు .
హవ్వ..సంసారుల లక్షణం ఇదేనా .ఘల్లు ఘల్లు మని చప్పుడుతో పరాయి మగాడిని ఆకర్షించాలా. మా ఇంటా వంటా లేదమ్మా..నడిస్తే గాజుల చప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా ఉంటారందరూ...
ఏరా తమ్ముడూ ..నీ పెళ్ళాం ఇలా పట్టీలు పెట్టుకుని తిరిగిందంటే మన సంప్రదాయం మంటకలుస్తుంది..నలుగురూ వచ్చి పోయే ఇల్లు..వచ్చి పోయే వారందరూ దీన్నే చూస్తారు. నువ్వు కనక దాని చేత పట్టీలను తీయించకపోతే ఇహ నేను ఒక్కక్షణం కూడా ఇంట్లో ఉండను.ఏ గోదాట్లోనో దూకుతాను....అంటూ బుడిబుడి రాగాలన దీస్తూ తెగేసి చెప్పిందట..అమ్మ మ్మ అత్తగారు, మావగారు కూడా తలచెడిన కూతురి మనస్తత్వం గ్రహించి ఆమె మాట కాదంటే ఏ అఘాయిత్యం చేస్తుందో నని పట్టీలను తీసేయమని చెప్పారు.పట్టీలంటే ఎంతో ఇష్టం ఉన్న అమ్మ మ్మ తాతయ్య వంక చూసిందట ఏమంటారని.ఆయన మరేమీ మాట్లాడకుండా అమ్మ, అక్క చెప్పినట్టు చేయి అన్నట్టు చూపులతోనే సైగ చేసి చెప్పారట..ఎంతో బాధ పడుతూ గజ్జెలను తీసేసిందట అమ్మ మ్మ..పట్టీలను తీసేసి అమ్మ మ్మ బోసి కాళ్ళతో నడుస్తుంటే ఒక విధమైన పైశాచికానందం పొందిందట ఆడపడుచు..మొత్తానికి ఆవిడ అమ్మ మ్మ పట్టీలను తీయించే వరకూ నిద్రపోలేదట..ఇక్కడ చిత్రం ఏమిటంటే పెళ్ళి కాని చిన్నాడపడుచు అమ్మ మ్మ పట్టీలను పెట్టుకుని ఘల్లు ఘల్లుమని తిరిగేదట.అమ్మ మ్మ బాధనంతా గుండెల్లో దిగమింగుకొని మళ్ళీ ఏనాడూ పట్టీలను పెట్టుకోలేదట.కానీ పట్టీలు పెట్టుకున్న వాళ్ళను ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ వంక నిర్లిప్తంగా చూస్తూ మనసులో బాధ పడుతూ ఉండిపోయేదట అమ్మమ్మ. !!!
#అమ్మమ్మకోరిక#
ఆపీసు నుండి ఇంటికి వచ్చాను.ఇంటి డోరు ముందు నిలబడి తలుపు తట్టాను.తలుపు తీసిన వ్యక్తిని చూసి నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను.ఎదురుగా అమ్మమ్మ.నా కు ఎంతో ప్రియాతి ప్రియమైన అమ్మమ్మ..ఒక్కసారిగా సంభ్రమాశ్చార్యంలో మునిగి పోయాను.
"అమ్మమ్మా! నువ్వెప్పుడొచ్చావు ..ఆత్రంగా అమ్మ మ్మని చుట్టేస్తూ అడిగాను
"అబ్ఫా ! వచ్చి గంటే అయ్యిందిలేవే..ముందు నువ్వు బట్టలవీ మార్చుకుని ఫ్రష్షై రా..అంటోంది అమ్మ..అమ్మమ్మకూడా ..నానుదుటిన ముద్దుపెట్టుకొని ..అమ్మలూ ..పొద్దునెప్పుడో వెళ్ళావు .వెళ్ళు మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని రా అంది ఆప్యాయంగా.ఇదిగో చిటికెలో వచ్చేస్తాను అంటూ బాత్రూంలోకి దూరాను నేను.
******
నేను ఫ్రష్షై వచ్చేసరికి అమ్మా , అమ్మ మ్మా టేబిల్ దగ్గర కూర్చొని ఉన్నారు.టేబిల్ పైన ప్లేట్లల్లో నాకిష్టమైన వేడి వేడి మిర్చి బజ్జీలున్నాయి. వచ్చి గబగబా ఒక మిర్చిబజ్జీని కొరుకుతూ .
"ఆ..ఇప్పుడు చెప్పు అమ్మమ్మా. ....ఎన్నాళ్ళైంది..! నువ్వొచ్చి ....ఎప్పుడూ మీ ఊరికి మేము రావటమే కాని నువ్వెప్పుడూ రావుగా..ఎప్పుడో నేను పెద్దమనిషినైనప్పుడు వచ్చి నా బలవంతం మీద ఓ పదిరోజులున్నావు మళ్ళీ ఎవరి పెళ్ళిళ్ళకన్నా వచ్చినా ఇలా వచ్చికనబడి మళ్ళీ పెళ్ళివారితోనే ఊరెళ్ళిపోయేదానివి..చాలా రోజులకు వచ్చావు..ఈసారి నువ్విక్కడ ఓ పది రోజులు ఉండాల్సిందే ..లేకపోతే నేనొప్పుకోను..అంతే అన్నా ...ముగ్గురం తినగా మిగిలిన చివరి బజ్జీని తింటూ.
"చాల్లేవే మా అమ్మ మీద నీ దబాయింపు ఏవిటే..అమ్మ మ్మ తాతయ్య గారి స్నేహితుడైన శేషగిరి బాబాయి మనవరాలి పెళ్ళికని పెద్ద మావయ్య వాళ్ళతో కలిసి వచ్చింది. తాతయ్యేమో నాట్లు వేసే సమయమని చాలా పన్లు ఉన్నాయని పెళ్ళికి ఎవరో ఒకరు వెళ్ళకపోతే బాగుండదని అమ్మ మ్మను వెళ్ళమంటే పె ళ్ళవగానే పెద్దమావయ్యతో నిన్ను చూడాలని ఉందని చెప్పిందట. అందుకే ఇక్కడ దించి వెళ్ళాడు.నేనూ ఉండమనే అన్నాను ఓ పది రోజులు..అక్కడ ఊర్లో మీ తాతయ్య ఒక్కరూ ఉన్నారుగా..ఎంత మా మేనత్త ఉన్నప్పటికీ ఆవిడకు డెభ్భై ఏళ్ళు.ఆవిడ నాన్నకు వండి పెట్టలేదు .కాస్త తనొచ్చేంతవరకూ వంటావిడకి ఇద్దరికీ వండి పెట్టమని చెప్పి వచ్చిందట.."!
అమ్మ ఇలా చెబుతుంటే ఊరు నుండి నాకోసం చేసి తీసుకొచ్చిన అరిసెలు, జంతికలు, సున్నిండల డబ్బాలను అమ్ములూ ఇంద అంటూ నా చేతికిచ్చింది అమ్మమ్మ..సంతోషంగా తీసుకున్నాను చిన్నపిల్లలా మురిసిపోతూ ..
అమ్మ మ్మ వచ్చింది కాబట్టి రెండు రోజులు ఆఫీసుకు సెలవ పెట్టేస్తాను తరువాత ఎలాగూ శని ఆదివారాలు నాకు సెలవేకాబట్టి నాల్రోజులు అమ్మ మ్మతో హ్యాపీ గా ఉండొచ్చు అని అమ్మతో చెప్పేశాను. నాన్న గారు ఆఫీసు పని మీద క్యాంప్ కు వెళ్ళారు ఆయన వారం రోజుల వరకూ రారు. నేనూ, అమ్మ , అమ్మమ్మ ముగ్గురమే ఉన్నాం కాబట్టి ఎంచక్కా కబుర్లెన్నో చెప్పుకోవచ్చు .రేపు అమ్మ మ్మను ఎక్కడకన్నా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. ఇంతలోఅమ్మ చక్కని ఫిల్టర్ కాఫీ పట్టుకొచ్చింది ముగ్గురికి. కాఫీ తాగుతూ అమ్మ ఎన్నో ఆరాలను అడుగుతోంది అమ్మమ్మని .ఇద్దరూ అలా మాట్లా డుకుంటూ ఉంటే చాలా ముచ్చటేసింది నాకు.తరువాత రాత్రి భోజనాలైన తరువాత ఊరి ప్రయాణ బడలిక వలన అమ్మమ్మ తొందరగా నిద్రపోయింది. .ప్రశాంత వదనంతో నిద్ర బోతున్న అమ్మమ్మను చూస్తూ అమ్మ ఇటీవల అమ్మ మ్మ గురించి చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఆలోచిస్తూ పడుకున్నాను.
*******
అమ్మమ్మకు తన పదిహేనో యేటే పెండ్లైయింది.వెంటనే కాపరానికి వచ్చిన ఆమెకు అత్తగారు, మావగారు, పెళ్ళై మొగుడు పోయిన తన భర్త అక్కగారు, పెళ్లి కాని ఆడపడుచు ఇద్దరు మరుదులు, వీళ్ళందరికీ వండి పెట్టడం చాకిరీతోనే జీవితంమొదలైందామెకు..అమ్మమ్మ చాలా మెతక మనిషి. అందరూ చెప్పిన పనులన్నీ ఎంతో ఓపిగ్గా చేసేది.ఎవరన్నా విసుక్కున్నా , తిట్టినా తలవంచుకు నిలబడేదే కాని పల్లెత్తు మాట కూడా అనేది కాదట..ఆడ పడుచు, పెళ్ళి మరుదుల చదువులు , పెళ్ళిళ్ళు, ఆ తరువాత అత్తగారు, మావగారు కాలం చేయటం. జరిగాయి. అమ్మమ్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. అమ్మమ్మ ఏనాడూ నోరెత్తి నాకు ఇది కావారని అడలేదు తాతయ్యని.సగటు ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ నెరవేర్చింది..
.తాతయ్య అక్క మొగుడు.పెళ్ళైన రెండు నెలలకే పోవడంతో, ఆచారం ప్రకారం ఆమెకు జుట్టు తీసి , తెల్లచీరకట్టించారు, అప్పట్లో.కాపరానికి వచ్చిన అమ్మమ్మను చూస్తే ఆవిడ కు చాలా అసూయ గా ఉండేది. ఆవిడకంటే అమ్మ మ్మ వయసులో ఐదేళ్ళే చిన్నది. ఇంచు మించు ఇద్దరూ ఒకే వయసు వారిలా ఉండేవాళ్ళు.ఆవిడ అమ్మమ్మను ఎప్పుడూ ఆడిపోసుకునేదట.కాళ్ళకు మెట్టెలతో పారాణి పాదాలకు పట్టీలు పెట్టుకుని పచ్చగా కాళ్ళకు పసుపు రాసుకుని చక్కగా లక్ష్మీ దేవిలా అమ్మ మ్మ తిరుగుతుంటే చూసి ఓర్వ లేకపోయేదట.ముఖ్యంగా ఘల్లు ఘల్లు మని పట్టీల మ్రోగుతుంటే అస్సలు సహించలేకపోయేదట..
ఒక రోజు పెద్ద గొడవ జరిగిందట ..ఆ రోజు ఇంటికెవరో దూరపు బంధువులు వచ్చారట.అందులో ఒకతను అమ్మ మ్మ అటూ ఇటూ తిరుగుతూ కాఫీలు అవీ ఇవీ అందిస్తుంటే ఆమె పట్టీలవంకే చూస్తూ ఉన్నాడట..వాళ్ళు వెళ్ళిపోగానే పెద్దాడబడుచు రయ్ మని లేచిందిట... ..
"ఇదేం ఇల్లనుకున్నావా , సానికొంప అనుకున్నావా" ...
నువ్వలా గజ్జెలు పెట్టుకుని వయ్యారంగా ఘల్లు ఘల్లుమని నడిస్తే మగ వెధవలు అందరూ నిన్నే చూస్తారు .
హవ్వ..సంసారుల లక్షణం ఇదేనా .ఘల్లు ఘల్లు మని చప్పుడుతో పరాయి మగాడిని ఆకర్షించాలా. మా ఇంటా వంటా లేదమ్మా..నడిస్తే గాజుల చప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా ఉంటారందరూ...
ఏరా తమ్ముడూ ..నీ పెళ్ళాం ఇలా పట్టీలు పెట్టుకుని తిరిగిందంటే మన సంప్రదాయం మంటకలుస్తుంది..నలుగురూ వచ్చి పోయే ఇల్లు..వచ్చి పోయే వారందరూ దీన్నే చూస్తారు. నువ్వు కనక దాని చేత పట్టీలను తీయించకపోతే ఇహ నేను ఒక్కక్షణం కూడా ఇంట్లో ఉండను.ఏ గోదాట్లోనో దూకుతాను....అంటూ బుడిబుడి రాగాలన దీస్తూ తెగేసి చెప్పిందట..అమ్మ మ్మ అత్తగారు, మావగారు కూడా తలచెడిన కూతురి మనస్తత్వం గ్రహించి ఆమె మాట కాదంటే ఏ అఘాయిత్యం చేస్తుందో నని పట్టీలను తీసేయమని చెప్పారు.పట్టీలంటే ఎంతో ఇష్టం ఉన్న అమ్మ మ్మ తాతయ్య వంక చూసిందట ఏమంటారని.ఆయన మరేమీ మాట్లాడకుండా అమ్మ, అక్క చెప్పినట్టు చేయి అన్నట్టు చూపులతోనే సైగ చేసి చెప్పారట..ఎంతో బాధ పడుతూ గజ్జెలను తీసేసిందట అమ్మ మ్మ..పట్టీలను తీసేసి అమ్మ మ్మ బోసి కాళ్ళతో నడుస్తుంటే ఒక విధమైన పైశాచికానందం పొందిందట ఆడపడుచు..మొత్తానికి ఆవిడ అమ్మ మ్మ పట్టీలను తీయించే వరకూ నిద్రపోలేదట..ఇక్కడ చిత్రం ఏమిటంటే పెళ్ళి కాని చిన్నాడపడుచు అమ్మ మ్మ పట్టీలను పెట్టుకుని ఘల్లు ఘల్లుమని తిరిగేదట.అమ్మ మ్మ బాధనంతా గుండెల్లో దిగమింగుకొని మళ్ళీ ఏనాడూ పట్టీలను పెట్టుకోలేదట.కానీ పట్టీలు పెట్టుకున్న వాళ్ళను ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ వంక నిర్లిప్తంగా చూస్తూ మనసులో బాధ పడుతూ ఉండిపోయేదట అమ్మమ్మ. !!!
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)