24-01-2026, 07:48 AM
ఎపిసోడ్ 41
గోకుల్ తో పాటు ముకుల్ కూడా ఇండియా రావడంతో శివమణి కలిసి అక్కడ దొరికిన స్టోన్స్ గురించి తెలుసుకుని ఆ ఏరియా హ్యాండ్ అవుర్ చేసుకోవడానికి ప్లాన్ ఉందని కాలేశ్వరమంద గురించి చెప్పాడు అభిజిత్.
**********************
వీడియో కాల్ లో ఫోటో చూపిస్తూ "అతని పేరు కాలేశ్వరమంద! మనిషి రూపంలో ఉన్న మృగం, వీడి దగ్గర ఉన్న మనుషుల్ని చూస్తే మనకే భయమేస్తుంది. వాళ్ల దగ్గర న్యూ టెక్నాలజీ వెపన్స్ కూడా ఉంటాయి." అని చెప్పాడు అభిజిత్.
"ఈ ప్రొఫెషనల్ కిల్లర్ ని మనం అక్కడికి పంపిస్తున్నాము కదా! ఒకవేళ వీడు ఆ తెగ వాళ్ళకి పట్టుబడి మన పేరు చెబితే మన ప్లాన్ మొత్తం పాడవుతుంది." అని డౌట్ గా చెప్పాడు సర్పరాజ్.
"మనం వీడితో డైరెక్ట్ గా మాట్లాడ్డం కుదరదు, డార్క్ వెబ్ లో కాంట్రాక్ట్ ఇచ్చి, చెప్పిన ఎకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే మనం ఎవరో కూడా అతనికి తెలియదు, అయినా వీడికి గ్యాంగ్ ని కొట్టడం ఆ తెగ వాళ్ళ వల్ల అవ్వదు." అని చెప్పాడు అభిజిత్.
"ఈ మధ్యకాలంలో ఆ తెగ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది మనమే, ఇప్పుడు ఈ ఎటాక్ జరిగింది అంటే కచ్చితంగా వాళ్లకి మన మీద డౌట్ వస్తుంది." అని చెప్పాడు శివమణి.
" అతను చెప్పింది కూడా నిజమే! అందుకే ఈ ఎటాక్ జరుగుతుంది అని మన మనిషితో వాళ్లకి ఇన్ఫర్మేషన్ పంపించండి. అప్పుడు మంద గెలిస్తే మనం ఆ ప్లేస్ కి ఎంటర్ అవుతాము, ఒకవేళ మంద చస్తే ఆ తెగ వాళ్ళకి దగ్గరవుతాము దేనినైనా మనకి అనుకూలంగా ఉపయోగించుకోవాలి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "అబ్బా.. అంకుల్! మీ బుర్రే బుర్ర, పక్క బిజినెస్ మాన్ అనిపించారు, ఇప్పుడే మంద గ్యాంగ్ కి కాంట్రాక్ట్ ఇచ్చి, శంభు దొర దగ్గరికి జాకిని పంపిస్తాను." అని చెప్పాడు అభిజిత్.
"సరే!" అని గోకుల్ వైపు చూసి "ఈ లోపు ఇక్కడ గవర్నమెంట్ మొత్తం మన గ్రిప్ లో ఉండేటట్లు చూడు." అని చెప్పాడు ముకుల్.
"ఓకే డాడ్! నేను ఆ పనిలో ఉంటాను." అని చెప్పాడు గోకుల్.
"అలాగే! ఆ అడవి ప్రాంతం ఉన్న మ్యాప్ నాకు ఒకసారి చూపించండి." అని అడిగాడు ముకుల్.
టేబుల్ మీద మ్యాప్ పెట్టి చూపిస్తూ "సార్! ఈ ఫారెస్ట్ ఏరియా ఇండియా బోర్డర్ లో ఉంటుంది. అంటూ వైపు వెళితే పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతాము, అక్కడ నుంచి టెర్రరిస్టు ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి కూడా భయపడతారు, అందుకే గవర్మెంట్ ఈ ప్లేస్ ని డెవలప్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు." అని చెప్పాడు శివమణి.
ఆ మాట విని మ్యాప్ వైపు చూస్తూ "మనకి మంచి పాయింట్ దొరికింది." అని అభిజిత్ వైపు చూసి NIA లో మన మాట వినే ఆఫీసర్ ని చూడు, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటో నేను చెబుతాను." అని చెప్పాడు ముకుల్.
"ఓకే అంకుల్! నా రికమండేషన్ తో జాబ్ లో జాయిన్ అయిన జోషి అని ఒక ఆఫీసర్ ఉన్నాడు మీరు ఎప్పుడు అంటే అప్పుడు పిలిపిస్తాను." అని చెప్పాడు అభిజిత్.
"ఆ ఆఫీసర్ ని వెంటనే పిలిపించు మనతో పాటు వాళ్లు కూడా ఆ ప్లేస్ కి రావాలి." అని చెప్పాడు ముకుల్.
"సరే అంకుల్! ఈరోజు రమ్మని చెప్తాను." అని చెప్పాడు అభిజిత్.
శివమణి వైపు చూసి "మేము ఇంకా బయలుదేరుతాము ఈ వర్క్ ఫినిష్ అయ్యేంతవరకు డాడ్ నేను నేను ఇండియాలోనే ఉండడానికి ఫిక్స్ అయ్యాము." అని చెప్పి ముకుల్ తో కలిసి బయటికి వచ్చాడు గోకుల్.
అక్కడ నుంచి కార్ లో వెళుతూ "అంకుల్! ఆ పంచరత్నాల మీద మన గోకుల్ ఆశపడ్డాడు మీరు శివమణికి అనవసరంగా మాటిచ్చారు." అని చెప్పాడు అభిజిత్.
అది విని నవ్వుతూ "నేను మాట మాత్రమే ఇచ్చాను పంచరత్నాలు ఇవ్వలేదు కదా! మన పని అయ్యేవరకు ఎవరి మనసు బాధ పెట్టకూడదు." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని నవ్వి "మీ స్టేటజి అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదు." అని డ్రైవింగ్ చేస్తున్న జాకి వైపు చూసి "నువ్వు రేపు గొర్వర్ బయలుదేరు." అని చెప్పాడు అభిజిత్.
"సరే భయ్యా! వాళ్ళని కలిసి ఎవరు అటాక్ చేస్తున్నారని చెప్పను." అని అడిగాడు జాకీ.
"ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి మళ్ళీ ధర్మ యుద్ధం చేయడానికి పుట్టాడు అని వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి మొగలుల వారసుడు ఈ దేశం మీదకి దండయాత్రకు వస్తున్నడు మొదటగా మీ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి చూస్తున్నారు అని ఒక చిన్న కథ చెప్పు!" అని చెప్పాడు సర్పరాజ్.
"గుడ్! ఆ మాట విన్న తర్వాత ధైర్యం ఉంటే పోరాడుతారు భయపడితే అక్కడ నుంచి పారిపోతారు." అని చెప్పాడు ముకుల్.
***************
రెండు రోజుల తర్వాత బేర అడివిలోకి వెళ్లి సహదేవుడిని కలిసి విషయం చెప్పాడు జాకి.
ఆ మాట విని "సరే దొర! నేను ఈ విషయం మా శంభూ దొరకి చెబుతాను మీరు వెళ్ళండి." అని హడావుడిగా గూడెంలోకి వెళ్లి విషయం చెప్పాడు సహదేవుడు.
అది విని "అయ్యా! నాకెందుకో మొన్న ఉత్సవాలకి వచ్చిన వాళ్ళ మీదే అనుమానంగా ఉంది." అని చెప్పాడు అభీర్.
"మనం కల్మషం లేని జంతువు మనసు అర్థం చేసుకోగలము గాని, గడియకి ఒక విధంగా ఆలోచించే మనిషి మనసు అర్థం చేసుకోలేము, అలా అని ఎవరి మీద నింద వేయకూడదు, మనం ఈ అడవిలోనే జీవిస్తూ బయట ప్రపంచం తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది." అని చెప్పాడు శంభు.
"సరే అయ్యా! ముందు ఈ ఆపద నుంచి మనం బయటపడ్డ తర్వాత నా దగ్గర ఒక ఉపయోగం ఉంది దానిని అమలు చేస్తాను." అని చెప్పాడు అభీర్.
"బిడ్డ! ఇది ఆపద కాదు నువ్వు పచ్చబొట్టుతో పుట్టినప్పుడే ధర్మం కోసం, మన జాతి కోసం, ఆ దైవం మనకి ఇచ్చిన ఈ భూమికోసం పోరాడవలసి వస్తుంది అని నాకు తెలుసు!"
అని చెప్పి
సహదేవుడు వైపు చూసి "మన వాళ్ళందరినీ సిద్ధం చెయ్ ఈ భూమి మీద అడుగుపెట్టిన వాడు వెనక్కి వెళ్ళకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు శంభు.
"సరే దొర!" అని ఆకాశం వైపు చూసి వింత శబ్దం చేస్తూ గట్టిగా అరిచాడు సహదేవుడు.
**********************
రెండు రోజుల తర్వాత తన గ్యాంగ్ తో గొర్వర్ అడవి దగ్గరికి చేరుకునే వర్క్ స్టార్ట్ చేశాము అని డార్క్ వెబ్ లో ఆబిజిత్ కి మెసేజ్ పెట్టాడు కాలేశ్వరమంద.
ఆ మెసేజ్ చూసి జైపూర్ ఫైవ్ స్టార్ హోటల్ లో తన రూమ్ లో శివమణితో మాట్లాడుతున్న ముకుల్ దగ్గరికి వెళ్లి "అంకుల్! వర్క్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని తల పైకెత్తి చూసి "అంత తొందర పడకు వాళ్ల గురించి ఇప్పుడే శివమణి దగ్గర వివరాలు తెలుసుకుంటున్నాను, ఆ ప్లేస్ ని హ్యాండోవర్ చేసుకోవడం మనం అనుకున్నంత ఈజీ కాదు, మన మనుషుల్ని కొంతమందిని తీసుకుని అక్కడికి వెళదాం రెడీ అవ్వండి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "ఎందుకు డాడ్? మందకి మనం కూడా హెల్ప్ వెళదామా?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
"అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరికి హెల్ప్ చేయాలో ఆలోచిద్దాము, త్వరగా పదండి ఆ ఆఫీసర్ మురళి జోషి కూడా వచ్చాడా?" అని అడిగాడు ముకుల్.
"ఎస్ అంకుల్! మురళి జోషి పాటు తన అసిస్టెంట్ జనార్ధన్ కూడా వచ్చాడు వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళదామా?" అని అడిగాడు అభిజిత్.
"అవును! తర్వాత జరగబోయే కార్యక్రమానికి వాళ్లే ముఖ్య పాత్రధారులు అవుతారు." అని చెప్పి శివమణితో కలిసి రూమ్ లో నుంచి కార్ దగ్గరికి వెళ్ళాడు ముకుల్.
*********************
మరుసటి రోజు ఉదయం గొర్వర్ దగ్గర గెస్ట్ హౌస్ లో ఉన్న ముకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "సార్! కెమెరా ఫిక్స్ చేసిన డ్రోన్స్ బేరా అడవి పైకి పంపించాము అక్కడ ఏం జరుగుతుందో మనం లైవ్ లో చూడొచ్చు!" అని చెప్పాడు మురళి జోషి.
లాప్టాప్ లో వీడియో చూపిస్తూ "సార్! మంద గ్యాంగ్ లోపలికి వెళ్లారు కానీ ఇప్పటివరకు వాళ్లకి ఆ తెగ వాళ్ళు ఎవరు కనిపించలేదు కాసేపటిలో ఆ కొండ దగ్గరికి చేరుకుంటారు." అని చెప్పాడు జనార్ధన్.
"ఓకే!" అని శివమణి వాళ్లతో కలిసి వీడియో చూస్తూ ఉన్నాడు ముకుల్.
*****************
బేరా అడివిలో నుంచి కొండ దగ్గరికి చేరుకుని తన మనుషుల వైపు చూసి, "ఒరేయ్ పైడి! ఒక్కడు కూడా కనిపించడం లేదేమిటి? అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా?" అని చికాకు అడిగాడు మంద.
"అన్న! ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొండ జాతి వాళ్ళు, చెట్టు పుట్టలలో కూడా కనపడకుండా దాక్కుంటారు, మనల్ని చూసి భయపడి పారిపోయినట్లు ఉన్నారు." అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు పైడి.
అంతలో తన తలకి రాయి తగలడంతో "ఎవడ్రా కొట్టింది?" అని తల పైకెత్తి చెట్టు మీద వెక్కిరిస్తున్న కోతి కనిపించడంతో గన్ తీసి గాల్లోకి షూట్ చేసి దాని వెనకాలే పరిగెత్తాడు మంద.
వీడియోలో జరిగేది చూస్తూ "కోతులు ఎంటర్ అయ్యాయి అంటే ఆ తెగ వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు." అని చెప్పాడు శివమణి.
"నాకు తెలిసి శంభు వాళ్ళు ఇప్పుడు మంద గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు." అని చెప్పాడు సర్పరాజ్.
ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "ఆ తెగ వాళ్ళ అటాక్ స్టేటజి తెలుసుకోవడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను." అని చెప్పాడు ముకుల్.
"అంకుల్! మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం!" అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు. అభిజిత్.
**********************
వీడియో కాల్ లో ఫోటో చూపిస్తూ "అతని పేరు కాలేశ్వరమంద! మనిషి రూపంలో ఉన్న మృగం, వీడి దగ్గర ఉన్న మనుషుల్ని చూస్తే మనకే భయమేస్తుంది. వాళ్ల దగ్గర న్యూ టెక్నాలజీ వెపన్స్ కూడా ఉంటాయి." అని చెప్పాడు అభిజిత్.
"ఈ ప్రొఫెషనల్ కిల్లర్ ని మనం అక్కడికి పంపిస్తున్నాము కదా! ఒకవేళ వీడు ఆ తెగ వాళ్ళకి పట్టుబడి మన పేరు చెబితే మన ప్లాన్ మొత్తం పాడవుతుంది." అని డౌట్ గా చెప్పాడు సర్పరాజ్.
"మనం వీడితో డైరెక్ట్ గా మాట్లాడ్డం కుదరదు, డార్క్ వెబ్ లో కాంట్రాక్ట్ ఇచ్చి, చెప్పిన ఎకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే మనం ఎవరో కూడా అతనికి తెలియదు, అయినా వీడికి గ్యాంగ్ ని కొట్టడం ఆ తెగ వాళ్ళ వల్ల అవ్వదు." అని చెప్పాడు అభిజిత్.
"ఈ మధ్యకాలంలో ఆ తెగ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది మనమే, ఇప్పుడు ఈ ఎటాక్ జరిగింది అంటే కచ్చితంగా వాళ్లకి మన మీద డౌట్ వస్తుంది." అని చెప్పాడు శివమణి.
" అతను చెప్పింది కూడా నిజమే! అందుకే ఈ ఎటాక్ జరుగుతుంది అని మన మనిషితో వాళ్లకి ఇన్ఫర్మేషన్ పంపించండి. అప్పుడు మంద గెలిస్తే మనం ఆ ప్లేస్ కి ఎంటర్ అవుతాము, ఒకవేళ మంద చస్తే ఆ తెగ వాళ్ళకి దగ్గరవుతాము దేనినైనా మనకి అనుకూలంగా ఉపయోగించుకోవాలి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "అబ్బా.. అంకుల్! మీ బుర్రే బుర్ర, పక్క బిజినెస్ మాన్ అనిపించారు, ఇప్పుడే మంద గ్యాంగ్ కి కాంట్రాక్ట్ ఇచ్చి, శంభు దొర దగ్గరికి జాకిని పంపిస్తాను." అని చెప్పాడు అభిజిత్.
"సరే!" అని గోకుల్ వైపు చూసి "ఈ లోపు ఇక్కడ గవర్నమెంట్ మొత్తం మన గ్రిప్ లో ఉండేటట్లు చూడు." అని చెప్పాడు ముకుల్.
"ఓకే డాడ్! నేను ఆ పనిలో ఉంటాను." అని చెప్పాడు గోకుల్.
"అలాగే! ఆ అడవి ప్రాంతం ఉన్న మ్యాప్ నాకు ఒకసారి చూపించండి." అని అడిగాడు ముకుల్.
టేబుల్ మీద మ్యాప్ పెట్టి చూపిస్తూ "సార్! ఈ ఫారెస్ట్ ఏరియా ఇండియా బోర్డర్ లో ఉంటుంది. అంటూ వైపు వెళితే పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతాము, అక్కడ నుంచి టెర్రరిస్టు ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి కూడా భయపడతారు, అందుకే గవర్మెంట్ ఈ ప్లేస్ ని డెవలప్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు." అని చెప్పాడు శివమణి.
ఆ మాట విని మ్యాప్ వైపు చూస్తూ "మనకి మంచి పాయింట్ దొరికింది." అని అభిజిత్ వైపు చూసి NIA లో మన మాట వినే ఆఫీసర్ ని చూడు, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటో నేను చెబుతాను." అని చెప్పాడు ముకుల్.
"ఓకే అంకుల్! నా రికమండేషన్ తో జాబ్ లో జాయిన్ అయిన జోషి అని ఒక ఆఫీసర్ ఉన్నాడు మీరు ఎప్పుడు అంటే అప్పుడు పిలిపిస్తాను." అని చెప్పాడు అభిజిత్.
"ఆ ఆఫీసర్ ని వెంటనే పిలిపించు మనతో పాటు వాళ్లు కూడా ఆ ప్లేస్ కి రావాలి." అని చెప్పాడు ముకుల్.
"సరే అంకుల్! ఈరోజు రమ్మని చెప్తాను." అని చెప్పాడు అభిజిత్.
శివమణి వైపు చూసి "మేము ఇంకా బయలుదేరుతాము ఈ వర్క్ ఫినిష్ అయ్యేంతవరకు డాడ్ నేను నేను ఇండియాలోనే ఉండడానికి ఫిక్స్ అయ్యాము." అని చెప్పి ముకుల్ తో కలిసి బయటికి వచ్చాడు గోకుల్.
అక్కడ నుంచి కార్ లో వెళుతూ "అంకుల్! ఆ పంచరత్నాల మీద మన గోకుల్ ఆశపడ్డాడు మీరు శివమణికి అనవసరంగా మాటిచ్చారు." అని చెప్పాడు అభిజిత్.
అది విని నవ్వుతూ "నేను మాట మాత్రమే ఇచ్చాను పంచరత్నాలు ఇవ్వలేదు కదా! మన పని అయ్యేవరకు ఎవరి మనసు బాధ పెట్టకూడదు." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని నవ్వి "మీ స్టేటజి అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదు." అని డ్రైవింగ్ చేస్తున్న జాకి వైపు చూసి "నువ్వు రేపు గొర్వర్ బయలుదేరు." అని చెప్పాడు అభిజిత్.
"సరే భయ్యా! వాళ్ళని కలిసి ఎవరు అటాక్ చేస్తున్నారని చెప్పను." అని అడిగాడు జాకీ.
"ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి మళ్ళీ ధర్మ యుద్ధం చేయడానికి పుట్టాడు అని వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి మొగలుల వారసుడు ఈ దేశం మీదకి దండయాత్రకు వస్తున్నడు మొదటగా మీ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి చూస్తున్నారు అని ఒక చిన్న కథ చెప్పు!" అని చెప్పాడు సర్పరాజ్.
"గుడ్! ఆ మాట విన్న తర్వాత ధైర్యం ఉంటే పోరాడుతారు భయపడితే అక్కడ నుంచి పారిపోతారు." అని చెప్పాడు ముకుల్.
***************
రెండు రోజుల తర్వాత బేర అడివిలోకి వెళ్లి సహదేవుడిని కలిసి విషయం చెప్పాడు జాకి.
ఆ మాట విని "సరే దొర! నేను ఈ విషయం మా శంభూ దొరకి చెబుతాను మీరు వెళ్ళండి." అని హడావుడిగా గూడెంలోకి వెళ్లి విషయం చెప్పాడు సహదేవుడు.
అది విని "అయ్యా! నాకెందుకో మొన్న ఉత్సవాలకి వచ్చిన వాళ్ళ మీదే అనుమానంగా ఉంది." అని చెప్పాడు అభీర్.
"మనం కల్మషం లేని జంతువు మనసు అర్థం చేసుకోగలము గాని, గడియకి ఒక విధంగా ఆలోచించే మనిషి మనసు అర్థం చేసుకోలేము, అలా అని ఎవరి మీద నింద వేయకూడదు, మనం ఈ అడవిలోనే జీవిస్తూ బయట ప్రపంచం తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది." అని చెప్పాడు శంభు.
"సరే అయ్యా! ముందు ఈ ఆపద నుంచి మనం బయటపడ్డ తర్వాత నా దగ్గర ఒక ఉపయోగం ఉంది దానిని అమలు చేస్తాను." అని చెప్పాడు అభీర్.
"బిడ్డ! ఇది ఆపద కాదు నువ్వు పచ్చబొట్టుతో పుట్టినప్పుడే ధర్మం కోసం, మన జాతి కోసం, ఆ దైవం మనకి ఇచ్చిన ఈ భూమికోసం పోరాడవలసి వస్తుంది అని నాకు తెలుసు!"
అని చెప్పి
సహదేవుడు వైపు చూసి "మన వాళ్ళందరినీ సిద్ధం చెయ్ ఈ భూమి మీద అడుగుపెట్టిన వాడు వెనక్కి వెళ్ళకూడదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు శంభు.
"సరే దొర!" అని ఆకాశం వైపు చూసి వింత శబ్దం చేస్తూ గట్టిగా అరిచాడు సహదేవుడు.
**********************
రెండు రోజుల తర్వాత తన గ్యాంగ్ తో గొర్వర్ అడవి దగ్గరికి చేరుకునే వర్క్ స్టార్ట్ చేశాము అని డార్క్ వెబ్ లో ఆబిజిత్ కి మెసేజ్ పెట్టాడు కాలేశ్వరమంద.
ఆ మెసేజ్ చూసి జైపూర్ ఫైవ్ స్టార్ హోటల్ లో తన రూమ్ లో శివమణితో మాట్లాడుతున్న ముకుల్ దగ్గరికి వెళ్లి "అంకుల్! వర్క్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది." అని చెప్పాడు అభిజిత్.
ఆ మాట విని తల పైకెత్తి చూసి "అంత తొందర పడకు వాళ్ల గురించి ఇప్పుడే శివమణి దగ్గర వివరాలు తెలుసుకుంటున్నాను, ఆ ప్లేస్ ని హ్యాండోవర్ చేసుకోవడం మనం అనుకున్నంత ఈజీ కాదు, మన మనుషుల్ని కొంతమందిని తీసుకుని అక్కడికి వెళదాం రెడీ అవ్వండి." అని చెప్పాడు ముకుల్.
ఆ మాట విని "ఎందుకు డాడ్? మందకి మనం కూడా హెల్ప్ వెళదామా?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
"అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరికి హెల్ప్ చేయాలో ఆలోచిద్దాము, త్వరగా పదండి ఆ ఆఫీసర్ మురళి జోషి కూడా వచ్చాడా?" అని అడిగాడు ముకుల్.
"ఎస్ అంకుల్! మురళి జోషి పాటు తన అసిస్టెంట్ జనార్ధన్ కూడా వచ్చాడు వాళ్ళని కూడా మనతో పాటు తీసుకువెళదామా?" అని అడిగాడు అభిజిత్.
"అవును! తర్వాత జరగబోయే కార్యక్రమానికి వాళ్లే ముఖ్య పాత్రధారులు అవుతారు." అని చెప్పి శివమణితో కలిసి రూమ్ లో నుంచి కార్ దగ్గరికి వెళ్ళాడు ముకుల్.
*********************
మరుసటి రోజు ఉదయం గొర్వర్ దగ్గర గెస్ట్ హౌస్ లో ఉన్న ముకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "సార్! కెమెరా ఫిక్స్ చేసిన డ్రోన్స్ బేరా అడవి పైకి పంపించాము అక్కడ ఏం జరుగుతుందో మనం లైవ్ లో చూడొచ్చు!" అని చెప్పాడు మురళి జోషి.
లాప్టాప్ లో వీడియో చూపిస్తూ "సార్! మంద గ్యాంగ్ లోపలికి వెళ్లారు కానీ ఇప్పటివరకు వాళ్లకి ఆ తెగ వాళ్ళు ఎవరు కనిపించలేదు కాసేపటిలో ఆ కొండ దగ్గరికి చేరుకుంటారు." అని చెప్పాడు జనార్ధన్.
"ఓకే!" అని శివమణి వాళ్లతో కలిసి వీడియో చూస్తూ ఉన్నాడు ముకుల్.
*****************
బేరా అడివిలో నుంచి కొండ దగ్గరికి చేరుకుని తన మనుషుల వైపు చూసి, "ఒరేయ్ పైడి! ఒక్కడు కూడా కనిపించడం లేదేమిటి? అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా?" అని చికాకు అడిగాడు మంద.
"అన్న! ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొండ జాతి వాళ్ళు, చెట్టు పుట్టలలో కూడా కనపడకుండా దాక్కుంటారు, మనల్ని చూసి భయపడి పారిపోయినట్లు ఉన్నారు." అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు పైడి.
అంతలో తన తలకి రాయి తగలడంతో "ఎవడ్రా కొట్టింది?" అని తల పైకెత్తి చెట్టు మీద వెక్కిరిస్తున్న కోతి కనిపించడంతో గన్ తీసి గాల్లోకి షూట్ చేసి దాని వెనకాలే పరిగెత్తాడు మంద.
వీడియోలో జరిగేది చూస్తూ "కోతులు ఎంటర్ అయ్యాయి అంటే ఆ తెగ వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు." అని చెప్పాడు శివమణి.
"నాకు తెలిసి శంభు వాళ్ళు ఇప్పుడు మంద గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు." అని చెప్పాడు సర్పరాజ్.
ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి "ఆ తెగ వాళ్ళ అటాక్ స్టేటజి తెలుసుకోవడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను." అని చెప్పాడు ముకుల్.
"అంకుల్! మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం!" అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు. అభిజిత్.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)