Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 36


అడవిలో సహదేవుడితో పాటు వెళుతూ తన దగ్గర ఉన్న అభీర్ భుజం మీద ఉండే సింబల్ బయటకు తీసి చూపించాడు శివమణి.

ఆ సింబల్ ని బయటకు తీయడంతోనే ఆకాశం నుంచి వేగంగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యింది సింబా.

*************************

తమ మీదకి భయంకరంగా అరుస్తూ ఆకాశం నుంచి వస్తున్న భారీ పక్షిని చూసి భయంతో కళ్ళు మూసుకున్నారు సర్పరాజ్ వాళ్ళు.

అంతలో "సింబా ఆగు!" అని అరుపు వినిపించడంతో పక్షి అరుపు ఆగడం చూసి నెమ్మదిగా కళ్ళు తెరిచి "మనకు ఎవరో హెల్ప్ చేయడానికి వచ్చారు." అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు గోకుల్.

ఎదురుగా ఏడు అడుగుల ఎత్తు కండలు తిరిగిన భుజాలు చూడడానికి సూపర్ మెన్ లాగా ఉన్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.

ఆ వ్యక్తిని చూడగానే దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని తలవంచి "వందనాలు నాయకుడా?" అని చెప్పాడు సహదేవుడు.

ఆ మాట విని దగ్గరికి వస్తూ "హాయ్ సార్! మీరేనా వీళ్ళ నాయకుడు శంభు దొర!" అని అడిగాడు సర్పరాజ్.

"అవును!" అని అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ  "మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని శివమణి చేతిలో ఉన్న పచ్చబొట్టు బొమ్మ చూసి "అది మీకు ఎక్కడ దొరికింది?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు శంభు.

ఆ మాట విని సంతోషంగా ముందుకు వెళ్లి "ఈ పచ్చ బొట్టు గురించి మీకు తెలుసా? ఇది చేతి మీద ఉన్న మనిషిని మీరు ఎప్పుడైనా చూసారా?" అని ఆత్రుతగా అడిగాడు శివమణి.

శివమణి చేతిలో ఉన్న జంతు తోలు తీసుకుని చూస్తూ "ఈ గుర్తు ఒంటి మీద ఉన్న మనిషి ఇక్కడ ఉంటాడు అని మీకు ఎవరు చెప్పారు?" అని అడిగాడు శంభు.

"మేము చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము, ఆ ప్రయత్నంలో బామ్రఘడ్ అడవి ప్రాంతంలో ఉన్న గుహలలో ఇవి కనపడ్డాయి, దుర్మార్గుల చేతికి వెళ్లకుండా వీటిని కాపాడి దాంట్లో ఉన్న చరిత్ర తెలుసుకుని ఆ గుర్తు ఉన్న వ్యక్తికి అప్పగించడానికి వచ్చాము." అని చెప్పాడు శివమణి.

ఆ మాటకి చిన్నగా నవ్వి "వీటిని చూసి ఏ చరిత్ర తెలుసుకున్నారు?" అని అడిగాడు శంభు.

"మాకు దొరికిన వాటి ఉన్నదానిని బట్టి  చత్రపతి శివాజీ మహారాజ్ దళంలో పనిచేసిన జారువా తెగకు చెందిన అభిర్ సేన గురించి తెలుసుకున్నాము, ఆ నాయకుడి వంశనికి చెందిన వారికి ఇవ్వడానికి వీటిని తీసుకువచ్చాము, వారు ఇక్కడే జీవిస్తున్నారని మాకు తెలిసింది." అని చెప్పాడు సర్ఫరాజ్.

"ఈ పత్రాలలో చరిత్ర అదేవిధంగా రాసి ఉందా?" అని అడిగాడు శంభు.

"అంటే! కచ్చితంగా అలా అని రాసి లేదు, దాంట్లో ఉన్న భాష మాకు సరిగ్గా అర్థం కాలేదు మాకు తెలిసినంతవరకు చదివి అర్థం చేసుకున్నాము." అని చెప్పాడు శివమణి.

"ఆదికాకుండా శంభు దొర! ఈ జారువ తెగకు చెందిన వారు కొంతమంది అండమాన్ దీవులలో ఉంటున్నారు వాళ్లు మనుషులతో కలవకుండా అక్కడికి వచ్చిన వారిని చంపేస్తున్నారు నేను ఈ దేశ నాయకులలో ఒకడిని అందుకే ఆ విషయం కూడా చెబుదామని వచ్చాము." అని చెప్పాడు అభిజిత్.

"జారువా తేగా వారి దగ్గరికి ఆశతో వెళితే మరణం తప్పదు, మీరు కూడా ఇక్కడికి ఏదైనా ఆశతో వస్తే, ఆ తెగ వారికి కనిపించక ముందే వెళ్లిపోండి." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని "అంటే! ఆ తెగ వారు ఇక్కడ జీవిస్తున్నారు కదా!" అని ఆత్రుతగా అడిగాడు గోకుల్.

"అవును! మీ దగ్గర ఉన్న వస్తువులు నాకు ఇవ్వండి నేను వాళ్లకి అందజేస్తాను ఇక మీరు ఇక నుంచి వెళ్లొచ్చు!" అని చెప్పాడు శంభు.

ఆ మాట విని కంగారు పడి "మేము వారిని ఒకసారి కలిసి వారి చరిత్రను బయట ప్రపంచానికి తెలిసేలాగా చేయాలి అనుకుంటున్నాము." అని చెప్పాడు సర్ఫరాజ్.

"కొన్ని సత్యాలు మరుగున ఉంటేనే అందరికీ మంచిది." అని చెప్పాడు శంభు.

"మీరు చెప్పింది కూడా నిజమే! కానీ చత్రపతి శివాజీ గారికి సహాయం చేసినా వారి వంశం వారిని చూడాలని చాలా ఆశతో వచ్చాము." అని చెప్పాడు గోకుల్.

"మీకు తెలిసిన విషయం తప్పు, అభీర్ సేన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారికీ సహాయం చేసే అంతటివారు కాదు, శివాజీ గారు ధర్మం వైపు నిలబడ్డారు, వారితో పాటు ఉన్నారు కాబట్టి  అభిర్ సేన కి అంత శక్తి వచ్చింది." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని శంభు వైపు చూస్తూ "మీరు ఆ సేనకు సంబంధించిన వారసులని నాకు అర్థమైంది. మాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది." అని అడిగాడు శివమణి.

ఆ మాటకు ఆగి దూరంగా ఉన్న కొండల వైపు చూసి ఆలోచిస్తూ "రేపు ఉదయం మా యువరాజుకి పట్టాభిషేకం మమ్మల్ని ఎవరు ఏది అడిగినా సరే తప్పకుండా తీరుస్తాము, మీరు మంచికి వచ్చారో, చెడుకి వచ్చారో నాకు తెలీదు ఇది దైవ నిర్ణయం అనుకుంటాను నాతో పాటు రండి." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని సంతోషంగా శంభు వెనకాల వెళుతూ, శివమణి వైపు చూసి "మనం మంచి టైమ్ లో వచ్చాము." అని స్లో గా చెప్పాడు గోకుల్.

ముందు నడుస్తూ "మీరు చెప్పింది నిజమే! ఇక్కడికి మీరు వచ్చిన ముహూర్తం చాలా బాగుంది లేకపోతే ఈ సమయానికి మా సహదేవుడి చేతిలో చనిపోయేవారు." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని "ఏంటి? సహదేవుడి చేతిలో చనిపోయే వాళ్ళమా? ఆ కుర్రాడు మా ఐదుగురిని చంపేయగలడా?" అని వెటకారంగా అడిగాడు జాకి.

ఆ మాటకి తల వెనక్కి తిప్పి జాకీ వైపు చూస్తూ "మనిషిని చూసి ఎప్పుడూ అంచనా వేయకూడదు, కాశీ పట్టణానికి భైరవుడు ఎలాగో, మా బైరా ప్రాంతానికి సహదేవుడు అలాగా తనను దాటి పక్క అడవిలో జంతువు కూడా ఇక్కడకు రాలేదు, తన అనుమతి లేనిదే ఇక్కడ నుంచి ఎవరు బయటకి కూడా వెళ్ళలేరు. " అని సీరియస్ గా చెప్పాడు శంభు.

ఆ మాటకి శంభు వైపు భయంగా చూస్తూ గుటకలు మింగాడు జాకీ.

అంతలో హడావుడిగా పరిగెత్తుకుంటూ శంభు దగ్గరకు వచ్చి "నాయక! పక్కా అడవిలో నుంచి రెండు సింహాలు ఇడకు వచ్చి మన జంతువుల్ని వేటాడుతున్నాయి." అని ఆయాస పడుతూ చెప్పాడు గూడెం లో ఉండే మనిషి.

ఆ మాట విని సహదేవుడు వైపు చూసి "వెళ్లి వాటి సంగతి చూడు నేను కూడా వస్తాను." అని చెప్పాడు శంభు.

"సరే నాయక!" అని చెప్పి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సహదేవుడు.

"ఏంటి? ఇప్పుడు ఆ రెండు సింహాలతో సహదేవుడు ఫైటింగ్ చేస్తాడా?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.

"మీ దృష్టిలో అవి క్రూర మృగాలు, మా దృష్టిలో నోరులేని ముగా జీవాలు, నోరు ఉన్న మనిషే తప్పు దారిలో వెళుతున్నాడు,  అవి వెళ్లడంలో తప్పులేదు కదా, వాటిని మంచిదారిలోకి తీసుకువస్తాము అంతేకానీ దండించాము పదండి మనం కూడా వెళదాము." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని "ఏంటి? ఇప్పుడు మనం ఆ సింహాల దగ్గరికి వెళ్లాలా?" అని కంగారుగా అడిగాడు అభిజిత్.

"మనం ఇప్పుడు ఆయన వెనకాల వెళ్ళకపోతే, ఇక్కడ ఉన్న ఏ పులికో ఆహారం అవుతాము పదండి." అని చెప్పాడు శివమణి.

"కరెక్ట్ ఈ అడవిలో నుంచి మనం ప్రాణాలతో బయటకు వెళ్లాలంటే వీళ్ళతో పాటే ఉండాలి." అని శంభు వెనకాలే వెళ్లాడు గోకుల్.

అక్కడి నుంచి వేగంగా పరిగెత్తిన సహదేవుడు వైపు చూసి 'జింక పిల్లలాగా పరిగెత్తాడు, మచ్చిక చేసుకున్న పులి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆ సింహంతో వీడు ఏం చేస్తాడు.' అని మనసులో అనుకున్నాడు జాకి.

రెండు సింహాలు అక్కడ ఉన్న జింకల గుంపు వెనకాల పరిగెత్తడం చూసి వేగంగా వెళ్లి వాటి ముందు నుంచుని కోపంగా చూస్తూ వింత శబ్దం చేశాడు సహదేవుడు.

పరిగెడుతున్న జింకలు ఆగి సహదేవుడు వెనకాల నుంచుని సింహం కాలు కింద ఉన్న జింక పిల్లని చూస్తూ ఉన్నాయి.

సహదేవుడు వైపు చూసి కోపంగా గర్జిస్తూ కాలి కింద ఉన్న జింకపిల్లని నోటితో పట్టుకోబోయింది  ఒక సింహం.

అక్కడికి వస్తూ జరిగేది చూసి "అయ్యో పాపం! జింక పిల్ల చచ్చిపోయింది." అని అన్నాడు గోకుల్.

ఆ మాట పూర్తయ్యే లోపు వేగంగా వెళ్లి సింహం కాలి కింద ఉన్న జింకపిల్లని తీసుకుని పరిగెత్తడు సహదేవుడు.

అది చూసి "వార్ని..సింహం పంజా కింద ఉన్న జింక పిల్లని కాపాడువాడు, అంటే వీడు మామూలువాడు కాదు." అని చెప్పాడు జాకి.

సహదేవుడు వైపు రెండు సింహాలు కోపంతో పరిగెట్టడం చూసి నోటితో ఒక భయంకరమైన శబ్దన్ని చేసాడు శంభు.

ఆ శబ్దం విని ఒళ్ళు జలదరించి చెవులు గట్టిగా మూసుకున్నారు గోకుల్ వాళ్ళు.

ఆ శబ్దం రావడంతో పరిగెడుతున్న  సింహాలు రెండు ఆగి వెనక్కి తిరిగి శంభు వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి.

భయంకరంగా వస్తున్న రెండు సింహాలను చూసి శంభు వెనక్కి వెళ్లి దాక్కుని గోకుల్ వైపు చూసి
"ఒరేయ్! నీ సరదా మన దూల తీర్చేస్తుంది రా.. ఎప్పుడు ఏ జంతువుకి ఆహారం అవుతామో కూడా అర్థం కావడం లేదు." అని చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు అభిజిత్.

"మరి థ్రిల్లింగ్ అంటే ఇలాగే ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత  ఇక్కడ విషయాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి." అని నవ్వుతూ చెప్పాడు గోకుల్.

రెండు సింహాలు మీదకి వస్తున్న బెదరకుండా వాటి కళ్ళలోకి చూస్తూ ధైర్యంగా నుంచున్న శంభు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శివమణి.

అంతలో ఆకాశంలో అరుపు వినపడడంతో తల పైకెత్తి చూసి "మళ్లీ సింబా ఇక్కడికి వస్తున్నాడు ఏంటి?" అని అడిగాడు సర్పరాజ్.

ఆకాశంలోకి చూస్తూ "ఆ సింబా కాళ్లతో ఒక కుర్రాడిని తీసుకువస్తుంది." అని ఆశ్చర్యంగా చెప్పాడు శివమణి.

సింబా కాళ్ళని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆకాశంలో వేగంగా వచ్చి శంభు ముందు దిగి మీదకి వస్తున్న సింహాల వైపు పరుగెత్తి ఎత్తిన పంజాని తన చేత్తో పట్టుకుని రెండు సింహాలను దూరంగా గిరాటు వేశాడు ఆ కుర్రాడు.

ఆ కుర్రాడి వైపు చూస్తూ బుజం మీద తను వెతుకుతున్న పచ్చబొట్టు కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ "అభీర్!" అని మనసులో అనుకున్నాడు  శివమణి.
[+] 10 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 20-01-2026, 06:46 AM



Users browsing this thread: 9 Guest(s)