16-01-2026, 04:49 PM
Part -47
అవని మాటలకి అందరూ ఓ అని అరుస్తారు. వావ్ సూపర్ వదిన నువ్వు కూడా మా పార్టీ అయితే.. మనం రచ్చ రంభోల చేసేయొచ్చు అంటూ ఉంటే.. ఇందిరాగారు ముందు వాళ్ళిద్దర్నీ లోపలికి రానివ్వండి తరువాత అన్ని ముచ్చట్లు అని చెప్పి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చెబుతారు.
అవిని సంతోషంగా భర్త చెయ్యి పట్టుకుని కుడికాలు లోపలికి పెట్టి వస్తుంది. నవ్వుతున్న అవని మొఖం చూసిన ధనుంజయ్.. ఈ నవ్వు ఏ రోజు కూడా ఇప్పటివరకు నేను చూడలేదు.
అంటే.. నా కూతురు నుంచి నాకు తెలియకుండా నేను లాగేసుకున్నానా అని చూస్తూ ఉంటారు.
అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి కాళ్లకు నమస్కారం చేసి నన్ను క్షమించండి అమ్మమ్మ అని తలదించుకుంటుంది.
క్షమించవలసిన అంత పెద్ద తప్పు నువ్వు ఏం చేశావు తల్లి. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ రోజు నువ్వు అలా చేయవలసి వచ్చింది.
నీకు పెళ్లి పైన ఉన్న విశ్వాసం, నా మనవడి పైన ఉన్న నమ్మకమే నిన్ను మళ్ళీ రప్పించింది. నీ నమ్మకమే నా మనవడు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అదే తాలిబంధం. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు అని దీవిస్తారు.
అత్త మామగారు దగ్గరికి వెళ్లి కాళ్ళకి నమస్కరించి నామీద మీకు ఎటువంటి కోపం లేదా అత్తయ్య గారు అని అడుగుతుంది.
కోపం ఎందుకే పిచ్చితల్లి. నా కొడుకు మీద నమ్మకంతో నువ్వు ఫైట్ చేసావు. ఎవరి దిష్టికళ్ళో పడి కొన్ని దుష్ట గ్రహాలు ఇంటిలోకి వచ్చి తిష్టవేశాయి.
మహాలక్ష్మి లాంటి నువ్వు వచ్చేవేళ అయ్యింది కాబట్టే నా కొడకు ఆ దుష్ట గ్రహాలు అన్నింటిని బయటకి తరిమేసాడు.
ఇప్పటినుంచి నేను నీకు అత్తనే కాదు అమ్మని కూడా అని చెబుతుంది. వెంటనే మాధవి అక్కడికి వచ్చి వదినమ్మ ఆగమ్మా.. తల్లిని ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి... దగ్గరికి తీసుకుంటుంది.
అవని మాధవి రమేష్ గారికి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది వెంటనే రమేష్ గారు నా కూతురికి ఎప్పుడూ మా ఆశీర్వాదాలు ఉంటాయి అలాగే నీకు తోడుగా కూడా నీకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నాడు అని చెబుతుండగానే...
భరత్ వచ్చి నన్ను నేను పరిచయం చేసుకుంటానులే అని చూడు సిస్టర్ బావ ఏదైనా ఇబ్బంది పెడితే..వెంటనే ఒక సైగ చేయి చాలు.
విక్రమ్ వైపు చూస్తూ వెంటనే నిన్ను నేను తెచ్చేసుకుంటాను అని చెబుతాడు. విక్రమ్ అదే మాట మీద వుండు బావ ఫ్యూచర్లో నువ్వు నాకు దొరుకుతావు కదా అని చెబుతాడు.
వెంటనే బావో నీకు దండం పెడతాను. నీకు అనుకూలంగా మార్చుకున్న అయినా సరే నన్ను ఇరికించేస్తావు అని దండం పెడతారు అందరూ వాళ్లని అలా చూసి నవ్వుకుంటారు.
సత్యవతి శేషగిరి కూడా వచ్చి అవిని నీ పట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి. మీ అమ్మ చేసుకున్న పుణ్యమే నిన్ను ఈరోజు ఇలాంటి కుటుంబంలోనికి తీసుకుని వచ్చింది.
బంగారం లాంటి భర్త, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబం వచ్చింది ఇప్పటినుండి అయినా నీ కష్టాలన్నీ గట్టెక్కిపోవాలి తల్లి అని అవని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటారు.
ఎలా ఉన్నారు నానమ్మ అంటూ కన్నీళ్ళతో అడుగుతుంది మేం బాగున్నాం తల్లి అని చెబుతారు.
ఇందిరాగారు పూజకి టైం అయిపోతుంది పదండి అని విక్రమ్ అవని నీ పూజలో కూర్చోబెడతారు. కోడలువైపు తిరిగి వెళ్లి సూత్రాలు తీసుకురా అని చెబుతారు.
అలాగే అత్తయ్య అని సూత్రాలు తెచ్చి అక్కడ పూజలో పెడతారు. ఆ సూత్రాలకు కూడా పూజ చేసి విక్రమ్ చేత అవిని మెడలో కట్టిస్తారు.
అవి చూడగానే అవని ఆనందం తట్టుకోలేక ఏడ్చేస్తుంది.
విక్రమ్ అవిని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ప్రతిదానికి ఏడుపేనా అని అడుగుతూ కన్నీళ్లు తుడుస్తాడు.
ఇది బాధతో వచ్చినవి కాదండి. ఆనందంతో వచ్చినవి. ఇది నా హక్కు. ఇన్ని రోజులకి నా చెంత చేరేటప్పటికీ సంతోషము ఆపుకోలేకపోతున్నాను అని విక్రమ్ చెయ్యి పట్టుకుని నుదుటి పైన పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది.
అవిని నీ అలా చూడగానే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడిందో అని బాధ పడతారు.
ఇందిరా గారే ముందుగా తేరుకొని లలిత వైపు తిరిగి ఈరోజు నుంచి మూడో రోజున అవని మెడలో తాళి మార్చాలి. ఆరోజు మళ్లీ వ్రతం చేపించి కార్యానికి ముహూర్తం పెట్టించు.
ఈ మూడు రోజులు అవనినీ నివి గదిలో ఉంచండి అని చెబుతారు. ఆ మాటలకి అవిని సిగ్గుపడితే విక్రమ్ ఇంకా మూడు రోజులా అన్నట్టు చూస్తాడు.
శ్రీ, రాజ్ విక్రమ్ చెరో ప్రక్కన చేరి ఏంటి బావ మూడు రోజులకే బెంగ పెట్టేసుకుంటున్నావు. ఆ కార్యం ఏదో అయిపోతే ఇంక మా చెల్లి కొంగు పట్టుకుని తిరుగుతావు ఏమో అని వేళాకోలం ఆడుతూఉంటారు.
వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ పట్టుకుని తిరిగితే తప్పేంటి... పెళ్లి కానీ బ్రహ్మచారులు మీకేం తెలుస్తుందిరా పెళ్ళైనోడి బాధ.
ముందు నీ పిల్లని నువ్వు లైన్లో పెట్టుకో. నీకు ఒక నెలరోజులే టైం ఇస్తున్నాను. ఈ లోపు నేహాతో ఓకే చెప్పించి నా ముందుకు రావాలి అని అల్టిమేట్ జారీ చేస్తాడు.
ఆ మాటలకి రాజ్ నవ్వితే... శ్రీ బిక్కమొహం వేసుకుని బావ ఇది అన్యాయం. ఇది ఏమైనా ప్రాజెక్టు అనుకుంటున్నావా... డెడ్ లైన్ ఇస్తున్నావు అని అంటాడు.
ఏ పనికైనా సరే డెడ్లైన్ పెట్టుకోవాల్సిందే... లేకపోతే పనులన్నీ చేద్దాం చూద్దాం అని మందుకొడిగా వెళ్తాయి. ముందు నీ పిల్లని నువ్వు సెట్ చేసుకో అని చెబుతాడు.
ఇంతకీ నా పిల్ల ఎక్కడ ఉంది అనుకుంటూ చూస్తూ ఉంటాడు. నేహా అక్కడ అవని నివితో మాట్లాడుతూ ఉంటుంది.
నవ్వుతూ మాట్లాడుతున్న నేహా వైపు చూసి అబ్బ నా పిల్ల అందరితో బానే కలిసిపోతుంది. బెంగళూరు వెళ్ళగానే లైన్లో పెట్టాల్సిందే... ఫోన్ చూసే వంకతో నేహ కి సైట్ కొడుతూ ఉంటాడు.
ధనుంజయ్ కి అక్కడ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందరి సంతోషాలు మధ్యన తను ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది.
అవని ఒప్పుకుంటే కానీ విక్రం మాట్లాడాడు ఇక కళ్యాణ్ రమేష్ గారు అయితే మొక్కుబడిగా మాట్లాడుతున్నారు కానీ ఆప్యాయంగా ఆ మాటలు లేవు.
లలితగారు పెళ్లయిన కొత్తలో అన్నయ్యగారు అని ఎంత అభిమానంగా మాట్లాడేవారు కానీ.. ఇప్పుడు ఒక మనిషిగా కూడా నన్ను చూడడం లేదు. ఇదంతా నా చేజేతులారా చేసుకున్నదే కదా..
ముందు నా కూతురు తోనే మాట్లాడాలి అని అవిని దగ్గరికి వెళతారు కానీ... అవిని పట్టించుకోకుండా నివి, నేహాతో మాట్లాడుతూ ఉంటుంది.
ఏం జరుగుతుందో అని అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు.విక్రమ్ మాత్రం ఫోన్ చూస్తూ ఉంటాడు.
ధనుంజయ కూతురు వైపే చూస్తూ అమ్మ అవని అని పిలుస్తాడు. ఆ పిలుపుకి అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
ఎన్నో సంవత్సరాల నుంచి అంత ప్రేమగా పిలిస్తే వినాలి అనుకుంది. ఇప్పుడు ఆ మనుషుల మీద విరిక్తి వచ్చాక పిలుస్తుంటే ఇంకా ఎలా స్పందించగలుగుతుంది.
పలకడం లేదు అనుకుని మళ్ళీ పిలుస్తారు. గట్టిగా శ్వాస తీసుకుని వదిలి చెప్పండి సార్ అంటుంది.
సార్ అన్న పిలుపుకి ధనుంజయ్ బాధగా చూస్తూ తండ్రిని పట్టుకుని సార్ ఏంటిమ్మ అనగానే... విరక్తిగా నవ్వుతూ తండ్రా ఎవరికి అని అడుగుతుంది.
ఆ మాటలకే ధనుంజయ్ మనసు కకావికలం అయిపోతూ ఉంటుంది. కూతురి గాయం అర్థం అయ్యే... నీకు కాదా అని అడుగుతాడు..
ఎలా అవుతారు. ఒక పనిమనిషి కి ఇంటి ఓనర్ ఎప్పుడు సారే గాని తండ్రి అవ్వరు కదా అని సూటిగా అడుగుతుంది.
నిన్ను ఎప్పుడూ నేను అలా చూడలేదు అవిని అని బాధగా అంటారు. చూడలేదా ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు ఆ మాట.
ఏ రోజు మీరు నన్ను కూతురుగా చూశారు?? ఏరోజైనా మీరు నాతో మాట్లాడారా... పోనీ రోజు నేను ఏమి తింటున్నానో...ఏం చదువుతున్నానో అని ఆయన ఎప్పుడైనా తెలుసుకున్నారా అని అడుగుతుంది.
అయినా నా పిచ్చి గానీ నేను తినే తిండి మీరు డిసైడ్ చేసి పెట్టేదే కదా ఇంకా మీరు కనుక్కోవడానికి ఏముంది అంతే కదా సార్ అని అంటుంది.
ఆ మాటలకే ధనుంజయ్ గుండెల్లో గునపాలు దిగుతూ ఉంటాయి. కూతురు వైపు కన్నీళ్ళతో చూస్తూ ఉంటాడు.
ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతాడు. కొడుకు బాధ చూడలేని సత్యవతి గారు ముందుకు వచ్చి అమ్మ అవని మీ నాన్నకి తెలియకుండా ఇదంతా జరిగిపోయింది.
మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం తల్లి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అంతా మంచే జరిగింది కదా... జరిగినవన్నీ మర్చిపోయి మీ నాన్నను క్షమించు తల్లి అని అడుగుతారు.
కారుతున్న కన్నీళ్లు కూడా తుడుచుకోకుండా ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు నానమ్మ. జరిగింది మర్చిపోమని. అనుభవించింది నేను కదా ఆ బాధ కూడా నాకే ఉంటుంది కదా....
అప్పుడు నాకు ఐదేళ్లు అనుకుంట.. బాగా ఆకలి వేసి నాన్న దగ్గరికి వెళ్లి ఆకలేస్తుంది నాన్న, ఇక్కడ నొప్పి వస్తుంది నాన్న అని పొట్ట మీద చెయ్యి పెట్టుకుని చూపిస్తే..
ఆ గ్లాసులో ఉన్న నీళ్లు తాగి వెళ్లి పడుకో. నొప్పి అదే తగ్గిపోతుంది అని తన ముద్దుల కూతురిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించారు.
తనకు తినిపించేకైనా మిగిలింది పెడతారేమో అని నిలబడితే... కోపంగా ఎందుకు ఇలా ఎదురుకుండా దిష్టిబొమ్మలాగా నిలబడతావు అని చిరాకు పడ్డారు.
ఆ ఇంటిలో నాకు చిన్నప్పటి నుండి సెపరేట్ గది కదా...
నొప్పితో విలవిలాడుతూ మోకాళ్లు పొట్టలోకి పెట్టుకొని ఏడుస్తూ ఉంటే....
ఈయన మాత్రం తన ముద్దుల భార్య, కూతురుతో గదిలో ముద్దు ముచ్చట్లు ఆడుతున్నాడు అలాంటి వాడు నాకు తండ్రా అని అడుగుతుంది.
ఆ మాటలకి, అవని బాధకి ఎవరు ఏమీ మాట్లాడలేక పోతారు. ఆ వయసులో ఉన్న చిన్నపిల్లల బాధ ఏంటో కళ్ళ ముందు కనపడుతుంది.
విక్రమ్ చేతిలో ఫోను నలిగిపోతూ ఉంటుంది.
ధనుంజయ్ కి ఆ రోజు జరిగిన విషయం గుర్తువస్తుంది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్గవి ఎదురొచ్చి మంచినీళ్లు కాఫీ ఇస్తుంది.
అవనికి నేను చెబుతుంటే వినడం లేదు ఈరోజు చాలా ఎక్కువ కేక్స్, చిప్స్ తినేసింది హాట్ వాటర్ తాగమంటే తాగను అని ఇంకా కావాలి అని పేచి పెడుతుంది మీరైనా చెప్పండి అని అమాయకంగా చెబుతుంది.
శిల్ప ఏమీ తినకుండా ఎదురుచూస్తోంది.మీరు తినిపిస్తేనే తింటాను అని సాయంత్రం నుంచి మీ కోసమే ఎదురు చూస్తుంది అని.. శిల్పకి మీరంటే ఎంత ఇష్టమో అంటుంది.
అవని ప్రవర్తనకి బాధపడుతూ శిల్ప ని చూసి మురిసిపోతూ శిల్పని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. ఏరా బంగారం తినలేదా అని తినిపిస్తూ ఉంటారు.
అప్పుడే అవని అక్కడకు వచ్చి అడగడం. తను కోప్పడడం అన్ని గుర్తుకు వస్తాయి. తన కోపం కూడా అవని అలా జంక్ తిన్నది అనేగాని వేరే ఉద్దేశం కాదు కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే...
ధనుంజయ్ ఏమని సమాధానం చెబుతాడు...
అవిని సంతోషంగా భర్త చెయ్యి పట్టుకుని కుడికాలు లోపలికి పెట్టి వస్తుంది. నవ్వుతున్న అవని మొఖం చూసిన ధనుంజయ్.. ఈ నవ్వు ఏ రోజు కూడా ఇప్పటివరకు నేను చూడలేదు.
అంటే.. నా కూతురు నుంచి నాకు తెలియకుండా నేను లాగేసుకున్నానా అని చూస్తూ ఉంటారు.
అవని ఇందిరాగారి దగ్గరికి వెళ్లి కాళ్లకు నమస్కారం చేసి నన్ను క్షమించండి అమ్మమ్మ అని తలదించుకుంటుంది.
క్షమించవలసిన అంత పెద్ద తప్పు నువ్వు ఏం చేశావు తల్లి. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ రోజు నువ్వు అలా చేయవలసి వచ్చింది.
నీకు పెళ్లి పైన ఉన్న విశ్వాసం, నా మనవడి పైన ఉన్న నమ్మకమే నిన్ను మళ్ళీ రప్పించింది. నీ నమ్మకమే నా మనవడు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అదే తాలిబంధం. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు అని దీవిస్తారు.
అత్త మామగారు దగ్గరికి వెళ్లి కాళ్ళకి నమస్కరించి నామీద మీకు ఎటువంటి కోపం లేదా అత్తయ్య గారు అని అడుగుతుంది.
కోపం ఎందుకే పిచ్చితల్లి. నా కొడుకు మీద నమ్మకంతో నువ్వు ఫైట్ చేసావు. ఎవరి దిష్టికళ్ళో పడి కొన్ని దుష్ట గ్రహాలు ఇంటిలోకి వచ్చి తిష్టవేశాయి.
మహాలక్ష్మి లాంటి నువ్వు వచ్చేవేళ అయ్యింది కాబట్టే నా కొడకు ఆ దుష్ట గ్రహాలు అన్నింటిని బయటకి తరిమేసాడు.
ఇప్పటినుంచి నేను నీకు అత్తనే కాదు అమ్మని కూడా అని చెబుతుంది. వెంటనే మాధవి అక్కడికి వచ్చి వదినమ్మ ఆగమ్మా.. తల్లిని ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి... దగ్గరికి తీసుకుంటుంది.
అవని మాధవి రమేష్ గారికి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది వెంటనే రమేష్ గారు నా కూతురికి ఎప్పుడూ మా ఆశీర్వాదాలు ఉంటాయి అలాగే నీకు తోడుగా కూడా నీకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నాడు అని చెబుతుండగానే...
భరత్ వచ్చి నన్ను నేను పరిచయం చేసుకుంటానులే అని చూడు సిస్టర్ బావ ఏదైనా ఇబ్బంది పెడితే..వెంటనే ఒక సైగ చేయి చాలు.
విక్రమ్ వైపు చూస్తూ వెంటనే నిన్ను నేను తెచ్చేసుకుంటాను అని చెబుతాడు. విక్రమ్ అదే మాట మీద వుండు బావ ఫ్యూచర్లో నువ్వు నాకు దొరుకుతావు కదా అని చెబుతాడు.
వెంటనే బావో నీకు దండం పెడతాను. నీకు అనుకూలంగా మార్చుకున్న అయినా సరే నన్ను ఇరికించేస్తావు అని దండం పెడతారు అందరూ వాళ్లని అలా చూసి నవ్వుకుంటారు.
సత్యవతి శేషగిరి కూడా వచ్చి అవిని నీ పట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి. మీ అమ్మ చేసుకున్న పుణ్యమే నిన్ను ఈరోజు ఇలాంటి కుటుంబంలోనికి తీసుకుని వచ్చింది.
బంగారం లాంటి భర్త, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబం వచ్చింది ఇప్పటినుండి అయినా నీ కష్టాలన్నీ గట్టెక్కిపోవాలి తల్లి అని అవని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటారు.
ఎలా ఉన్నారు నానమ్మ అంటూ కన్నీళ్ళతో అడుగుతుంది మేం బాగున్నాం తల్లి అని చెబుతారు.
ఇందిరాగారు పూజకి టైం అయిపోతుంది పదండి అని విక్రమ్ అవని నీ పూజలో కూర్చోబెడతారు. కోడలువైపు తిరిగి వెళ్లి సూత్రాలు తీసుకురా అని చెబుతారు.
అలాగే అత్తయ్య అని సూత్రాలు తెచ్చి అక్కడ పూజలో పెడతారు. ఆ సూత్రాలకు కూడా పూజ చేసి విక్రమ్ చేత అవిని మెడలో కట్టిస్తారు.
అవి చూడగానే అవని ఆనందం తట్టుకోలేక ఏడ్చేస్తుంది.
విక్రమ్ అవిని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ప్రతిదానికి ఏడుపేనా అని అడుగుతూ కన్నీళ్లు తుడుస్తాడు.
ఇది బాధతో వచ్చినవి కాదండి. ఆనందంతో వచ్చినవి. ఇది నా హక్కు. ఇన్ని రోజులకి నా చెంత చేరేటప్పటికీ సంతోషము ఆపుకోలేకపోతున్నాను అని విక్రమ్ చెయ్యి పట్టుకుని నుదుటి పైన పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది.
అవిని నీ అలా చూడగానే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడిందో అని బాధ పడతారు.
ఇందిరా గారే ముందుగా తేరుకొని లలిత వైపు తిరిగి ఈరోజు నుంచి మూడో రోజున అవని మెడలో తాళి మార్చాలి. ఆరోజు మళ్లీ వ్రతం చేపించి కార్యానికి ముహూర్తం పెట్టించు.
ఈ మూడు రోజులు అవనినీ నివి గదిలో ఉంచండి అని చెబుతారు. ఆ మాటలకి అవిని సిగ్గుపడితే విక్రమ్ ఇంకా మూడు రోజులా అన్నట్టు చూస్తాడు.
శ్రీ, రాజ్ విక్రమ్ చెరో ప్రక్కన చేరి ఏంటి బావ మూడు రోజులకే బెంగ పెట్టేసుకుంటున్నావు. ఆ కార్యం ఏదో అయిపోతే ఇంక మా చెల్లి కొంగు పట్టుకుని తిరుగుతావు ఏమో అని వేళాకోలం ఆడుతూఉంటారు.
వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ పట్టుకుని తిరిగితే తప్పేంటి... పెళ్లి కానీ బ్రహ్మచారులు మీకేం తెలుస్తుందిరా పెళ్ళైనోడి బాధ.
ముందు నీ పిల్లని నువ్వు లైన్లో పెట్టుకో. నీకు ఒక నెలరోజులే టైం ఇస్తున్నాను. ఈ లోపు నేహాతో ఓకే చెప్పించి నా ముందుకు రావాలి అని అల్టిమేట్ జారీ చేస్తాడు.
ఆ మాటలకి రాజ్ నవ్వితే... శ్రీ బిక్కమొహం వేసుకుని బావ ఇది అన్యాయం. ఇది ఏమైనా ప్రాజెక్టు అనుకుంటున్నావా... డెడ్ లైన్ ఇస్తున్నావు అని అంటాడు.
ఏ పనికైనా సరే డెడ్లైన్ పెట్టుకోవాల్సిందే... లేకపోతే పనులన్నీ చేద్దాం చూద్దాం అని మందుకొడిగా వెళ్తాయి. ముందు నీ పిల్లని నువ్వు సెట్ చేసుకో అని చెబుతాడు.
ఇంతకీ నా పిల్ల ఎక్కడ ఉంది అనుకుంటూ చూస్తూ ఉంటాడు. నేహా అక్కడ అవని నివితో మాట్లాడుతూ ఉంటుంది.
నవ్వుతూ మాట్లాడుతున్న నేహా వైపు చూసి అబ్బ నా పిల్ల అందరితో బానే కలిసిపోతుంది. బెంగళూరు వెళ్ళగానే లైన్లో పెట్టాల్సిందే... ఫోన్ చూసే వంకతో నేహ కి సైట్ కొడుతూ ఉంటాడు.
ధనుంజయ్ కి అక్కడ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందరి సంతోషాలు మధ్యన తను ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది.
అవని ఒప్పుకుంటే కానీ విక్రం మాట్లాడాడు ఇక కళ్యాణ్ రమేష్ గారు అయితే మొక్కుబడిగా మాట్లాడుతున్నారు కానీ ఆప్యాయంగా ఆ మాటలు లేవు.
లలితగారు పెళ్లయిన కొత్తలో అన్నయ్యగారు అని ఎంత అభిమానంగా మాట్లాడేవారు కానీ.. ఇప్పుడు ఒక మనిషిగా కూడా నన్ను చూడడం లేదు. ఇదంతా నా చేజేతులారా చేసుకున్నదే కదా..
ముందు నా కూతురు తోనే మాట్లాడాలి అని అవిని దగ్గరికి వెళతారు కానీ... అవిని పట్టించుకోకుండా నివి, నేహాతో మాట్లాడుతూ ఉంటుంది.
ఏం జరుగుతుందో అని అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు.విక్రమ్ మాత్రం ఫోన్ చూస్తూ ఉంటాడు.
ధనుంజయ కూతురు వైపే చూస్తూ అమ్మ అవని అని పిలుస్తాడు. ఆ పిలుపుకి అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
ఎన్నో సంవత్సరాల నుంచి అంత ప్రేమగా పిలిస్తే వినాలి అనుకుంది. ఇప్పుడు ఆ మనుషుల మీద విరిక్తి వచ్చాక పిలుస్తుంటే ఇంకా ఎలా స్పందించగలుగుతుంది.
పలకడం లేదు అనుకుని మళ్ళీ పిలుస్తారు. గట్టిగా శ్వాస తీసుకుని వదిలి చెప్పండి సార్ అంటుంది.
సార్ అన్న పిలుపుకి ధనుంజయ్ బాధగా చూస్తూ తండ్రిని పట్టుకుని సార్ ఏంటిమ్మ అనగానే... విరక్తిగా నవ్వుతూ తండ్రా ఎవరికి అని అడుగుతుంది.
ఆ మాటలకే ధనుంజయ్ మనసు కకావికలం అయిపోతూ ఉంటుంది. కూతురి గాయం అర్థం అయ్యే... నీకు కాదా అని అడుగుతాడు..
ఎలా అవుతారు. ఒక పనిమనిషి కి ఇంటి ఓనర్ ఎప్పుడు సారే గాని తండ్రి అవ్వరు కదా అని సూటిగా అడుగుతుంది.
నిన్ను ఎప్పుడూ నేను అలా చూడలేదు అవిని అని బాధగా అంటారు. చూడలేదా ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు ఆ మాట.
ఏ రోజు మీరు నన్ను కూతురుగా చూశారు?? ఏరోజైనా మీరు నాతో మాట్లాడారా... పోనీ రోజు నేను ఏమి తింటున్నానో...ఏం చదువుతున్నానో అని ఆయన ఎప్పుడైనా తెలుసుకున్నారా అని అడుగుతుంది.
అయినా నా పిచ్చి గానీ నేను తినే తిండి మీరు డిసైడ్ చేసి పెట్టేదే కదా ఇంకా మీరు కనుక్కోవడానికి ఏముంది అంతే కదా సార్ అని అంటుంది.
ఆ మాటలకే ధనుంజయ్ గుండెల్లో గునపాలు దిగుతూ ఉంటాయి. కూతురు వైపు కన్నీళ్ళతో చూస్తూ ఉంటాడు.
ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతాడు. కొడుకు బాధ చూడలేని సత్యవతి గారు ముందుకు వచ్చి అమ్మ అవని మీ నాన్నకి తెలియకుండా ఇదంతా జరిగిపోయింది.
మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం తల్లి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అంతా మంచే జరిగింది కదా... జరిగినవన్నీ మర్చిపోయి మీ నాన్నను క్షమించు తల్లి అని అడుగుతారు.
కారుతున్న కన్నీళ్లు కూడా తుడుచుకోకుండా ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు నానమ్మ. జరిగింది మర్చిపోమని. అనుభవించింది నేను కదా ఆ బాధ కూడా నాకే ఉంటుంది కదా....
అప్పుడు నాకు ఐదేళ్లు అనుకుంట.. బాగా ఆకలి వేసి నాన్న దగ్గరికి వెళ్లి ఆకలేస్తుంది నాన్న, ఇక్కడ నొప్పి వస్తుంది నాన్న అని పొట్ట మీద చెయ్యి పెట్టుకుని చూపిస్తే..
ఆ గ్లాసులో ఉన్న నీళ్లు తాగి వెళ్లి పడుకో. నొప్పి అదే తగ్గిపోతుంది అని తన ముద్దుల కూతురిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించారు.
తనకు తినిపించేకైనా మిగిలింది పెడతారేమో అని నిలబడితే... కోపంగా ఎందుకు ఇలా ఎదురుకుండా దిష్టిబొమ్మలాగా నిలబడతావు అని చిరాకు పడ్డారు.
ఆ ఇంటిలో నాకు చిన్నప్పటి నుండి సెపరేట్ గది కదా...
నొప్పితో విలవిలాడుతూ మోకాళ్లు పొట్టలోకి పెట్టుకొని ఏడుస్తూ ఉంటే....
ఈయన మాత్రం తన ముద్దుల భార్య, కూతురుతో గదిలో ముద్దు ముచ్చట్లు ఆడుతున్నాడు అలాంటి వాడు నాకు తండ్రా అని అడుగుతుంది.
ఆ మాటలకి, అవని బాధకి ఎవరు ఏమీ మాట్లాడలేక పోతారు. ఆ వయసులో ఉన్న చిన్నపిల్లల బాధ ఏంటో కళ్ళ ముందు కనపడుతుంది.
విక్రమ్ చేతిలో ఫోను నలిగిపోతూ ఉంటుంది.
ధనుంజయ్ కి ఆ రోజు జరిగిన విషయం గుర్తువస్తుంది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్గవి ఎదురొచ్చి మంచినీళ్లు కాఫీ ఇస్తుంది.
అవనికి నేను చెబుతుంటే వినడం లేదు ఈరోజు చాలా ఎక్కువ కేక్స్, చిప్స్ తినేసింది హాట్ వాటర్ తాగమంటే తాగను అని ఇంకా కావాలి అని పేచి పెడుతుంది మీరైనా చెప్పండి అని అమాయకంగా చెబుతుంది.
శిల్ప ఏమీ తినకుండా ఎదురుచూస్తోంది.మీరు తినిపిస్తేనే తింటాను అని సాయంత్రం నుంచి మీ కోసమే ఎదురు చూస్తుంది అని.. శిల్పకి మీరంటే ఎంత ఇష్టమో అంటుంది.
అవని ప్రవర్తనకి బాధపడుతూ శిల్ప ని చూసి మురిసిపోతూ శిల్పని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. ఏరా బంగారం తినలేదా అని తినిపిస్తూ ఉంటారు.
అప్పుడే అవని అక్కడకు వచ్చి అడగడం. తను కోప్పడడం అన్ని గుర్తుకు వస్తాయి. తన కోపం కూడా అవని అలా జంక్ తిన్నది అనేగాని వేరే ఉద్దేశం కాదు కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే...
ధనుంజయ్ ఏమని సమాధానం చెబుతాడు...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)