05-01-2026, 04:22 PM
(This post was last modified: 05-01-2026, 04:24 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అమ్మోరు
నా చిన్నతనంలో ఎప్పుడో విన్న అమ్మవారి కథలలో ఈ కథ ఒకటి అండి. నాకు మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి రచయిత ఎవరు ప్రాంతం ఏదో కూడా సరిగా తెలియలేదు. నేను విన్న కథకు కొద్దిగా నా ఊహను జోడించి ఇక్కడ రాయడం జరుగుతోంది. ఇక ఇప్పుడు కథలోకి వెళదాము.
అది ఒక మారుమూల పల్లె. ఆ పల్లెలోని ఎక్కువమంది జీవనాధారం దుంగలు కొట్టి అమ్మడం. అలా వాళ్లు కొట్టి అమ్మిన దుంగలకు ఒక విశిష్టత ఉంటుంది. వాళ్ళు పెద్దపెద్ద దేవదారు మొదలైన శ్రేష్టమైన చెట్లను నరికి నదిలో 15 రోజులు పాటు నానబెట్టి బయటకు తీసిన తర్వాత కలపగా ఉపయోగించుకునే రకంగా దుంగలను నరికి అమ్ముతూ ఉంటారు. అలా 15 రోజులు పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ చెక్కలో పట్టుత్వం వస్తుంది అని వాళ్ళ నమ్మకం. అలా చెట్లను నీళ్లలో నానబెట్టి బయటకు తీసి చెట్టు మొద్దులను నరుకుతూ ఉంటే ఒక చెట్టు మూడు భాగాలుగా చేసిన తర్వాత దాంట్లో భూమి నుంచి పైకి ఉన్న ఒక భాగం మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది. దానిని ముక్కలుగా నరకాలనుకున్నా కూడా బెరడు కి కూడా ఏమీ కాలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దుంగను అలానే పక్కన పెట్టారు. మధ్యాహ్న సమయం అవ్వడంతో ఆ కూలీలందరూ కూడా తెచ్చుకున్న సద్ది మూటను విప్పి ఆ దుంగలకు ఎదురుగా కూర్చుని తింటూ ఉన్నారు. అంతలో అందులో ఒక వ్యక్తికి ఆ దుంగ బెరడు రెండు కళ్ళ ఆకారంలో కనిపించింది. వెంటనే అతను తన పక్కన ఉన్న మరికొందరికి " అదిగో చూడండి రా. దుంగ కళ్ళు తెరిచి మనల్ని చూస్తోంది." అన్నాడు.
అందరూ కూడా ఆ దుంగ వైపు చూసి " నిజమేరా కళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయి." అన్నారు. ఆ తర్వాత ఆ దుంగని ఏం చేద్దాం అన్నా కూడా వాళ్ల వల్ల కాలేదు. ఇది ఏదో మహత్యం ఉన్న దుంగ లాగా ఉందని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ఆ దుంగని ఒక పక్కగా పెట్టి దండం పెట్టుకుని ఆ రోజుకి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
మర్నాడు ఆ దుంగ దగ్గరకు వచ్చి " అమ్మ ఈరోజు మా పని సవ్యంగా జరగాలి. మమ్మల్ని ఆశీర్వదించు తల్లి." అని చెప్పుకుని అక్కడి నుంచి తమ పని లోపలికి వెళ్లిపోయారు. నిజంగానే ఆరోజు రోజు కంటే కూడా ఎక్కువ దుంగల్ని నరకగలిగారు.
వాళ్లంతా తిరిగి వెళుతూ " అమ్మోరు నీ దయవల్ల మాకు ఎక్కువ దుంగలు నరికి ఆదాయం ఎక్కువ వచ్చిందని దండం పెట్టుకొని వెళ్లారు."
అలా వాళ్ళు దండం పెట్టుకుని వెళుతూ ఉండటం చూసిన ఒక గొర్రెల కాపరి " ఏంటయ్యా తుంగకు దండం పెడుతున్నారు?" అని వాళ్ళని అడిగాడు.
అందులో ఒకతను " ఆ దుంగ మామూలు దుంగ కాదయ్యా? దొంగ అనకండి. అమ్మోరు తల్లి. నువ్వు దగ్గరకు వెళ్లి చూడు రెండు కళ్ళు కూడా కనబడతాయి. మేము ఇవాళ ఉదయం అమ్మోరు తల్లి దగ్గరకు వెళ్లి మా పని మంచిగా జరగాలి అని అందరం దండం పెట్టుకుని వెళ్ళాము. ఎప్పుడూ రోజంతా కష్టపడి నరికే దుంగలు ఈరోజు దాని కంటే ఇంకా ఎక్కువ దుంగలే ఎక్కువ శ్రమ లేకుండా నరికాము. బాగా దయగల తల్లి అమ్మోరు తల్లి." అని చెప్పి వెళ్ళిపోయారు.
ఆ మాట విన్న ఆ గొర్రెల కాపరి ఇంటికి వెళ్లి మర్నాడు ఉదయమే అటు నుంచి వెళుతూ " అమ్మ నా గొర్రెలను ఏ క్రూర జంతువు పాలిట పడకుండా కాపాడు. వాటికి చక్కటి మేత దొరకాలి." అని దండం పెట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడూ అడవిలోకి వెళ్లినా ఏదో ఒక జంతువు మీద పడి రెండు మూడు గొర్రెలను తినటము, అతను బాధతో తిరిగి రావడం జరిగేది. కానీ ఈరోజు అలా జరగలేదు. అతను ఎంతో సంతోషంగా తిరిగి వెళుతూ " అమ్మోరు తల్లి నువ్వు నిజంగానే దయగల దానివి. నా గొర్రెలన్నిటినీ కాపాడి ఇంటికి చేర్చావు." అని దండం పెట్టుకుని వెళ్ళాడు.
అలా అలా అమ్మవారి గురించి ఊర్లో అందరికీ తెలిసింది. అందరూ అటువైపు వెళుతూ కూలి పనులకు, తమ రోజువారి ఈ పనులకు వెళుతూ " మమ్మల్ని కాపాడు తల్లి." అనో " మా కష్టాలు ఇవి. మా కష్టాలు తీర్చు." అనో ఏదో ఒకటి ఆమె దగ్గర మొక్కి దండం పెట్టుకుని వెళుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. వారిలో భక్తి పెరిగి పోయింది.
అప్పటినుంచి తమ దొడ్లో పూచిన పువ్వులను తమ దొడ్లో కాచిన కాయలను, కూరగాయలను ఏవి ఉంటే అది ముందుగా అమ్మోరు తల్లికి నివేదించి ఆ తర్వాత ఆ పంటను కోసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు సంతోషంగా ఎటువంటి చీకు చింతా లేకుండా బతుకుతూ ఉన్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఆ దుంగకి చుట్టూ చిన్న పాకలాగా వేసి పైన కప్పుని ఏర్పరిచారు. బయట నుంచి చూస్తే చక్కగా అమ్మోరు కనిపిస్తూ ఉంటుంది.
ఊరిలోని వారంతా ఆ ఊరి పంతులు గారిని బతిమాలి " అయ్యా మాకు పూజలు చేయడం రాదు. కానీ మా అమ్మోరు తల్లి చాలా చలవగల తల్లి. మీ చేత్తో ఒక దీపం పెట్టి అమ్మోరికి పూజ చేయండి. అయ్యా మాకు తోచింది ఇచ్చుకుంటాము." అన్నారు.
ఆ పూజారి కూడా దేవీ భక్తుడు అవ్వటం మూలంగా నడివయసు దాటినవాడైనప్పటికీ కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టి తనకి తెలిసినట్లుగా నాలుగు మంత్రాలు చదివి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను పూజకు వచ్చే సమయానికి ఊర్లోని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కాయో కమ్మో తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టమని పూజారికి ఇచ్చి వెళ్తూ తమ తమ కష్టాలు అమ్మవారికి చెప్పుకుని తీర్చమని వేడుకుని వెళుతూ ఉంటారు. అది క్రమంగా వాళ్లకు రోజువారి అలవాటు లాగా ఏర్పడిపోయింది. ఎంతో శ్రద్ధతో పూజ చేస్తూ ఉన్న పూజారికి ఎంతో కొంత ఇచ్చుకోవాలి అని అతనికి నెలకి సరిపడా సరుకులు ఏదో ఒక రూపంలో వస్తూ ఉన్నాయి. అతని జీవనాధారానికి ఎటువంటి లోటు లేకుండా అయిపోయింది.
అలా కాలం సుఖంగా కాలం జరుగుతూ ఉంది. ఇంతలో ఒక సంవత్సరం వానాకాలం వచ్చింది. దుంగలు నరికే కూలివాళ్లకు కూడా పని లేకుండా పోయింది. కానీ అమ్మవారి దయవల్ల పని లేకపోయినా వాళ్లంతా ఆ కాలాన్ని హాయిగా ఇళ్లలో గడిపే విధంగా ఏర్పాటు జరిగిపోయింది. వాళ్ళందరూ కూడా పెద్దపెద్ద చెట్లను నరికి వాన నీటికి నదిలో నానబెట్టడానికి కట్టి ప్రశాంతంగా ఇళ్లలో ఉన్నారు.
అయితే ప్రతిరోజూ వాననకుండా వరదనకుండా పూజారి వచ్చి పూజ చేసుకొని వెళుతూనే ఉన్నాడు. ఒకరోజు అతను వచ్చేసరికి ఆ చీకటిలో ఎవరో ఒకతను అమ్మవారి మీద గొడ్డలి ఎత్తాడు. పూజారి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చూస్తే మాసిన బట్టలతో మురికి దుమ్ము కొట్టుకుపోయి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంతలో దుంగలో నుంచి ఒక నడివయసు చామన చాయతో ఉన్న స్త్రీ బయటకు వచ్చింది. ఆమెను చూస్తూ ఉంటే చేతుల నిండా ఎర్రటి గాజులు, నుదుటిన రూపాయి కాసంత బొట్టు, తలలో పువ్వులు ఉన్నాయి. చూడగానే నమస్కరించాలి అనేటువంటి ఆహార్యం.
ఆమె బయటకు వచ్చి ఆ వ్యక్తితో " నాయన నువ్వు ఈ దుంగను కొట్టకు. ఇది ఇక్కడి వాళ్లకి దేవతా స్వరూపం. నీ కళ్ళముందే నేను దుంగలో నుంచి వచ్చాను కదా. వదిలిపెట్టి వెళ్ళు." అన్నది.
అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ " అమ్మ నేను ఒక దోపిడీ దొంగని. అయినప్పటికీ ఎప్పుడన్నా దారి కాచి దోపిడీ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే జీవనాధారాన్ని మార్చుకోవాలని కొన్నాళ్లుగా కట్టెలు కొట్టి తీసుకోళ్లి అమ్ముకునే జీవిస్తూ ఉన్నాను. ప్రస్తుతం వానాకాలం రావటము, కట్టెలు ఎక్కడా కనిపించలేదు. ఇంటికి తీసుకు వెళ్లడానికి నయా పైసా లేదు. నువ్వు డబ్బులు ఇచ్చావు అంటే నేను ఈ దుంగను కొట్టకుండా వెళ్ళిపోతాను." అన్నాడు.
ఆమె వెంటనే తన బొడ్డులో దోపుకున్న చిన్న సంచిని ఒక దాన్ని తీసి అతని చేతికి ఇస్తూ " ఇదిగో నాయనా, ఈ దొంగ జోలికి ఇక ఎప్పటికీ రాకు. నువ్వు మంచి ప్రవర్తనతో జీవించు. కష్టపడి నీ జీవితాన్ని కొనసాగించు. ఇక ఇకపై దొంగతనాల జోలికి వెళ్ళకు." అన్నది.
అప్పుడు ఆ వ్యక్తి " అమ్మ నా ఇంట్లో ముసలి తల్లి, కడుపుతో ఉన్న భార్య ఉన్నారు. అందుకనే డబ్బుల కోసం అనే ఇక్కడ పెట్టి ఉన్న ఈ దుంగను కొట్టాలి అనుకున్నాను. కానీ మరొకరి వస్తువుని దొంగతనం చేయకూడదు అనుకున్న తర్వాత ఇంత భద్రంగా పెట్టిన దుంగను నేను మాత్రం ఎందుకు కొడతాను. వేరే దారి లేక ఎండిపోయి చక్కగా పొడిగా ఉన్నది. కొట్టి అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను. సరే తల్లి ఇక మీదట నేను దొంగతనం చేయను. ఇది నేను నీకు ఇస్తున్న ప్రమాణం." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
దూరం నుంచి పూజారి అదంతా చూస్తూనే ఉన్నాడు. అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాత అతను తిరిగి వెళ్ళిన తర్వాత ఆ నడివయసు ఆడమనిషి ఎటు వెళ్లిందో అతనికి కనిపించలేదు. అతను వెంటనే " ఔరా 10 ఏళ్ల బట్టి ఎంతో భక్తితో నేను అమ్మవారిని పూజిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ వ్యక్తి వచ్చి అమ్మవారి మీద గొడ్డలి ఎత్తటం తోటే అమ్మవారే స్వయంగా వచ్చి అతనికి కాసుల సంచిని ఇచ్చారు. మరి ఇన్నేళ్లు పూజిస్తున్న నన్ను మాత్రం ఎందుకు ఉపేక్షించారు?" అనుకున్నాడు. అతనికి ధనాస పెరిగింది. అందువల్ల అతని విచక్షణ నశించింది. అతను వెంటనే " అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోవాలి అంటే గొడ్డలి ఎత్తాలి అనమాట. ఇదా కిట్టుకు. సరే చెప్తాను." అంటూ ఆరోజు పూజ చేయకుండా వెనుతిరిగి ఇంటికి వెళ్లి ఇంటి నుంచి గొడ్డలి తీసుకుని వచ్చాడు.
&&&&&&&&&&&&&&&&&&&
నా చిన్నతనంలో ఎప్పుడో విన్న అమ్మవారి కథలలో ఈ కథ ఒకటి అండి. నాకు మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి రచయిత ఎవరు ప్రాంతం ఏదో కూడా సరిగా తెలియలేదు. నేను విన్న కథకు కొద్దిగా నా ఊహను జోడించి ఇక్కడ రాయడం జరుగుతోంది. ఇక ఇప్పుడు కథలోకి వెళదాము.
అది ఒక మారుమూల పల్లె. ఆ పల్లెలోని ఎక్కువమంది జీవనాధారం దుంగలు కొట్టి అమ్మడం. అలా వాళ్లు కొట్టి అమ్మిన దుంగలకు ఒక విశిష్టత ఉంటుంది. వాళ్ళు పెద్దపెద్ద దేవదారు మొదలైన శ్రేష్టమైన చెట్లను నరికి నదిలో 15 రోజులు పాటు నానబెట్టి బయటకు తీసిన తర్వాత కలపగా ఉపయోగించుకునే రకంగా దుంగలను నరికి అమ్ముతూ ఉంటారు. అలా 15 రోజులు పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ చెక్కలో పట్టుత్వం వస్తుంది అని వాళ్ళ నమ్మకం. అలా చెట్లను నీళ్లలో నానబెట్టి బయటకు తీసి చెట్టు మొద్దులను నరుకుతూ ఉంటే ఒక చెట్టు మూడు భాగాలుగా చేసిన తర్వాత దాంట్లో భూమి నుంచి పైకి ఉన్న ఒక భాగం మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది. దానిని ముక్కలుగా నరకాలనుకున్నా కూడా బెరడు కి కూడా ఏమీ కాలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దుంగను అలానే పక్కన పెట్టారు. మధ్యాహ్న సమయం అవ్వడంతో ఆ కూలీలందరూ కూడా తెచ్చుకున్న సద్ది మూటను విప్పి ఆ దుంగలకు ఎదురుగా కూర్చుని తింటూ ఉన్నారు. అంతలో అందులో ఒక వ్యక్తికి ఆ దుంగ బెరడు రెండు కళ్ళ ఆకారంలో కనిపించింది. వెంటనే అతను తన పక్కన ఉన్న మరికొందరికి " అదిగో చూడండి రా. దుంగ కళ్ళు తెరిచి మనల్ని చూస్తోంది." అన్నాడు.
అందరూ కూడా ఆ దుంగ వైపు చూసి " నిజమేరా కళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయి." అన్నారు. ఆ తర్వాత ఆ దుంగని ఏం చేద్దాం అన్నా కూడా వాళ్ల వల్ల కాలేదు. ఇది ఏదో మహత్యం ఉన్న దుంగ లాగా ఉందని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ఆ దుంగని ఒక పక్కగా పెట్టి దండం పెట్టుకుని ఆ రోజుకి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
మర్నాడు ఆ దుంగ దగ్గరకు వచ్చి " అమ్మ ఈరోజు మా పని సవ్యంగా జరగాలి. మమ్మల్ని ఆశీర్వదించు తల్లి." అని చెప్పుకుని అక్కడి నుంచి తమ పని లోపలికి వెళ్లిపోయారు. నిజంగానే ఆరోజు రోజు కంటే కూడా ఎక్కువ దుంగల్ని నరకగలిగారు.
వాళ్లంతా తిరిగి వెళుతూ " అమ్మోరు నీ దయవల్ల మాకు ఎక్కువ దుంగలు నరికి ఆదాయం ఎక్కువ వచ్చిందని దండం పెట్టుకొని వెళ్లారు."
అలా వాళ్ళు దండం పెట్టుకుని వెళుతూ ఉండటం చూసిన ఒక గొర్రెల కాపరి " ఏంటయ్యా తుంగకు దండం పెడుతున్నారు?" అని వాళ్ళని అడిగాడు.
అందులో ఒకతను " ఆ దుంగ మామూలు దుంగ కాదయ్యా? దొంగ అనకండి. అమ్మోరు తల్లి. నువ్వు దగ్గరకు వెళ్లి చూడు రెండు కళ్ళు కూడా కనబడతాయి. మేము ఇవాళ ఉదయం అమ్మోరు తల్లి దగ్గరకు వెళ్లి మా పని మంచిగా జరగాలి అని అందరం దండం పెట్టుకుని వెళ్ళాము. ఎప్పుడూ రోజంతా కష్టపడి నరికే దుంగలు ఈరోజు దాని కంటే ఇంకా ఎక్కువ దుంగలే ఎక్కువ శ్రమ లేకుండా నరికాము. బాగా దయగల తల్లి అమ్మోరు తల్లి." అని చెప్పి వెళ్ళిపోయారు.
ఆ మాట విన్న ఆ గొర్రెల కాపరి ఇంటికి వెళ్లి మర్నాడు ఉదయమే అటు నుంచి వెళుతూ " అమ్మ నా గొర్రెలను ఏ క్రూర జంతువు పాలిట పడకుండా కాపాడు. వాటికి చక్కటి మేత దొరకాలి." అని దండం పెట్టుకొని వెళ్ళాడు. ఎప్పుడూ అడవిలోకి వెళ్లినా ఏదో ఒక జంతువు మీద పడి రెండు మూడు గొర్రెలను తినటము, అతను బాధతో తిరిగి రావడం జరిగేది. కానీ ఈరోజు అలా జరగలేదు. అతను ఎంతో సంతోషంగా తిరిగి వెళుతూ " అమ్మోరు తల్లి నువ్వు నిజంగానే దయగల దానివి. నా గొర్రెలన్నిటినీ కాపాడి ఇంటికి చేర్చావు." అని దండం పెట్టుకుని వెళ్ళాడు.
అలా అలా అమ్మవారి గురించి ఊర్లో అందరికీ తెలిసింది. అందరూ అటువైపు వెళుతూ కూలి పనులకు, తమ రోజువారి ఈ పనులకు వెళుతూ " మమ్మల్ని కాపాడు తల్లి." అనో " మా కష్టాలు ఇవి. మా కష్టాలు తీర్చు." అనో ఏదో ఒకటి ఆమె దగ్గర మొక్కి దండం పెట్టుకుని వెళుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. వారిలో భక్తి పెరిగి పోయింది.
అప్పటినుంచి తమ దొడ్లో పూచిన పువ్వులను తమ దొడ్లో కాచిన కాయలను, కూరగాయలను ఏవి ఉంటే అది ముందుగా అమ్మోరు తల్లికి నివేదించి ఆ తర్వాత ఆ పంటను కోసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు సంతోషంగా ఎటువంటి చీకు చింతా లేకుండా బతుకుతూ ఉన్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఆ దుంగకి చుట్టూ చిన్న పాకలాగా వేసి పైన కప్పుని ఏర్పరిచారు. బయట నుంచి చూస్తే చక్కగా అమ్మోరు కనిపిస్తూ ఉంటుంది.
ఊరిలోని వారంతా ఆ ఊరి పంతులు గారిని బతిమాలి " అయ్యా మాకు పూజలు చేయడం రాదు. కానీ మా అమ్మోరు తల్లి చాలా చలవగల తల్లి. మీ చేత్తో ఒక దీపం పెట్టి అమ్మోరికి పూజ చేయండి. అయ్యా మాకు తోచింది ఇచ్చుకుంటాము." అన్నారు.
ఆ పూజారి కూడా దేవీ భక్తుడు అవ్వటం మూలంగా నడివయసు దాటినవాడైనప్పటికీ కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టి తనకి తెలిసినట్లుగా నాలుగు మంత్రాలు చదివి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను పూజకు వచ్చే సమయానికి ఊర్లోని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కాయో కమ్మో తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టమని పూజారికి ఇచ్చి వెళ్తూ తమ తమ కష్టాలు అమ్మవారికి చెప్పుకుని తీర్చమని వేడుకుని వెళుతూ ఉంటారు. అది క్రమంగా వాళ్లకు రోజువారి అలవాటు లాగా ఏర్పడిపోయింది. ఎంతో శ్రద్ధతో పూజ చేస్తూ ఉన్న పూజారికి ఎంతో కొంత ఇచ్చుకోవాలి అని అతనికి నెలకి సరిపడా సరుకులు ఏదో ఒక రూపంలో వస్తూ ఉన్నాయి. అతని జీవనాధారానికి ఎటువంటి లోటు లేకుండా అయిపోయింది.
అలా కాలం సుఖంగా కాలం జరుగుతూ ఉంది. ఇంతలో ఒక సంవత్సరం వానాకాలం వచ్చింది. దుంగలు నరికే కూలివాళ్లకు కూడా పని లేకుండా పోయింది. కానీ అమ్మవారి దయవల్ల పని లేకపోయినా వాళ్లంతా ఆ కాలాన్ని హాయిగా ఇళ్లలో గడిపే విధంగా ఏర్పాటు జరిగిపోయింది. వాళ్ళందరూ కూడా పెద్దపెద్ద చెట్లను నరికి వాన నీటికి నదిలో నానబెట్టడానికి కట్టి ప్రశాంతంగా ఇళ్లలో ఉన్నారు.
అయితే ప్రతిరోజూ వాననకుండా వరదనకుండా పూజారి వచ్చి పూజ చేసుకొని వెళుతూనే ఉన్నాడు. ఒకరోజు అతను వచ్చేసరికి ఆ చీకటిలో ఎవరో ఒకతను అమ్మవారి మీద గొడ్డలి ఎత్తాడు. పూజారి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చూస్తే మాసిన బట్టలతో మురికి దుమ్ము కొట్టుకుపోయి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంతలో దుంగలో నుంచి ఒక నడివయసు చామన చాయతో ఉన్న స్త్రీ బయటకు వచ్చింది. ఆమెను చూస్తూ ఉంటే చేతుల నిండా ఎర్రటి గాజులు, నుదుటిన రూపాయి కాసంత బొట్టు, తలలో పువ్వులు ఉన్నాయి. చూడగానే నమస్కరించాలి అనేటువంటి ఆహార్యం.
ఆమె బయటకు వచ్చి ఆ వ్యక్తితో " నాయన నువ్వు ఈ దుంగను కొట్టకు. ఇది ఇక్కడి వాళ్లకి దేవతా స్వరూపం. నీ కళ్ళముందే నేను దుంగలో నుంచి వచ్చాను కదా. వదిలిపెట్టి వెళ్ళు." అన్నది.
అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ " అమ్మ నేను ఒక దోపిడీ దొంగని. అయినప్పటికీ ఎప్పుడన్నా దారి కాచి దోపిడీ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే జీవనాధారాన్ని మార్చుకోవాలని కొన్నాళ్లుగా కట్టెలు కొట్టి తీసుకోళ్లి అమ్ముకునే జీవిస్తూ ఉన్నాను. ప్రస్తుతం వానాకాలం రావటము, కట్టెలు ఎక్కడా కనిపించలేదు. ఇంటికి తీసుకు వెళ్లడానికి నయా పైసా లేదు. నువ్వు డబ్బులు ఇచ్చావు అంటే నేను ఈ దుంగను కొట్టకుండా వెళ్ళిపోతాను." అన్నాడు.
ఆమె వెంటనే తన బొడ్డులో దోపుకున్న చిన్న సంచిని ఒక దాన్ని తీసి అతని చేతికి ఇస్తూ " ఇదిగో నాయనా, ఈ దొంగ జోలికి ఇక ఎప్పటికీ రాకు. నువ్వు మంచి ప్రవర్తనతో జీవించు. కష్టపడి నీ జీవితాన్ని కొనసాగించు. ఇక ఇకపై దొంగతనాల జోలికి వెళ్ళకు." అన్నది.
అప్పుడు ఆ వ్యక్తి " అమ్మ నా ఇంట్లో ముసలి తల్లి, కడుపుతో ఉన్న భార్య ఉన్నారు. అందుకనే డబ్బుల కోసం అనే ఇక్కడ పెట్టి ఉన్న ఈ దుంగను కొట్టాలి అనుకున్నాను. కానీ మరొకరి వస్తువుని దొంగతనం చేయకూడదు అనుకున్న తర్వాత ఇంత భద్రంగా పెట్టిన దుంగను నేను మాత్రం ఎందుకు కొడతాను. వేరే దారి లేక ఎండిపోయి చక్కగా పొడిగా ఉన్నది. కొట్టి అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను. సరే తల్లి ఇక మీదట నేను దొంగతనం చేయను. ఇది నేను నీకు ఇస్తున్న ప్రమాణం." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
దూరం నుంచి పూజారి అదంతా చూస్తూనే ఉన్నాడు. అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాత అతను తిరిగి వెళ్ళిన తర్వాత ఆ నడివయసు ఆడమనిషి ఎటు వెళ్లిందో అతనికి కనిపించలేదు. అతను వెంటనే " ఔరా 10 ఏళ్ల బట్టి ఎంతో భక్తితో నేను అమ్మవారిని పూజిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ వ్యక్తి వచ్చి అమ్మవారి మీద గొడ్డలి ఎత్తటం తోటే అమ్మవారే స్వయంగా వచ్చి అతనికి కాసుల సంచిని ఇచ్చారు. మరి ఇన్నేళ్లు పూజిస్తున్న నన్ను మాత్రం ఎందుకు ఉపేక్షించారు?" అనుకున్నాడు. అతనికి ధనాస పెరిగింది. అందువల్ల అతని విచక్షణ నశించింది. అతను వెంటనే " అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోవాలి అంటే గొడ్డలి ఎత్తాలి అనమాట. ఇదా కిట్టుకు. సరే చెప్తాను." అంటూ ఆరోజు పూజ చేయకుండా వెనుతిరిగి ఇంటికి వెళ్లి ఇంటి నుంచి గొడ్డలి తీసుకుని వచ్చాడు.
&&&&&&&&&&&&&&&&&&&
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)