Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#32
ఎపిసోడ్ 8


హిర్వాణి తో వీడియో కాల్ లో మాట్లాడి డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ప్రాబ్లం ఏమిటో వివరాలు తెలుసుకుంది అర్ణ.

జైలు నుంచి వసుంధర ఇంటి దగ్గర అవుట్ హౌస్ కి వచ్చాడు అభిర్.

*****************

లండన్ వేరే వేరే దేశాలలో ఉంటూ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి వచ్చిన ఫ్యామిలీ మెంబెర్స్ ని రిసీవ్ చేసుకుని ఒక ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకు వెళ్ళింది వర్ణ.

"మనం మీ ఇంటికి వెళ్లకుండా ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు వచ్చాము? నాన్నగారు ఇక్కడ ఉన్నారా ఏంటి?" డౌట్ గా అడిగాడు ముకుల్ నంద రెండో కొడుకు ప్రవీణ్ నంద.

"నో! తాతగారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాత్రి ఇంటికి వచ్చారు." అని చెప్పింది అర్ణ.

"అవునా? నాన్నగారు హాస్పిటల్ లో ఉన్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు?" డౌట్ గా అడిగింది పెద్ద కూతురు ఝాన్సీ.

"అలా అయితే మనం ఇక్కడికి ఎందుకు ఇంటికి వెళ్లి నాన్నగారిని చూద్దాం పదండి." అంది రెండో కూతురు నళిని.

"అర్ణ మనతో ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అందుకునే ఇక్కడికి తీసుకు వచ్చింది అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి." అన్నాడు రెండో కొడుకు సుభాష్ నంద.

"ఎస్! మీరందరూ ప్రశాంతంగా ఉంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, తాతగారు అందరకి ఆస్తులు పంచబోతున్నారు." అని చెప్పింది అర్ణ.

"అవునా? అయితే ఇందులో ప్రాబ్లమ్ ఏముంది ఉన్నది మొత్తం 5 వాటాలు అని ఎప్పటినుంచో అనుకునేదే కదా!" అన్నాడు ప్రవీణ్.

"నేను వాటాల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు,12 సంవత్సరాల క్రితం ఇండియాలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తీసుకువచ్చాను." అంది అర్ణ.

"నో! ఇండియా బిజినెస్ లు మొత్తం గోకుల్, నాన్నగారు చూసుకునేవారు  అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత నాన్నగారు లండన్ వచ్చేసారు.'

'నేను ఒకసారి అడిగితే ఆ విషయం గురించి ఇంకెప్పుడు మాట్లాడకు నీకు ఇచ్చిన బిజినెస్ లు నువ్వు జాగ్రత్తగా చూసుకో అన్నారు అందుకే నేను ఆ టాపిక్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు." అన్నాడు సుభాష్.

"ఎస్! అన్నయ్య చనిపోయిన తర్వాత నేను వెళ్లి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అని అడిగాను అప్పుడు నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు అప్పటినుంచి నేను ఇండియా విషయం మర్చిపోయాను." అంది ఝాన్సీ.

"నాకు అసలు ఇండియా సంగతే తెలీదు ఒకసారి బిజినెస్ ట్రిప్ నిమిత్తం వెళుతున్నాను అంటే నాన్నగారు వద్దు అన్నారు ఆగిపోయాను అప్పట్నుంచి ఇండియా తో ఒక డీల్ కూడా చేసుకోలేదు." అన్నాడు ప్రవీణ్.

"నాకు తెలిసి ఇండియాలో అన్నయ్య, నాన్నగారు ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు అందుకే ఆయన వెళ్లడం లేదు ఎవర్ని వెళ్లడం లేదు.'

'ఒక్కసారి అడిగితే ఇండియాలో ఉన్న బిజినెస్ లు నేను మాత్రమే చూసుకుంటాను అని చెప్పారు, ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు అందుకే ఆ రోజు నుంచి సైలెంట్ గా ఉండిపోయాను." అంది నళిని.

"ఇండియాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నంద గ్రూప్ కంపెనీలు మాక్సిమం మూత పడిపోయాయి అని నాకు ఈమధ్య తెలిసింది దాని గురించి అందరితో ఒకసారి మాట్లాడదాము అనుకున్నాను ఇంతలో ఆ టాపిక్ నువ్వే తీసుకొచ్చావు." అన్నాడు ప్రవీణ్ కొడుకు విష్ణు.

సైలెంట్ గా కూర్చున్న సుభాష్ కొడుకు ప్రమోద్ వైపు చూసి "నీకు ఏమైనా ఐడియా ఉందా?" అని అడిగింది అర్ణ.

"నో ఐడియా! 30 మినిట్స్ లో ఫుట్ బాల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీటింగ్ త్వరగా అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను." అన్నాడు ప్రమోద్.

"ఆశ, మోహిత్ మీరిద్దరు నంద వారసులు కాకపోయినా ఆస్తిలో వాటలు వస్తున్నాయి మీకు ఏమైనా ఐడియా ఉందా?" అంటూ వేటకారంగా చూస్తూ అంది అర్ణ.

"నాన్నగారు! కూతుర్ని కొడుకుల్ని సమానంగా చూశారు నువ్వు వారసులు కాదు అంటూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు." అంటూ కోపంగా అంది ఝాన్సీ.

"సారీ అత్తయ్య! నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇండియాలో మన ప్రాపర్టీ వ్యాల్యూ 2 లాక్స్ కోర్స్ మన ఆస్తిలో 20% అక్కడే ఉంది. కానీ ఆ ఆస్తిని పక్కన పెట్టి మిగతా దాన్ని మనకి పంచడానికి రెడీ అవుతున్నారు." అంది అర్ణ.

"అవునా? ఒకవేళ అక్కడ నంద వారసుడు ఎవరైనా ఉన్నారా?" డౌట్ గా అడిగాడు నళిని భర్త రాజేష్.

"ఇండియాలో ఉన్న ఆస్తి కూడా అందరికీ సమానంగా పంచి పెట్టమని నాన్న గారిని అడుగుదాము." అంది నళిని.

"ఆ మాట తాత గారిని అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా?" అంటూ అందరి వైపు చూసింది అర్ణ.

"నో! అంత ధైర్యం ఇక్కడ ఎవరు చేయలేరు." అన్నాడు విష్ణు.

"ఎస్! అందుకే మన అందరి తరపున అక్కడికి ఒకరిని పంపడానికి డిసైడ్ అయ్యాను, దానికి మీ అందరి సహకారం కూడా ఉంటే నా పని ఈజీ అవుతుంది." అంది అర్ణ.

"నాన్నగారు ఇండియాలో ఉన్న బిజినెస్, ప్రాపర్టీస్ గురించి అలా ఎందుకు ఉన్నారో మనం తెలుసుకోకుండా ప్రొసీడ్ అయితే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందేమో ఆలోచించండి." అన్నాడు సుభాష్.

"నేను ఆ విషయం కూడా ఆలోచించను అందుకే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవ్వరు ఇండియాలోకి ఎంటర్ అవ్వరు ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవడానికి ఒక ట్రైల్ వేస్తున్నాను సక్సెస్ అయితే ఆస్తి పంచుకుంటాము లేకపోతే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో ఆలోచిస్తాము." అంది అర్ణ.

"గుడ్! నా ఓటు అక్కకే నేను ఈ మెంటల్ టెంక్షన్ పెట్టుకోలేను." అన్నాడు ప్రమోద్.

"ఓకే! మనలో నువ్వే సమర్ధురాలవి చిన్నప్పుడు నుంచి నాన్నగారి దగ్గరే ఉంటున్నావు ఒకవేళ ఏదైనా ఇష్యూ అయినా సర్ది చెప్పగలవు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నీ వెనకాల మేము ఉంటాము." అంది నళిని.

"మా అందరి ఓటు కూడా నీకే ఏం చేయాలో నువ్వే డిసైడ్ చెయ్!" అన్నాడు ప్రవీణ్.

"ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తాతగారు ఏమీ చెబుతారో చూసి ఇండియాకి ప్రతాప్ మిశ్ర కొడుకు సుజిత్ ని పంపిస్తాను అంత ఓకే అనుకుంటే నంద వారసులుగా మనం ఎంటర్ అవుదాము." అని చెప్పింది అర్ణ.

"ఓకే! గుడ్ ఐడియా!" అన్నారు అందరు.

"సరే! త్వరగా ఫ్రెష్ అయ్యి ఇంటికి వచ్చేయండి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది." అంటూ మహేష్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్ణ.

అక్కడినుంచి అర్ణ వెళ్లడంతోనే లోపలి నుంచి వస్తూ "అర్ణ చెప్పిన మాట విని అందరు గంగిరెద్దుల్లాగా తలలు ఊపారు అసలు విషయం ఏమిటో ఆలోచించరా?" అని అడిగాడు ఝాన్సీ భర్త రఘురామ్.

"ఈ విషయంలో మనం ఆలోచించి ఏమీ చేయగలం బావ! ఎప్పుడు ఇండియా పేరు ఎత్తిన నాన్నగారు తాసు పాములాగా లెగుస్తున్నారు ఆ బాధ ఏదో దానినే పడనివ్వు ఆస్తి వచ్చిన తర్వాత హ్యాపీగా పంచుకుందాము." అన్నాడు ప్రవీణ్.

"నేను కంపెనీలో ఉన్న ఒక డైరెక్టర్ తో మాట్లాడాను అసలు ఇండియాలో ప్రాబ్లం అంటూ ఏమీ లేదు తన ముద్దుల కొడుకు గోకుల్ అక్కడ చనిపోయాడని బాధలో దానిని పక్కన పెట్టారు.'

'మనం అందరం కలిసి ఆస్తిని అర్ణ చేతిలో పెట్టాము అంటే దాంట్లో సగం కూడా మన చేతికి రాదు మీరందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకునే లేపు అది పది డిసిషన్ లు తీసుకుంటుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకోవాలి." అన్నాడు రఘురామ్.

"ఎస్! మావయ్య చెప్పింది కరెక్ట్!" అన్నాడు విష్ణు.

"సరే! నీకు ఇండియాలో పరిచయాలు ఎక్కువ కదా! అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండు. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాము." అన్నాడు సుభాష్.

"ఓకే! ఈరోజు నుంచి నా కన్ను ఒకటి ఇండియా మీద ఉంటుంది." అంటూ స్మైల్ ఇచ్చాడు రఘురామ్.

**********************

50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వడంతో వచ్చిన అతిధులందరు వెళ్లిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి

"ఈ ఆస్తి ఐదు వాటాలు కాదు  నా అల్లుళ్ళు కోడళ్లు, మనమలు, మనవరాళ్ల సహా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద ఆస్తులు రాయించను నాకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు." అని చెప్పి అందరికీ డాక్యుమెంట్స్ ఇస్తూ

"మీ అందరిలో ఒకటే ఆలోచన అది ఇండియా కి సంబంధించిన ఆస్తుల గురించి అని నాకు తెలుసు! కానీ ఆ ఆస్తులు గురించి మీరు మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి.'

'అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది దానిని నేనే పేస్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో నా మాట కాదని మీరు ఇండియాలో అడుగు పెట్టకండి తరువాత మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది." అని చెప్పాడు ముకుల్ నంద.

"మావయ్య గారు! నేను ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి ఇండియాలో ఉన్న ప్రాబ్లం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సాల్వ్ చేయలేమా?" డౌట్ గా చూస్తూ అడిగాడు రఘురామ్.

"తాతయ్య! ఆ ప్రాబ్లం గురించి ఒక్కసారి కూడా మాకు చెప్పలేదు అంటే మేము సాల్వ్ చేయలేము అని మీకు అనిపిస్తుందా?" అన్నాడు విష్ణు.

"నాన్నగారు! ఇండియాలో ఉన్న ఆస్తి మీకు ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే చెప్పండి మేము ఇంకా దాని గురించి మాట్లాడము." అంది నళిని.

"ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ ఎవరికీ ఇచ్చే ఉద్దేశం లేదు అవి కూడా మీకే చెందుతాయి, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాలేదు త్వరలోనే అన్ని సర్దుకుంటాయి  అప్పటివరకు వెయిట్ చెయ్యండి.'

'అక్కడ ఉన్న ప్రాబ్లం గురించి మీకు చెప్పిన అర్థం కాదు దానిని ఎలాగైనా సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తారు  ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకుని బాధలో ఉన్నాను.'

'ఇంకా ఆ విషయంలో ఎవరిని పోగొట్టుకోలేను దాని గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండండి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెబుతాను." అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు ముకుల్ నంద.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 28-12-2025, 10:51 PM



Users browsing this thread: 1 Guest(s)