25-12-2025, 02:52 PM
అందరూ హీరో హీరోయిన్లే
![[Image: A.jpg]](https://i.ibb.co/XrkdmmBT/A.jpg)
(అత్తగారి కథలు - పార్ట్ 14)
రచన: L. V. జయ
పెళ్ళి తరువాత మొదటిసారి ఆఫీసుకి వెళ్ళింది జాగృతి. స్నేహితులు, కొలీగ్స్ అందరి అభినందలు అందుకున్నాక, కంప్యూటర్ ముందు కూర్చుని, పని మొదలు పెట్టాలనుకుంది కానీ, ఎంత ప్రయత్నించినా, పని మీద ద్యాస కుదరలేదు. అత్తగారింట్లోనున్న జరిగిన కొన్ని విషయాలు గుర్తువచ్చి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
జాగృతిని గమనిస్తున్న స్వప్న, దగ్గరికి వచ్చి, "జాగృతీ, అంతా ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమయిందో చెప్పు" అని కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. ప్రాణస్నేహితురాలు వచ్చి అడగడంతో, మనసులోని బాధ బయటకి వచ్చింది జాగృతికి.
*********************************************
జాగృతి ఆడపడుచు పల్లవి, "ఏదైనా సినిమా చూద్దామమ్మా. " అంది వాళ్ళ అమ్మ రాధతో.
"హిందీ సినిమా చూద్దాం. నీ ఫేవరెట్ హీరోయిన్ జుహీచావ్లా సినిమా పెట్టు" అంటూ పల్లవికి సౌంజ్ఞ చేసింది రాధ. పల్లవి 'ఖయామత్ సి ఖయామత్ తక్' పెట్టింది.
"అవునూ, మనం హిందీ సినిమా చూస్తుంటే, మరి ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడకి హిందీ రాదుగా పాపం. " అంది రాధ, జాగృతిని ఉద్దేశించి.
"నాకు హిందీ వచ్చండి. మీరిద్దరూ చూడండి. నాకు సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు. " అంటూ అక్కడినుండి లేచింది జాగృతి.
"అన్నీ అబద్దాలే. దీనికెలా హిందీ వస్తుంది? మనం నార్త్ లో ఉన్నాం కాబట్టి, మనందరికీ వచ్చు. దీని బతుకంతా ఆంధ్రాలోనే కదా అయిపొయింది. " అంది రాధ, జాగృతిని వెక్కిరిస్తూ.
రాధ మాటతీరు జాగృతికి నచ్చలేదు. 'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి చూస్తున్నాను, ప్రతిదానికి నన్ను, మా వాళ్ళని ఎలా అవమానించేలా అని చూస్తున్నారు ఈవిడ! అది, ఇది, అని మాట్లాడుతున్నారు! ఏమిటి నాతో ఈవిడాకున్న ప్రాబ్లెమ్?' అనుకుని, "ఆంధ్రాలో ఉంటే, హిందీ రాకూడదనేమి లేదుకదండి" అంది రాధతో.
"నువ్వు ఇంగ్లీష్ మీడియం కూడా కాదు కదా మా పిల్లల్లాగా. తెలుగులో పుట్టిపెరిగావ్ పాపం. నీకేం వస్తుంది అని అడిగాను" అంది రాధ.
'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఈవిడ గొప్పలు తట్టుకోలేకపోతున్నాను.' అనుకుని, "భాష నేర్చుకోవడాని కేముందండి. ఎపుడైనా నేర్చుకోవచ్చు." అంది జాగృతి సౌమ్యంగా.
"నీకెంత హిందీ వచ్చొ చూస్తాను. మాతోపాటు సినిమా చూడు అయితే. " అంటూ జాగృతిని బలవంతంగా కూర్చోబెట్టి, పల్లవి పెట్టిన సినిమా చూడమంది.
సినిమా మొదలవకముందే, "మా పల్లవి, అచ్ఛం జుహీచావ్లా లాగా ఉంటుందని, మా నార్త్ వాళ్ళందరూ అంటారు. ఈ సినిమాలో జుహీచావ్లా లాగ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో, మా పల్లవికి కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు అలానే చేయించాను. చక్కగా తయారయ్యి, కాలేజీకి వెళ్ళితే, పల్లవి అందాన్ని చూసి, ఆడపిల్లలందరూ కుళ్లిపోయేవాళ్ళు, అబ్బాయిలు వెనకపడేవారు. BA అవ్వగానే, పెళ్ళిచేసేసాం. వెంటవెంటనే చక్కగా ఇద్దరు పిల్లల్ని కనేసింది. " అంటూ పల్లవిని పొగుడుతూ, జాగృతిని తిట్టింది రాధ.
పాతజ్ఞాపకాలని గుర్తుతెచ్చుకుని మురిసిపోయింది పల్లవి.
"సమర్థ్ ని ఏమనేవారమ్మా? పవన్ కళ్యాణ్ అని కదా. " అని అడిగింది పల్లవి, రాధని.
"అవును. ఆంధ్ర వెళ్తే చాలు, సమర్థ్ ని అందరూ పవన్ కళ్యాణ్ తో పోల్చేవాళ్ళు. వాడి జుట్టు కూడా పవన్ కళ్యాణ్ జుట్టులాగా ఉంటుంది. ఇక్కడ కాలేజీలో, వాడు క్రికెట్ ఆడుతుంటే, వాడు జుట్టు అలా అలా ఎగరెయ్యటం చూడడానికి ఆడవాళ్ళందరూ వాడి చుట్టూ చేరేవాళ్ళు. కాలేజీలో ఉన్నప్పుడే వాడికి పెళ్ళిసంబంధం వచ్చింది తెలుసా. ఏ విత్తు వేస్తే, ఆ పంట పండుతుందంటారు. నేను కాబట్టి, అంత అందమైన పిల్లల్ని కన్నాను. " అంది రాధ గర్వంగా.
"నాన్నని శోభన్ బాబు అనేవారు కదమ్మా. నాన్న గురించి కూడా చెప్పు. " అంది పల్లవి, రాధని ప్రోత్సహిస్తూ.
"మీ నాన్నని ఇప్పటికీ అందరూ శోభన్ బాబు అనే పిలుస్తారు. ఆయన స్టేజ్ ఎక్కి, 'భలే మంచి రోజు, పసందైన రోజు' అని పాడుతుంటే, పెళ్ళైన ఆడవాళ్లు కూడా, చప్పట్లు కొట్టడం మర్చిపోయి ఆయన్నే చూస్తుండిపోయేవారు. అలాంటి అందమైన భర్తని చేసుకున్నందుకు నన్ను చూసి కుళ్ళిపోయేవారందరూ. " అంది రాధ మురిసిపోతూ.
"నువ్వు, నాన్నా మొదటిసారి కలిసినప్పుడు ఏమైందో చెప్పమ్మా. ప్లీజ్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. " అని రాధని అడిగింది పల్లవి.
పల్లవి, రాధని ఏదైనా చెప్పమని అడిగిన ప్రతిసారి, రాధ, పల్లవిని చిరాకుగా జాగృతిని చూడడాన్ని జాగృతి గమనించింది.
'వీళ్లిద్దరు కావాలనే ఈ విషయాలని నా ముందు మాట్లాడుతున్నారు అని అర్ధం అవుతోంది. కానీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. ' అనుకుంది జాగృతి.
రాధ కళ్ళుమూసుకుని, గతస్మృతుల్ని నెమరువేసుకుంటూ, "అప్పుడు నాకు పదహారేళ్లు. చాలా చిన్న పిల్లని. తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను. నవలలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది నాకప్పుడు. నేను చేసుకోబోయే అతను, ఆ నవలల్లోని హీరోలా ఉండాలనుకునేదాన్ని. ఒకరోజు, లంగా ఓణీ వేసుకుని, మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని, యద్దనపూడి సులోచనారాణి నవల చదువుకుంటున్నాను.
అచ్చం నేను చదివే నవలలోని హీరోలా, పెద్ద కాలరున్న షర్ట్, బెల్ బాటమ్ ప్యాంటు, టక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, బూట్స్ వేసుకుని, సిగరెట్ కాలుస్తున్న మనిషి మా ఇంటివైపే వస్తుండడం చూసాను. మొదటిచూపులోనే, అతని మీద మనసు పారేసుకున్నాను. అతను నేనున్న కిటికీ దగ్గరికి వచ్చి, 'రాధ ఇల్లు ఇదేనా?' అని నన్ను అడిగితే, నా మనసులో వీణలు మోగినట్టు అయ్యింది.
సిగ్గుతో పరిగెత్తి లోపలకివెళ్ళి, ఇలాంటతను నాకు భర్తగా వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. తరువాత తెలిసింది, అతను నన్ను చూడడానికే వచ్చాడని. పెళ్లిచూపులు జరగకుండానే, అతను నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నపుడు నా అనడానికి అవధులు లేవు. గొప్పింటి సంబంధమని, కట్నం అడగలేదని, శోభన్ బాబు లాగా ఉన్నాడని అందరూ అంటుంటే, నేనెంత అదృష్టవంతురాలనో తెలిసి మురిసిపోయాను. నా స్నేహితులందరూ నన్ను చూసి ఎంత కుళ్లిపోయారో తెలుసా?" అంది రాధ సిగ్గుపడుతూ.
అప్పుడే వచ్చిన మాణిక్యాలరావు, రాధ చెప్పిందంతా విని, "చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని నిన్ను చూసి అబ్బాయిలందరూ పాడేవారని చెప్పవేం వాణిశ్రీ. " అన్నాడు.
రాధ మొహం సిగ్గుతో కందిపోయింది. "నేను వాణిశ్రీ లాగ ఉంటానని అందరూ అంటారు. మన కుటుంబాన్ని చూసి, నాకు ఎంత గర్వంగా ఉంటుందో. అందరం అందమైన వాళ్ళమే కదా. " అంది రాధ మురిసిపోతూ.
మాణిక్యాలరావు వెళ్ళగానే, జాగృతిని చీదరంగా చూస్తూ, "మనఇంటికి ఇలాంటిది వచ్చిందేమిటో! అసలు సమర్థ్ కి ఇదెలా నచ్చిందో అర్ధంకావటంలేదు. ఒక్క అవయవం కూడా సరిగ్గాలేదు ఈవిడకి. ఆడపిల్ల లక్షణాలు అస్సలేవు. అందుకే దీనికి పెళ్ళి కూడా ఇంత లేట్ అయ్యింది.
![[Image: A.jpg]](https://i.ibb.co/XrkdmmBT/A.jpg)
(అత్తగారి కథలు - పార్ట్ 14)
రచన: L. V. జయ
పెళ్ళి తరువాత మొదటిసారి ఆఫీసుకి వెళ్ళింది జాగృతి. స్నేహితులు, కొలీగ్స్ అందరి అభినందలు అందుకున్నాక, కంప్యూటర్ ముందు కూర్చుని, పని మొదలు పెట్టాలనుకుంది కానీ, ఎంత ప్రయత్నించినా, పని మీద ద్యాస కుదరలేదు. అత్తగారింట్లోనున్న జరిగిన కొన్ని విషయాలు గుర్తువచ్చి, కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
జాగృతిని గమనిస్తున్న స్వప్న, దగ్గరికి వచ్చి, "జాగృతీ, అంతా ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమయిందో చెప్పు" అని కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. ప్రాణస్నేహితురాలు వచ్చి అడగడంతో, మనసులోని బాధ బయటకి వచ్చింది జాగృతికి.
*********************************************
జాగృతి ఆడపడుచు పల్లవి, "ఏదైనా సినిమా చూద్దామమ్మా. " అంది వాళ్ళ అమ్మ రాధతో.
"హిందీ సినిమా చూద్దాం. నీ ఫేవరెట్ హీరోయిన్ జుహీచావ్లా సినిమా పెట్టు" అంటూ పల్లవికి సౌంజ్ఞ చేసింది రాధ. పల్లవి 'ఖయామత్ సి ఖయామత్ తక్' పెట్టింది.
"అవునూ, మనం హిందీ సినిమా చూస్తుంటే, మరి ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడకి హిందీ రాదుగా పాపం. " అంది రాధ, జాగృతిని ఉద్దేశించి.
"నాకు హిందీ వచ్చండి. మీరిద్దరూ చూడండి. నాకు సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు. " అంటూ అక్కడినుండి లేచింది జాగృతి.
"అన్నీ అబద్దాలే. దీనికెలా హిందీ వస్తుంది? మనం నార్త్ లో ఉన్నాం కాబట్టి, మనందరికీ వచ్చు. దీని బతుకంతా ఆంధ్రాలోనే కదా అయిపొయింది. " అంది రాధ, జాగృతిని వెక్కిరిస్తూ.
రాధ మాటతీరు జాగృతికి నచ్చలేదు. 'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి చూస్తున్నాను, ప్రతిదానికి నన్ను, మా వాళ్ళని ఎలా అవమానించేలా అని చూస్తున్నారు ఈవిడ! అది, ఇది, అని మాట్లాడుతున్నారు! ఏమిటి నాతో ఈవిడాకున్న ప్రాబ్లెమ్?' అనుకుని, "ఆంధ్రాలో ఉంటే, హిందీ రాకూడదనేమి లేదుకదండి" అంది రాధతో.
"నువ్వు ఇంగ్లీష్ మీడియం కూడా కాదు కదా మా పిల్లల్లాగా. తెలుగులో పుట్టిపెరిగావ్ పాపం. నీకేం వస్తుంది అని అడిగాను" అంది రాధ.
'ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఈవిడ గొప్పలు తట్టుకోలేకపోతున్నాను.' అనుకుని, "భాష నేర్చుకోవడాని కేముందండి. ఎపుడైనా నేర్చుకోవచ్చు." అంది జాగృతి సౌమ్యంగా.
"నీకెంత హిందీ వచ్చొ చూస్తాను. మాతోపాటు సినిమా చూడు అయితే. " అంటూ జాగృతిని బలవంతంగా కూర్చోబెట్టి, పల్లవి పెట్టిన సినిమా చూడమంది.
సినిమా మొదలవకముందే, "మా పల్లవి, అచ్ఛం జుహీచావ్లా లాగా ఉంటుందని, మా నార్త్ వాళ్ళందరూ అంటారు. ఈ సినిమాలో జుహీచావ్లా లాగ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో, మా పల్లవికి కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు అలానే చేయించాను. చక్కగా తయారయ్యి, కాలేజీకి వెళ్ళితే, పల్లవి అందాన్ని చూసి, ఆడపిల్లలందరూ కుళ్లిపోయేవాళ్ళు, అబ్బాయిలు వెనకపడేవారు. BA అవ్వగానే, పెళ్ళిచేసేసాం. వెంటవెంటనే చక్కగా ఇద్దరు పిల్లల్ని కనేసింది. " అంటూ పల్లవిని పొగుడుతూ, జాగృతిని తిట్టింది రాధ.
పాతజ్ఞాపకాలని గుర్తుతెచ్చుకుని మురిసిపోయింది పల్లవి.
"సమర్థ్ ని ఏమనేవారమ్మా? పవన్ కళ్యాణ్ అని కదా. " అని అడిగింది పల్లవి, రాధని.
"అవును. ఆంధ్ర వెళ్తే చాలు, సమర్థ్ ని అందరూ పవన్ కళ్యాణ్ తో పోల్చేవాళ్ళు. వాడి జుట్టు కూడా పవన్ కళ్యాణ్ జుట్టులాగా ఉంటుంది. ఇక్కడ కాలేజీలో, వాడు క్రికెట్ ఆడుతుంటే, వాడు జుట్టు అలా అలా ఎగరెయ్యటం చూడడానికి ఆడవాళ్ళందరూ వాడి చుట్టూ చేరేవాళ్ళు. కాలేజీలో ఉన్నప్పుడే వాడికి పెళ్ళిసంబంధం వచ్చింది తెలుసా. ఏ విత్తు వేస్తే, ఆ పంట పండుతుందంటారు. నేను కాబట్టి, అంత అందమైన పిల్లల్ని కన్నాను. " అంది రాధ గర్వంగా.
"నాన్నని శోభన్ బాబు అనేవారు కదమ్మా. నాన్న గురించి కూడా చెప్పు. " అంది పల్లవి, రాధని ప్రోత్సహిస్తూ.
"మీ నాన్నని ఇప్పటికీ అందరూ శోభన్ బాబు అనే పిలుస్తారు. ఆయన స్టేజ్ ఎక్కి, 'భలే మంచి రోజు, పసందైన రోజు' అని పాడుతుంటే, పెళ్ళైన ఆడవాళ్లు కూడా, చప్పట్లు కొట్టడం మర్చిపోయి ఆయన్నే చూస్తుండిపోయేవారు. అలాంటి అందమైన భర్తని చేసుకున్నందుకు నన్ను చూసి కుళ్ళిపోయేవారందరూ. " అంది రాధ మురిసిపోతూ.
"నువ్వు, నాన్నా మొదటిసారి కలిసినప్పుడు ఏమైందో చెప్పమ్మా. ప్లీజ్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది. " అని రాధని అడిగింది పల్లవి.
పల్లవి, రాధని ఏదైనా చెప్పమని అడిగిన ప్రతిసారి, రాధ, పల్లవిని చిరాకుగా జాగృతిని చూడడాన్ని జాగృతి గమనించింది.
'వీళ్లిద్దరు కావాలనే ఈ విషయాలని నా ముందు మాట్లాడుతున్నారు అని అర్ధం అవుతోంది. కానీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. ' అనుకుంది జాగృతి.
రాధ కళ్ళుమూసుకుని, గతస్మృతుల్ని నెమరువేసుకుంటూ, "అప్పుడు నాకు పదహారేళ్లు. చాలా చిన్న పిల్లని. తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను. నవలలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది నాకప్పుడు. నేను చేసుకోబోయే అతను, ఆ నవలల్లోని హీరోలా ఉండాలనుకునేదాన్ని. ఒకరోజు, లంగా ఓణీ వేసుకుని, మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని, యద్దనపూడి సులోచనారాణి నవల చదువుకుంటున్నాను.
అచ్చం నేను చదివే నవలలోని హీరోలా, పెద్ద కాలరున్న షర్ట్, బెల్ బాటమ్ ప్యాంటు, టక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, బూట్స్ వేసుకుని, సిగరెట్ కాలుస్తున్న మనిషి మా ఇంటివైపే వస్తుండడం చూసాను. మొదటిచూపులోనే, అతని మీద మనసు పారేసుకున్నాను. అతను నేనున్న కిటికీ దగ్గరికి వచ్చి, 'రాధ ఇల్లు ఇదేనా?' అని నన్ను అడిగితే, నా మనసులో వీణలు మోగినట్టు అయ్యింది.
సిగ్గుతో పరిగెత్తి లోపలకివెళ్ళి, ఇలాంటతను నాకు భర్తగా వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. తరువాత తెలిసింది, అతను నన్ను చూడడానికే వచ్చాడని. పెళ్లిచూపులు జరగకుండానే, అతను నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నపుడు నా అనడానికి అవధులు లేవు. గొప్పింటి సంబంధమని, కట్నం అడగలేదని, శోభన్ బాబు లాగా ఉన్నాడని అందరూ అంటుంటే, నేనెంత అదృష్టవంతురాలనో తెలిసి మురిసిపోయాను. నా స్నేహితులందరూ నన్ను చూసి ఎంత కుళ్లిపోయారో తెలుసా?" అంది రాధ సిగ్గుపడుతూ.
అప్పుడే వచ్చిన మాణిక్యాలరావు, రాధ చెప్పిందంతా విని, "చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని నిన్ను చూసి అబ్బాయిలందరూ పాడేవారని చెప్పవేం వాణిశ్రీ. " అన్నాడు.
రాధ మొహం సిగ్గుతో కందిపోయింది. "నేను వాణిశ్రీ లాగ ఉంటానని అందరూ అంటారు. మన కుటుంబాన్ని చూసి, నాకు ఎంత గర్వంగా ఉంటుందో. అందరం అందమైన వాళ్ళమే కదా. " అంది రాధ మురిసిపోతూ.
మాణిక్యాలరావు వెళ్ళగానే, జాగృతిని చీదరంగా చూస్తూ, "మనఇంటికి ఇలాంటిది వచ్చిందేమిటో! అసలు సమర్థ్ కి ఇదెలా నచ్చిందో అర్ధంకావటంలేదు. ఒక్క అవయవం కూడా సరిగ్గాలేదు ఈవిడకి. ఆడపిల్ల లక్షణాలు అస్సలేవు. అందుకే దీనికి పెళ్ళి కూడా ఇంత లేట్ అయ్యింది.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)