04-09-2025, 06:10 PM
ఒకనాడు ఊర్వశి పురూరవులు నిద్రిస్తుండగా దేవేంద్రుడు పంపిన విశ్వావసువు మాయా గంధర్వ గొల్లలు మారు వేషంలో వచ్చి రెండు మేక పిల్లలను దొంగిలించారు. మేక పిల్లల అరుపులకు పురూరవునికి, ఊర్వశి కి మెలకువ వచ్చింది. మేక పిల్లలను దొంగలు ఎత్తుకు వెళుతున్నారని పురూరవునికి అర్థం అయ్యింది.
పురూరవుడు వెంటనే మంచం మీద నుండి లేచాడు. అతడు ధరించిన పంచె మంచం కోడుకు పట్టుకుని అతనికి దూరం అయ్యింది. అతడు అదేమీ పట్టించుకోకుండా రెండు మేక పిల్లల సంరక్షణ నిమిత్తం పరుగు తీసాడు. దేవేంద్రుని ప్రభావాన ఉరుమలు ఉరిమాయి. మెరుపులు మెరిసాయి. ఆ మెరుపు లో ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూరవుని చూసింది.
దేవేంద్రుని విన్నపము ను అనుసరించి చంద్రుడు తన మనుమడు పురూరవుని మీద "అమృత వర్షం" కురిపించాడు. ఆ అమృత వర్షమే పురూరవునికి అమృత వస్త్రాలయ్యాయి . సనత్ కుమారుడు పెట్టినాడు శాపం సగం కూడా పురూరవుని అంటక ముందే శాప శక్తి ఛాందస శక్తిని చుట్టు ముట్టింది.
శాప విమోచనం కలిగిన పురూరవుని వశిష్ట మహర్షి రాజ్యానికి ఆహ్వానించాడు. నియమాను సారం ఊర్వశి తన పతిగ పురూరవుని విసర్జించింది.
పురూరవుడు సతిగా కాకున్న సాటి మనిషి గా కొంత కాలం తన రాజ్యంలో ఉండమని ఊర్వశి ని కోరాడు. అందుకు ఊర్వశి సమ్మతించింది. అంత పురూరవుడు ఊర్వశి తోనూ, తన సంతానం తోనూ ప్రతిష్టాన పురానికి వచ్చాడు. కొందరు ఛాందస బ్రాహ్మణులు తమ తప్పు తెలుసుకుని తమని క్షమించమని పురూరవుని ప్రార్థించారు. పురూరవుడు అందరినీ క్షమించాడు. నిరుపేదల పేదరికం తొలగించడానికి నిరంతరం పోరాడతానని ప్రజలందరికి మాట ఇచ్చాడు.
ఊర్వశీపురూరవులు కొంత కాలం ఆనందంగా జీవించారు. పురూరవుడు కడు సమర్థుడు అయిన తన కుమారుడు ఆయువు కు పట్టాభిషేకం చేసాడు. అనంతరం ఆనందంగా తపోవనానికి వెళ్ళిపోయాడు.
తపోవనానికి వెళుతున్న పురూరవుడు ఉషను విసర్జిస్తున్న సూర్య నారాయణునిలా ఉన్నాడు. అతని నోట వెలువడే యజుర్వేద మంత్రాలలో పునర్జన్మ వాసనలు బహిర్గతం మవుతున్నాయి.
ఊర్వశి దేవేంద్రుని విన్నపము ను అనుసరించి ఇంద్ర లోకం వెళ్ళిపోయింది.
సర్వే జనాః సుఖినోభవంతు
పురూరవుడు వెంటనే మంచం మీద నుండి లేచాడు. అతడు ధరించిన పంచె మంచం కోడుకు పట్టుకుని అతనికి దూరం అయ్యింది. అతడు అదేమీ పట్టించుకోకుండా రెండు మేక పిల్లల సంరక్షణ నిమిత్తం పరుగు తీసాడు. దేవేంద్రుని ప్రభావాన ఉరుమలు ఉరిమాయి. మెరుపులు మెరిసాయి. ఆ మెరుపు లో ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూరవుని చూసింది.
దేవేంద్రుని విన్నపము ను అనుసరించి చంద్రుడు తన మనుమడు పురూరవుని మీద "అమృత వర్షం" కురిపించాడు. ఆ అమృత వర్షమే పురూరవునికి అమృత వస్త్రాలయ్యాయి . సనత్ కుమారుడు పెట్టినాడు శాపం సగం కూడా పురూరవుని అంటక ముందే శాప శక్తి ఛాందస శక్తిని చుట్టు ముట్టింది.
శాప విమోచనం కలిగిన పురూరవుని వశిష్ట మహర్షి రాజ్యానికి ఆహ్వానించాడు. నియమాను సారం ఊర్వశి తన పతిగ పురూరవుని విసర్జించింది.
పురూరవుడు సతిగా కాకున్న సాటి మనిషి గా కొంత కాలం తన రాజ్యంలో ఉండమని ఊర్వశి ని కోరాడు. అందుకు ఊర్వశి సమ్మతించింది. అంత పురూరవుడు ఊర్వశి తోనూ, తన సంతానం తోనూ ప్రతిష్టాన పురానికి వచ్చాడు. కొందరు ఛాందస బ్రాహ్మణులు తమ తప్పు తెలుసుకుని తమని క్షమించమని పురూరవుని ప్రార్థించారు. పురూరవుడు అందరినీ క్షమించాడు. నిరుపేదల పేదరికం తొలగించడానికి నిరంతరం పోరాడతానని ప్రజలందరికి మాట ఇచ్చాడు.
ఊర్వశీపురూరవులు కొంత కాలం ఆనందంగా జీవించారు. పురూరవుడు కడు సమర్థుడు అయిన తన కుమారుడు ఆయువు కు పట్టాభిషేకం చేసాడు. అనంతరం ఆనందంగా తపోవనానికి వెళ్ళిపోయాడు.
తపోవనానికి వెళుతున్న పురూరవుడు ఉషను విసర్జిస్తున్న సూర్య నారాయణునిలా ఉన్నాడు. అతని నోట వెలువడే యజుర్వేద మంత్రాలలో పునర్జన్మ వాసనలు బహిర్గతం మవుతున్నాయి.
ఊర్వశి దేవేంద్రుని విన్నపము ను అనుసరించి ఇంద్ర లోకం వెళ్ళిపోయింది.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
