15-01-2025, 09:41 PM
శుభాంగి మాటలను అనుసరించి కురు మహా రాజు ప్రజల ఐశ్వర్యాభివృద్ది నిమిత్తం మహర్షులతో అనేక యాగాలు చేయించాడు. నిరుపేదల జీవనానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాడు.
శుభాంగి కురు మహారాజు తో కలిసి తన రాజ్యాన్నంత సందర్శించింది. రాజ్యంలోని అనేకానేక పవిత్ర ప్రదేశాలన్నిటిని గుర్తించింది. శుభాంగి సూచించిన ప్రదేశంలో శ్రీ సూర్య నారాయణుని ఆశీర్వాదంతో కురు మహారాజు దివ్య తపస్సు చేసాడు. పతిదేవుని తపస్సుకు శుభాంగి తగిన విధంగా సహకరించింది.
కురు మహారాజు తపస్సుకు మెచ్చిన పంచ భూతాలు, తదితర దేవతలు కురు మహారాజు పరిపాలనలో అతని రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుందని వరాలను ఇచ్చారు. కురు మహారాజు తపస్సు చేసిన ప్రాంతానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ కురుక్షేత్రం ను మరింత పవిత్రం చేసే నిమిత్తం కురు మహారాజు, ధర్మపత్ని శుభాంగి మాటలను అనుసరించి ఆ భూమినంత తనే స్వయంగా దున్నాడు.
అతనికి ఇంద్రుడు సహాయంగా వచ్చాడు. శుభాంగి కురుక్షేత్రం లో అమృత ధాన్యం పండించమని భర్త కు చెప్పింది. కురు మహారాజు భార్య మాటలను అనుసరించి అమృత ధాన్యం పండించాడు. ఆ ధాన్యాన్ని నిరుపేదలకు పంచాడు. కురు మహారాజు నిరుపేదల, వసిష్టాది మహర్షుల సహాయసహకారాలతో అనేక యజ్ఞయాగాదులు చేసాడు. కురు మహారాజు కాలంలో సకాలంలో వర్షాలు పడ్డాయి. పాడిపంటలతో రాజ్యం సుభిక్షంగా వర్థిల్లింది.
శుభాంగి ప్రజలను విద్యావంతులను చేయడంలో తనవంతు సహాయం తను అందించింది. ప్రజలలో సాహిత్య జిజ్ఞాసను కలిగించింది. అందరికీ ఉపయోగపడే నూతన వస్తు రూపకల్పన చేయమని ప్రజలను ప్రోత్స హించింది. ప్రజలలో సహృదయతను పెంచింది.
కురు మహారాజు సుపరిపాలనలో హస్తినాపురం పాడి పంటలతో, సిరిసంపదలతో తులతూగింది. చంద్ర వంశ రాజులలో కురు మహారాజు వంశ కర్త అయ్యాడు.
శుభాంగి కురు మహారాజు దంపతులకు పుట్టిన పుత్రుని పేరు విదూరధుడు.
శుభం భూయాత్
శుభాంగి కురు మహారాజు తో కలిసి తన రాజ్యాన్నంత సందర్శించింది. రాజ్యంలోని అనేకానేక పవిత్ర ప్రదేశాలన్నిటిని గుర్తించింది. శుభాంగి సూచించిన ప్రదేశంలో శ్రీ సూర్య నారాయణుని ఆశీర్వాదంతో కురు మహారాజు దివ్య తపస్సు చేసాడు. పతిదేవుని తపస్సుకు శుభాంగి తగిన విధంగా సహకరించింది.
కురు మహారాజు తపస్సుకు మెచ్చిన పంచ భూతాలు, తదితర దేవతలు కురు మహారాజు పరిపాలనలో అతని రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుందని వరాలను ఇచ్చారు. కురు మహారాజు తపస్సు చేసిన ప్రాంతానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ కురుక్షేత్రం ను మరింత పవిత్రం చేసే నిమిత్తం కురు మహారాజు, ధర్మపత్ని శుభాంగి మాటలను అనుసరించి ఆ భూమినంత తనే స్వయంగా దున్నాడు.
అతనికి ఇంద్రుడు సహాయంగా వచ్చాడు. శుభాంగి కురుక్షేత్రం లో అమృత ధాన్యం పండించమని భర్త కు చెప్పింది. కురు మహారాజు భార్య మాటలను అనుసరించి అమృత ధాన్యం పండించాడు. ఆ ధాన్యాన్ని నిరుపేదలకు పంచాడు. కురు మహారాజు నిరుపేదల, వసిష్టాది మహర్షుల సహాయసహకారాలతో అనేక యజ్ఞయాగాదులు చేసాడు. కురు మహారాజు కాలంలో సకాలంలో వర్షాలు పడ్డాయి. పాడిపంటలతో రాజ్యం సుభిక్షంగా వర్థిల్లింది.
శుభాంగి ప్రజలను విద్యావంతులను చేయడంలో తనవంతు సహాయం తను అందించింది. ప్రజలలో సాహిత్య జిజ్ఞాసను కలిగించింది. అందరికీ ఉపయోగపడే నూతన వస్తు రూపకల్పన చేయమని ప్రజలను ప్రోత్స హించింది. ప్రజలలో సహృదయతను పెంచింది.
కురు మహారాజు సుపరిపాలనలో హస్తినాపురం పాడి పంటలతో, సిరిసంపదలతో తులతూగింది. చంద్ర వంశ రాజులలో కురు మహారాజు వంశ కర్త అయ్యాడు.
శుభాంగి కురు మహారాజు దంపతులకు పుట్టిన పుత్రుని పేరు విదూరధుడు.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
