Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#37
జస్టిస్ పార్టీ ఆవిర్భావం

తెలుగులో వ్యాకరణాలు రాసినా, పెద్దబాలశిక్ష లాంటి పిల్లల పాఠాలు రాసినా, దస్తావేజులు రాసినా, అర్జీలు రాసినా, ఉత్తరాలు రాసినా, ఏ రాత పనైనా బ్రాహ్మణులే చేశారు. అంచేత వ్యావహారిక వాదం అనే మాట బలపడ్డ తరవాత కూడా బ్రాహ్మణ వ్యావహారికమే ఈ వ్యావహారిక వాదుల మనసుల్లో వుంది. ఒక చిన్నయ సూరి మినహా గ్రాంథిక భాషకి వ్యాకరణం రాసినవాళ్ళు కూడా అందరూ బ్రాహ్మణులే. చిన్నయ సూరి బ్రిటిష్ ప్రభుత్వపు ఉద్యోగాల్లో, లేదా ఇతర వ్యాపారాల్లో సంపన్నులైన అబ్రాహ్మణుల ప్రాపకం వల్లే పైకొచ్చాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతను వ్యావహారికం రాస్తే ఎలాంటి వ్యావహారికం రాసేవాడో మనకి తెలియదు. మాట్లాడేటప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అతను ఎలాటి భాష వాడేవాడో ఊహించుకోవాలి గాని సమాచారం దొరకదు. ముఖ్యంగా అతను మాట్లాడేటప్పుడు, ఉపన్యసించేటప్పుడు క్రియా పదాలు ఎలాంటివి వాడేవాడు! వచ్చితిని, వెళ్ళితిని, చేయుదును, ఇలాంటి వ్యాకరణ సమ్మతమైన క్రియా పదాలే వాడేవాడా? బ్రాహ్మణ వ్యవహారంలో వుండే రాస్తున్నాను, చేస్తున్నాను, మాట్లాడాను, వస్తాను ఇలాంటి క్రియా పదాలు వాడేవాడా? ఈ విషయమై మనకు ఏ రకమైన సమాచారమూ లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో జస్టిస్ పార్టీ ఏర్పడిన తరవాత బ్రాహ్మణులతో ఉద్యోగాలలో పోటీపడి చాలామంది అబ్రాహ్మణులు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా, కాలేజీల్లో అధ్యాపకులుగా చాలామంది అబ్రాహ్మణులు ఉండేవారు. తెలుగు కాని మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లీషులోనే చెప్తూ ఉండడం బట్టి వాళ్ళు ఆ పాఠాలు ఇబ్బందిలేకుండా హాయిగా చెప్పేవారు. కానీ సభల్లో ఎక్కడైనా మాట్లాడవలసివచ్చినా, పదిమందితో కబుర్లు చెప్పవలసివచ్చినా, ఇంగ్లీషే మాట్లాడేవాళ్ళు. చివరికి పత్రికలు కూడా ఇంగ్లీషు పత్రికలే చదివేవాళ్లు. వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడేవారు. అందుచేత వాళ్ళ పలుకుబడిలో అబ్రాహ్మణత్వం బయటపడవలసిన అవసరం వుండేది కాదు. అంతే కాకుండా సమాజంలో పైకి రావాలనుకునేవాళ్లు ఇంగ్లీషు మాట్లాడటం అవసరం. అందువల్ల వాళ్ల స్థాయి పెరుగుతుంది. ఆ కారణం చేత బ్రాహ్మణులు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడేవారు.

నిత్యవ్యవహారానికి ఇంగ్లీషు వాడేవాళ్ళు విద్యావంతులు, కేవలం తెలుగే వాడేవాళ్ళు అయితే పండితులు, లేకపోతే వాళ్ళ తక్కువ కులాన్ని వ్యక్తపరిచే తెలుగు మాట్లాడే సామాన్యులు. జస్టిస్ పార్టీలోనే వున్న కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని రామస్వామి ఇందుకు మినహాయింపు. రామలింగారెడ్డి అద్భుతంగా ఇంగ్లీషు మాట్లాడేవారు. అవసరమైతే చక్కని పాండిత్య స్ఫోరకమైన తెలుగు మాట్లాడగలిగినా తరచు ఇంగ్లీషే మాట్లాడేవారు. త్రిపురనేని రామస్వామి గొప్ప పండితుడు. ఆయనకి ఇంగ్లీషు బాగా వచ్చును. కానీ పాండిత్య స్ఫోరకమైన తెలుగే మాట్లాడేవారని ప్రతీతి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రారుగా పనిచేసిన కె.వి. గోపాలస్వామి నాయుడు ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే ఇంగ్లీషుకి ఎంతో గౌరవం ఉండేది కూడా.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 29-08-2020, 02:07 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: