Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#35
ఇవన్నీ నారాయణరావుకి ఇప్పటికీ గుర్తున్నాయి. దాంతో పాటు పెద్దబాలశిక్షలో రకరకాల నీతి కథలు, నీతి వాక్యాలు, పురాణాల్లో వుండే షట్చక్రవర్తులు, అష్ట దిక్పాలకులు, వాళ్ళ భార్యల పేర్లు–ఈ వ్యవహారమంతా వుండేది. శచీదేవి అంటే ఎవరు? ఇంద్రుడి భార్య. స్వాహాదేవి అంటే ఎవరు? అగ్నిదేవుని భార్య. ఇలాటి సమాచారం వుండేది. ఉత్తరాలు ఎవరికి ఎలా రాయాలి? వైదికులైన బ్రాహ్మణులకు ఎలా రాయాలి; శూద్రులకు రాసేటప్పుడు ఎలా రాయాలి; శూద్రులకు బ్రాహ్మలు రాసేటప్పుడు ఎలా రాయాలి, లాంటి వివరాలు చాలా యెక్కువగా వుండేవి. ఈ పుస్తకంలో అర్జీలు రాసే పద్ధతి ఉండేది. కొద్దిగా ఛందస్సు కూడా ఉండేది. భూగోళశాస్త్ర విషయాలు, భారతదేశంలో ఇతర ప్రాంతాల పేర్లు ఉండేవి. చిట్టచివర ఒక స్తోత్రం, దండకంతో బాలశిక్ష పూర్తయ్యేది. మొత్తం మీద ఈ పుస్తకం పూర్తిగా చదువుకున్న పిల్లలకి తమ ప్రాంతంలో బతకడానికి అవసరమైన విద్యాబుద్ధులు నిండుగా దొరికేవి. ఈ పుస్తకంలో భాష అవసరాన్ని బట్టి మారుతూ వచ్చింది కాని చిన్నయసూరి చెప్పిన గ్రాంథికము, గిడుగు రామమూర్తి చెప్పిన వ్యావహారికము అనే మాటలు లేవు. మనకి అలవాటైన మాటల్లో చెప్పాలంటే రకరకాల గ్రాంథికాలు, రకరకాల వ్యావహారికాలు దీనిలో ఉండేవి. ఇది తెలుగుదేశంలో నిజమైన వ్యవహార భాష. ఈ భాష మాట్లాడుతూనే రాస్తూనే చదువుకున్నవాళ్ళందరూ పెరిగారు.

గురజాడ అన్నట్లు బ్రిటిషువాళ్ళు వచ్చి బడులు పెట్టిన తరువాతే గ్రాంథికం అన్న భాష, ఆ నియమాలు ఏర్పడాయి. ఇది 20వ శతాబ్దంలో వచ్చిన సమస్య.

క్రిస్టియన్లు తమ స్కూళ్ళల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి కొన్ని రీడర్లు తయారు చేశారు.అందులోని భాష మొత్తం అంతా ఒకే శైలిలో ఉంటుంది. ఆ శైలి చదువుకున్నవాళ్ళు మాట్లాడేదానికి దగ్గరగా ఉంటుంది. వాక్యాలు తగినంత విరామాలతో అందంగా అచ్చు వేసిన పుస్తకాలివి. అందులోని విషయాల దగ్గరికొస్తే, పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో, పేజీల మీద చేతులు వేస్తే అవి మరకలు పడిపోకుండా ఎలా చూసుకోవాలో, చదవడం అయిపోయిన తరువాత పుస్తకాన్ని మూసి ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో, ఇలాంటి విషయాలు మొదటి పాఠం. రెండవ పాఠంలో దేవుడిని గురించి. దేవుడు ఆకాశంలో ఉంటాడని, లోకానికంతటికీ ఆయనే కర్త అని, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. తరవాత రాతి బొమ్మలలో దేవుడు ఉండడని ఆ రాళ్ళని పూజిస్తే అవి పలకవని, ఇంకో మాటలో చెప్పాలంటే విగ్రహారాధన తప్పని చెప్పే వాక్యాలు ఉంటాయి. మొత్తం మీద ఈ పుస్తకాలు అందంగా అచ్చు వేశారు. అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. భాషా శైలిలో చెప్పుకోతగ్గ ఏకత్వం ఉంది. వీటిలో కూడా లాక్షణిక భాష, గ్రామ్య భాష ఇలాంటి మాటలు లేవు. ఈ పుస్తకాల్లో ఇంతకుముందు చెప్పిన బాలశిక్షలో మల్లే లెక్కలు, ఉత్తరాలు రాసే పద్ధతులు, లౌకికమైన నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు ఇలాంటివి ఏమీ లేవు. అంచేత ఈ పుస్తకాలు కేవలం క్రైస్తవ మత ప్రయోజనాలకి మాత్రమే పనికొచ్చాయి.

తరవాత కాలంలో వచ్చిన వ్యావహారిక భాషావాదంలో గిడుగు రామమూర్తిగారు బాలశిక్షలోనూ, క్రిస్టియన్ పుస్తకాల్లోనూ వున్న భాషా విశేషాలను పట్టించుకోలేదు. అంచేత భాషా విషయకమైన చర్చల్లో ఈ పుస్తకాలకి ఏ రకమైన ప్రాముఖ్యం లేకుండా పోయింది.

ఇదిలా వుండగా ఒక పక్క ఇంగ్లీషు ముంచుకొస్తూ వుంటే, తెలుగు చదివితే మంచి ఉద్యోగాలు రావనే అభిప్రాయం బలపడుతూ వుంటే, తెలుగు తప్ప మిగతా ఆధునిక విషయాలన్నీ–చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం మొదలైనవన్నీ–ఇంగ్లీషులోనే చెప్తూ వుంటే, పై చదువుల్లో తెలుగు గూడుకట్టుకుపోయింది. తెలుగులో ఏ పుస్తకాలు చదివినా జీవితంలో పనికొచ్చే కొత్త విషయాలేవీ తెలియవు, కావలసిందల్లా ఇంగ్లీషే అన్న అభిప్రాయం క్రమక్రమంగా బలపడింది. స్కూళ్ళలో ఇంగ్లీషు నుంచి అనువాదం కోసం వాడే తెలుగు భాష నిర్జీవంగా ఎవరికీ పట్టనట్లు తయారయింది.

[Image: IMG_3206.JPG]
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 29-08-2020, 01:58 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: