29-08-2020, 01:41 PM
ఇంగ్లీషు బళ్లలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో లాక్షణిక భాషావాదులకి, వ్యావహారిక భాషావాదులకి వచ్చిన వివాదాల ఫలితంగా చివరికి లాక్షణిక భాషావాదులే–వీళ్లకే గ్రాంథిక భాషావాదులు అన్న పేరు స్థిరపడింది–గెలిచారు. ఈ సందర్భంలో అప్పట్లో కాలేజీ పిల్లలకి ఏ పుస్తకాలు చెప్పేవారు, ఏ రకమైన భాష నేర్పేవారు అనే ప్రశ్న వేసుకోవడం అవసరం. ఈ సందర్భంగా అందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేది పెద్దబాలశిక్ష. ఈ పుస్తకం రకరకాల అవతారాలు ఎత్తి చాలాకాలం పాటు అచ్చవుతూ వచ్చింది. దీని మొదటి పేరు బాలశిక్ష అనే. దీని మొదటి ముద్రణ 1832లో ఏదో ఒక రూపంలో ఈ పుస్తకాన్ని చాలా సంవత్సరాల పాటు బళ్ళల్లో చేరిన పిల్లలకు పాఠాలు చెప్పడానికి వాడారు.
అయితే బడిలో చేరని పిల్లలు కూడా చాలామంది ఉండేవారు. మాకు అక్షరాలు నేర్చుకోవడం ఎందుకు, మేము కరణీకం పనులు చేయాలా, వ్యాపారాలు చేయాలా అనుకునే చిన్న కులాలవాళ్ళు, అందులో కొందరు బాగా పొలమున్న మోతుబరులు కూడా, పిల్లల్ని కాలేజీకి పంపేవారు కారు. పెద్ద కులాల్లో పెళ్ళిచూపుల్లో మా అమ్మాయి పెద్దబాలశిక్ష చదువుకుంది అని చెప్పేవారు. ఒక సొంత విషయం చెప్పాలంటే ఈ వ్యాసం రాస్తున్న మా యిద్దరిలో నారాయణరావు పెద్దబాలశిక్ష చదువుకునే కాలేజీకి వెళ్ళాడు. అతని మీద ఆ పుస్తకం ప్రభావం ఎంత ఎక్కువ అంటే అందులో కథలు, నీతులు, లెక్కలు, శ్లోకాలు, పద్యాలు ఇప్పటికీ అతనికి కంఠతా వచ్చు. ఉదాహరణకి పెద్దబాలశిక్షలో లెక్కలు చెప్పేటప్పుడు ఒక పద్యం వుండేది.
ఖర్జూర ఫలములు గణికుండు గొనితెచ్చి సగపాలు మోహంబు సతికి నిచ్చె
నందు నాలవ పాలు ననుగుతమ్మునకిచ్చె నష్టభాగంబిచ్చె నతనిసతికి
దగ తొమ్మిదోపాలు తనయున కిచ్చెను తనచేత నాల్గున్ను దల్లికిచ్చె
మొదట దెచ్చిన వెన్ని మోహంబు సతికెన్ని భ్రాత కెన్ని వాని భార్య కెన్ని
తనయుకెన్నియిచ్చె దడయకదల్లికి
నాలుగెట్టులాయె నయము తోడ
గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి
యడుగవలయు దేవ యవసరముగ
అలాగే పిడుగు పడినప్పుడు పఠించవలసిన శ్లోకము:
అర్జునఃఫల్గునఃపార్థఃకిరీటీశ్వేతవాహనః
భీభత్సుర్విజయః కృష్ణస్సవ్యసాచీధనంజయః
మందు వేసుకునేటప్పుడు పద్యం:
శరీరే జర్ఝరీభూతేవ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణో హరిః
![[Image: peddabAlaSiksha.jpg]](https://eemaata.com/images/oct2019/peddabAlaSiksha.jpg)
అయితే బడిలో చేరని పిల్లలు కూడా చాలామంది ఉండేవారు. మాకు అక్షరాలు నేర్చుకోవడం ఎందుకు, మేము కరణీకం పనులు చేయాలా, వ్యాపారాలు చేయాలా అనుకునే చిన్న కులాలవాళ్ళు, అందులో కొందరు బాగా పొలమున్న మోతుబరులు కూడా, పిల్లల్ని కాలేజీకి పంపేవారు కారు. పెద్ద కులాల్లో పెళ్ళిచూపుల్లో మా అమ్మాయి పెద్దబాలశిక్ష చదువుకుంది అని చెప్పేవారు. ఒక సొంత విషయం చెప్పాలంటే ఈ వ్యాసం రాస్తున్న మా యిద్దరిలో నారాయణరావు పెద్దబాలశిక్ష చదువుకునే కాలేజీకి వెళ్ళాడు. అతని మీద ఆ పుస్తకం ప్రభావం ఎంత ఎక్కువ అంటే అందులో కథలు, నీతులు, లెక్కలు, శ్లోకాలు, పద్యాలు ఇప్పటికీ అతనికి కంఠతా వచ్చు. ఉదాహరణకి పెద్దబాలశిక్షలో లెక్కలు చెప్పేటప్పుడు ఒక పద్యం వుండేది.
ఖర్జూర ఫలములు గణికుండు గొనితెచ్చి సగపాలు మోహంబు సతికి నిచ్చె
నందు నాలవ పాలు ననుగుతమ్మునకిచ్చె నష్టభాగంబిచ్చె నతనిసతికి
దగ తొమ్మిదోపాలు తనయున కిచ్చెను తనచేత నాల్గున్ను దల్లికిచ్చె
మొదట దెచ్చిన వెన్ని మోహంబు సతికెన్ని భ్రాత కెన్ని వాని భార్య కెన్ని
తనయుకెన్నియిచ్చె దడయకదల్లికి
నాలుగెట్టులాయె నయము తోడ
గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి
యడుగవలయు దేవ యవసరముగ
అలాగే పిడుగు పడినప్పుడు పఠించవలసిన శ్లోకము:
అర్జునఃఫల్గునఃపార్థఃకిరీటీశ్వేతవాహనః
భీభత్సుర్విజయః కృష్ణస్సవ్యసాచీధనంజయః
మందు వేసుకునేటప్పుడు పద్యం:
శరీరే జర్ఝరీభూతేవ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణో హరిః
![[Image: peddabAlaSiksha.jpg]](https://eemaata.com/images/oct2019/peddabAlaSiksha.jpg)