06-07-2020, 12:42 AM
స్థూలంగా చెప్పాలంటే, భాషలో రకరకాల శైలులు వున్నాయి. సాహిత్యంలో వాడే భాష ఒక రకం, శాస్త్ర విషయాలు, ఆలోచనలు చెప్పటానికి వాడే భాష ఇంకొక రకం, ఈ రెండురకాల భాషలకి మధ్య తేడా ఉంది. మొదటి దాంట్లో ఏం చెప్పాలి అనే అనే విషయం మీద కాకుండా ఎలా చెప్పాలి అన్న విషయం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది, రెండవ దాంట్లో స్పష్టతకు, తార్కికతకి, సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కానీ చెప్పే విషయం అందంగా ఉందా లేదా అన్న విషయం మీద దృష్టి ఉండదు. ఇలా విడదీసి చూస్తే గ్రాంథికవాదులకి మూలమైన చిన్నయ సూరి రెండు రకాల శైలుల్లోనూ పుస్తకాలు రాశాడని, వ్యావహారికవాదులు ఆ పని చేయలేదని చెప్పొచ్చు.
గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం అంతా కూడా పదాలు, వాటి వర్ణక్రమాలు, మరీ ముఖ్యంగా క్రియా పదాలు ఎలా ఉండాలి అనే. దీని తరువాత వ్యావహారికవాదులు ముఖ్యంగా చర్చించిన విషయం సంధులు ఎక్కడ విడతీయొచ్చు, ద్రుతప్రకృతికాలు, కళలు వీటిని పాటించాలా వద్దా, సరళాదేశాలు, గసడదవాదేశాలు పాటించి తీరాలా, అరసున్నాలు వాడకపోతే వచ్చిన నష్టమేమిటి–ఇలాటివి. తెలుగులో వచనం అప్పుడప్పుడే అలవాటు లోకి వస్తోంది కాబట్టి అందంగా వుండే వచనం, స్పష్టంగా వుండే వచనం, ఈ రెంటి మధ్యా ముఖ్యమైన తేడా ఉండాలి అన్నది ప్రధానంగా చర్చకు రాలేదు. సాహిత్య వచనం రకరకాల అలంకారాలతో, చమత్కారాలతో ఉండేది సరే. కానీ విషయం ప్రధానంగా వుండే వచనంలో స్పష్టత కావాలి కానీ అందం కోసం ప్రయత్నం అక్కర్లేదు అన్న విషయాన్ని విడదీసి చర్చించిన దాఖలాలు కనిపించవు. ఉదాహరణకి ‘మీ వుత్తరం అందింది, సంతోషించాను’ అని రాయవలసిన అవసరం వచ్చినప్పుడు ‘అమందానందకందళిత హృదయారవిందుడనైతిని’ అని రాయక్కర్లేదు. ఈ తేడా గ్రాంథికవాదులు ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. వ్యావహారికవాదులు కూడా మాటల విషయంలో పేచీపడ్డారు కానీ, స్పష్టతకు ఉపయోగపడే వచనం రాసి చూపించలేదు.
ఇది ఇక్కడ ఆపి ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. మన వ్యాకరణాలన్నీ పదస్వరూపాన్ని నిర్ణయించేవే. అంటే ఒక పదానికున్న సాధుత్వ, అసాధుత్వాలని నిర్ధారించేవే. ఏదైనా ఒక వ్యాకరణం ప్రకారం సాధించడానికి వీలు లేకపోతే ఆ పదం అసాధువు. అంటే అన్నీ సాధు పదాలే వాడి వాక్యాన్ని గజిబిజిగా రాయవచ్చు అనే ఊహ వాళ్ళు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఉదాహరణకి గ్రాంథిక భాషకి ప్రామాణికంగా పనికొచ్చే బాలవ్యాకరణంలో ఒక సూత్రం వుంది చూడండి:
ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వ పదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపంజను (కారక పరిఛ్ఛేదము 37).
పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపందగును – ఏనిప్రభృతిశబ్దములు కొన్ని నియమసాపేక్షంబు లయియుండు –
గాలి చల్లగా వీచెను –
వీచెను జల్లగా గాలి –
చల్లగా గాలి వీచెను –
వీచెను గాలి చల్లగా –
గాలి వీచెను జల్లగా –
చల్లగా వీచెను గాలి.
అని వాక్య నిర్మాణాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ఊరుకున్నాడు చిన్నయ సూరి. నిజానికి వాక్యనిర్మాణాన్ని గురించి ఇంత తేలికగా చెప్పి వూరుకోవడానికి తెలుగు భాష ఒప్పుకోదు. తెలుగు వాక్యనిర్మాణంలో ఇన్ని రకాల క్లిష్టతలు ఉన్నాయి. వాక్య నిర్మాణానికి రచనలో ఎంత శ్రద్ధ కావాలి అన్న విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో చేకూరి రామారావు రాసిన తెలుగు వాక్యం అన్న పుస్తకం చదివితే తెలుగు వాక్యనిర్మాణానికి ఉన్న కొన్ని నియమాలైనా బోధపడతాయి. తెలుగు సాంప్రదాయక వ్యాకరణం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం పదస్వరూపాన్ని గురించిన చర్చలతోటే ఆగిపోయింది.
గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం అంతా కూడా పదాలు, వాటి వర్ణక్రమాలు, మరీ ముఖ్యంగా క్రియా పదాలు ఎలా ఉండాలి అనే. దీని తరువాత వ్యావహారికవాదులు ముఖ్యంగా చర్చించిన విషయం సంధులు ఎక్కడ విడతీయొచ్చు, ద్రుతప్రకృతికాలు, కళలు వీటిని పాటించాలా వద్దా, సరళాదేశాలు, గసడదవాదేశాలు పాటించి తీరాలా, అరసున్నాలు వాడకపోతే వచ్చిన నష్టమేమిటి–ఇలాటివి. తెలుగులో వచనం అప్పుడప్పుడే అలవాటు లోకి వస్తోంది కాబట్టి అందంగా వుండే వచనం, స్పష్టంగా వుండే వచనం, ఈ రెంటి మధ్యా ముఖ్యమైన తేడా ఉండాలి అన్నది ప్రధానంగా చర్చకు రాలేదు. సాహిత్య వచనం రకరకాల అలంకారాలతో, చమత్కారాలతో ఉండేది సరే. కానీ విషయం ప్రధానంగా వుండే వచనంలో స్పష్టత కావాలి కానీ అందం కోసం ప్రయత్నం అక్కర్లేదు అన్న విషయాన్ని విడదీసి చర్చించిన దాఖలాలు కనిపించవు. ఉదాహరణకి ‘మీ వుత్తరం అందింది, సంతోషించాను’ అని రాయవలసిన అవసరం వచ్చినప్పుడు ‘అమందానందకందళిత హృదయారవిందుడనైతిని’ అని రాయక్కర్లేదు. ఈ తేడా గ్రాంథికవాదులు ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. వ్యావహారికవాదులు కూడా మాటల విషయంలో పేచీపడ్డారు కానీ, స్పష్టతకు ఉపయోగపడే వచనం రాసి చూపించలేదు.
ఇది ఇక్కడ ఆపి ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. మన వ్యాకరణాలన్నీ పదస్వరూపాన్ని నిర్ణయించేవే. అంటే ఒక పదానికున్న సాధుత్వ, అసాధుత్వాలని నిర్ధారించేవే. ఏదైనా ఒక వ్యాకరణం ప్రకారం సాధించడానికి వీలు లేకపోతే ఆ పదం అసాధువు. అంటే అన్నీ సాధు పదాలే వాడి వాక్యాన్ని గజిబిజిగా రాయవచ్చు అనే ఊహ వాళ్ళు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఉదాహరణకి గ్రాంథిక భాషకి ప్రామాణికంగా పనికొచ్చే బాలవ్యాకరణంలో ఒక సూత్రం వుంది చూడండి:
ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వ పదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపంజను (కారక పరిఛ్ఛేదము 37).
పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపందగును – ఏనిప్రభృతిశబ్దములు కొన్ని నియమసాపేక్షంబు లయియుండు –
గాలి చల్లగా వీచెను –
వీచెను జల్లగా గాలి –
చల్లగా గాలి వీచెను –
వీచెను గాలి చల్లగా –
గాలి వీచెను జల్లగా –
చల్లగా వీచెను గాలి.
అని వాక్య నిర్మాణాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ఊరుకున్నాడు చిన్నయ సూరి. నిజానికి వాక్యనిర్మాణాన్ని గురించి ఇంత తేలికగా చెప్పి వూరుకోవడానికి తెలుగు భాష ఒప్పుకోదు. తెలుగు వాక్యనిర్మాణంలో ఇన్ని రకాల క్లిష్టతలు ఉన్నాయి. వాక్య నిర్మాణానికి రచనలో ఎంత శ్రద్ధ కావాలి అన్న విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో చేకూరి రామారావు రాసిన తెలుగు వాక్యం అన్న పుస్తకం చదివితే తెలుగు వాక్యనిర్మాణానికి ఉన్న కొన్ని నియమాలైనా బోధపడతాయి. తెలుగు సాంప్రదాయక వ్యాకరణం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం పదస్వరూపాన్ని గురించిన చర్చలతోటే ఆగిపోయింది.