05-07-2020, 11:28 PM
గురజాడ అప్పారావు
(గురజాడ అప్పారావు జీవితచరిత్ర దాదాపుగా తెలిసినదే కనుక ఆ వివరాలలోకి మేము వెళ్ళటం లేదు.-ర.)
జయంతి రామయ్య పంతులు రాసిన రిపోర్టును (A Defense of Literary Telugu) కాదంటూ గురజాడ అప్పారావు, గ్రాంథికవాదుల వాదాలు ఎలా తప్పో చూపిస్తూ, నన్నయ కాలం నుంచి కూడా కావ్యేతరమైన భాషలో ‘చున్న’ బదులు ‘స్తున్న’ (వచ్చుచున్న , వస్తున్న) ఎలా వాడుకలో వుందో చాలా వివరంగా ఉదాహరణలు ఇస్తూ, ఒక 152 పేజీల వ్యాసం (Minute of Dissent) రాశారు. ఆ తరవాత రామయ్య పంతులు తమ రిపోర్టులో ఆర్కయాక్ (archaic), కరెంట్ (current) అనే విభజన చూపించలేదని; చాలా మాటలు పాతబడి పోయినవి, కేవలం అలంకార సౌందర్యం కోసం వాడినవి, నిత్య వ్యవహారంలో అవసరం లేదని; కావ్యేతర వ్యవహారంలో వున్న భాష వర్ణక్రమాన్ని సోదాహరణంగా వివరించారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో పై తరగతి విద్యావంతులు మాట్లాడే భాష ఆధునిక వ్యావహారిక భాష అవ్వాలని వాదించారు. చిన్నయ సూరి నీతిచంద్రికలో నిజంగా అందమైన వచనం రాయగా కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం దాన్ని అనుకరించబోయి భయంకరమైన, గొడ్డు గ్రాంథికభాష రాశారని; ఇలాంటి వచనమే కాలేజీ పిల్లలకి తెలుగు వచనం పేరుతో బోధిస్తున్నారని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చేసే సంధులు తెలుగులో పండితులు కూడా నిత్యం వాడ్డంలేదని; ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు ఈ గ్రాంథికవాదుల దృష్టికి రాలేదని చూపించారు.
చిన్నయ సూరి రాసిన వచనం గ్రాంథికమైనా అందమైనదని గుర్తించినందుకు గురజాడ అప్పారావుని మెచ్చుకోవలసి వుంది.
తెలుగులో కళ, ద్రుతప్రకృతికము అనే తేడా చాలా కాలంగా పోయిందని చిన్నయ సూరి ఆ విభాగాన్ని బతికుంచడానికి ప్రయత్నం చేసినా గ్రాంథికవాదులు కూడా ఆ తేడాని పాటించలేక పోతున్నారని ఉదాహరణలతో సహా నిరూపిస్తారు గురజాడ అప్పారావు. అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే తెలుగులో బ్రిటిష్వాళ్లకి పూర్వం అందరికీ పాఠం చెప్పే బడులు లేవు; సర్వత్రా నేర్పబడుతున్నది గ్రాంథిక భాష కాదు;, గ్రాంథిక భాష అనేది పూర్వం లేదు; అసలు పూర్వం ఎప్పుడూ గ్రాంథిక భాష అనేది పాఠంగా చెప్పబడలేదు; ఈ గ్రాంథిక భాష బ్రిటిష్వాళ్లు తమ విద్యాశాఖ ద్వారా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా, టెక్స్ట్ బుక్ కమిటీల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు; కాని, ఇవాళ వ్యావహారిక భాష పిల్లలకి చెప్పాలని వాదిస్తున్నారని; గురజాడ అప్పారావు రాసిన ఈ మినిట్ ఆఫ్ డిసెంట్ వ్యాసం పరిశీలనగా చూస్తే ఆయన వాదన ఎంత సహేతుకమైనదో, గ్రాంథికమే ఎందుకు కృతకమైనదో, ఛందస్సుల్లో ఉన్న కావ్యాల్లో లేని భాష–ఎంత విస్తృతంగా వ్యవహారంలో వుందో తెలుస్తుంది.
ఇంత శ్రమ పడిన తరువాత కూడా గురజాడ ఆధునిక రచనా భాషకి కొన్ని కట్టుబాట్లు అవసరమని, నిజానికి ఇప్పుడు కావలిసింది ఒక ‘కొత్త గ్రాంథికం’ అని స్పష్టంగా చెప్పలేదు. అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష మీద దాని ప్రభావాన్ని ఆయన గుర్తించారు. పూర్వకాలంలో వున్న రకరకాల వ్యావహారికాలకు ఆయన బలమైన ఉదాహరణలు చూపించినా అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారాలకి వాడబడుతుందని, అయినా గ్రంథప్రచురణకర్తలు భాషా స్వరూపాన్ని సమర్థంగా నిర్ణయించరని, వాళ్ళు అచ్చు పుస్తకాల్లో వాడే భాష వ్యహారంలో వుండే తెలుగుకి దగ్గరలో వుండేదే కానీ ఇది అక్షరాలా ఎవరూ మాట్లాడే తెలుగు కాదని, గురజాడ అప్పారావు గుర్తించలేదు. అందుచేత ఆయన వ్యాసం అంతా గిడుగు రామమూర్తి పంతులు పద్ధతిలో గ్రాంథిక భాషని కాదనడానికే ఉపయోగపడింది కానీ ఆధునిక తెలుగు ఎలా వుండాలో నిర్ణయించడానికి ఉపయోగపడలేదు.
చివరి మాటగా చెప్పాలంటే ఈ వివాదాల వల్ల గ్రాంథిక భాష ఎందుకు పనికిరాదో చెప్పడానికి బలం యేర్పడింది కాని ఆధునిక తెలుగు ఏ రూపంలో వుండాలో చెప్పడానికి మంచి రచనలు తయారవలేదు.
(గురజాడ అప్పారావు జీవితచరిత్ర దాదాపుగా తెలిసినదే కనుక ఆ వివరాలలోకి మేము వెళ్ళటం లేదు.-ర.)
జయంతి రామయ్య పంతులు రాసిన రిపోర్టును (A Defense of Literary Telugu) కాదంటూ గురజాడ అప్పారావు, గ్రాంథికవాదుల వాదాలు ఎలా తప్పో చూపిస్తూ, నన్నయ కాలం నుంచి కూడా కావ్యేతరమైన భాషలో ‘చున్న’ బదులు ‘స్తున్న’ (వచ్చుచున్న , వస్తున్న) ఎలా వాడుకలో వుందో చాలా వివరంగా ఉదాహరణలు ఇస్తూ, ఒక 152 పేజీల వ్యాసం (Minute of Dissent) రాశారు. ఆ తరవాత రామయ్య పంతులు తమ రిపోర్టులో ఆర్కయాక్ (archaic), కరెంట్ (current) అనే విభజన చూపించలేదని; చాలా మాటలు పాతబడి పోయినవి, కేవలం అలంకార సౌందర్యం కోసం వాడినవి, నిత్య వ్యవహారంలో అవసరం లేదని; కావ్యేతర వ్యవహారంలో వున్న భాష వర్ణక్రమాన్ని సోదాహరణంగా వివరించారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో పై తరగతి విద్యావంతులు మాట్లాడే భాష ఆధునిక వ్యావహారిక భాష అవ్వాలని వాదించారు. చిన్నయ సూరి నీతిచంద్రికలో నిజంగా అందమైన వచనం రాయగా కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం దాన్ని అనుకరించబోయి భయంకరమైన, గొడ్డు గ్రాంథికభాష రాశారని; ఇలాంటి వచనమే కాలేజీ పిల్లలకి తెలుగు వచనం పేరుతో బోధిస్తున్నారని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చేసే సంధులు తెలుగులో పండితులు కూడా నిత్యం వాడ్డంలేదని; ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు ఈ గ్రాంథికవాదుల దృష్టికి రాలేదని చూపించారు.
చిన్నయ సూరి రాసిన వచనం గ్రాంథికమైనా అందమైనదని గుర్తించినందుకు గురజాడ అప్పారావుని మెచ్చుకోవలసి వుంది.
తెలుగులో కళ, ద్రుతప్రకృతికము అనే తేడా చాలా కాలంగా పోయిందని చిన్నయ సూరి ఆ విభాగాన్ని బతికుంచడానికి ప్రయత్నం చేసినా గ్రాంథికవాదులు కూడా ఆ తేడాని పాటించలేక పోతున్నారని ఉదాహరణలతో సహా నిరూపిస్తారు గురజాడ అప్పారావు. అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే తెలుగులో బ్రిటిష్వాళ్లకి పూర్వం అందరికీ పాఠం చెప్పే బడులు లేవు; సర్వత్రా నేర్పబడుతున్నది గ్రాంథిక భాష కాదు;, గ్రాంథిక భాష అనేది పూర్వం లేదు; అసలు పూర్వం ఎప్పుడూ గ్రాంథిక భాష అనేది పాఠంగా చెప్పబడలేదు; ఈ గ్రాంథిక భాష బ్రిటిష్వాళ్లు తమ విద్యాశాఖ ద్వారా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా, టెక్స్ట్ బుక్ కమిటీల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు; కాని, ఇవాళ వ్యావహారిక భాష పిల్లలకి చెప్పాలని వాదిస్తున్నారని; గురజాడ అప్పారావు రాసిన ఈ మినిట్ ఆఫ్ డిసెంట్ వ్యాసం పరిశీలనగా చూస్తే ఆయన వాదన ఎంత సహేతుకమైనదో, గ్రాంథికమే ఎందుకు కృతకమైనదో, ఛందస్సుల్లో ఉన్న కావ్యాల్లో లేని భాష–ఎంత విస్తృతంగా వ్యవహారంలో వుందో తెలుస్తుంది.
ఇంత శ్రమ పడిన తరువాత కూడా గురజాడ ఆధునిక రచనా భాషకి కొన్ని కట్టుబాట్లు అవసరమని, నిజానికి ఇప్పుడు కావలిసింది ఒక ‘కొత్త గ్రాంథికం’ అని స్పష్టంగా చెప్పలేదు. అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష మీద దాని ప్రభావాన్ని ఆయన గుర్తించారు. పూర్వకాలంలో వున్న రకరకాల వ్యావహారికాలకు ఆయన బలమైన ఉదాహరణలు చూపించినా అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారాలకి వాడబడుతుందని, అయినా గ్రంథప్రచురణకర్తలు భాషా స్వరూపాన్ని సమర్థంగా నిర్ణయించరని, వాళ్ళు అచ్చు పుస్తకాల్లో వాడే భాష వ్యహారంలో వుండే తెలుగుకి దగ్గరలో వుండేదే కానీ ఇది అక్షరాలా ఎవరూ మాట్లాడే తెలుగు కాదని, గురజాడ అప్పారావు గుర్తించలేదు. అందుచేత ఆయన వ్యాసం అంతా గిడుగు రామమూర్తి పంతులు పద్ధతిలో గ్రాంథిక భాషని కాదనడానికే ఉపయోగపడింది కానీ ఆధునిక తెలుగు ఎలా వుండాలో నిర్ణయించడానికి ఉపయోగపడలేదు.
చివరి మాటగా చెప్పాలంటే ఈ వివాదాల వల్ల గ్రాంథిక భాష ఎందుకు పనికిరాదో చెప్పడానికి బలం యేర్పడింది కాని ఆధునిక తెలుగు ఏ రూపంలో వుండాలో చెప్పడానికి మంచి రచనలు తయారవలేదు.