Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#21
ఈ కాలంలోనే గిడుగు రామమూర్తి తెలుగు సాహిత్యాన్ని మామూలు పండితులకు కూడా సాధ్యం కానంత సూక్ష్మదృష్టితో అధ్యయనం చేశారు. ఆయన జ్ఞాపకశక్తి చాలా గొప్పది. ఎక్కడెక్కడ ఏ మూల ఏ కవి వాడిన పదస్వరూపాలనయినా క్షణమాత్రంలో గుర్తుకు తెచ్చుకుని ఉదాహరణగా చూపించగల సామర్థ్యం ఆయనకి ఉండేది. చాలా జాగ్రత్తగా ఆయన చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం వున్న భాషకి; పూర్వపు తెలుగు కవులు వాడుతూ వచ్చిన భాషకి; వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులు మొదలైన వాళ్లు లాక్షణికం అనుకున్న భాషకి, తేడాలున్నాయని గమనించారు. పూర్వకవులు వాడిన భాష కాలక్రమాన మారుతూ వచ్చిందని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం సాధించదగిన భాష ఇంకొక కొత్తరకమయిన భాష అని, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వీరేశలింగం పంతులు వాడినది ఇంకొక రకమైనదని గమనించారు. వీటన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టకుండా కావ్యాల్లో వాడిన భాష నిజమైన గ్రాంథికమని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసేది దక్షిణాది తెలుగు అని (దీని గురించి కొంతసేపట్లో వివరిస్తాం); కొక్కొండ వెంకటరత్నం పంతులు, వీరేశలింగం పంతులు వాడే భాష కృతక గ్రాంథికమని; నిర్దేశించారు.

ఆయన దృష్టిలో ఏ కాలం లోనూ ఎవరూ కూడా తమ కాలంలో వాడుకలో వున్న భాషని వ్యతిరేకించి దాని ప్రభావం తమ మీద పడకుండా రాయడం అసాధ్యం. అంచేత లాక్షణిక భాష రాస్తున్నాం అనుకునే వాళ్లందరూ చిన్నయ సూరి వ్యాకరణాన్ని అనుకరించలేదనీ, వ్యవహారంలో వున్న మాటలకే కృతక రూపాలు కల్పించి అదే లాక్షణికం అనే భ్రమలో రాస్తున్నారనీ ఆయన వందల కొద్దీ వుదాహరణలతో చూపించారు. చిన్నయ సూరి వ్యాకరణానికి లొంగని, చిన్నయ సూరి గమనించని, పూర్వ కవి ప్రయోగాలు ఉన్నాయని ఆయన సోదాహరణంగా చూపించారు. అంచేత ఆయన వాదం ప్రకారం లాక్షణిక భాష ఎవరూ రాయలేరు. ఆఖరికి చిన్నయ సూరి కూడా రాయలేడు.

ఆ రోజుల్లో మద్రాసులో వున్న తెలుగు పండితుల్లో ఉత్తరాదివాళ్లు, దక్షిణాదివాళ్లు అనే తేడాలు ఉండేవి. చిన్నయ సూరి, వేదం వెంకటరాయరావు దక్షిణాదివాళ్లు. వీళ్ల తెలుగుకి అరవ తెలుగు అని గిడుగు రామమూర్తి పేరు పెట్టారు. ఆ తెలుగునే చిన్నయ సూరి తన వ్యాకరణంలో ఉద్దేశించి దానికే వ్యాకరణం రాశాడని ఆయన వాదన. అంచేత ఆయన దృష్టిలో ఈ తెలుగు గ్రాంథికం కాదు.
డానియల్ జోన్స్ (Daniel Jones) ఓట్టో యెస్పర్సన్ (Jens Otto Harry Jespersen), ఫిలిప్ హార్టోగ్ (Philip Hartog) రాసిన పుస్తకాలు, వాళ్ల ఆలోచన విధానం దానితో పాటు భారతీయ భాషల్ని ఆర్య భాషలు, ద్రావిడ భాషలు అంటూ విడదీస్తూ రాబర్ట్ కాల్డ్‌వెల్ చేసిన సిద్ధాంతాన్ని గిడుగు రామమూర్తి పూర్తిగా ఒప్పేసుకున్నారు. దానితోపాటు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించి భారతీయ సాహిత్యాల గురించి చాలా అభిప్రాయాలను చెప్పిన జార్జ్ గ్రియర్సన్ అభిప్రాయాలు పూర్తిగా ఆయన అంగీకరించారు. అయితే, ముఖ్యంగా వ్యాకరణం అనే భావానికి అర్థం మారుతోందని ఆధునికుల దృష్టిలో వ్యాకరణం భాషని శాసించేది కాదని భాషని అనుసరించేదని గిడుగు రామమూర్తి పాశ్చాత్య ప్రభావం వల్లే గ్రహించారు.

ఆ కాలంలో ఇంగ్లీషు విద్యావంతులకు విక్టోరియన్ నైతిక దృష్టి ప్రభావం వల్ల అశ్లీలమనే కొత్త భావం ప్రవేశించి తెలుగు సాహిత్యంలో చాలాభాగం అశ్లీలంగా కనిపించింది. ఈ వాదానికి బలం చేకూర్చినవారు ఇద్దరు: కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి. ఆ దృక్పథాన్ని గిడుగు రామమూర్తి నిరభ్యంతరంగా అంగీకరించారు. ఆయన దృష్టిలో ముద్దుపళని బజారు వేశ్య. కేవలం రాజుల మెప్పు కోసం మాత్రమే స్త్రీల అంగాంగవర్ణనలు చేస్తూ తెలుగు కవులు చవకబారు వర్ణనలు చేశారు. అందుచేత విద్యార్థులచే చదివించే పాత తెలుగు పుస్తకాలని జాగ్రత్తగా పరిశీలించి అశ్లీల భాగాలని పరిహరించాలని రామమూర్తి పంతులు గట్టిగా వాదించారు. వీటివల్ల గిడుగు రామమూర్తి మీద వలసవాద భావాల ప్రభావం ఎంత బలంగా వుందో గమనించవచ్చు.

దాదాపు ఈ కాలంలోనే రాసిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజంలో గిడుగు రామమూర్తి గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చిన్నయ సూరి కూడా రాయలేదనే ప్రతిపాదనకి ఎక్కువ వివరంగా ఉదాహరణలు ఇచ్చారు. ఆయనే తరువాత సంకలనం చేసిన గద్యచింతామణిలో పూర్వం వచనం రాసిన వాళ్లనించి కొల్లలుగా ఉదాహరణలు ఇస్తూ అదంతా వ్యావహారికమేనని వాదిస్తూ, వ్యావహారికం పూర్వకాలం నుంచి తెలుగులో చాలామంది రాశారని చూపించారు. ఇది దాదాపుగా గిడుగు రామమూర్తి వాదన యొక్క సారాంశం.

రామమూర్తి పంతులుకి పండితులంటే అభివృద్ధి నిరోధకులని, కొత్త ఆలోచనలకు అడ్డొచ్చేవారని, ప్రపంచంలో వున్న జ్ఞానం యేదీ తెలుగులోకి రాకుండా వాళ్ల పట్టుదల వల్లే ఆగిపోతోందని తీవ్రమైన అభ్యంతరం వుంది. అయితే పండితుల్లోనే ఆయనకు మంచి స్నేహితులున్నారని, తన అభిప్రాయాలను ఆమోదించిన వారున్నారని రామమూర్తి పంతులు మనకి జ్ఞాపకం చేస్తారు.
గురజాడ 1915లో పోయారు. ఆయన మరణం వ్యావహారికవాదులకి పెద్ద దెబ్బ అయ్యింది. గిడుగు రామమూర్తి దాదాపుగా ఒంటరి అయిపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన దాదాపు 25 ఏళ్ళపాటు ప్రభుత్వాన్ని, యూనివర్శిటీ సిండికేటు వాళ్ళ సభల్ని వదిలిపెట్టి ఊరూరా తిరిగి వీలున్నంతమంది పండితుల్ని వ్యక్తిగతంగా కలుసుకుని వాళ్ళతో వాదించి వ్యావహారిక భాష గురించి తన అభిప్రాయాలని వాళ్ళు ఒప్పుకునేట్లు చేసి అలా ఒప్పుకున్నట్లు కాగితం మీద రాయించి పుచ్చుకున్నారు. తన వాదనలు ఒప్పుకోని పండితులనుంచి తాము ఒప్పుకోవడం లేదన్న సంగతిని కూడా కాగితం మీద రాయించి తీసుకున్నారు. ఈ రకంగా ఆయన పండితుల అభిప్రాయాన్ని ఒకరొకరుగా ఎదుర్కున్నారు. ఈ పని పట్టుదలగా చేయడంవల్ల ఆయన వాదాన్ని పండితులు కూడా లోపల ఒప్పుకున్నా లేకపోయినా పైకి కాదనగల పరిస్థితి లేకుండా పోయింది. అంతకన్నా ముఖ్యంగా ఆయన సభల్లో గట్టిగొంతుకతో పుంఖానుపుంఖాలుగా ఉదాహరణలిస్తూ గ్రాంథికవాదాన్ని చితకకొడుతూ వ్యావహారికాన్ని సమర్థించడం వల్ల ఆయనకి పండితలోకంలో అసామాన్యమైన పేరు వచ్చింది. ఆయన సూర్యరాయాంధ్ర నిఘంటువుని విమర్శిస్తూ అందులో లోపాల్ని పరమ సమర్థంగా చూపించేవారు. అంచేత గ్రాంథికం అనే మాటకి క్రమక్రమంగా బలం తగ్గి ఈయన ప్రతిపాదించిన వ్యావహారికం అనే మాట నిత్యవ్యవహారం లోకి వచ్చింది.

తెలుగుభాషకి గ్రాంథికత్వం చిన్నయ సూరి వల్లే వచ్చిందని, రామమూర్తి పంతులు వ్యతిరేకిస్తున్న కృతక గ్రాంథికానికి చిన్నయ సూరే కారకుడని ఒక సామాన్యాభిప్రాయం తెలుగులో కొత్తగా రాసేవారందరిలోను ఏర్పడింది. భాషని పాడు చేసింది చిన్నయ సూరే అని, దానికి లేనిపోని సంకెళ్లు తగిలించి ఎవరూ రాయలేనంత క్లిష్టంగా ఎవరికీ అర్థం కానంత కష్టంగా చిన్నయ సూరే తెలుగుని తయారు చేశారని, ఒక అనాలోచితమైన అభిప్రాయం కొత్త రచయితల్లో బలపడింది. ఈ ప్రవాహంలో చిన్నయ సూరి చేసిన పనిని సమర్థంగా బోధపరుచుకునే పని ఎవ్వరూ చేయలేదు. అంతకన్నా ముఖ్యంగా చిన్నయ సూరి రాసింది అందమైన భాష అని ఒక్క గురజాడ తప్ప ఎవరూ గుర్తించలేదు. ఈ కారణాలవల్ల క్రమంగా లాక్షణికము, గ్రామ్యము అనే మాటలు పోయి గ్రాంథికము, వ్యావహారికము అనే మాటలే ప్రచారంలోకి వచ్చాయి.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 05-07-2020, 11:17 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)