01-07-2020, 07:23 PM
పద్ధెనిమిదవ శతాబ్ది చివరి కాలం నాటికి రాజులు దెబ్బతిని పోయారు. ఒకరి తరువాత ఒకరుగా కుంఫిణీ ప్రభుత్వ ప్రాబల్యానికి లొంగిపోయారు. కుంఫిణీ ప్రభుత్వం నయానా భయానా, ఆ రెండూ చెల్లకపోతే మోసానా ఈ రాజ్యాలకి సైనిక అధికారం లేకుండా చేసింది. తెలుగుదేశంలో కుంఫిణీ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోట్లాడిన ఆఖరి రాజ్యం విజయనగర రాజ్యం. ఒక పక్క ఫ్రెంచివాళ్ళు, ఇంకొక పక్క ఇంగ్లీషువాళ్ళు దక్షిణదేశంలో ప్రాబల్యం కోసం పోటీ పడుతూ ఉండగా తెలుగు ప్రాంతంలో స్థానికంగా వైరాలు ఉన్న విజయనగరం, బొబ్బిలి రాజ్యాలు, ఇంకా ఇతర చిల్లర రాజ్యాలు తమ తగాదాల పరిష్కారం కోసం ఒకరు ఇంగ్లీషు వాళ్ళని, ఇంకొకరు ఫ్రెంచి వాళ్లని సహాయం కోరుతూ ఉండేవారు.
ఫ్రెంచి వాళ్ళని ఓడించి స్థిరంగా ఇంగ్లీషు కుంఫిణీ అధికారాన్ని సంపాదించుకున్న తరవాత ఈ స్థానిక సంస్థానాలని ఒక దాని వెనక ఒకటి తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వివరంగా చెప్పడానికి ఇది చోటు కాదు కాని, విజయనగర రాజులు ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా పద్మనాభం అనే చోట యుద్ధం చేశారని చట్రాతి లక్ష్మీనర్సకవి రాసిన పద్మనాభ యుద్ధం చెప్తుంది. కానీ ఈ పద్మనాభ యుద్ధకావ్యం విజయనగర రాజుల ఓటమిని ఒప్పుకోదు. అలాగే బొబ్బిలి రాజులకి ఫ్రెంచి సేనాని బుస్సీకి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి ఓడిపోయినా దిట్టకవి నారాయణకవి రాసిన రంగరాయ విజయం కూడా బొబ్బిలి ఓటమిని ఒప్పుకోదు. ఆ రాజులు వీరస్వర్గం పొందినట్లు గానో మరోవిధంగానో వారిని పైచేయిగా ఈ కావ్యాలు చూపిస్తాయి. ఈ కావ్యాలు చదివితే, సాంస్కృతికంగా ఈ రాజులు తమ ప్రపంచంలో నిర్మించుకున్న వాతావరణానికీ — ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వమూ బుస్సీ దొరా అమలు చేస్తున్న రాజకీయ, సైనిక వ్యూహాలకీ మధ్య పెద్ద అగాధం ఉందని మనకి బోధ పడుతుంది. తమ మనస్సుల్లో వీరత్వం, గౌరవం మొదలైన నమ్మకాలు ఒక పట్టాన ఈ రాజులు పోగొట్టుకోలేదు. దేశమంతా ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింత చచ్చినా చావని పులుపు లాగా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, మర్యాదల్ని, విశ్వాసాల్ని, ఎక్కడో ఒకచోట అట్టే పెట్టుకున్నారు.
రాజ్యంలో సైనికాధికారం పోయిన తరువాత వీళ్ళు నిజానికి పన్నుల వసూలు చేసే జమీందార్లు మాత్రమే అయ్యారు. రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, ఆ పన్నుల్లో కొంత భాగం ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వానికి, దాని తర్వాత దాని స్థానంలో వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఏటేటా చెల్లించి, వాళ్ళ అనుమతితో ఈ జమీందార్లు బతుకుతూ ఉండేవారు. తర్వాత తర్వాత ఈ పన్నుల్ని వసూలు చేసే పనిని బ్రిటిష్ ప్రభుత్వం వేలం వేసేది. ఆ వేలంలో రకరకాల కులాల వాళ్ళు పాట పాడి కొనుక్కుని జమీందార్లు అయ్యారు. అలాంటి జమీందార్లలో ఒకప్పుడు రాజ్యాధికారానికి అలవాటు పడ్డ వెలమ దొరలు, వాళ్ళతో పాటు ఎప్పుడూ రాజ్యాధికారం లేని బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ జమీందారీ విస్తీర్ణాన్ని బట్టి, దాని మీద వచ్చే పన్నుల ఆదాయాన్ని బట్టి, బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని బట్టి, ఈ జమీందారులు పెద్దాచిన్నాగా రకరకాల స్థాయిల్లో ఉండేవారు (తూమాటి దోణప్ప, 1969).
రాజులు పోయిన తరవాత, అంటే దాదాపుగా 18వ శతాబ్దాంతానికి పండితులు, కవులు బతకడానికి ఆధారం లేని వాళ్ళయ్యారు. అందులో ఏ కొద్దిమందికో తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండేవి. అవి రైతులకి అమరకానికి ఇచ్చి ఆ రైతు పండించిన పంటలో కొంత భాగం వీళ్లకివ్వగా, ఆ డబ్బుతో ఈ కవులు, పండితులు సుఖజీవనం చేస్తూ వుండేవాళ్ళు. పుస్తకాలు చదవడం, కవిత్వం అల్లడం వీళ్ళకి వచ్చిన ఒకే ఒక విద్య. ఆ విద్య పోషింపబడటానికి కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు కావాలి, పాండిత్యాన్ని గౌరవించేవాళ్లు కావాలి; ఆ దశలో ఈ కవులు, పండితులు పోషకుల్ని తయారుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జమీందార్లకి అర్థం కాకపోయినా పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలు చెప్పి, వాళ్లకి లేని ఆస్థానాలని కల్పించి, ఆ జమీందార్లకి మహారాజులని, కవిపోషకులని గౌరవకరమైన బిరుదులిచ్చి, వాళ్ళ ఆస్థాన కవులమని, ఆస్థాన పండితులమని పేర్లు తమకిచ్చుకుని ఈ కవులు, పండితులు బతుకుతుండేవాళ్లు.
కాని, తెలుగులోనే పని చేస్తున్నవాళ్లు ఒక ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చేది. వాళ్ళు కవులే కానీ పండితులు కారు. పండితులు అవాలంటే సంస్కృతంలో వ్యాకరణము, అలంకారశాస్త్రము క్షుణ్ణంగా రావాలి. పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు. పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో తెలుగు కవులకి పాండిత్య గౌరవం లేకుండా పోయింది. జమీందారుల దగ్గరికి వెళ్లి తమకి వచ్చిన సంస్కృతాన్ని హడావిడిగా చూపించుకోగల శక్తి సంస్కృత పండితులకే ఉండేది. పెద్దగా చదువుకోని ఈ జమీందారులు సంస్కృత పండితుల హడావిడి చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. వాళ్ళ ఎదుట నిలబడి, సంస్కృత పండితులతో పోటీ పడగలమని ధైర్యంతో మాట్లాడగలిగిన తెలుగు కవులు ఉండేవారు కారు. ఈ సంగతి చెళ్ళపిళ్ళ వెంకటరావుగారి జీవితచరిత్ర చూస్తే బాగా బోధపడుతుంది. తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు. అందుచేతనే వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పడం, వందమంది అడిగిన ప్రశ్నలకి, వాళ్ళు ఇచ్చిన సమస్యలకీ పద్యాల్లోనే సమాధానాలు, పూరణలు చెప్పి, ఆ పద్యాలన్నీ మళ్ళా వాళ్ళే ధారణ పట్టి తిరిగి మరుపు లేకుండా అప్పచెప్పడం — ఇలాంటి విద్యలవల్ల వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు. కాని, అంతకు ముందు పరిస్థితి చూస్తే సంస్కృత విద్వాంసులదే పైచేయి. గీర్వాణం అంటే దేవతల భాష కానీ గీర్వాణం అంటే గర్వం, పొగరుమోతు తనం అనే అర్థాలు తెలుగులో వచ్చాయి. తిరుపతి వెంకట కవుల పుణ్యమా అని తెలుగుకి ఆస్థాన ప్రవేశము, సాహిత్య గౌరవము ఏర్పడ్డ తర్వాత ‘తెలుగు మీరిపోతోంది’ అనే మాట కూడా అందుకే వచ్చింది. తెలుగుకి, సంస్కృతానికి ఈ రకమైన పోటీ కొన్నేళ్ల పాటు కొనసాగింది.
ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం — (తెలుగు భాషతో నిండిన కావ్యం ఇనుముతో చేసిన నగ లాంటిది) అని సంస్కృత పండితులు ఈసడిస్తే,
సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్తేభ శృంఖలం — (సంస్కృతమనే అడవిలో యధేచ్ఛగా తిరిగే పండితుడు అనే ఏనుగుని కట్టేసే గొలుసు ఇది) అని తెలుగు కవులు అనేవారుట. చాటు ప్రపంచంలో జ్ఞాపకం వుండే శ్లోకం ఈ వైరుధ్యాన్నే తెలియ పరుస్తుంది (వెల్చేరు, షూల్మన్, 1998).
చెళ్ళపిళ్ళ వెంకటరావుగారి కన్నా ఒక 20, 30 ఏళ్ళు ముందుకి వెళ్లి చూస్తే ఈ వివాదాలు ఇంకా బలంగా కనిపిస్తాయి. తెలుగు కవులకి, పండితులకి ఆసరాగా నన్నయ తిక్కనలు ఉన్న్నారు కానీ శాస్త్ర పండితులు ఎవరూ లేరు. జమీందార్ల పోషణలో వుండే తెలుగు కవులు, సంస్కృత పండితులు ఇలాటి అంతర్గత వైరుధ్యాలతో సతమతవుతూ వుండేవారు. తెలుగు వ్యాకరణం సంస్కృతంలో వుంది. అది సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. పండితులు అంటే సంస్కృత పండితులు అనే పేరే వున్నా తెలుగులో కవి అనే పేరుకి అంత గౌరవమూ సంపాదించి తెలుగులో తాము చెప్పే కవిత్వమంతా ప్రామాణికం చెయ్యడానికి, అంటే శాస్త్ర గౌరవాన్ని సంపాదించుకోవడానికి, తెలుగు కవులు ప్రయత్నించేవారు. ఇలాంటి వారిని గౌరవిస్తే తప్ప జమీందార్లకి కూడా సాహిత్యపోషకులు అనే బిరుదు వచ్చేది కాదు. కుంఫిణీ ప్రభుత్వం తెలుగుని ఏ రకంగా చూచినా జమీందార్లు మాత్రం ఆంధ్రశబ్దచింతామణి ఒప్పుకున్న తెలుగునే ఆదరిస్తూ వచ్చారు. తమ ఆశుకవిత్వంతో, శతావధానాలతో జమిందార్లనే కాకుండా డబ్బున్న విద్యావంతులని కూడా ఆకర్షించిన తిరుపతి వెంకట కవులు కూడా తమ కవిత్వాన్ని ఎదుర్కునే పండితులతో పోట్లాడి, తమ ప్రయోగాలు వ్యాకరణ రీత్యా సమర్ధించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ‘తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది’ అనే మాట అన్నా, వ్యాకరణాన్ని మాత్రం వాళ్లెప్పుడూ కాదనలేదు.
తెల్లదొరలు తెలుగు నేర్చుకోవడం మానేసి తెలుగువాళ్లకే ఇంగ్లీషు నేర్పడం మొదలుపెట్టిన తరువాత తెలుగుకి ఏ దిక్కూ లేకుండా పోయింది. ఒక పక్క జమీందార్లు చెప్పుకోదగ్గ బలంగా యెక్కడా లేరు. ఇంకొకపక్క కుంఫిణీ వారు తెలుగు వాళ్లకి ఇంగ్లీషు నేర్పే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో స్కూళ్లలో తెలుగు చెప్పేవారు. వీళ్లకోసం తెలుగు పండితులు వ్యాకరణాలు, కథల పుస్తకాలు రాశారు. ఆ వ్యాకరణాలలో ముఖ్యమైనవి: వేదం పట్టాభిరామరావు – ఆంధ్ర వ్యాకరణము లేక పట్టాభిరామ పండితీయం, రావిపాటి గురుమూర్తిరావు – తెనుగు వ్యాకరణం, పుదూరి సీతారామరావు – ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, వేదం వెంకటరమణరావు – లఘువ్యాకరణము, తాడినాడ వెంకయ్య – ఆంధ్రవ్యాకరణం, ఇత్యాది. ఈ వ్యాకరణాలతో పాటు రావిపాటి గురుమూర్తి రావు రాసిన విక్రమార్కుని కథలు, ఆయనే రాసిన పంచతంత్రం, దీనితో పాటు అందరికీ పరిచయమైన పెద్ద బాలశిక్ష (పుదూరి సీతారామరావు), పాటూరి రామస్వామి రాసిన శుకసప్తతి కథలు పఠనపాఠనాలలో వుండేవి.
ఫ్రెంచి వాళ్ళని ఓడించి స్థిరంగా ఇంగ్లీషు కుంఫిణీ అధికారాన్ని సంపాదించుకున్న తరవాత ఈ స్థానిక సంస్థానాలని ఒక దాని వెనక ఒకటి తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వివరంగా చెప్పడానికి ఇది చోటు కాదు కాని, విజయనగర రాజులు ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా పద్మనాభం అనే చోట యుద్ధం చేశారని చట్రాతి లక్ష్మీనర్సకవి రాసిన పద్మనాభ యుద్ధం చెప్తుంది. కానీ ఈ పద్మనాభ యుద్ధకావ్యం విజయనగర రాజుల ఓటమిని ఒప్పుకోదు. అలాగే బొబ్బిలి రాజులకి ఫ్రెంచి సేనాని బుస్సీకి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి ఓడిపోయినా దిట్టకవి నారాయణకవి రాసిన రంగరాయ విజయం కూడా బొబ్బిలి ఓటమిని ఒప్పుకోదు. ఆ రాజులు వీరస్వర్గం పొందినట్లు గానో మరోవిధంగానో వారిని పైచేయిగా ఈ కావ్యాలు చూపిస్తాయి. ఈ కావ్యాలు చదివితే, సాంస్కృతికంగా ఈ రాజులు తమ ప్రపంచంలో నిర్మించుకున్న వాతావరణానికీ — ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వమూ బుస్సీ దొరా అమలు చేస్తున్న రాజకీయ, సైనిక వ్యూహాలకీ మధ్య పెద్ద అగాధం ఉందని మనకి బోధ పడుతుంది. తమ మనస్సుల్లో వీరత్వం, గౌరవం మొదలైన నమ్మకాలు ఒక పట్టాన ఈ రాజులు పోగొట్టుకోలేదు. దేశమంతా ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింత చచ్చినా చావని పులుపు లాగా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, మర్యాదల్ని, విశ్వాసాల్ని, ఎక్కడో ఒకచోట అట్టే పెట్టుకున్నారు.
రాజ్యంలో సైనికాధికారం పోయిన తరువాత వీళ్ళు నిజానికి పన్నుల వసూలు చేసే జమీందార్లు మాత్రమే అయ్యారు. రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, ఆ పన్నుల్లో కొంత భాగం ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వానికి, దాని తర్వాత దాని స్థానంలో వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఏటేటా చెల్లించి, వాళ్ళ అనుమతితో ఈ జమీందార్లు బతుకుతూ ఉండేవారు. తర్వాత తర్వాత ఈ పన్నుల్ని వసూలు చేసే పనిని బ్రిటిష్ ప్రభుత్వం వేలం వేసేది. ఆ వేలంలో రకరకాల కులాల వాళ్ళు పాట పాడి కొనుక్కుని జమీందార్లు అయ్యారు. అలాంటి జమీందార్లలో ఒకప్పుడు రాజ్యాధికారానికి అలవాటు పడ్డ వెలమ దొరలు, వాళ్ళతో పాటు ఎప్పుడూ రాజ్యాధికారం లేని బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ జమీందారీ విస్తీర్ణాన్ని బట్టి, దాని మీద వచ్చే పన్నుల ఆదాయాన్ని బట్టి, బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని బట్టి, ఈ జమీందారులు పెద్దాచిన్నాగా రకరకాల స్థాయిల్లో ఉండేవారు (తూమాటి దోణప్ప, 1969).
రాజులు పోయిన తరవాత, అంటే దాదాపుగా 18వ శతాబ్దాంతానికి పండితులు, కవులు బతకడానికి ఆధారం లేని వాళ్ళయ్యారు. అందులో ఏ కొద్దిమందికో తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండేవి. అవి రైతులకి అమరకానికి ఇచ్చి ఆ రైతు పండించిన పంటలో కొంత భాగం వీళ్లకివ్వగా, ఆ డబ్బుతో ఈ కవులు, పండితులు సుఖజీవనం చేస్తూ వుండేవాళ్ళు. పుస్తకాలు చదవడం, కవిత్వం అల్లడం వీళ్ళకి వచ్చిన ఒకే ఒక విద్య. ఆ విద్య పోషింపబడటానికి కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు కావాలి, పాండిత్యాన్ని గౌరవించేవాళ్లు కావాలి; ఆ దశలో ఈ కవులు, పండితులు పోషకుల్ని తయారుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జమీందార్లకి అర్థం కాకపోయినా పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలు చెప్పి, వాళ్లకి లేని ఆస్థానాలని కల్పించి, ఆ జమీందార్లకి మహారాజులని, కవిపోషకులని గౌరవకరమైన బిరుదులిచ్చి, వాళ్ళ ఆస్థాన కవులమని, ఆస్థాన పండితులమని పేర్లు తమకిచ్చుకుని ఈ కవులు, పండితులు బతుకుతుండేవాళ్లు.
కాని, తెలుగులోనే పని చేస్తున్నవాళ్లు ఒక ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చేది. వాళ్ళు కవులే కానీ పండితులు కారు. పండితులు అవాలంటే సంస్కృతంలో వ్యాకరణము, అలంకారశాస్త్రము క్షుణ్ణంగా రావాలి. పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు. పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో తెలుగు కవులకి పాండిత్య గౌరవం లేకుండా పోయింది. జమీందారుల దగ్గరికి వెళ్లి తమకి వచ్చిన సంస్కృతాన్ని హడావిడిగా చూపించుకోగల శక్తి సంస్కృత పండితులకే ఉండేది. పెద్దగా చదువుకోని ఈ జమీందారులు సంస్కృత పండితుల హడావిడి చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. వాళ్ళ ఎదుట నిలబడి, సంస్కృత పండితులతో పోటీ పడగలమని ధైర్యంతో మాట్లాడగలిగిన తెలుగు కవులు ఉండేవారు కారు. ఈ సంగతి చెళ్ళపిళ్ళ వెంకటరావుగారి జీవితచరిత్ర చూస్తే బాగా బోధపడుతుంది. తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు. అందుచేతనే వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పడం, వందమంది అడిగిన ప్రశ్నలకి, వాళ్ళు ఇచ్చిన సమస్యలకీ పద్యాల్లోనే సమాధానాలు, పూరణలు చెప్పి, ఆ పద్యాలన్నీ మళ్ళా వాళ్ళే ధారణ పట్టి తిరిగి మరుపు లేకుండా అప్పచెప్పడం — ఇలాంటి విద్యలవల్ల వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు. కాని, అంతకు ముందు పరిస్థితి చూస్తే సంస్కృత విద్వాంసులదే పైచేయి. గీర్వాణం అంటే దేవతల భాష కానీ గీర్వాణం అంటే గర్వం, పొగరుమోతు తనం అనే అర్థాలు తెలుగులో వచ్చాయి. తిరుపతి వెంకట కవుల పుణ్యమా అని తెలుగుకి ఆస్థాన ప్రవేశము, సాహిత్య గౌరవము ఏర్పడ్డ తర్వాత ‘తెలుగు మీరిపోతోంది’ అనే మాట కూడా అందుకే వచ్చింది. తెలుగుకి, సంస్కృతానికి ఈ రకమైన పోటీ కొన్నేళ్ల పాటు కొనసాగింది.
ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం — (తెలుగు భాషతో నిండిన కావ్యం ఇనుముతో చేసిన నగ లాంటిది) అని సంస్కృత పండితులు ఈసడిస్తే,
సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్తేభ శృంఖలం — (సంస్కృతమనే అడవిలో యధేచ్ఛగా తిరిగే పండితుడు అనే ఏనుగుని కట్టేసే గొలుసు ఇది) అని తెలుగు కవులు అనేవారుట. చాటు ప్రపంచంలో జ్ఞాపకం వుండే శ్లోకం ఈ వైరుధ్యాన్నే తెలియ పరుస్తుంది (వెల్చేరు, షూల్మన్, 1998).
చెళ్ళపిళ్ళ వెంకటరావుగారి కన్నా ఒక 20, 30 ఏళ్ళు ముందుకి వెళ్లి చూస్తే ఈ వివాదాలు ఇంకా బలంగా కనిపిస్తాయి. తెలుగు కవులకి, పండితులకి ఆసరాగా నన్నయ తిక్కనలు ఉన్న్నారు కానీ శాస్త్ర పండితులు ఎవరూ లేరు. జమీందార్ల పోషణలో వుండే తెలుగు కవులు, సంస్కృత పండితులు ఇలాటి అంతర్గత వైరుధ్యాలతో సతమతవుతూ వుండేవారు. తెలుగు వ్యాకరణం సంస్కృతంలో వుంది. అది సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. పండితులు అంటే సంస్కృత పండితులు అనే పేరే వున్నా తెలుగులో కవి అనే పేరుకి అంత గౌరవమూ సంపాదించి తెలుగులో తాము చెప్పే కవిత్వమంతా ప్రామాణికం చెయ్యడానికి, అంటే శాస్త్ర గౌరవాన్ని సంపాదించుకోవడానికి, తెలుగు కవులు ప్రయత్నించేవారు. ఇలాంటి వారిని గౌరవిస్తే తప్ప జమీందార్లకి కూడా సాహిత్యపోషకులు అనే బిరుదు వచ్చేది కాదు. కుంఫిణీ ప్రభుత్వం తెలుగుని ఏ రకంగా చూచినా జమీందార్లు మాత్రం ఆంధ్రశబ్దచింతామణి ఒప్పుకున్న తెలుగునే ఆదరిస్తూ వచ్చారు. తమ ఆశుకవిత్వంతో, శతావధానాలతో జమిందార్లనే కాకుండా డబ్బున్న విద్యావంతులని కూడా ఆకర్షించిన తిరుపతి వెంకట కవులు కూడా తమ కవిత్వాన్ని ఎదుర్కునే పండితులతో పోట్లాడి, తమ ప్రయోగాలు వ్యాకరణ రీత్యా సమర్ధించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ‘తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది’ అనే మాట అన్నా, వ్యాకరణాన్ని మాత్రం వాళ్లెప్పుడూ కాదనలేదు.
తెల్లదొరలు తెలుగు నేర్చుకోవడం మానేసి తెలుగువాళ్లకే ఇంగ్లీషు నేర్పడం మొదలుపెట్టిన తరువాత తెలుగుకి ఏ దిక్కూ లేకుండా పోయింది. ఒక పక్క జమీందార్లు చెప్పుకోదగ్గ బలంగా యెక్కడా లేరు. ఇంకొకపక్క కుంఫిణీ వారు తెలుగు వాళ్లకి ఇంగ్లీషు నేర్పే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో స్కూళ్లలో తెలుగు చెప్పేవారు. వీళ్లకోసం తెలుగు పండితులు వ్యాకరణాలు, కథల పుస్తకాలు రాశారు. ఆ వ్యాకరణాలలో ముఖ్యమైనవి: వేదం పట్టాభిరామరావు – ఆంధ్ర వ్యాకరణము లేక పట్టాభిరామ పండితీయం, రావిపాటి గురుమూర్తిరావు – తెనుగు వ్యాకరణం, పుదూరి సీతారామరావు – ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, వేదం వెంకటరమణరావు – లఘువ్యాకరణము, తాడినాడ వెంకయ్య – ఆంధ్రవ్యాకరణం, ఇత్యాది. ఈ వ్యాకరణాలతో పాటు రావిపాటి గురుమూర్తి రావు రాసిన విక్రమార్కుని కథలు, ఆయనే రాసిన పంచతంత్రం, దీనితో పాటు అందరికీ పరిచయమైన పెద్ద బాలశిక్ష (పుదూరి సీతారామరావు), పాటూరి రామస్వామి రాసిన శుకసప్తతి కథలు పఠనపాఠనాలలో వుండేవి.