21-11-2019, 05:49 PM
(This post was last modified: 22-11-2019, 05:53 PM by sweet1guy. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆ పరమేశ్వరుడే ఈ సమస్త చరాచర ప్రపంచంలో కంటికి కనిపించేదీ, చెవికి వినిపించే వాటిని అన్నింటినీ ప్రకృతిలో దేనికీ సత్యస్వరూపుడు. శాశ్వతుడు. ప్రకృతిలో దేనికీ సత్యస్వరూపము, శాశ్వతములు లేవు.
భగవానుడు కల్పించిన ఈ ప్రకృతినే మానవుడు ఇంతవరకు తెలిసికొనలేక పోయినాడు. ఒక వ్యక్తి తన సమస్త జ్ఞానమున తన మనస్తత్వమును తెలియలేకున్నాడు - గెలుచుట చేతకాని పని !
"లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తమున్ గెలువనేరవు" అన్నాడు భాగవతంలో ప్రహ్లాదుడు.
ప్రకృతిని - తన ప్రకృతిని - ఎరుగలేని దుర్బలాతి దుర్బలుడు మానవుడు. అయినా తనకు అన్నీ తెలుసునని బీరాలు పలుకుతాడు.
మానవుని వద్ద ఒక మహత్తున్నది. అది ఆలోచన. అన్వేషణ. అతడు పుట్టిన్నాటినుంచి అన్వేషిస్తున్నాడు. మానవుని భగవదన్వేషణ ఆగలేదు - ఆగదు. అతనికి భగవంతుడు లభించడు. ఏలనన కూటిలో రాయితీయలేనివాడు ఏటిలోనిరాయి తీయలేడు.
తననే ఎరగనివాడు సకల చరాచర సృష్టికర్తను ఎరుగుట దుర్లభము. కాని అన్వేషణ ఆగదు. ఆ అన్వేషణ యందలి భాగమే ఈ దేవతలు, ఈ మహాత్ములు, ఈ ప్రవక్తలు.
వీరిలో ఎవరూ పరాత్పరులుకారు. ఎవరూ సర్వేశ్వరుని సాంతంగా దర్శించలేదు. మహామహులు యోగులు ఋషులు ఆచార్యులు ప్రవక్తలు అందరూ భగవదంశాన్ని మాత్రమే దర్శించగలిగారు.
ఈ అంశం తెలియజేయడానికీ తిరువనంతపురపు అనంత పద్మనాభస్వామిని దర్శించడానికి మూడు వాకిళ్లు ఏర్పరచినారు.
అయితే మహాత్ములు చూపిన దేవతలను ఆరాధించడం దోషంకాదు. అతడు అందనివాడు. వారు అందినవారిని మనకు చూపినారు. ఆరాధించడమే మన పని. పరాత్పరుడు సత్యము. దేవతలు విశ్వాసము.
సత్యము కనిపించనపుడు విశ్వాసమే మహత్తము.
సముద్రం చూడనివాడు కూపాన్నే సముద్రం అనుకోవాలి.
దేశంలో ప్రభుత్వం అంతటా ఉంటుంది. గ్రామస్తునికి గ్రామాధికారియే ప్రభుత్వం. ఏ శాఖ వానికి ఆ శాఖ ప్రభుత్వం అవుతుంది. అందువల్ల అవి మాత్రమే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం వేరే ఉంది. అది సర్వబలోపేత.
గ్రామస్తునికి గ్రామాధికారి వంటి వారే అనేక దేవతలు.
యేప్యన్న దేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః |
తేపిమా మేమ కౌన్తేయ యజస్త్యని విధిపూర్వకమ్ ||
అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో 9-23లో
ఇతర దేవతల భక్తులు ఆ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాంటివారు నన్నే పూజించినట్లవుతుంది. అయితే అవిధి పూర్వకంగా.
పన్ను వసూలు చేసే వానికి ఇచ్చిన పన్ను ప్రభుత్వానికే చెందుతుంది కదా !
"ఏకం సద్విప్రాబహుధావదంతి" అంటుంది వేదం. ఒకే సత్యాన్ని పండితులు అనేక విధాలుగా చెపుతారు అని.
సత్య స్వరూపం అగోచరం. అలాంటపుడు పండితులు దాన్ని అనేక విధాలుగా చెప్పే అవకాశం ఏది? కాబట్టి పండితులు చెపుతున్నది సత్యపు ఏదో ఒక అంశాన్ని మాత్రమే.
ఏకం సద్విప్రాబహుధా వదంతి, అంటే సూర్యచంద్రాది దేవతలందరు పరమాత్మ స్వరూపులని అర్థంకాదు.
సూర్య చంద్ర, గ్రహ, నక్షత్రాది సమస్త సృష్టికర్త భగవానుడు.
భగవానుడు కర్త. సూర్యచంద్రాదులు సృష్టిమాత్రమే. వారు అశాశ్వతులు. వారికి అంతం ఉంది.
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోనః ప్రచోదయాత్
3-4-62-1 ఈ మంత్రద్రష్ట విశ్వామిత్రుడు. "ఏ సవిత మా బుద్ధికి ప్రేరణ కలిగించునో ఎవడు సమస్త శ్రుతులందు ప్రసిద్ధుడో అట్టి ద్యోతమాన లోకస్రష్ట యొక్క పరబ్రహ్మాత్మక తేజమును మేము ఉపాసింతుము"
ఆ పరింజ్యోతి ఏది? ఏదైనను దానినే ఉపాసింతుము.
ఇదే మనం ప్రస్తుతం ఉపాసిస్తున్న గాయత్రి మంత్రం.
ఋగ్వేదం 10వ మండలం 7వ అధ్యాయం 121వ సూక్తం 1-10 మంత్రాల్లో పరాత్పరుని గుణగణాలను వర్ణిస్తూ "కస్మైదేవాయ హనిషా విధేమ?" అనే ప్రశ్న కనిపిస్తుంది.
మానో హింపీజ్జనితాయః పృథివ్యాయోవాదివ సత్యధర్మాజజాన
యశ్వాపశ్చన్ద్రా బ్రహతీర్జనాన కస్మైదేవాయ హవిషావిధేమ
ఎవడు భూమిని సృష్టించినాడో ఎవని బలము సత్యమగునో ఎవడు ఆకసమును సృష్టించినాడో ఎవడు ఆనంద వర్ధకమగు విస్తీర్ణ జలరాశిని సృష్టించినాడో అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పించవలెను?
భగవానుడు కల్పించిన ఈ ప్రకృతినే మానవుడు ఇంతవరకు తెలిసికొనలేక పోయినాడు. ఒక వ్యక్తి తన సమస్త జ్ఞానమున తన మనస్తత్వమును తెలియలేకున్నాడు - గెలుచుట చేతకాని పని !
"లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తమున్ గెలువనేరవు" అన్నాడు భాగవతంలో ప్రహ్లాదుడు.
ప్రకృతిని - తన ప్రకృతిని - ఎరుగలేని దుర్బలాతి దుర్బలుడు మానవుడు. అయినా తనకు అన్నీ తెలుసునని బీరాలు పలుకుతాడు.
మానవుని వద్ద ఒక మహత్తున్నది. అది ఆలోచన. అన్వేషణ. అతడు పుట్టిన్నాటినుంచి అన్వేషిస్తున్నాడు. మానవుని భగవదన్వేషణ ఆగలేదు - ఆగదు. అతనికి భగవంతుడు లభించడు. ఏలనన కూటిలో రాయితీయలేనివాడు ఏటిలోనిరాయి తీయలేడు.
తననే ఎరగనివాడు సకల చరాచర సృష్టికర్తను ఎరుగుట దుర్లభము. కాని అన్వేషణ ఆగదు. ఆ అన్వేషణ యందలి భాగమే ఈ దేవతలు, ఈ మహాత్ములు, ఈ ప్రవక్తలు.
వీరిలో ఎవరూ పరాత్పరులుకారు. ఎవరూ సర్వేశ్వరుని సాంతంగా దర్శించలేదు. మహామహులు యోగులు ఋషులు ఆచార్యులు ప్రవక్తలు అందరూ భగవదంశాన్ని మాత్రమే దర్శించగలిగారు.
ఈ అంశం తెలియజేయడానికీ తిరువనంతపురపు అనంత పద్మనాభస్వామిని దర్శించడానికి మూడు వాకిళ్లు ఏర్పరచినారు.
అయితే మహాత్ములు చూపిన దేవతలను ఆరాధించడం దోషంకాదు. అతడు అందనివాడు. వారు అందినవారిని మనకు చూపినారు. ఆరాధించడమే మన పని. పరాత్పరుడు సత్యము. దేవతలు విశ్వాసము.
సత్యము కనిపించనపుడు విశ్వాసమే మహత్తము.
సముద్రం చూడనివాడు కూపాన్నే సముద్రం అనుకోవాలి.
దేశంలో ప్రభుత్వం అంతటా ఉంటుంది. గ్రామస్తునికి గ్రామాధికారియే ప్రభుత్వం. ఏ శాఖ వానికి ఆ శాఖ ప్రభుత్వం అవుతుంది. అందువల్ల అవి మాత్రమే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం వేరే ఉంది. అది సర్వబలోపేత.
గ్రామస్తునికి గ్రామాధికారి వంటి వారే అనేక దేవతలు.
యేప్యన్న దేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః |
తేపిమా మేమ కౌన్తేయ యజస్త్యని విధిపూర్వకమ్ ||
అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో 9-23లో
ఇతర దేవతల భక్తులు ఆ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాంటివారు నన్నే పూజించినట్లవుతుంది. అయితే అవిధి పూర్వకంగా.
పన్ను వసూలు చేసే వానికి ఇచ్చిన పన్ను ప్రభుత్వానికే చెందుతుంది కదా !
"ఏకం సద్విప్రాబహుధావదంతి" అంటుంది వేదం. ఒకే సత్యాన్ని పండితులు అనేక విధాలుగా చెపుతారు అని.
సత్య స్వరూపం అగోచరం. అలాంటపుడు పండితులు దాన్ని అనేక విధాలుగా చెప్పే అవకాశం ఏది? కాబట్టి పండితులు చెపుతున్నది సత్యపు ఏదో ఒక అంశాన్ని మాత్రమే.
ఏకం సద్విప్రాబహుధా వదంతి, అంటే సూర్యచంద్రాది దేవతలందరు పరమాత్మ స్వరూపులని అర్థంకాదు.
సూర్య చంద్ర, గ్రహ, నక్షత్రాది సమస్త సృష్టికర్త భగవానుడు.
భగవానుడు కర్త. సూర్యచంద్రాదులు సృష్టిమాత్రమే. వారు అశాశ్వతులు. వారికి అంతం ఉంది.
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోనః ప్రచోదయాత్
3-4-62-1 ఈ మంత్రద్రష్ట విశ్వామిత్రుడు. "ఏ సవిత మా బుద్ధికి ప్రేరణ కలిగించునో ఎవడు సమస్త శ్రుతులందు ప్రసిద్ధుడో అట్టి ద్యోతమాన లోకస్రష్ట యొక్క పరబ్రహ్మాత్మక తేజమును మేము ఉపాసింతుము"
ఆ పరింజ్యోతి ఏది? ఏదైనను దానినే ఉపాసింతుము.
ఇదే మనం ప్రస్తుతం ఉపాసిస్తున్న గాయత్రి మంత్రం.
ఋగ్వేదం 10వ మండలం 7వ అధ్యాయం 121వ సూక్తం 1-10 మంత్రాల్లో పరాత్పరుని గుణగణాలను వర్ణిస్తూ "కస్మైదేవాయ హనిషా విధేమ?" అనే ప్రశ్న కనిపిస్తుంది.
మానో హింపీజ్జనితాయః పృథివ్యాయోవాదివ సత్యధర్మాజజాన
యశ్వాపశ్చన్ద్రా బ్రహతీర్జనాన కస్మైదేవాయ హవిషావిధేమ
ఎవడు భూమిని సృష్టించినాడో ఎవని బలము సత్యమగునో ఎవడు ఆకసమును సృష్టించినాడో ఎవడు ఆనంద వర్ధకమగు విస్తీర్ణ జలరాశిని సృష్టించినాడో అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పించవలెను?

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)