Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఎవరు - 2
#1
Bug 
ఎవరు....? 

 (క్రైమ్ ధారావాహికం)

సురేష్ జోస్యభట్ల




ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం. ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని" ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు. ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు. లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపోయున్న వ్యక్తి శవాన్నీ ఫారన్సిక్ బృందం పరిశీలిస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు "దేవేంద్ర రెడ్డి". ఇతను "విజయవాడ సెంట్రల్ " నియోజికవర్గం MLA. ఇతను కూడా అదే "నవతరం పార్టీ " సభ్యుడు. . చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.



స్వాతంత్ర్య దినోత్సవం తరువాత నుండి

*పాఠక మిత్రుల స్పందన లేకపోతే అప్డేట్లు ఆలస్యమౌతాయి
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(09-08-2026, 03:42 PM)k3vv3 Wrote: ఎవరు....? 

 (క్రైమ్ ధారావాహికం)

సురేష్ జోస్యభట్ల




ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం. ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని" ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ . చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.



స్వాతంత్ర్య దినోత్సవం తరువాత నుండి

*పాఠక మిత్రుల స్పందన లేకపోతే అప్డేట్లు ఆలస్యమౌతాయి
Nice start K3vv3 garu! (including original writer Suresh J )
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#3
ఎవరు....? - 1
 
[Image: Picture4.png]

-సురేష్ జోస్యభట్ల
 
Part - 1
ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం.
ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని"
ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు. 
ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు.
లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపోయున్న వ్యక్తి శవాన్నీ ఫారన్సిక్ బృందం పరిశీలిస్తుంది. 
ఆ చనిపోయిన వ్యక్తి పేరు "దేవేంద్ర రెడ్డి". ఇతను "విజయవాడ సెంట్రల్ " నియోజికవర్గం MLA. ఇతను కూడా అదే "నవతరం పార్టీ " సభ్యుడు.  .
చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.
"ఒకే పార్టీకి చెందిన సూర్యనారాయణ మరియు దేవేంద్ర రెడ్డి ఒకప్పుడు బద్ద శత్రువులు. ఒకరంటె ఒకరికి పడేదికాదు. పోయిన ఎన్నికల్లొ పార్టీ పెద్దలు పార్టీ ఆఫీసులొ మీటింగు పెట్టి ఈసారి సూర్యనారాయణకు కాకుండా దేవేంద్ర రెడ్డికి MLA టికెట్టు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం సూర్యనారాయణకి నచ్చలేదు దాంతొ ఆదె పార్టీ మీటింగులొ అందరిముందు దేవేంద్ర రెడ్డిని మరియు పార్టీ పెద్దల్ని అనరాని మాటలు అన్నాడు. 
ఇంకా కోపం తగ్గక దేవేంద్ర రెడ్డి పై చెయ్యి కూడా చేసుకున్నాడు. అప్పుడు అక్కడున్న సూర్యనారాయణ అనుచరులు గొడవ మరీంత పెద్దది అవ్వకుండా తనని అక్కడనుంచి బయటకి తీసుకెళ్ళీపోయారు. కాని దేవేంద్ర రెడ్డి మాత్రం అందరి ముందు తనకి జరిగిన ఈ అవమానం తట్టుకోలేకపోయాడు. దాంతొ సూర్యనారాయణపై సెక్యూరిటీ ఆఫీసర్ కేసు పెట్టి తనని జైల్లొ పెట్టించి బెయిల్ కూడా రాకుండా చేస్తాడు. దీంతొ ఇద్దరి మద్యన వైరం మరింత ముదిరింది. 
ఎన్నికల్లొ దేవేంద్ర రెడ్డి MLA గా గెలిచాడు.  తరువాత దేవేంద్ర రెడ్డిని పిలిచి పోలీసూ కేసులు లాంటివి పార్టీకి అంత మంచివి కావని పార్టీ పెద్దలు చెప్పి ఒత్తిడి చేయడంతొ సూర్యనారాయణ పై పెట్టిన కేసుని వాపసు తీసుకున్నాడు. కాని దేవేంద్ర రెడ్డికి మాత్రం సూర్యనారాయణపై పగ ఇంకా పోలేదు. తనని ఎలాగైన పార్టీ నుండి గెంటెయ్యాలని బలంగా నిర్ణయించుకున్నాడు.
అలా 1.5 సంవత్సరం గడిచింది. తరువాత ఏమైందొ ఏమో తెలియదు కాని ఇద్దరు పాత పగలు అన్నీ మర్చిపోయి మంచి స్నేహితులయ్యారు. ఇద్దరి ఇళ్ళ మద్యన రాకపోకలు పెరిగాయి. నాలుగు నెలలు నుంచి ఎటువంటి గొడవలు లేకపోయెసరికి నిజంగానె ఇద్దరు మారిపోయారని ఇంక అంతా శుభమె అని అందరు అనుకున్నారు.
కాని ఈ రోజు మద్యాహ్నం భోజనానికి అని సూర్యనారాయణ తన ఇంటికి పిలవగా వెళ్ళిన దేవేంద్ర రెడ్డి ఇలా ఇప్పుడు శవమై క్రింద పడున్నాడు". 
ఫారన్సిక్ బృందం వాళ్ళు దేవేంద్ర రెడ్డి కంచంలొ వదిలేసిన ఆహారాన్నీ మరియు టేబుల్ పై ఉన్న మిగతా ఆహారాన్నీ కూడా సేకరించారు. దాంట్లొ ఎమైన విషం కలిసిందా అని పరిశీలించడానికి. తరువాత దేవేంద్ర రెడ్డి శవాన్నీ పంచనామాకి తరలించారు. 
సెక్యూరిటీ ఆఫీసర్లు CrPC 174 సెక్షన్ క్రింద అనుమానస్పద మరణంగా నమోదు చేసి. CrPC 41 సెక్షన్ క్రింద అనుమానితుడుగా సెక్యూరిటీ ఆఫీసర్లు సూర్యనారాయణని తమ అదుపులోకి తీసుకున్నారు. 
వివిధ వార్తా మాద్యమాల్లోని మరియు పత్రికల్లోని దేవేంద్ర రేడ్డి మరణం వెనుక సూర్యనారాయణ హస్తం ఉందంటూ అనె ప్రచారం జోరందుకుంది..
తరువాత సెక్యూరిటీ ఆఫీసర్లు ఇద్దరు మద్య ఎప్పటినుంచొ ఉన్న శత్రుత్వాన్నీ పరిగణలోకి తీసుకొని సూర్యనారాయణపై BNS సెక్షన్ 302 హత్య నేరం కూడా కలిపి  FIR నమోదుచేశారు. 
మరుసటి రోజు పోలిసులు సూర్య నారాయణని కోర్టు లొ హజరుపరిచారు. అక్కడ వాదప్రతివాదనలు మొదలయ్యాయి.
సూర్య నారాయణ ఇంట్లొ పని వాళ్ళందరితొ పాటు ఆ సమయంలొ అక్కడున్న దేవేంద్ర రెడ్డి కారు డ్రైవర్ ను కూడా కోర్టులొ లాయర్లు ప్రశ్నించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : సర్. ముద్దాయి సూర్యనారాయణకి మరియు చనిపోయిన దేవేంద్ర రెడ్డికి మద్య చాలా కాలంపాటు పెద్ద వైరం నడిచింది. పోయిన ఎన్నికల్లొ తనని కాదని పార్టీ పెద్దలు దేవేంద్ర రెడ్డి కి MLA టిక్కెట్టు ఇచ్చారని కోపంతొ అందరి ముందు దేవేంద్ర రెడ్డిని తిట్టి, కొట్టడమె కాకుండా చంపేస్తానని కూడా సూర్యనారాయణ బెదిరించాడు అందుకు గాను సూర్యనారాయణ పై కేసు కూడా నమొదయ్యింది. తరువాత పార్టీ పెద్దల చొరవ వల్ల కేసు వాపసు తీసుకోవడం జరిగింది. నేరుగా దేవేంద్ర రెడ్డిని చంపడం కష్టం కాబట్టి పథకం ప్రకారం తనతొ స్నేహం నటించాడని. తనని నమ్మించి ఇంటికి పిలిచి భోజనంలొ విషం కలిపి హత్య చేశాడని మా అనుమానం. నిజానిజాలు రాబట్టడం కోసం 15 రోజుల పాటు ఇతనని సెక్యూరిటీ ఆఫీసర్వారి కస్టడిలోకి పంపించమని కోర్టు వారిని కోరుతున్నాం.
జడ్జి : డిఫెన్స్ లాయర్ మీ వాధనను వినిపించండి.
డిఫెన్స్ లాయర్ : సర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పిన దాంట్లొ దేవేంద్ర రెడ్డిని కొట్టినందుకు సూర్య నారాయణ పై కేసు పెట్టి తరువాత వాపసు తీసుకున్నంతవరకు వాస్తవమె. కాని తనని సూర్య నారాయణ చంపాడు అనేది మాత్రం అబద్దం. ఎందుకంటె విషం కలిపారు అని చెబుతున్న ఆ ఆహారాన్నె అందరితొ పాటు సూర్య నారాయణ కూడా తిన్నాడని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి ఆ ఇంట్లోని పని వాళ్ళు మరియు దేవేంద్ర రెడ్డి కారు డ్రైవరు కూడా చెప్పారు. వాళ్ళ సాక్ష్యాలను కోర్టువారు ఒక్కసారి పరిశీలించాలి.
జడ్జి : ఇరువర్గాల వాదలను విన్న తరువాత నిజానిజాలు తేలడం కోసం సెక్యూరిటీ ఆఫీసర్ వారు అడిగినట్టు సూర్య నారాయణని 15 రోజులు పాటు సెక్యూరిటీ ఆఫీసర్ కస్టడీకి కాకుండా వారం రోజులు పాటు జుడీశ్యల్ కస్టడికి మాత్రమె పంపించడానికి ఆదేశిస్తున్నాం. ఫారెన్సిక్ మరియు పంచనామ రిపోర్టులను వచ్చేంత వరుకు కేసును వచ్చే వారం ఏప్రిల్ 23వ తారీకు గురువారానికి వాయిదా వేస్తున్నాం.
తరువాత జుడీశ్యల్ కస్టడీలో ఉన్న సూర్యనారాయణని వారం రోజుల పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు విచారించారు. కాని వారు ఆశించిన నిజాలేమి రాలేదు. సూర్య నారాయణ తనకేం తెలియదనె చెప్పుకుంటూ వచ్చాడు.
ఈ లోపు ఫారన్సిక్ మరియు శవ పంచనామా రిపోర్టలు రెండు వచ్చాయి.
ఫారన్సిక్ రిపోర్టులొ దేవేంద్ర రెడ్డి తిన్న ఆహారంలొ గాని త్రాగిన నీళ్ళల్లొ గాని. మరియు ఆ టేబుల్ పై ఉన్న మిగతా ఆహారంలొ కూడా ఎటువంటి విషపూరితమైన పదార్ధం లేదు అని ఉంది.
శవ పంచనామా రిపోర్టులొ అయితె సడన్ కార్డియాక్ ఎరస్ట్ (Sudden cardiac arrest) అంటె హఠాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల చనిపోయాడు అని ఎటువంటి విష ప్రయోగం జరగలేదు అని పైగా అతని ఒంటిపై ఎటువంటి గాయాలు గాని చిన్న గీతలు గాని లేవని ఉంది.
సెక్యూరిటీ ఆఫీసర్ విచారణ అధికారి : ఏంటీ గుండె పోటు వల్ల చనిపోయాడా? అది ఎలా సాద్యం. దేవేంద్ర రెడ్డికి బీ.పి, షుగరు లాంటివి ఏమిలేవు అతను చాలా ఆరోగ్యవంతుడు పైగా ఎటువంటి దురలవాట్లు లేని వ్యక్తి. అతనికి గుండెపోటు రావడం ఏంటి...?
వారం రోజులు తరువాత సూర్యనారాయణని కోర్టులొ తిరిగి హాజరు పరిచారు.
డిఫెన్స్ లాయర్ : సర్ వచ్చిన ఫారన్సిక్ మరియు శవ పంచనామ రిపోర్టుల ప్రకారం అతనిపై ఎటువంటి దాడి గాని విషప్రయోగం గాని జరగలేదు అని ఉంది. పైగా అతని చావుకి కారణం గుండెపోటు అని నిర్ధారించారు. కాబట్టి సూర్యనారాయణ కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని తేలిపోయింది. కాబట్టి అతనిపై నమోదైన BNS సెక్షన్ 302 హత్య నేరం ఆరోపణ తొలగించి బెయిల్ మంజూరు చేయవలిసిందిగా కోర్టు వారిని  కోరుతున్నాం.
జడ్జి : పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీరు మాట్లాడండి
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : సర్ దేవేంద్ర రెడ్డికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతనికి గుండె పోటు వచ్చె అవకాశం చాలా తక్కువ. పైగ మృతుడి శరీరాన్నీ బాగా పరిశీలిస్తె అది సహజ మరణంలా లేదు కచ్చితంగా అతనిపై హత్యాయత్నం జరిగింది. కాబట్టి నిజాలని వెలికితీయడం కోసం ఇంకొన్ని రోజులు సూర్యనారాయణని విచారించడానికి అనుమతి కావాలి అని కోర్టు వారిని కోరుకుంటున్నాం.
జడ్జి : వాదనులు మరియు అన్నీ రిపోర్టులు పరిశీలించాక సూర్యనారాయణె ఈ హత్య చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగని సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నట్లు దేవేంద్ర రెడ్డిది సహజ మరణం కాదనె అనుమానాలు ఉన్నాయి. పైగా దేవేంద్ర రెడ్డి చనిపోయింది సూర్యనారాయణ ఇంట్లొ కాబట్టీ అతనిని నిర్దోశిగాను పరిగణించలేము. అలాగని అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు.  కాబట్టి ప్రస్తుతానికి తనపై నమోదైన BNS సెక్షన్ 302 హత్య నేరాన్నీ కొట్టేస్తూ బెయిల్ మాత్రం మంజూరు చేస్తున్నాం. కేసు పూర్తయ్యవరకు అతను ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ లోపు సెక్యూరిటీ ఆఫీసర్ వారు వెంటనె దర్యాప్తు జరిపి తగు ఆధారలు సేకరించాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
కోర్టు తీర్పుతొ సూర్యనారాయణకు కాస్త ఉపశమనం కలిగింది. కాని సెక్యూరిటీ ఆఫీసర్లకి మాత్రం అసహనం కలిగంది. 
వార్తల్లొ ఇంకా సూర్యనారాయణనె అనుమానితుడుగా చూపిస్తున్నారు. దేవేంద్ర రెడ్డి అనుచరులు కొంతమంది సూర్యనారాయణ ఇంటి పై రాళ్ళు వేస్తూ అతినికి నిరసన తన ఇంటి ముందు బేఠాయించారు. 
కాని సూర్యనారాయణ అంతకుముందె గన్నవరం దగ్గర ఉన్న తన ఫార్మ్ హౌస్ కి మకాం మర్చేశాడు.
దేవేంద్ర రెడ్డి శవాన్నీ విజయవాడ నగరం మీదుగా ఊరేగిస్తూ అంత్యక్రియలకి తీసుకెళ్ళారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఎటువంటి గొడవలు జరగకుండా ప్రభావిత ప్రాంతాలలొ కర్ఫ్యూ విధించారు. రక్షణ బలగాలను అంత్యక్రియలు అయ్యేంత వరకు ఊరేగింపుకి కాపలాగా ఉంచారు
ఈ సంఘటనలన్నీ ఒక వ్యక్తి తన ఇంట్లొ కూర్చోని ప్రశాంతంగా తన మొబైల్లొ చూస్తున్నాడు. తరువాత కుర్చిలోంచి లేచి ఎదురుగా గోడపై ఉన్న బోర్డుకి గుచ్చిన దేవేంద్ర రెడ్డి ఫోటోను తీసుకొని తన లైటర్ తొ ఆ ఫోటోను కాలుస్తాడు. ఆ వచ్చిన మంటపై సిగిరెట్ వెలిగించి కాలుతున్న ఫోటోను డస్టబిన్లొ పడేశి బిగ్గరగా నవ్వుతాడు.
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
ఎవరు....? - 2
Part - 2
 
దేవేంద్ర రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతని ఇంట్లొని కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలొ మునిగిపోయి ఉన్నారు.
సరిగ్గ అప్పుడె ఆ ఇంటి ముందు నలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ (Swift dzire) కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి 37 సంవత్సరాల వయసున్న వ్యక్తి దిగాడు.
ఆతనిని చూడగానె దేవేంద్ర రెడ్డి ముఖ్య అనుచరులు ఇద్దరు అతని వద్దకు వచ్చారు.
శివ (దేవేంద్ర రెడ్డి అనుచరుడు) : నమస్తె సాగర్ సార్...
సాగర్ : నమస్తె ఎలా ఉన్నావు శివ...? మేడమ్ గారు ఉన్నారా?
శివ : బాగున్నా సార్. మేడమ్ గారు లోపలె ఉన్నారు రండి.
వివేక్ (దేవేంద్ర రెడ్డి ఇంకొ అనుచరుడు) : ఆ సంఘటన తరువాత మీకు కాల్ చేయడానికి ప్రయత్నించాం కాని మీకు కాల్ కలవలేదు.
సాగర్ : ముఖ్యమైన పని మీద నేను మారేడిమిల్లి అటవి ప్రాంతంలోకి వెళ్ళాను అక్కడ సిగ్నల్సు ఉండవు అందుకె నీకు నా కల్ కలవలేదు.
శివా : వివేక్ వెళ్ళి ప్రియా మేడమ్ ని పిలు. సాగర్ సార్ వచ్చారని చెప్పు.
వివేక్ : అలాగె శివ.
శివ: మీరు ఇలా హాల్లొని సోఫాలొ కూర్చోండి సార్ మేడమ్ వచ్చేస్తారు.
సాగర్ : సరె..
కాసేపటికి దేవేంద్ర రెడ్డి భార్య ప్రియ మరియు తన కొడుకు అరవింద్ ఇద్దరు సాగర్ ని కలవడానికి హాల్లోకి వచ్చారు. సాగర్ ని చూడగానె ప్రియకి దుఖం తన్నుకొచ్చేసింది.
ప్రియ : చూశావా సాగర్ ఏం జరిగిందొ. ఆయన మనల్ని వదలి పెట్టి వెళ్ళిపోయారు.  ఆయన గుండెపోటు వల్ల చనిపోయారంటె ఇప్పటికి నమ్మలేకపోతున్నా...
అరవింద్ : అవును అంకుల్ మా నాన్న చాలా ఆరోగ్యవంతుడు. తనకి బీ.పి, షుగరు లాంటివి ఏమి లేదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తాడు. ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. అలాంటిదీ ఆయనకు గుండెపోటంటె నమ్మశక్యంగా లేదు.
ప్రియ : ఇదంతా ఆ సూర్యనారాయణ పనె. నాకు అతనిపై మొదటి నుంచి నమ్మకం లేదు. నువ్వు వాళ్ళిధ్దరిని కలపకుండా ఉండాల్సింది సాగర్..
వీళ్ళు ఇలా మాట్లాడుకుటుండగా అక్కడున్న దేవేంద్ర రెడ్డి అనుచరులలొ గణేశ్ అనె 23 ఏళ్ళ కుర్రాడు శివ మరియు వివేక్ వద్దకు వచ్చి
గణేశ్ : శివ అన్న ఆయన ఎవరు.? ప్రియ మేడమ్ మరియు అరవింద్ సార్ ఆయనతొ అంత క్లోజ్ మాట్లాడుతున్నారు?
శివ : నువ్వు కొత్తగా పనిలొ చేరి నెల అవ్వడ వల్ల నీకు తెలియలేదు. ఆయన పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ కమీష్నర్ పేరు సాగర్ వర్మ ఐ.పీ.ఎస్. 2 నెలల క్రితం వరకు ఆయన విజయవాడలోనె ఉండేవారు. ఇప్పుడు రాజమండ్రికి బదిలి అయ్యారు.
వివేక్ : దేవేంద్ర సార్ కి ఆయన కుటుంబానికి చాలా బాగా కావలసిన వ్యక్తి. 12 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ వయసున్న అరివింద్ సార్ ని కొంతమంది కిడ్నాప్ చేస్తె సాగర్ సారె తనని ప్రాణాలకు తెగించి కాపాడారు. అప్పటి నుంచె దేవేంద్ర సార్ కి ప్రియ మేడమ్ కి బాగా దగ్గరయ్యారు. ఈయన సలహాలనె దేవేంద్ర సార్ ఎక్కువుగా వింటారు.
గణేశ్ : ఇందాకల ప్రియ మేడమ్ అన్నారు సాగార్ సారె దేవేంద్ర సార్ ని సూర్యనారాయణ ని కలిపారు అని. నిజమా?
వివేక్ : అవును. సాగర్ సార్ వల్లె వాళ్ళిద్దరు పాత పగలు మర్చిపోయి స్నేహితులయ్యారు.
గణేశ్ : ఆయనెందుకు వాళ్ళిద్దరిని కలిపారు.?
శివ : ఎందుకంటె సాగర్ సార్ దేవేంద్ర సార్కి మాత్రమె కాదు సూర్యనారాయణకు కూడా బాగా కావలిసిన వ్యక్తి.
గణేశ్ : ఏంటి ఇద్దరికి స్నేహితుడా? అదెలా?
వివేక్ : ఎందుకంటె సాగర్ సార్ పరిచయమయ్యె సమయానికి దేవేంద్ర సార్ మరియు సూర్యనారాయణ అప్పటికె మంచి స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసె పెరిగారు. కాని 7 ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరి మద్యన రాజకీయంగ గొడవలు పెరిగి అది వ్యక్తిగత గొడవలుగా మారి బద్ద శత్రువులయ్యారు.
శివ : కాని సాగర్ సార్ మాత్రం ఇద్దరిలొ ఏ ఒక్కరి స్నేహాన్నీ వదులుకోలేదు. ఇద్దరని ఎప్పడు కలపాలనె చూశారు. ఆయన చొరవ వల్లె 7 ఏళ్ళ తరువాత ఇద్దరు కలిశారు.
వివేక్ : కాని ఏం లాభం ఇప్పుడు దేవేంద్ర సార్ చినపోయారుగా ఆ సూర్య నారాయణ వల్ల. అసలు ఆయన ట్రాన్సఫర్ అయ్యి వెళ్ళకుండా ఉండుంటె ఈ ఘోరం జరిగేది కాదు.
గణేశ్ : ఓహో....
శివ : సర్లే పోయి కార్ తీసి ఉంచు ప్రియ మేడమ్ బయటకి వెళ్ళాలి.
గణేశ్ : సరె అన్న...
సాగర్ : మీరేమి బాధ పడకండి అసలు ఏం జరిగిందొ నేను కనుక్కుంటాను. నిజంగా ఆయన హత్య చేయబడితె ఆ చంపిన వాళ్ళని వదలను అది సూర్యనారాయణ అయిన సరె.
ప్రియ : ఠాంక్యు సాగర్ ఇప్పుడు ఉన్న పరిస్తితులలొ నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేను.
సాగర్ : సరె మేడమ్ నేనిక బయలుదేరుతాను. అరివింద్ అమ్మని జాగ్రత్తగా చూసుకొ ఒంటరిగా వదలద్దు సరేనా. మీ నాన్న గారి పెద్ద కర్మ అయ్యేంత వరకు నేను ఈ ఊర్లొనె ఉంటా. ఈ లోపు నీకేమైన అవసరమయతె నన్ను పిలు.
అరవింద్ : సరె అంకుల్...
ప్రియ : భోజనం చేసి వెళ్ళొచ్చు కదా సాగర్.
సాగర్ : పర్లేదు మేడమ్ నేను మళ్ళి రేపు వస్తాను.
వాళ్ళకి ధైర్యం చెప్పి సాగర్ అక్కడనుంచి బయలుదేరి కారు ఎక్కబోతూ ఆగి..
సాగర్ : శివ ....
శివ : సార్ ....
సాగర్ : దేవేంద్ర సార్ కేసుని చూసిన సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ ఎవరు..?
శివ : C.I మురళిధర్.....
సాగర్ : సరె... వాళ్ళని జాగ్రత్తగా చూసుకొ నేను మళ్ళి రేపు వస్తా...
శివ : సరె సార్...
తరువాత సాగర్ కారెక్కి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
------------------------------------------------------------------------
గన్నవరం ఫార్మ హౌసులొ ఉన్న సూర్యనారాయణ తన పరిస్థితి తలుచుకొని చాలా బాధ పడుతున్నాడు.
ఈ లోగా తనకి పార్టీ ప్రసిడెంట్ సాంబయ్య నుంచి ఫోనొచ్చింది. ఎత్తాడు.
సూర్యనారాయణ : హలొ! అన్న చెప్పండి...
సాంబయ్య : ఎక్కడున్నావు...? నీతొ చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నన్ను కలవడానికి అవుతుందా.?
సూర్యనారాయణ : తప్పకుండా అన్న. ఎక్కడికి రమ్మంటారు?
సాంబయ్య : ఇంతకి నువ్వు ఎక్కడున్నావు...?
సూర్యనారాయణ : గన్నవరం దగ్గర నా ఫార్మ్ హౌసులొ..
సాంబయ్య : అయితె అక్కడె ఉండు. నేనిప్పడె విమానాశ్రయం నుంచి బయలుదేరా. నేనె అక్కడికి వస్తా..
సూర్యనారాయణ : సరె అన్న..
సూర్యనారాయణ ఫోన్ పెట్టగానె తన ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఎవరా అని పైన బాల్కని నుండి చూస్తె ఆ వచ్చింది సాగర్...
తనని చూడగానె సూర్యనారాయణకి ప్రాణం లేచ్చొచ్చింది. వెంటనె క్రిందకి దిగి సాగర్ ని కలుసుకున్నాడు.
సూర్యనారాయణ : వచ్చేవా సాగర్. నీకు చాలాసార్లు కాల్ చేశాను కాని నీ ఫోన్ అస్సలు కలవలేదు.
సాగర్ : మారేడుమిల్లి వెళ్ళాను అక్కడ సిగ్నల్సు లేవు. ఇంతకి మీరు ఎలా ఉన్నారు.?
సూర్యనారాయణ : చూస్తున్నావుగా. ఊళ్ళొ ఉంటె నా ఇంటిపై దాడి చేస్తున్నారు అని ఇక్కడ ఉంటున్న.
సాగర్ : అసలు ఏం జరిగింది సార్. మీ మీద హత్య నేరం ఆరోపించడం ఏంటి?
సూర్యనారాయణ : ఏమొ తెలియదు సాగర్. ఆ రోజు భోజనానికని తనని నా ఇంటికి పిలిచాను. కొంచెం తినగానె హఠాత్తుగా గుండె పట్టుకొని నేలమీద కూలబడ్డాడు. వెంటనె డాక్టర్ ని పిలిచెలోపు తను చనిపోయాడు.
సాగర్ : ఇంతకి సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎవరు చెప్పారు. ?
సూర్యనారాయణ : ఎవరు చెప్పారొ తెలియదు కాని 15 నిమిషాల్లొ అక్కడికి చేరుకున్నారు. కూడా పత్రికల వాళ్ళని తెచ్చారు.
సాగర్ : ఆయన చనిపోయిన 15 నిమిషాలకి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారా..? ఎక్కడొ తేడ కొడుతుంది.
సూర్యనారాయణ : నువ్వు అంటుంటె నాకు అలాగె అనిపిస్తుంది. చూస్తుంటె నన్ను ఎవరొ కావాలని ఇరికించినట్టుగా ఉంది.
సాగర్ : నాకు అదె అనుమానంగా ఉంది.
సూర్యనారాయణ : సాగర్ నువ్వె ఎలాగైన నన్ను ఈ కేసు నుంచి బయట పడేలా చూడు. నిన్ను తప్ప నేనింక ఎవ్వరిని నమ్మలేను.
సాగర్ : మీరేం కంగారు పడకండి నాకు వీలైనంత వరకు ప్రయత్నిస్తాను.
వీళ్ళిద్దరు హాల్లొ కూర్చొని మాట్లాడుకుంటుండగా. పార్టీ ప్రెసిడెంటు సాంబయ్య వచ్చాడు.
సూర్యనారాయణ : రండి అన్న...
సాంబయ్య : అరె సాగర్ నువ్వా...? ఎప్పుడొచ్చావు?
సాగర్ : ఇవాళ పొద్దున్న వచ్చాను..
సాంబయ్య : సరైన సమయానికి వచ్చావు. ఇప్పుడు నేను చెప్పబోయె విషయం నువ్వు కూడా వినాలి.
సాగర్ : ఏంటి సార్ అది.?
సాంబయ్య : ఇక్కడ కాదు పైన గదిలోకీ పదండి. మన ముగ్గురం మాట్లాడుకునేది ఎవరు వినకూడదు.
ముగ్గురు కలిసి పైన గదిలోకి పోయి తలుపేసుకున్నారు.
సూర్యనారాయణ : ఇప్పుడు చెప్పండి అన్న. ఏంటి అంత ముఖ్యమైన విషయం.?
సాంబయ్య : పార్టీ పని మీద ఢిల్లిలొ ఉన్న మన ఏం. పి (MP) రాఘవరావుని కలవడానికి వెళ్ళా. తనతొ మాట్లాడుతున్నప్పుడు నాకొ విషయం తెలిసింది.
సాగర్ : ఏంటది. ?
సాంబయ్య : ఒక విషయం చెప్పు సాగర్. ఇంత కాలం నిన్ను విజయవాడ లేద గుంటూరు చుట్టు ప్రక్కల తప్పించి వేరె ఇంకెక్కడికైన ట్రాన్సఫర్ అయ్యావా?
సాగర్ : లేదు నా మీద ఉన్న అభిమానంతొ దేవేంద్ర గారు సూర్యనారాయణ గారు కలిసి నన్ను దూరంగ వెళ్ళనియ్యకుండా ఈ చుట్టు ప్రక్కల ఉండేలా చేశారు.
సాంబయ్య : ఎవరి సాయంతొ?
సాగర్ : ఏం. పి (MP) రాఘవరావు గారు పలుకుబడితొ.
సాంబయ్య : ఆయన ఊరికనె వీళ్ళు చెప్తె చేస్తాడా?
సాగర్ : చెయ్యడు పార్టీ పెద్దలు లేదా ముఖ్యమంత్రి గాని హోమ్ మంత్రి గాని చెప్తె చేస్తాడు.
సాంబయ్య : ఎంత పార్టీ ప్రసిడెంట్నైనా. నేను ముఖ్యమంత్రికి చెప్పకుండా అయితె చెయ్యను. నీ వల్ల పార్టీకి లాభం ఉంది కాబట్టీ. ముఖ్యంగా విజయవాడ చుట్టప్రక్కల నియోజికవర్గాల్లొ ఇన్నేళ్ళు మన పార్టీయె గెలవడంలొ నీ పాత్ర కూడా ఉంది కాబట్టి నిన్ను దూరంగ వెళ్ళనియ్యకుండా కేంద్రంలొ మన పార్టీ పలుకుబడి ఉపయోగించి దగ్గరగా ఉంచాం.
సాగర్ : ఇప్పుడు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు.?
సాంబయ్య : ఇంతకాలం నిన్ను ఇక్కడ ఉంచిన వాళ్ళు చెప్పకుండానె నిన్ను రాజమండ్రికి ట్రాన్ఫర్ చేశారు అంటావా?
సాగర్ : అంటె మీ ఉద్దేష్యం ముఖ్యమంత్రి మరియు హోమ్ మంత్రి ఇద్దరు కలిసి నన్ను ట్రాన్సఫర్ చెయ్యాలనె నిర్ణయం తీసుకున్నారా?
సాంబయ్య : అవును..
సాగర్ : నేనింకా నా పై అధికారులకి దేవేంద్ర గారిని మరియు సూర్యనారాయణ గారిని కలిపినందుకు కోపంతొ ఇక్కడి నుంచి పంపించారి అనుకున్నానె. అంటె వాళ్ళ వెనకున్నది సీ.యం మరియు హోమ్ మంత్రా?
సూర్యనారాయణ : ఏంటి సాగర్ మా ఇద్దరిని కలిపినందుకు నిన్ను ట్రాన్సఫర్ చేశేరా? మరి మాకెందుకు చెప్పలేదు.?
సాగర్ : వాళ్ళ ఉద్దేష్యం ఏంటొ తెలుసుకుందామని ఆగాను. కాని వాళ్ళ వెనుక వీళ్ళద్దరు ఉన్నారని అనుకోలేదు. ఆయన వీళ్ళిద్దరు కలవడం పార్టీకి మంచిదెగా. అటువంటప్పుడు నా మీద ఎందుకు కోపం?
సాంబయ్య : ఎందుకంటె వీళ్ళు కలవడం వాళ్ళకిష్టం లేదు. వీళ్ళు విడిగా ఉంటూ గొడవ పడుతూ ఉండడమె వాళ్ళకి కావాలి.
సూర్యనారాయణ : ఎందుకు..?
సాంబయ్య : ఎందుకంటె మీరిద్దరికి ప్రజలలొ చాలా మంచి పేరు ఉంది. గత 20 ఏళ్ళుగా విజయవాడ మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలని మీ గుప్పెట్లొ పెట్టుకున్నారు. ఏదొక రోజు కచ్చితంగా మీరు వాళ్ళనె మించిపోతారని.  అందుకె మీ బలం తగ్గించడం కోసం మిమ్మల్ని విడదీశారు..
సూర్యనారాయణ : అంటె దేవేంద్ర మరణం వెనుకు కూడా...?
సాంబయ్య : అదె నా అనుమానం..
సాగర్ : వాళ్ళు మాత్రమె కాదు…
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)