Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
విప్లవ ఉగాది


రచన: అల్లు సాయిరాం


భారతికి ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పట్నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగింది. అమ్మమ్మగారింట్లో ఉగాది రోజున అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి, ఉగాది రోజు తెల్లవారుజామున నుంచి యింటి ముందు ముగ్గులు వేసేవాళ్ళతో, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేవాళ్ళతో, అలంకరణాలు చేసేవాళ్ళతో, ఇంట్లో పని చేసేవారితో, ఊరందరికి పంచడానికి సిద్దపరిచిన రెండు, మూడు బస్తాలతో తోటల్లో కాసిన మామిడికాయలు, వేపపువ్వులు, లేత పనసకాయలు, కొత్త బెల్లం కుండలు తాతయ్య దగ్గరుండి పంచుతుంటే తీసుకోవడానికి వచ్చేవాళ్లతో, మామిడితోటలో చెట్లకు పెద్దతాళ్ళతో ఉయ్యాల కట్టి ఊగేవాళ్ళతో సందడిగా ఉండేది. యిలా ఉగాది పండుగ భారతి దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. మామిడితోటలో చెట్లు ప్రతి యేటా ఉగాదికి తప్పకుండా గంపెడుల కొద్ది కాయలు కాస్తుండడం వలన  తోటని ఉగాది మామిడితోట అని పిలిచేవారు.  మామిడితోటని అమ్మమ్మ భారతి తల్లికి పుట్టింటి పెళ్లి కానుకగా యిచ్చింది. వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతి పట్టుబట్టి మరి అమ్మ దగ్గర నుంచి తన పుట్టింటి పెళ్ళి కానుకగా తీసుకుంది. భారతి పెళ్ళయిన తరువాత కుడా ఉగాది పండుగ అలానే జరుపుతూ వస్తుంది. 


 భారతి కాస్త భారతమ్మ అయ్యి పాతికేళ్ళవుతుంది. భర్త సూర్యప్రకాశరావు ఉద్యోగ రీత్యా, కొడుకు కుమార్ చదువుల దృష్ట్యా పల్లెటూరి నుంచి పట్టణానికి మారి మూడేళ్లవుతుంది. వయసు మళ్ళుతున్న కుడా భారతమ్మకి ఉగాది అంటే మక్కువ పోలేదు. ఈసారి ఉగాది యిలా చేద్దాం, అలా చేద్దాం అంటూ ఎన్నో ఊహలతో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తుంది. ఈసారి ఉగాది రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు రాయడానికి రకరకాల రంగులు, పదిహేను వరుసల పదిహేను చుక్కలతో ముగ్గులు, డిజైన్లలో ముందస్తు సన్నాహాలు చేస్తుంది. 


 ఎంతగానో ఎదురుచూస్తున్న ఉగాది రానే వచ్చింది. భారతమ్మ తెల్లవారుజాము మూడు గంటలకు హడావిడిగా నిద్రలేచేసి, గబగబా తలంటుకునేసి, కుమార్ ని, సూర్యప్రకాశరావుని నిద్ర లేపేసి, పడుకున్న కోడిని సైతం లేపి కూత అరిపించేసింది. గబగబా యింటి ముందుకు వచ్చేసి "శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు" అని రంగురంగుల ముగ్గు పెడదామనుకుని చూస్తుంది. తండ్రికొడుకులిద్దరు భారతమ్మ భాధ పడలేక, నిద్రముఖాలతో చెరో ప్రక్కన చెరో లైటు పట్టుకుని నిల్చుని చూస్తున్నారు. ఒక వరుసకి ఒక అడుగు చొప్పున చూసిన కుడా పదిహేను వరుసల ముగ్గుకి పదిహేను అడుగుల స్థలం అవసరం పడుతుంది. ఉన్నదే పది అడుగుల రోడ్డు. అందులో సగం ఎదురింటివాడిది, సగం పక్కింటివాడిది. ఉన్న స్ధలంలో కనీసం "శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు" అని రాయడానికి కుడా ఇరుకుసందుల వీధుల్లో స్థలం సరిపోవట్లేదు. అయినా, భారతమ్మ పట్టువదలకుండా పెద్ద ముగ్గులు వేస్తూ, చెరిపేస్తూ, మళ్ళీ మార్చి మార్చి ఎన్ని సార్లు ముగ్గులు వేసినా లాభం లేకుండాపోయింది. చుక్కల ముగ్గు సంగతి ఏమోగానీ, ముగ్గులు వేయటానికి మాత్రం భారతమ్మకి చుక్కలు కనిపించాయి. ముందస్తు సన్నాహాలు చేసుకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారతమ్మ ఆశలు నీరుగారిపోయాయి.


భారతి! నువ్వు ఎన్నిసార్లు వేసినా, నీ ముగ్గులకి యి ప్లేస్ సరిపోదు. అనవసరంగా మాకు నిద్ర పాడుచేసేశావు! అని సూర్యప్రకాశరావు అంటే, కుమార్ నవ్వుతూ


అవునమ్మ! ఒక పని చేద్దాం.  ముగ్గులు వేసిన పేపర్ యిక్కడ అంటించేద్దాం! నీ కోరిక తీరిపోతుంది! అని అంటూ యిద్దరూ మెల్లగా నవ్వుకుంటున్నారు.


అసలే అనుకున్న ముగ్గులు రాక మండిపోయి ఉన్న భారతమ్మ "ఆఁ! మీకు ఆకలి వేసినప్పుడు, భోజనం అని పేపర్ మీద రాసేసి పెట్టేస్తాను. మీ ఆకలి తీరిపోతుంది! ఏమంటారు! అని అనేసరికి, తండ్రి కొడుకులిద్దరూ నవ్వు ఆపేసి, యిప్పుడు అమ్మని కెలకకూడదని, నోరు మూసేసి నవ్వుకుంటున్నారు.


ఎంత ప్రయత్నించినా సరిగ్గా కుదరకపోయేసరికి భారతమ్మ సర్లే! ఎంతైనా పల్లెటూరిలో చేసినట్టుగా పట్టణాలలో చెయ్యలేం కదా! ఇదే పల్లెటూరిలా ఖాళీ స్థలం ఉండి ఉంటే, యి భారతి వేసిన ఉగాది ముగ్గు చూసి ఆశ్చర్యపోయి నోళ్ళు తెరవాలి. మళ్ళీ యి భారతి చేసిన ఉగాది పచ్చడి తినడానికి నోరు మూస్తారు.  పట్టణానికి వచ్చి సంవత్సరాలు కావస్తున్నా, కనీసం పక్కింటివాళ్లు ఎవరో కుడా తెలియట్లేదు. ఎంతైనా,  రోజులు మళ్ళీ వస్తాయా ఏంటి!" అని అదినిష్టూరంగా నిట్టూరుస్తూ ముగ్గు తంతు కానిచ్చేస్తుంది. చూస్తుండగానే సూర్యుడు పిలవని అతిథిలా వచ్చేస్తున్నాడు. "ఇంకా ముగ్గు దగ్గర ఉంటే, మరి ఉగాది పచ్చడో! మామిడికాయలు తెచ్చుకోవాలి కదా!  కాలంలో, మామిడికాయల కోసం వూరిలో మన యింటి గడప తొక్కనివాళ్ళే ఉండేవాళ్ళు కాదు!  రోజులే వేరు!" అంటూ రెండోసారి నిట్టూరుస్తూ, కుమార్ ని పిలిచి మామిడికాయల కోసం మార్కెట్ కి పంపించింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
తండ్రి కొడుకులకి ఉగాది రోజున భారతమ్మ నిట్టూర్పులు కొత్తేం కాదు. సూర్యప్రకాశరావు కుడా తలంటుకుని వచ్చి, టివిలో రాశిఫలాలు చెప్తుంటే ముందు కూర్చున్నాడు. అనుకుని, జరగని ప్రతి విషయానికి ఇదే  కాలంలో అయితే..! అని భారతమ్మ నిట్టూర్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో శుభాకాంక్షల సందేశాలు వస్తూనే ఉండడంతో మొబైల్ ఫోన్లు మ్రోగుతునే ఉన్నాయి. ఉగాది చుక్కలముగ్గు ఆశ ఎలాగో తీరలేదు. కనీసం ఉగాది పచ్చడి అయినా అనుకున్నట్లుగా చేద్దామని తహతహలాడిపోతోంది. మామిడికాయల కోసం వెళ్లిన కుమార్ ఎంతకీ రావట్లేదు. కుమార్ రాక కోసం వంటింట్లోకి, వాకిట్లోకి  వందసార్లు తిరిగిందో, భారతమ్మ కాలి పట్టీల శబ్ధాలు వింటున్న సూర్యప్రకాశరావుకే తెలియాలి. ఇటువంటి సందర్భంలో భారతమ్మని గాని కదిపితే, చిన్నసైజు కందిరీగలా ఉంటుంది. అనుభవపూర్వకంగా భారతమ్మ గురించి తెలుసు కాబట్టి, సూర్యప్రకాశరావు ఒక్కసారి కూడా భారతమ్మని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. 



 సమయం తొమ్మిది కావస్తోంది. "ఏమండోయ్! కుమార్ ఎప్పుడో వెళ్లాడు. ఇంకా రాలేదేంటండీ? మామిడికాయలు తెమ్మంటే, తోట మొత్తం దులిపేసి తీసుకొచ్చేస్తున్నాడా ఏంటి! ఒకసారి కుమార్ కి ఫోన్ చెయ్యండి!" అని యింటి మెట్ల మీద నిలబడి రోడ్డు వైపు చూస్తూ అంది భారతమ్మ. "ఫోన్ ఎందుకులే! నువ్వు అన్నట్టు తోటలో ఉన్న కాయలు మొత్తం తేవాలంటే బరువు ఎక్కువగా ఉండడం వలన తీసుకురావడానికి టైం పడుతుందేమో! నన్ను వెళ్లి చూసి రమ్మంటావా?" అని బయటికి వెళ్లడానికి యిదే అదునుగా సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ అడిగాడు సూర్యప్రకాశరావు. గ్యాస్ పొయ్యి మీద వంటచేసిన కూడా నిప్పులు వస్తాయా అన్నంత ఎర్రగా, భారతమ్మ ఒక చూపు చూసి "అప్పుడనగా వెళ్లిన కొడుకు యింకా రాలేదు. ఇప్పుడు తండ్రి వెళ్తే ఎప్పుడు వస్తాడో! ఏమక్కర్లేదు! కుమార్ వచ్చేస్తాడులే!!" అని అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సూర్యప్రకాశరావు కూర్చుని యధావిధిగా టివిలో రాశిఫలాలు చూస్తున్నాడు. 


  సమయంలో "ఆహ బావ! బంగారం లాంటి మా చెల్లెమ్మ నీ పక్కన ఉండగా, ఇంకా నువ్వు రాశిఫలాలు ఎందుకు చూడాలి బావా!! అసలు మా చెల్లెమ్మకి అన్నపూర్ణ అని పేరు పెట్టాల్సింది. మా చెల్లెమ్మ నేతితో చేసిన పెసరట్టు వాసన వీధి చివర వరకు వస్తుంది!" అని వచ్చాడు ప్రసాద్. "అవును బావ! అట్టు మాడిపోతే, వాసన ఎక్కువ వస్తుందిలే! ఉదయం నుంచి వినలేకపోతున్నాను. అదేఁ తినలేకపోతున్నాను!" అని నిజం చెప్పడానికి ప్రయత్నించి, కొంపదీసి భారతమ్మ వినలేదు కదా అని వంటింటి వైపు చూస్తూ అన్నాడు సూర్యప్రకాశరావు.


"ఊరుకో బావ! నువ్వు ఎప్పుడు అలాగే అంటావ్! మా చెల్లెమ్మ ఎక్కడ? ఉగాది రోజున మా చెల్లెమ్మ చేతి పచ్చడి తినడానికే పరిగెత్తుకుంటూవచ్చాను!" అని అంటూ "చెల్లెమ్మ! భారతి!!" అని పిలుస్తున్నాడు ప్రసాద్. "బావ చెప్పింది విను! ఇప్పుడు మీ చెల్లెమ్మని పిలవద్దు బావ!!" అని సూర్యప్రకాశరావు చెప్తుండగానే, కుమార్ వచ్చేశాడెమోనని వేగంగా వచ్చింది భారతమ్మ చేతిలో ఎర్రని అట్లకర్రతో. "చెల్లెమ్మ! మాంచి ఆకలి మీద ఉన్నాను. ముందుగా నీ చేతి పచ్చడి తిన్నాకే, మిగతావి పెట్టు!" అంటూ చేతులు కడుక్కుని కూర్చున్నాడు.


"ఏంటి పెట్టేది! పచ్చడి చేస్తే కదా!!" అని అన్నాడు సూర్యప్రకాశరావు నోరు ఆపుకోలేక. "ఏంటి యింకా చెయ్యలేదా!!" అని ప్రసాద్ సాగదీసేసరికి, ఉదయం నుంచి ఎక్కడ చూపించకుండా ఆపుతున్న భారతమ్మ క్రోధం బయటికొచ్చేసింది.


"అవును! చెయ్యలేదు. కుమార్ ఉదయమనగా వెళ్ళాడు. తొమ్మిది దాటిపోతున్నా ఇంకా రాలేదు. ఏమైందో?" అని అంటుండగానే వచ్చాడు కుమార్. "అదిగో! మేనల్లుడు వచ్చేశాడు. నూరేళ్ళు!" అంటూ చెప్పబోయిన ప్రసాద్ లేచి చూస్తున్నాడు. కుమార్ రాగానే కడిగి పారేద్దామని ఆత్రంగా దగ్గరకు వచ్చిన భారతమ్మ "ఏమైంది? ఏమి యింతసేపు??" అని నోట్లోకి వచ్చిన మాటల్ని మింగేసి ఆశ్చర్యంగా చూస్తుంది. కుమార్ అవతారం చూస్తుంటే, ఏదో పెద్దహీరో సినిమాకి మొదటిరోజు టికెట్ల కోసం లైన్లో పడి నలిగిపోయినట్లుగా ఉన్నాడు. 


 "ఏమైంది నాన్నా?" అని అడిగాడు సూర్యప్రకాశరావు. కుమార్ నీళ్ళు తాగుతూ 


"మామిడికాయలు కొనడానికి క్యూ లైన్ కిలోమీటరు ఉంది అక్కడ!" అని గుటకలు మింగుతూ చెప్పాడు.


కుమార్ తెచ్చిన సంచిలో ఉన్న నలిగిపోయిన మామిడి ఆకులు, కాయలు భారతమ్మ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ "బంగినపల్లి మామిడికాయలేనా! ఏంత? ఇదేంటి కుమార్! రెండు మామిడికాయలే ఉన్నాయి!" అని అడిగితే "యాభై రూపాయలు!" అని నీళ్ళు తాగి కాస్త స్థిమితపడి చెప్పాడు కుమార్.


"రెండు కాయలు యాభై రూపాయలా! చాలా ఎక్కువ!!" అని పెద్దగా నోరు తెరిచి అడిగింది భారతమ్మ. "అవును! అందుకే, ఒక్క మామిడికాయ 50 రూపాయలు అమ్మ!" అని చెప్పాడు కుమార్.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
"నీకు బొత్తిగా బేరం ఆడడమే రాదురా కుమార్.  కాయలు కుడా ఏం బాగాలేవు. మొత్తం నల్లమచ్చలు ఉన్నాయి. కొంచెం తగ్గించి అడగలేకపోయావా? ఎప్పుడూ మెత్తగా ఉంటే పనులు అవ్వవు!" అని తన కొడుకు మృదుస్వభావాన్ని ఉద్దేశించి అంది భారతమ్మ.



"అది జరిగిందమ్మా! బేరం ఆడడం నాకు రాకపోయినా, నీకోసం ధైర్యం చేసి అడిగాను. కొంటే కొను. లేకపోతే, పక్కకి వెళ్ళు. నా బేరం పోతుంది అని ముఖానికి పెట్టుకున్న మాస్క్ మూసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళపోమన్నాడు కోపంగా!" అని విడమర్చి చెప్పాడు కుమార్.


సూర్యప్రకాశరావు కుర్చీలో నుంచి లేచి కుమార్ దగ్గరికి వస్తూ "కుమార్! నీ తప్పు లేదులే. ఇప్పుడే యి క్రోధి నామ సంవత్సర రాశిఫలాలు టివిలో చూశాను నీది మేషరాశి కదా, ఆదాయం 8 వ్యయం 14. నాది కుంభరాశి ఆదాయం 14 వ్యయం 14. నీ బదులు నేను వెళ్లి ఉంటే బాగుండేదేమో!" అని శాస్త్రపరంగా విశ్లేషించి చెప్పాడు.


"నాన్న! నా అవతారం చూసిన తర్వాత కుడా, మీకు అంత నమ్మకం ఉందా! బజారులో మామిడికాయలకి యిప్పుడు ఉన్న గిరాకీకి, నేను వెళ్ళాను కాబట్టి, కనీసం నలిగిన చొక్కాతో అయినా తిరిగి వచ్చాను. మీరు వెళ్లి ఉంటే, అమ్మకి మామిడికాయలు కోసి ముక్కలు చేసే శ్రమ తగ్గి ఉండేది!" అని వాస్తవాన్ని వివరించి చెప్పాడు కుమార్.


"అల్లుడు చెప్పింది నిజమే బావ! బయట పరిస్థితి అలానే ఉంది. సంతోషం ఏంటంటే, కనీసం వేపపువ్వు అయినా ప్రస్తుతానికి మాములుగా దొరుకుతుంది. తరువాత ఏడాదికి అది కూడా బజారులో పెట్టి అమ్మేస్తారేమో! అని నవ్వుతూ అన్నాడు ప్రసాద్.


"తర్వాత ఏడాది వరకు ఎందుకు మామయ్య! యిప్పుడే అమ్ముతున్నారు. క్యూలో రెండుగంటలు నిలబడితే, యి రెండు కాయలైనా దొరికాయి. ఇవి కూడా బ్లాక్ లో కొనడానికి చాలామంది కాచుకుని ఉన్నారు అక్కడ. మీకు వద్దంటే చెప్పండి!" అని కుమార్ చెప్తుంటే ఆశ్చర్యపోయి ముగ్గురు ముక్కున వేలేసుకున్నారు.


"ఇప్పుడు యి లెక్కలు ఎందుకు?  కాయలు ముక్కలు చేసి పచ్చడి చెయ్యమ్మా!" అని వంటింటి వైపు చూస్తూ చెప్పాడు కుమార్.


"ఇంకేం పచ్చడి! ఇంత టైం అయినప్పుడే, సగం ఆశ పోయింది.  చిన్న మామిడికాయలు యాభై రూపాయలు అంటుంటే, యాభై రూపాయలనే ముక్కలు చేస్తున్నట్టుగానే ఉంది!" అంటూ నిరాశగా చెప్తూ సంచి వంటింట్లోకి తీసుకెళ్ళడానికి తీసి, అందులోని మావిడాకులను చూపిస్తూ "ఏంటి కుమార్! యి మావిడాకులు? ఒక చిగురు కూడా లేదు. అన్ని నలిగిపోయి, ముక్కలైపోయాయి. చెట్టెక్కి తెంపలేకపోయావా?" అని భారతమ్మ అడిగింది.


"ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా!  ఆకులు కూడా కొన్నాను!" అని కుమార్ చెప్తుంటే "ఏం రోజులు వచ్చాయిరా దేవుడా!" అని దిగాలుగా కుర్చీలో కూర్చుండిపోయింది భారతమ్మ. 


 "ఏమైందమ్మా! టైం అవుతుంది. నీచేతితో ఉగాది పచ్చడి చెయ్యమ్మా!" అంటూ కుర్చీలో కూర్చున్న భారతమ్మ దగ్గరకి వచ్చి కింద కూర్చుని అడిగాడు కుమార్.


"ఇంకేం ఉగాది!  ఆశ పోయింది!" అని ఏదో కోల్పోయినట్లు అంది భారతమ్మ.


"ఇప్పుడు ఏమైందని? పండుగపూట యి విచారం?" అని భారతమ్మని అలా చూడలేక అడిగాడు సూర్యప్రకాశరావు.


"ఇంకేం కావాలి? చిన్నప్పుడు ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలో ఆడుకున్న నా కొడుకు, ఈరోజున ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా, మామిడి ఆకులు కొనుక్కుని వచ్చానమ్మా అని చెప్తున్నాడు. అసలు యి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? అదే మన ఊర్లో ఉండి ఉంటే, చక్కగా ఉగాది ముందు రోజు సాయంత్రం ఊరంతా రామమందిరం దగ్గర చేరి పంచాంగాలు వినేవాళ్ళం. పురోహితుడు సంవత్సరంలో పడే వర్షాలు, ఎవరెవరికి ఎన్ని సున్నాలు ఉన్నాయో, ఇంకా చాలా విషయాలు చెప్పేవారు.


ఉగాది రోజు తెల్లవారుజామున లేచి, కొత్త బట్టలు వేసుకుని, కొత్త నాగలి కట్టి, ఎద్దులకి మెడలో కట్టిన గంటలు ఘల్లుఘల్లులాడించుకుంటూ వెళ్లి, పొలంలో నేలతల్లికి మొక్కి, దుక్కి దున్నేసి, మన మామిడితోట మీదుగా వచ్చేదారిలో మామిడికాయలు, చిగురాకులు, వేపపువ్వులు, పనసకాయలు, అరటిపువ్వు, అరిటాకులు తీసుకొచ్చేవాళ్ళు. మీకోసం మేం యింటిదగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలతో ఎదురుచూసేవాళ్ళం. మన దగ్గర ఉన్నది, పదిమందికి పంచుకుని, అందరం ఉగాది పచ్చడి చేసుకుని తినేవాళ్ళం. తోటల్లో పెద్ద పెద్ద చెట్లకి తాళ్లతో ఉయ్యాలలు కట్టి, చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా సంతోషంగా ఉయ్యాలలు ఊగుతూ, పండుగ చేసుకునేవాళ్లం. ఇది ఉగాది అంటే, మరి యిప్పుడు ఏలా ఉంది?" అని ఉద్వేగంగా భారతమ్మ చెప్తుంటే ముగ్గురికి ఒకసారి పాత రోజులు కన్నుల్లో మెదిలాయి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా, మన వూరి నుండి యిక్కడికి మారిపోదామన్నారు. వూరిలో మన యింటికి మామిడికాయలు అడగడానికి వచ్చిన వాళ్లతోనే సగం ఉగాది గడిచిపోయేది! వద్దు మొర్రో అని ఎంత నెత్తినోరు కొట్టుకుని చెప్పినా, వినకుండా ఒక్క చెట్టు కుడా మిగల్చకుండా మామిడితోట కొట్టేశారు. పోనీ,  ఉగాదికైనా మన ఊరు వెళ్లి, అక్కడ చేసుకుందామని చెప్తుంటే, యి తండ్రి కొడుకులకి ఉలుకులేదు. పలుకులేదు. ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి కావాలా?" అని లోపల ఉన్నదంతా చెప్పేసింది భారతమ్మ. అందరూ అప్పటి పరిస్థితులు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.



 సూర్యప్రకాశరావు మౌనం నుంచి తేరుకుని "భారతి! నీకు గుర్తుందో లేదో, నేను నీకో మాట యిచ్చాను. మనం ఎన్ని చెట్లు కొట్టించాల్సి వచ్చిందో, అంత కన్నా ఎక్కువ మొక్కలు తీసుకుని నాటుదామన్నాను.  మాట ప్రకారం, ఈరోజు సాయంత్రమే వెళ్లి, మామిడి మొక్కలు కొంటాం. ఎక్కడ కొట్టేశామో, అక్కడే నాటుతాం. నువ్వు ఏమంటావు బావా!" అని గబగబా చొక్కా తొడుక్కుని మొక్కలు కొనడానికి నర్సరీకి వెళ్లడానికి బయలుదేరుతూ అన్నాడు.


ప్రసాద్ ఉత్సాహంగా "శుభస్య శీఘ్రం! నువ్వు మాట యిచ్చావంటే, అది సగం పని అయిపోయినట్టే! పదా యిప్పుడే వెళ్దాం! ఇప్పుడు నాటితే, వెంటనే కాకపోయినా, వచ్చే రెండు, మూడు సంవత్సరాలకైనా కాయలైనా తినొచ్చు. ఉగాది రోజున వేసే యి మొక్కలు ఉగాది తోటగా మారి మళ్లీ పూర్వవైభవం రావాలి! చెల్లెమ్మ చెప్పినట్టుగా తరువాత తరాలకు మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయి.  ప్రాంతంలోనైనా ఉండే సంస్కృతులు, సంప్రదాయాలు వారు మాట్లాడే మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మనమందరం మన తల్లి లాంటి తెలుగు భాషని పక్కన పెట్టేస్తే, యింకా పండుగలు ఎలా జరుపుకోవాలో ఎలా తెలుస్తుంది. ఈతరం పిల్లల దౌర్భాగ్యం ఏంటో మరి, వాళ్లకి పండుగ అంటే తెలియదు. జాతర అంటే అర్ధం కాదు. సంస్కృతులు, సంప్రదాయాలు గురించి యింకా చెప్పనక్కర్లేదు.


పిల్లల్ని అలా తయారుచేస్తున్నారు యితరం తల్లిదండ్రులు. అవన్నీ పిల్లలకి చెప్పాలంటే, తెలిసినవాళ్లు టైం లేదంటారు. తెలియనివాళ్లు అవసరం లేదంటారు. మొత్తానికి ఒక జాతిని నాశనం చేసేస్తున్నారు! మనది కాని ఆంగ్ల సంవత్సరాది జరుపుకోవడానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి పన్నెండు వరకు పడుకోకుండా ఉండి, కేకులు కోసుకుని, పడుకున్నవాళ్లకి ఫోన్ చేసి నిద్ర లేపేసి, శుభాకాంక్షలు నేను ముందు చెప్పానంటే, నేను ముందు చెప్పానని పోటీ పడతారు. మరి తెలుగు సంవత్సరాది ఉగాది రోజు తెల్లవారుజామున లేచి పండుగ జరుపుకోవడానికి,  ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో! మన మూలాలు మనమే మరిచిపోతే ఎలాగా! నిజం బావ! యి వైఖరి యిలా కొనసాగితే, భవిష్యత్తు తరం ఏమైపోతుందో అని ఊహించుకుంటేనే, భయమేస్తోంది. అందుకే, మెల్లమెల్లగా పూర్వవైభవం మళ్లీ తీసుకురావడానికి, ఏదో ఉడతాభక్తిగా నా వంతుగా నేను మా తెలుగుతల్లి కళా సాంస్కృతిక సంస్థ తరఫున సంస్కృతులు, సంప్రదాయాలు తెలియాల్సిన సందర్బాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.


మళ్లీ, పిలిచి సంస్కృతులు, సంప్రదాయాలు గురించి ఉపన్యాసాలు యిస్తామంటే, ఎవరు రారు. అందుకు ముగ్గులు, కవితలు, కథలు, పాటలు, నాట్య ప్రదర్శన పోటీలు పెట్టాలి. అలా యిసారి పెట్టిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈరోజు సాయంత్రం బహుమతులు ప్రదానం చెయ్యాలి. చెల్లెమ్మ చేతి ఉగాది పచ్చడి తినేసి వెళ్దామని వచ్చాను. తినడానికి ఉగాది పచ్చడి లేకపోయినా, ఉగాది రోజున మన మంచి అనుభవాలను, చేదు జ్ఞాపకాలను పంచుకున్న యి సందర్భం, ఉగాది పచ్చడి తిన్నంత కమ్మగా అనిపిస్తుంది. మా తెలుగు తల్లి కళా సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో యిరోజు సాయంత్రం జరగబోయే బహుమతుల ప్రదాన కార్యక్రమానికి మీ ముగ్గురు వచ్చి, మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది. ఏదో మనకి తెలిసినది తర్వాత తరాలకు మన వంతుగా అందించడానికి ప్రయత్నం చేద్దాం!" అని చెప్పాడు.


తరువాత తరాలకు వారసత్వంగా కుమార్ ఉప్పొంగిన ఉత్సాహంతో వస్తాం మామయ్య! యిది మా తరాలకు ఎంత అవసరమో, మీరు యిప్పుడు చెప్తుంటే తెలుస్తోంది. మా కుర్ర బ్యాచ్ మొత్తాన్ని తీసుకొస్తాను. మీ వారసుడిగా నేను తరువాత తరాలకు అందించే ప్రయత్నం చేస్తాను! అమ్మ! నువ్వు పచ్చడి తొందరగా చెయ్యమ్మ! మామయ్య, నేను తొందరగా తినేసి బయల్దేరుతాం! ప్రతి సంవత్సరం నీ ఉగాది పచ్చడి తినడానికి వచ్చే అభిమానులు వచ్చే టైం అవుతోంది. తొందరగా చెసేయ్యమ్మ! అని కార్యసాధకునిలా చెప్పాడు. ముగ్గురి మాటలు వింటూ భవిష్యత్తు మారబోతుందనే ఆనందబాష్పాలు నిండిన కళ్లతో భారతమ్మ ఆనందంగా వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే, అన్ని రకాల రుచులు సిధ్ధంగా ఉంచింది. కుమార్ తీసుకొచ్చిన రెండు మామిడికాయలు తీసి, ముక్కలుగా కోసి, చిటికెలో ఉగాది పచ్చడి చేసి నాలుగు కప్పుల్లో తీసుకొచ్చింది. నలుగురు నవ్వుతూ తిన్నారు.


 "నీ ఉగాది పచ్చడికి అభిమానులు చూడమ్మా! వాట్సాప్ లో తెగ మెసేజ్లు పెట్టేస్తున్నారు. నువ్వు పచ్చడి పంపిస్తావని!! అని మొబైల్ చూస్తూ నవ్వుతూ అన్నాడు కుమార్. ఏంటి పంపించేది పచ్చడి! రెండు మామిడికాయలు తొక్కలతో కలిపి గీసి గీసి గీస్తే యి మాత్రం అయ్యింది. నీళ్ళు కలిపి ఉగాది పచ్చడి బదులు ఉగాది పానకంలా యిచ్చేయడమే! అని భారతమ్మ నిట్టూరుస్తూ అంది. ఎందుకులేమ్మా! నువ్వు చేసిన ఉగాది పచ్చడి ఫోటోలు తీసి వాట్సాప్ లో పంపించేశాను. తినేస్తారులే!" అని నవ్వుతూ అన్నాడు కుమార్. అందరూ నవ్వారు. 
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
అక్షర



కథలు చెబుతా.. కథలు చెబుతా.. . అన్నావంటే బొక్కలు తీసి కుక్కలకేస్తా.. కహానీలు కూడు పెట్టవు.. కవిత్వం కూడు పెట్టదు. అవన్నీ అదేదో మైకం లో పడేసి మనిషిని పిచ్చివాడిని చేస్తాయి.. ఆదర్శాలు, ఆధ్యాత్మికతల వలయంలో కవుల మనసులను పడేసి రఫ్ ఆడుకుంటాయి.. కవులను నిస్సహాయులను చేస్తాయి. మనసున్న కవికి మరణమే శరణం తప్ప మరేం లేదు. ఇటువంటి విషయాల్లో ఎవరి అనుభవం వారిది. నా అనుభవం ఇది. 



 నిప్పులాంటి నిజం నిప్పు లాగ చెప్పాలంటే కొంచెం ఆలోచించేవాడికి లెక్కల్లో గానీ సైన్స్ లో గానీ ఒక సూత్రం కనిపెట్టాలంటే చాలా చాలా కాలం పడుతుంది. ఇక సూత్రం వెలుగు లోకి రావడానికి కొన్ని తరాలే పట్టవచ్చు. అదే కొంచెం ఆలోచించేవారికి కవిత్వం వ్రాయడం క్షణంలో పని. అయితే వారు వ్రాసిన కవిత్వం ఎంతమంది చదువుతారు అన్నది తర్వాత విషయం. 



ఒకప్పుడు ఎక్కువ శాతం ఎవరు వ్రాసిన కవిత్వం వారే చదువుకునేవారు. చరవాణులు, వాట్సాప్ లు వంటివి వచ్చాక ఒక కవి వ్రాసిన కవిత్వం మరో నలుగురు చదివి లైక్ లు కొడుతున్నారు.. చదువుతున్నారా? లేదా? అనేది తర్వాత విషయం. లైక్ లు మాత్రం అటు నాలుగు ఇటు నాలుగు. అంతే.. అయితే నలుగురు లైక్ లు కొట్టినంత మాత్రాన కవిత్వం వ్రాసిన వానికి నాలుగు వందల రూపాయలు వస్తాయనుకోవడం మాత్రం అవివేకం. 



  సత్యాన్ని గమనించని అక్షర, చేతిలో చరవాణిని పెట్టుకుని కథలంటూ, కవితలంటూ టైమంతా వేస్ట్ చేస్తుంది. దానికి టెంత్ ఆఫియర్ ఎగ్జామ్ లో లెక్కల్లో జీరో వస్తే తెలుగు లో రెండు జీరోలు వచ్చాయి. 



అది తెలుగు లో దాని పేరు అక్షర అని వ్రాసుకోవడం చేతకాదు. అక్షర వ్రాయమంటే "అక్కా రా" అని వ్రాస్తుంది. అలాంంటిది టెంత్ పబ్లిక్ లో తెలుగు లో 99 మార్కులు, లెక్కల్లో వంద మార్కులు తెచ్చుకుంది. ఇన్ని మార్కులు ఎలా వచ్చాయంటే, మాస్.. మాస్.. ఊరమాస్.. సూపర్ రిజల్ట్ చూడు. రిజల్ట్ వెనుక గ్రౌండ్ చూడకు అంటుంది. 



 అలాంటిది ఇంటర్ తప్పాక చరవాణిలో చెడామడా కథలు, కవితలు రాసి పారేస్తుంది. నడుమ రెండు వేలు ఖర్చుపెట్టి అదేదో సాహిత్య సంస్థ దగ్గరకు వెళ్ళి సన్మానం కూడ చేయించుకొచ్చింది. దాని లెక్క అణా కోడికి ఆరణాల మషాల అన్నట్లు ఉంటుంది. 



అక్షర తండ్రి రెండు చేతులతో కాస్త బాగానే సంపాది స్తున్నాడు. ఏదో కొంచెం పైరాబడి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అతని పేరు చలపతిరావు. 



చలపతిరావు కు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి అక్షర. రెండవ అమ్మాయి దీప్తి. అక్షర గజనీ మహ్మద్ దండయాత్ర చేసినట్లు ఇంటర్ లో ఒకటికి నాలుగు సార్లు తప్పి చరవాణిని నమ్ముకుని కవిత్వం వ్రాయసాగింది. 



 దీప్తి అక్షరకున్నంత అక్షర జ్ఞానం కూడ లేదు కానీ పరులను నమ్ముకుని మెడిసిన్ వరకు వచ్చేసింది. 
 చలపతిరావు అక్షర కు పెళ్లి సంబంధాలు వెదకటం ముమ్మరం చేసాడు. కానీ సంబంధం కుదరలేదు. అందుకు ఒక కారణం అక్షర కవిత్వం. 



 కవిత్వం వ్రాసే మగాడికి పిల్లనివ్వడం, ఆడదాన్ని కోడలుగ తెచ్చుకోవడం కోరి కోరి కొరివిని తెచ్చు కోవడమే అవుతుంది. 
 ఎందుకంటే కవిత్వం వ్రాసేవారి కొందరి హృదయాలు సున్నితంగా ఉంటాయి. ప్రతి చిన్న దానికి విపరీతంగా స్పందిస్తారు. వారి దృష్టి మనీ మీద కంటే వారు వ్రాసే కవిత్వం మీదనే ఉంటుంది. అలాంటి వారిని బయటవారే కాదు బంధువులు కూడ మోసం చేయడం సులభం. 



అయినా రోజుల్లో మంచి కవిత్వం వ్రాసేవారికి ఏపాటి ఆదాయం వస్తుంది? వారి ఆదాయం వారి సెల్ఫోన్ ఛార్జింగ్ కు కూడా సరిపోదు. ఇక మరి కొందరు సరస సాహిత్యం, యువ సాహిత్యం అంటూ శృతి మించని శృంగారం అంటూ అంగాంగ వర్ణన చేస్తూ వారి మెదడుని ఆడదాని అంగాల దగ్గరే ఉంచుతారు.
 
అలాంటి వారు వారి వారితో కాపురం చేసేదానికంటే ఎక్కువ వారి కవిత్వం తో కాపురం చేస్తారు. అవసరమైతే కాముని కోసం వావివరుసలు మరిచి పోతారు. అదేమిటంటే పురాణాల్లోని మాధవి కథలు, చిత్రాంగి కథలు చెబుతారు. మన పురాణ కథల ఉదాహరణలు చెడ్డ వారిని సపోర్ట్ చేసినంతగ మంచి వారిని సపోర్ట్ చేయలేకపోతున్నాయి. 



దీప్తి లవ్ లో పడింది. కడకు ప్రేమించినవానినే పెళ్ళి చేసుకుని యింటిది అయ్యింది. ఇంకా అక్షర పెళ్ళి కాలేదు. 



ఒకసారి అక్షర దీప్తి ఇంటికి వెళ్ళింది. అప్పుడు దీప్తి, " అక్కా.. నువ్వు మా యింటికి వచ్చెటప్పుడు బాగా మేకప్ అయ్యి రాకు. మా ఆయన కొన్ని విషయాల్లో కొంచెం వీక్.. నీ కథల్లో మనుషులు వేరుగా ఉంటారు. వాస్తవ జీవితంలో మనుషులు వేరుగ ఉంటారు. " అని అంది. 



 అప్పటినుండి అక్షర దీప్తి ఇంటికి వెళ్ళడం మానేసింది. 
 కవితలు కథలు కవితలు కథలు అవి వ్రాయడంలో పడి అక్షర తన పెళ్ళి ఆలోచనలను పక్కకు నెట్టేసింది. 
 దీప్తి ఆస్తుల పంపకం గురించి తండ్రితో మాట్లాడింది. చలపతిరావు ఇద్దరు కూతుళ్ళకు సమానంగ ఆస్తి పంచాడు. 



 దీప్తి తన భర్త తో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టించింది. వ్యాపారం బాగానే సాగుతుంది. మూడు సంవత్సరాల అనంతరం అక్షర అనారోగ్యంతో, ప్రసవ వేదనతో మరణించింది. 



 అక్షర తో పాటు అక్షరకు పుట్టిన శిశువు కూడ మరణించింది. 
 అక్షర మరణానికి ప్రధాన కారణం నేనని చాలా మంది అంటారు. రాస్కేల్స్.. నోరుందికదా అని తెగ వాగేస్తుంటారు. 
 ఒక సారి 80 ఏళ్ల నా దగ్గరకు దీప్తి భర్త వచ్చాడు. ప్రశాంతంగా ఒంటరిగా బతుకుతున్న నన్ను తన బిజినెస్ లో పెట్టుబడి పెట్టమన్నాడు. ఆలోచిస్తానన్నాను. పెళ్ళాం పోయి ఇరవై ఏళ్లు దాటిపోయింది. బిడ్డలంతా విదేశాల్లో సెటిలైపోయారు. లైఫ్ ను రిచ్ గా ఎంజాయ్ చెయ్యడానికి కావల్సిన దానికంటే పదిరెట్లు ఎక్కువ ఉంది. ఇప్పుడు మరలా బిజినెస్ లు ఎందుకు అనుకున్నాను. 



 అప్పుడే అతగాడు తన వదిన అక్షర ను నాకు పరిచయం చేసాడు. బుక్స్ చదివే అలవాటు ఉన్న నాకు అక్షర కవిత్వం చదవబుద్ధి అయ్యింది. అక్షర ముఖం చూస్తూ బిజినెస్ విషయం లో "సరే" అన్నాను. 



 అక్షర ప్రతిరోజూ మా యింటికి వచ్చి తన కవిత్వం చదివి వినిపించేది. మహా యిష్టంగా వినేవారికి తన కవిత్వం చదివి వినిపించడమంటే అక్షరకు మహా యిష్టం.
 
 ఒకప్పుడు కవులు పచ్చి శృంగారాన్ని రాజులకు పద్యాలలో చదివి వినిపించి పొలాలు, బంగారు నాణేలు అవి ఇవి సుకవులు రాజుల దగ్గర నుండి బహుమతులుగ తీసుకునేవారు. 



అక్షర తన కథలు చదివి వినిపించేటప్పుడు ఆమె కథలలోని ఆడ పాత్రల అంగాంగ వర్ణనల మూలాల గురించి అక్షర నే అడిగేవాడిని. అలాంటి సమయంలోనే నేను అక్షరను లొంగ తీసుకున్నాను. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఛీ.. పాడు.. ఇంత వయసు వచ్చింది. నీకు బుద్ది, సిగ్గు లేదా? అని కొందరు నన్ను తిట్టవచ్చు. అలా తిట్టేవారి నోట్లో మట్టికొట్టా.. అసలు ఇలాంటి కథలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయి? నేనేం వంద సంవత్సరాలు నిండిన వాడిని కాదే.. కన్యాశుల్కం లో లుబ్దావధానులుకంటే మహా అయితే నాలుగైదు ఏళ్ళు ఎక్కువ ఉంటాయి. అంతే కదా? అందరికి 80 ఏళ్ళవాడిని అనే చెబుతాను కానీ కొంచెం ఎక్కువ ఏజే ఉందిలే.. అయిన కండపుష్టి కలవాడిని. ఉప్పూకారం ఇబ్బడి ముబ్బడిగా తినేవాడిని. 



అయినా కాలం పిల్లల్లా నేనేం అక్షరకు లైన్ వెయ్యలేదు. పక్కలోకి రాకపోతే యాసిడ్ పోస్తా అనలేదు. నేనేం బ్రహ్మర్షిని, మహర్షిని అని అనలేదు. అయితే తప్పంతా అక్షరది అని అనను. అలాగని నాది తప్పంటే అసలు ఒప్పుకోను. నన్ను చంపుతాను అన్న సరే నాది తప్పుకాదు. 
 అయితే అక్షర చనిపోయాక మాత్రం ఎవరన్నా కథలు, కవితలు అంటే మాత్రం వారి బొక్కలు ముక్కలు చేసి కుక్కలకు వెయ్యాలనిపిస్తుంది. అనిపించడం వేరు. ఆచరించడం వేరు. అనిపించేదే చెబుతుంది కథ కవిత్వం. ఆచరించేది చెప్పేస్థాయికి కవిత్వం కథ ఎప్పుడు వస్తుందో?



 అన్నట్లు చెప్పడం మరిచాను. దీప్తి భర్త దీప్తికి హ్యాండ్ ఇచ్చాడు. మొత్తం సొమ్మును తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు. 



దీప్తి మాత్రం కవిత్వం వ్రాయదు. తన ముందు నిలిచినవారు తనకు తేడా అనిపిస్తే ఆఫ్ రేషన్ పేరుతో తనకేది కట్ చేయాలనిపిస్తే, అది కట్ చేసేస్తుంది. 



 శుభం భూయాత్
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 1
'మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 1/2' పెద్దకథ ప్రారంభం




సారిక సెల్ తీసి చూస్తే ఎవరిదో కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది. 'ఇది ఎవరయి? ఉంటారు. సర్లే చేసి చూద్దాం.. !' అని కాల్ చేసింది  నంబర్ కి. 


 "హల్లో! ఎవరండీ? నా సెల్ కి కాల్ చేసింది" అంది సారిక. 


అటునుండి "నేను వసంత, నువ్వు మా ఫ్రండ్ రమణ వాళ్ల అమ్మాయివేనా.. !" అంది వసంత. 


"అవునండీ!" అంది సారిక. 


నేను.. ! మీ అమ్మ ఫ్రెండ్ ను, మీఅమ్మ.. ! నేను కలసి సిక్స్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు కలసి చదువుకున్నాం. "


 "మీ.. రు.. వసంత కదా.. ! నేను ఇప్పటి వరకు మిమ్ములను చూడకపోయినా.. మా అమ్మ, ఎపుడూ మిమ్ములను తలచుకుంటూ ఉండేది. అందువల్ల మీరు నాకు తెలుసు. "


 "కానీ.. సారి సారికా! మీఆమ్మ సూసైడ్ చేసుకుందిటా, నేను చాలా షాక్! పోయిన నెలలో ఇండియా వచ్చినప్పుడు తెలిసింది. ఇపుడు నువ్వు ఫ్రీ గానే ఉన్నావా! మాట్లాడవచ్చా?" అంది. 


 "షూర్ ఆంటీ!" అంది సారిక. 


"ఇది ఎలా జరిగింది!? సారికా.. ! మీ అమ్మ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. " 


"అదే ఆంటీ.. ! మాకు కలగానే వుంది ఇదంతా!"


 "మీరు ఇద్దరు అమ్మాయిలట కదా!" 


"అవునాంటి! నేను, మా అక్క.. !"


"పాపం మీరు సరే! మీ నాన్నగారికి ఇది పెద్ద దెబ్బ అవునా!" 


"ఆయన అలా ఏమి? అనుకోవటం లేదు లెండి. "  మాటలో కొంచం వ్యంగ్యం ధ్వనించింది. 


 ఇక సాగదీయ కూడదని వసంత, ఇపుడు నువ్వేమి? చేస్తున్నావు!"అంది. 


"అమెరికాలో ఎంఎస్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నా.. ! ఆంటీ!"


నువ్వు ఇపుడు అమెరికాలో ఎక్కడా.. !?" అన్నది వసంత. 


"న్యూయార్క్ ఆంటీ!" అంది. 


 "నేను న్యూజెర్సీలో ఉంటాను, దగ్గరే కాబట్టి ఒకసారి మా ఇంటికిరా!"


 'ఒకసారి ఈమెను కలవాలనుకుని' మనసులో "వస్తాను ఆంటీ.. !" అంది సారిక. 


తర్వాత సారిక ఒకసారి కాల్ చేసింది. "ఆంటీ  వీకెండ్ మీరు ఖాళీయేనా!" 


"రామ్మా! సారికా.. ! మేము ఎక్కడికి వెళ్ళటం లేదు అన్నది వసంత. 


సారిక వచ్చింది సోఫా చూపించి "సారికా.. రా! కూర్చో.. !" అంది వసంత. 


సారిక వసంతను చూస్తూ 'ఈవిడ, అమ్మ దగ్గర వున్న ఫోటోలో లాగానే వుంది. కాకపోతే వయసు వల్ల వచ్చే చేంజెస్ అంతే. కొద్దిగా వళ్ళు చేశారు. కానీ, బావున్నారు ఆంటీ.. !' మనసులో అనుకుంది సారిక. 


 "కాఫీనా టీనా? ఏమి తాగుతావు సారికా!" అన్న వసంతతో "ఏదైనా పర్లేదు ఆంటీ!" 


"ఒకే కాఫీ తెస్తాను కాఫీ తాగుతూ ఇద్దరం మాట్లాడుకుందాం!" అంటూ లోపలికి వెళ్ళింది వసంత. 


 లోపు ఇల్లు పరికించి చూసి 'చాలా బాగా సర్డుకున్నారు' అనుకుంది సారిక. 


 వసంత కాఫీ చేతికి ఇస్తూ! "చెప్పు సారికా.. ! ఏంటి? కబుర్లు" అంది. 


"మీరే చెప్పండి ఆంటీ.. ! మా అమ్మ గూర్చి!" ఆసక్తిగా అడిగింది సారిక. 
 
 "సారికా.. ! నువ్వు అచ్చు మా ఫ్రెండ్ రమణలాగా వున్నావు. " 


"అవునా థాంక్స్ ఆంటీ!" అంది. 


"నేను, మీ అమ్మ.. ! ఎలా వుండేవాళ్ళమో.. ? చెప్తాను. " 


అమ్మా.. ! అనగానే సారిక మొహంలో భాద కనపడటం గమనించి వసంత తనని నవ్విద్దామని. తన చెయ్యి రింగులు తిరిగే లాగా చుడుతూ.. చెప్పటం మొదలెట్టింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
"అవి మేము కాలేజ్ చదివే రోజులు. వినెక్ జాకెట్టులు "లంగా ఓణీలు వేసుకొని కాలేజికి వెళ్ళే వాళ్ళం. కాలేజ్ కి వెళ్ళే దారిలో మీ అమ్మ ఇల్లు ఉండేది. నేనూ.. !, గీత అని ఇంకో ఫ్రెండ్ వుండేది. మేమిద్దరం కలసి మీ అమ్మను పిలుచుకుని కాలేజుకు వెళ్ళేవాళ్ళం. 


 మాముగ్గురులో మీ అమ్మ బాగా చదివేది. నాకు మీ అమ్మకు చదువులో పోటీ వుండేది. అస్సలు చదవలేదంటూ! ఇద్దరం బాగా చదివి బాగా మార్క్స్ తెచ్చుకునే వాళ్లము. 


నేను బాగా నవ్వించి సైలెంట్ గా కుర్చూనేదాన్ని. పాపం మీ అమ్మా..  గీత, లెక్చరర్స్, చేత తిట్లు తినేవాళ్ళు వచ్చే దారిలో నన్ను..  మీ అమ్మా, గీత వ్వించవద్దు మమ్ముల్ని.. ! అని తిట్టేవాళ్ళు. 
 
శనివారం మా కాలేజీ కి హాఫ్ డే. మధ్యాన్నం పక్కన వుండే టౌన్ లో రిక్షా ఎక్కి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆరోజులే వేరు సారిక. మొదట నా పెళ్లి అయిపోయింది. మీ అమ్మ ఒక్కతే కూతురు. మీ తాతా, అమ్మమ్మ వాళ్లు కూలి నాలి చేసి చదివించేవారు. మీ అమ్మ అపుడు చెప్తూ.. వుండేది. నేను మంచి జాబ్ తెచ్చుకుని మా అమ్మానాన్నలను చూసుకోవాలని. 
 
 నేను మా వూరు వెళ్ళినప్పుడు మీ తాత కనపడి చెప్పాడు. మీ అమ్మకి జాబ్ వచ్చిందని, పెళ్లి అయిందనీ. తర్వాత మావారికి అమెరికాలో జాబ్ రావటం వల్ల నేను ఇటు వచ్చేసాను. మా అమ్మ వాళ్ళు కూడా  ఊరిలో లేక పోవటం వల్ల మీ అమ్మ విషయాలు ఏమి తెలీదు? తర్వాత నాకు. 


 మొన్న ఇండియ వచ్చినప్పుడు నే పుట్టిన వూరు చూద్దామని వెళ్ళాను. మీ అమ్మమ్మనీ వెళ్ళి పలకరించా. అపుడు ఏడుస్తూ చెప్పింది "నాపిల్లని చంపేసారమ్మా!  ఇల్లు అదే కట్టించింది. మాకు డబ్బులు కూడా పంపేది. ఇపుడు మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా?" అని ఏడిచింది. "ఎంతమంది పిల్లలు రమణకు.. !" అంటే "ఇద్దరు అమ్మా.. !" అంది. 


 పాప ఫోన్ నంబర్ ఇవ్వమంటే.. నీ నంబర్ ఇచ్చింది. నువ్వు అమెరికాలో వున్నావని చెప్పింది. అపుడు ఆనంబర్ కి నీకు కాల్ చేశా. ఇపుడు ఇంక మీ అమ్మ సంగతి చెప్పు!" అంది వసంత


 మా అమ్మకు జాబ్ వచ్చిన తర్వాత మానాన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మా అమ్మానాన్నను చూసుకుంటానని చెపితే.. మా నాన్న దానికి ఒప్పుకుంటేనే.. పెళ్లి చేసుకుంది అమ్మ. 


 నాన్నతో పెళ్లయిన కొన్నాళ్ళు సుఖపడింది అంతే అమ్మ.. !. 


 మా నాయనమ్మ వాళ్లకు మా అమ్మ అంటే..  ఇష్టం లేదు. ఆమెకు మా నాన్న ఒక్కడే అబ్బాయి. ఆమెకు పెద్ద కూతురు, కూతురుని నాన్న చేసుకోలేదని కోపం. ఇంకో కూతురు మాకు దగ్గరలోనే వుంటుంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. మా అక్క పుట్టిన దగ్గర నుండి అమ్మకు కష్టాలు మొదలయ్యాయి. మా నాయనమ్మ వాళ్ళు అమ్మకు అబ్బాయి పుట్టలేదని గొడవ. ఇంకా నాన్నకు అమ్మ మీద లేనిపోనివి చెప్పేవాళ్ళు. నాన్న వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అమ్మను తిడుతూ.. ! వుండేవాడు. దానికి అమ్మా.. వాళ్ళను ఏమనలేక.. మనసులోనే కుమిలిపోయేది
 
"అవును మీ అమ్మ చాలా సెన్సిటివ్. చాలా కరెక్ట్ గా వుండేది, ఎదుటి వాళ్ళు కూడా అలా వుండాలనుకొనేది. ముక్కుసూటి మనిషి. ఒక్కోసారి మనం పరిస్థితులకు మారాలి అంటే "నేను అలా మారలేను అనేది, అవసరానికి ఒక రకంగా తర్వాత ఒక రకంగా నేనుండలేనూ! అనేది. మాట మార్చే వాళ్ళను మీ అమ్మ చాలా దూరంగా వుంచేది"
 
"భలే కరెక్ట్ గా చెప్పారు ఆంటీ.. ! మా అమ్మ మెంటాలిటీ. దీన్ని నాయనమ్మ వాళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు. పని చేయించుకునే వారు. మళ్ళీ మాకు ఒక్కవసరానికి కూడ ఉపయోగపడే వాళ్ళు కారు. 
మా నాన్నకు, ఈగో కొంచం ఎక్కువ. మా తాత ఆస్థిని మా నాయనమ్మ తదనంతరం మా నాన్నకు దక్కేలా! రాశారు. దీనితో మా నాన్నకు తనకి ఆస్తి ఇవ్వదనీ వాళ్లమ్మ.. ! ఏది చెపితే, అది రైట్ అనేవాడు. 


వాళ్ళు చాలా మెత్తగా మీ ఆవిడ సంపాదించింది అంతా మీ అత్తామామలకు ఇస్తుందని చెప్పేవారు. దానితో ఆయన అమ్మను తిట్టటం. అపుడు అమ్మ "మా వాళ్ళకు నేను ఒక్కదాన్నే.. ! వాళ్ళని చూసుకుంటాను అంటే మీరు ఒప్పుకునే.. నన్ను చేసుకున్నారు. ఇపుడు మాట మారుస్తున్నారు" అని అరిచేది. 
 
 నేను మా అమ్మానాన్నలను చూసుకోలేకపోతున్నాను అని బాధ పడేది. లోన్ తీసుకొని వాళ్లకు చిన్న ఇల్లు కట్టించింది. కొంత డబ్బు పంపేది. ఇది తెలిసి నాన్న అమ్మ జీతం తనకు ఇవ్వాలని గోల చేసేవాడు. 
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
మిస్ యూ అమ్మా.. ! పార్ట్ 2



గోలల్లో అక్కది డిగ్రీ అయింది నేను బిటెక్ లో వున్నాను. మా అక్కను రెండో అత్త కొడుకుకు ఇవ్వాలని మా నాయనమ్మ పేచి పెట్టింది. మా అమ్మ వాళ్ళకి పెద్దగా చదువు లేదనీ.. ! వద్దంది. వాళ్లకు అన్నీ అవలక్షణాలని వాళ్లకు ఇచ్చి చేస్తే.. ! ఇప్పటికే నేను వాళ్ళతో వేగలేక పోతున్నా! అక్కా.. ! వాళ్ళతో వేగలేదని అమ్మ ఆలోచన. 



 నాన్నకి అక్కని బావ కీచ్చి చేస్తే నాకు ఎటూ.. !కొడుకులు లేరు మా అమ్మ నా కిచ్చేది వాళ్లకీ ఇస్తే.. ఆస్తి బయట వాళ్లకి వెళ్లదని.. మా నాన్న ఆలోచన. ఆయన ఏది చేసినా! రెండు రకాలుగా లాభం వుంటేనే.. ! చేస్తాడు. 



 మా నాన్న ఎపుడు ఆఫీస్ వర్క్ తో బిజీ మమ్మల్ని పెద్దగా ముద్దు చేసింది లేదు. అన్నీ! అమ్మే.. ! చూసుకునేది. మానాన్న జీతంలో లోను తీసుకొని ఇల్లు, కారు కొన్నాడు. వాటిని తీర్చటం మిగతా వాటితో ఆయన బట్టలు, చెప్పులు, సెల్ కొనుక్కోవడం చేసేవాడు. ఆయన వరకు ఆయన హ్యాపీగా ఉండేవాడు



 ఇంటికి కావాల్సినవి తెస్తూ.. మాకు బట్టలు ఇంకా ఏమి కావాలంటే అవి కొనేది అమ్మ. తనకంటూ ప్రతేకంగా ఏమి కొనుక్కొనేది కాదు. మా అక్క మొదట్లో బానే వుంది అమ్మతో. 



 నాయనమ్మ నాన్నతో నీ పిల్లను నీ అక్క కొడుక్కి ఇస్తేనే.. ఆస్తి ఇస్తా.. అనటంతో నాన్నా.. ! అక్కను ముద్దు చేయటం ఏవి అడిగితే అవి కొనిస్తూ "బావను పెళ్లి చేసుకో.. !" అని చెప్పేవాడు. 



 మా అత్తవాళ్లు మీ అమ్మకు.. ! మేము ఇష్టం లేదు జాబ్ చేస్తుందని మమ్ములను తక్కువ చూస్తుందనీ.. ! చెప్పేవాళ్ళు అక్కతో. అమ్మకు పద్ధతిగా! లేకపోతే ఎప్పటి పని అపుడు చేయక పోయినా అక్కను తిట్టేది. 



 మా పక్కనే వుండేది మా నాయనమ్మ. ఇప్పటికీ నేనూ.. ! మీ అత్తవాళ్లకి ఒక పని చెప్పలేదు. మీ అమ్మ మీకు ఏమి? పనులు చెపుతుంది" అనేది. 
దానితో అది నానమ్మ, అత్తవాళ్ళు, మంచి వాళ్ళనుకుని వాళ్లతో మాట్లాడేది. మా అమ్మా.. ! మా అక్క
 వాళ్ళతో మాట్లాడుతుందని తిట్టేది. 



 అపుడు నాన్న ఎంటరయి, "దాన్ని తిట్టకు? అని అక్కను ముద్దుచేస్తూ.. ! మీ అమ్మకు నువ్విష్టం లేదు మీచెల్లి అంటే ఇష్టం అది తిడితే.. వురుకోవాకు అని చెప్పేవాడు. పిచ్చిది మా అక్క, అమ్మని ఎడిపించటానికి.. ! నేను బావని చేసుకుంటానని ఒకటే గొడవ. 



  గొడవలప్పుడు నేను ఎంఎస్ చేయటానికి అమెరికా వచ్చాను. అమ్మ ఫోన్ లో అంటూ వుండేది "నాకు బ్రతకాలేని లేదు సారిక. "
 "అమ్మా.. ! అలా అనకు నాకు జాబ్ వస్తే ఇక్కడికి వద్దువు కాని, అని ధైర్యం చెప్పేదాన్ని. "



 మరి మీ అక్క ఏమనేది?" అంది వసంత. 
అక్కకి కాల్ చేసి అమ్మతో.. ! మాట్లాడు అంటే.. , ! "ఇలా వుండు అలా వుండు.. ! జాబ్స్ కు అప్లయ్ చెయ్యి ఒకటే క్లాస్లు తీస్తుంది. నాన్న చెప్పినట్లు బావని చేసుకుని ఈమే గోల నుండి బయటపడతా. అమ్మా.. ! ఎపుడు ఆమె సైడ్ ఆలోచిస్తుంది. నా సైడ్ ఆలోచించదనేది. ఇలా అక్కా.. !, నాన్న టార్చర్ తో అమ్మ వెక్స్ అయిపోయింది 



 పెళ్లి, పిల్లలు గూర్చి ఎన్నో కలలు కన్నది అమ్మ. కానీ ఇంట్లోనే తనకి సపోర్ట్ లేకపోవటం, సొంత పిల్ల కూడా అర్థం చేసుకోలేక పోయేసరికి కుంగిపోయింది. బయట ఎంత మంచి అనిపించుకున్నా! ఇంట్లో వంటరి పోరాటమే చేసింది. 
 
 ఎంతో ప్రశాంతంగా బతకాలనుకుందో? అంత జీవితం ఇంకా కష్టంగా మారుతుంటే.. నేను పోతే వీళ్ళు మారుతారు అనుకుంది పిచ్చమ్మా.. ! అందుకని తన జాబ్ ను మా అక్కకు వచ్చేట్లు చేయమని ఆఫీస్ వాళ్లకి ఒక లెటరు రాసి పెట్టింది. తనకు వచ్చిన డబ్బులో మాకు కొంత, మా అమ్మమ్మకి, కొంత ఇవ్వమని చెప్పి వురివేసుకొంది. 



 ఆఫీసు వాళ్ళు అమ్మ మంచితనానికి అక్కకు, జాబ్ వచ్చేట్లు, మనీ త్వరగా వచ్చేట్లు చేశారు. స్టాఫ్ అందరూ అమ్మ గురించి గొప్పగా చెప్తుంటే.. , ! నాకు కళ్ల నీళ్ళు ఆగలేదు. ఒక అమ్మగా భార్యగా కొంచం గట్టిగా మాట్లాడితే తప్పా. అది ఎవరి? కోసం, మా కోసమేగా.. ! అని ఎమోషనలుగా ఫీల్ అయింది. అలా అని అమ్మ ఒక్కనాడు కూడా తన భాద్యతలను విస్మరించలేదు. పొద్దున ఆరింటికి లేచి మాకు అన్నం వండి బాక్స్ ఇచ్చి తను ఆఫీసుకి వెళ్ళేది. 
 
 "మరి మీ అక్క పెళ్లి అయ్యిందా?" అన్న వసంతతో లేదు "మా బావ ఫ్రెండ్స్ తో కలిసి ఎవరో అమ్మాయిని ఏడిపించాడని.. ! కొన్నాళ్ళు జైల్ కు వెళ్ళాడు. ప్రస్తుతం అక్క ఉద్యోగం చేసుకుంటూ వుంది. " 
 
 ఏవన్నా మార్పు వచ్చిందా? మీ అక్కలో!"



"లేదు ఆంటీ.. ! అసలు అమ్మ.. ! నాతో నాన్నతో మాట్లాడితే! పోయేది. ఇలా ఎందుకు? చేసుకుందో!" అంది. 



 "ఎన్నిసార్లు మీతో మాట్లాడాలన్నా.. ! మీరు ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు. నువ్వూ.. ! నాన్నా అమ్మ దగ్గర కూర్చొని యేంటి అమ్మా.. !? నీ మనసులో బాధ అని ఒకసారన్నా అడిగారా! అక్కా! అని అడిగితే.. , !, నేను నీ కన్నా పెద్దదాన్ని "నాకు సలహాలు ఇవ్వకు" అంది మా అక్క. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
 "మరి అమ్మకూడ.. మన కన్నా పెద్దదిగా.. ? మరి అమ్మ మాట మనం ఎవరం విన్నాం?" అంటే
"అందుకేగా! ఇపుడు నేను బావను పెళ్లి చేసుకోవటం లేదు అంది అక్క. 
"ఇదే మాట నువ్వు ముందు చెప్తే.. !, అమ్మ బతికి వుండేది" అన్నాను. 



 అయితే నావల్ల "అమ్మ పోయిందా.. !"
 నాన్న.. ! చూడు సారిక ఏమంటుందో!" అని మా నాన్నకి చెప్పింది "మీ అమ్మలాగా క్లాసులు తీయకు.. !" అన్నాడు నాన్న కోపంగా. 



 "మనుషులు కారు వీళ్ళు ఎప్పటికీ మారరు.. ? 
అమ్మా.. ! ఇలాంటి వాళ్ల కోసం నువ్వు నీ లైఫ్ ను బలి చేశావా.. !" అక్కడ ఇక వుండలేక, తర్వాత నేను అమెరికా వచ్చాను. 
 
 "సారిక, ఇపుడు నువ్వు ఏమి చేద్దామని? అనుకుంటున్నావు.. !" అంది వసంత. 



"ఏమిచెయ్యాలో తెలియటం లేదు ఆంటీ. ప్రస్తుతం పార్ట్ టైం చేస్తూ.. ! మా ఫ్రెండ్ రూమ్ లో వుంటున్నా. జాబ్స్ కోసం అప్లయ్ చేస్తున్నా.. !" అంది సారిక. 



 "నీ డిటైల్స్ నాకు పంపు. మావారి ఆఫీస్ లో ఏదన్నా వుందేమో! చూడమని చెప్తా. "



"చాలా థాంక్స్ ఆంటీ! మీతో మాట్లాడితే.. మా అమ్మతో మాట్లాడినట్లు వుంది" అని చెప్పి సారిక వెళ్ళింది



 ఒక నెల రోజుల తర్వాత సారికకి వసంత వాళ్లయన ఆఫీస్ లో జాబ్ వచ్చింది. 



 ఒక వీకెండ్ వచ్చింది "ఆంటీ చాలా థాంక్స్.. !" అంది సారిక. "అదేమీ లేదు కానీ మీ అమ్మ కోరికలు నీతో పాటు నేను తీర్చటానికి ప్రయత్నిస్తా.. !" అంది వసంత. 



"మా అమ్మ కోరిక మా అక్క సెటిల్ అవ్వటం మా బావని కాకుండ, వేరేవాళ్లని.. ! పెళ్లి చేసుకోవటం. "
 
 "మీ అక్క సంగతి ఎంటి?" అని అడిగింది వసంత. 



 నిన్న కాల్ చేసింది ఆంటీ! మా అత్తవాళ్ళు దీని జాబ్ చూసి పెళ్ళిచేసు కుంటామన్నారుట. మా అక్క ఇప్పట్లో.. నాకు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదు అందిట. దానితో మా అత్త.. ! మీ అమ్మ.. ! నీ వల్లే పోయింది. మాకు వద్దులే.. మీ వెదవ సంబంధం! అని పోయిందిట. 



 ఇలా అత్తా.. ! వాళ్ళు హ్యాండ్ ఇవ్వటంతో మా నాన్న కూడా కొంచం డల్ అయ్యాడుట. ఇన్నాళ్లు వీళ్ల మాటలు విని అమ్మను బాధపెట్టానే.. ! అని. నిజముగా అమ్మని మిస్ చేస్తున్నా.. ! సారిక" అని అక్క నాకు కాల్ చేసింది. 



 నేను, అమ్మా.. ! నీతో విషయాలు మాట్లాడదామని ఎన్నిసార్లు ట్రై చేశామో.. ? అక్కా.. ! కానీ, నువ్వు వినిపించుకోలేదు. ఇప్పటినుండి అమ్మ జాబ్ లో అమ్మని చూసుకుంటూ, అమ్మ చేసినట్లుగా చేసి.. అమ్మ సీట్ కి పేరు తీసుకురా అక్కా.. ! అన్నాను ఆంటీ.. !" మెరుస్తున్న కళ్ల తో అంది సారిక. 



 "పోనీలే! మీఅమ్మ త్యాగం వృదా పోలేదు.. !" అంది వసంత ఆనందంగా. 



 "ఆంటీ.. ఉగాదికి నేను ఇండియా వెళ్తున్నా.. ! అమ్మకు ఉగాది అంటే.. ! చాలా ఇష్టం. అక్కా.. ! నేను, నాన్న కలిసి ఉగాది చేసుకోబోతున్నాము. ఉగాది నుండైనా.. ! మేము ముగ్గురం కలిసి, మా కష్ట సుఖాలను పంచుకోవాలి. అమ్మ.. ఎపుడూ.. ! అంటుండేది 'కలసి ఉంటే కలదు సుఖం' అని. ఇకనుండి మేము ఎపుడూ.. !కలిసి ఉండాలనీ, మమ్మల్ని బ్లేస్ చేయమని!" వసంతను కోరింది సారిక. 



 "తప్పక నా బ్లెస్సింగ్స్, పైనుండీ మీ అమ్మ బ్లెస్సింగ్స్.. ! కూడా మీకు వుంటాయని.. !" సంతోషంగా దీవించింది వసంత. 



====================================================================
సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
అందమైన అబద్ధం



రచన: నీరజ హరి ప్రభల 






"ఏయ్ సుజీ ! సాయంత్రం బ్యాంకు నుంచి త్వరగా వస్తాను. సరదాగా సినిమాకెళ్లొద్దాం. నీవు, వంశీ సిధ్ధంగా ఉండండి". చెప్పాడు హరి. 



"అలాగే" అని భర్త చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది సుజాత. దాన్ని అందుకుని 'బై' చెప్పి ఆఫీసు కెళ్లాడు హరి. కాసేపటికి వంశీని లేపి వాడి పనులన్నీ చూసి, వాడికి బాక్సు రెడీ చేసి వాడిని కాలేజీలో దించి వచ్చింది. ఆతర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసింది. సాయంత్రం కాలేజీకు వెళ్లి వంశీని తీసుకుని వచ్చి వాడిని రెడీ చేసి తనూ రెడీ అయింది. హరిరాగానే అతనికి స్నాక్స్, టీ ఇచ్చింది. ముగ్గురూ కలిసి సరదాగా సినిమాకు వెళ్లివచ్చారు. చక్కని జంట, ముచ్చటైనసంసారం. రోజులు సాఫీగా గడుస్తున్నా యి. 



ఒకరోజున సుజాత షాపింగ్ చేస్తుంటే అక్కడ ఎదురైన ఒకామెను చూసి ఆశ్చర్యపోయింది. ఆవిడ కూడా అంతే. సుజాత వెంటనే తేరుకుని సంతోషంగా "హాయ్ రాధా!" అనటం, ఆవిడ కూడా అంతే ఆనందంతో " హాయ్ సుజీ" అనటం, ఇద్దరూ ఒకళ్లనొకళ్లు హత్తుకోవటం జరిగింది. కాలేజీలో ఇద్దరూ మంచిస్నేహితులు. చదువు పూర్తయాక రాధ వాళ్లు వేరే ఊరికి వెళ్లటం, తర్వాత సుజాతకు పెళ్లి అవటంతో ఇంక ఇద్దరి మధ్యనా కమ్యూనికేషన్ లేదు. మరలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కలవటం. షాపింగ్ పూర్తి చేసుకున్నాక సుజాత రాధను తీసుకుని తన ఇంటికి వచ్చింది. 



అతిథి మర్యాదలయ్యాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. సుజాత హరితో తనకు పెళ్లి, వంశీ పుట్టటం అంతా చెప్పాక, రాధ తన గురించి వివరంగా చెప్పింది. 'బాంకు లో పనిచేస్తున్న వెంకట్ తో తనకు పెళ్లి, సంతోషంగా కాపురం. అన్యోన్యంగా ఉన్న జంటను చూసి 'విధికి కన్నుకుట్టిందా' అన్నట్లుగా పెళ్లైన 2సం..తర్వాత ఒక యాక్సిడెంట్ లో వెంకట్ ఈలోకాన్ని వీడటం, కొన్నాళ్లకు అతని ఉద్యోగం తనకు రావటం, 'దెబ్బ మీద దెబ్బ' అన్నట్లుగా కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి దిగులుతో తన తల్లిదండ్రులు చనిపోవడం, ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, తల్లితండ్రులు లేని బాధను భరిస్తూ ఇలా ఒంటరిగా రోజులు గడుపుతున్నాను. ' అని గద్గదిక స్వరంతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే సుజాత స్నేహితురాలిని దగ్గరకు తీసుకుని కన్నీటిని తుడిచి "ఇంక నుండీ నీకు నేనున్నాను. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పటం మరవద్దు" అని సముదాయించి ధైర్యం చెప్పింది. 



కాసేపు ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రాధ తన ఫోన్ నెంబరు, ఇంటి అడ్రసు చెప్పి తనింటికి తప్పకుండా రమ్మని చెప్పి వెళ్లింది. ఆతర్వాత ఇద్దరి మధ్యన తరచూ ఫోన్ల సంభాషణలు మాములే. కొన్నాళ్లకు రాధ అదే ఊరిలో వేరే బ్రాంచ్ కు బదిలీ అయింది. అక్కడే తన సహోద్యోగి అయిన హరిని చూసింది. హరిది తన ప్రక్క సీటులోనే. పరిచయాలయ్యాక ' సందేహం వచ్చినా తనను అడగమన్న ' అతని మాటతీరు, కలుపుగోలుతనాన్ని మనసులోనే మెచ్చుకుంది రాధ. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా అతన్ని కొన్ని సలహాలు, సందేహాలు అడిగేది రాధ. బాంకులో కూడా అతనికి మంచి పేరుంది. క్రమేపీ ఇద్దరి మధ్యనా మంచి స్నేహం ఏర్పడింది. కొన్ని నెలలకు రాధ గతం గురించి ఆమె నోటి వెంట విన్న హరి బాధపడి 'ఒక స్నేహితుడిగా నీకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండమని' చెప్పి ఓదార్చాడు. తన గురించి చెప్తూ 'తన భార్య చాలా మంచిదని, భార్యా బిడ్డతో సంతోషకరమైన జీవితం' అని చెప్పాడు. ఎవరి ఉద్యోగబాధ్యతలలో వాళ్లు బిజీగా ఉన్నారు. కాలం సాఫీగా గడిచిపోతోంది. 



ఒక రోజున ఏదోపనిమీద సుజాత బయటకు వెళ్లింది. బాగా నీరసంగా అనిపిస్తే దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేద్దామనుకుని వెళ్లింది. బేరర్ కు ఆర్డరిచ్చాక చుట్టూ పరికించి చూడగా ఒక్క చోట చూపులు ఆగిపోయాయి. ఒక టేబుల్ ప్రక్కన కుర్చీలలో తన భర్త, రాధ కూర్చుని మాట్లాడుతూ కన్పించారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ల వద్దకు వెళ్లి కూర్చుందామనుకుని వాళ్లేదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారని ప్రయత్నాన్ని విరమించుకుంది. వాళ్లు తనని చూడలేదు. కాసేపటికి వాళ్లు బయటకు వెళ్లాక తను కూడా ఇంటికి వెళ్లింది. 



సాయంత్రం హరి బాంకు నుంచి ఇంటికి రాగానే రోజూలాగానే అతనికి స్నాక్స్, టీ ఇచ్చింది. మాటల మధ్యలో తను హోటల్ కు వెళ్లిన విషయం చెప్తూ ' అక్కడ మీతో మాట్లాడుతున్న ఒకావిడను చూశాను. ' అంది సుజాత. ' ఆవిడ తన సహోద్యోగి రాధ. అనుకోకుండా అక్కడ ఆవిడను కలిసి ఏదో మాట్లాడుతూ టిఫెను చేశాము' అన్నాడు హరి. రాత్రి రాధ ఫోన్ చేసి 'తన సహోద్యోగి హరి సాయంతో అత్తింటి వైపు కోర్టు కేసు నుంచి బయటపడ్డాను. అతను చాలా మంచి వ్యక్తి. ఒక సోదరుడిలా తనకు సాయపడ్డాడు. కృతజ్ణతగా అతన్ని ఈరోజున హోటల్ కు పిలిచి లంచ్ ఏర్పాటు చేశాను' అని మాటల మధ్యలో చెప్పింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
భర్త చెప్పిన 'అందమైన అబధ్ధానికి ' మనసులోనే నవ్వుకుంది సుజాత. తన భర్త మనసు గురించి, స్నేహితురాలి గురించి తెలుసు కనుక వాళ్ల మీద తనకేమాత్రం అనుమానం లేదు. పైగా రాధకు తన భర్త చేసిన సాయం విని అతన్ని మనసులోనే మెచ్చుకుంది సుజాత. 



 ఒక ఆదివారం నాడు రాధను తన ఇంటికి భోజనానికి పిలిచింది సుజాత. రాధ రాగానే హరిని, వంశీని పరిచయం చేసింది. రాధను తన స్నేహితురాలిగా భర్తకు పరిచయం చేసింది. ముద్దులొలికే వంశీని చూసి రాధ చాలా ముచ్చట పడింది. రాధా, హరి ఒకళ్లనొకళ్లు ఆనందంతో, ఆశ్చర్యంగా చూడటం గమనించిన సుజాత "మీరిద్దరూ సహొద్యోగులు, మంచి స్నేహితులని రాధ మాటల ద్వారా తెలిసింది. అంతే కాకుండా మీరు ఒక సోదరుడిగా రాధకు చేసిన సాయం కూడా తెలుసు. ఆరోజున హోటల్ లో మీ ఇద్దరినీ చూశాను. మీ ఇద్దరి మంచి మనస్సులు నాకు తెలుసు కనుక ఈరోజు సంతోషంగా రాధను భోజనానికి పిలిచి ఇలా సమావేశం ఏర్పాటు చేశాను " అన్న సుజాత మాటలకు హరి కళ్లు చెమర్చాయి. "అయామ్ సారీ సుజీ. ఆనాడు నేను నీతో అబధ్ధం చెప్పాను. నన్ను క్షమించు. " అని సుజీని దగ్గరకు తీసుకున్నాడు హరి. నవ్వుతూ భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది సుజాత. రాధ, వంశీ చప్పట్లతో సుజాత తెప్పరిల్లి సిగ్గుపడి "అందరం సంతోషంగా భోజనాలు చేద్దామంటూ" డైనింగ్ టేబుల్ వద్దకు దారి తీసింది. వంశీని ఎత్తుకొని రాధ, హరి ఆమెను అనుసరించారు. 



కబుర్లతో అందరూ భోజనాలు పూర్తి చేశాక రాధకు మంచి చీర పెట్టి " చూడు రాధా! దేవుడు నాకు హరి లాంటి మంచి భర్తను, నీలాంటి మంచి స్నేహితురాలిని ఇచ్చినందుకు మనస్సులోనే దేవుడికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను " అని హత్తుకున్న సుజాతను చూసి రాధ కళ్లు, హరి కళ్లు ఆనంద భాష్పాలతో చెమర్చాయి. 



"నీలాంటి స్నేహితురాలు ఉన్న నేను చాలా అదృష్ట వంతురాలిని సుజీ " అని వాళ్ల వద్ద వీడ్కోలు తీసుకుని తన ఇంటికి వెళ్లింది రాధ. 
[font="var(--ricos-font-family,unset)", serif]   ….[/font]సమాప్తం[font="var(--ricos-font-family,unset)", serif].[/font]
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 2 Guest(s)