Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
నాన్న
![[Image: Naanna-Story%20picture_1774059178.jpg]](https://www.gotelugu.com/godata/articles/202603/Naanna-Story%20picture_1774059178.jpg)
- డా:సి.హెచ్.ప్రతాప్
ఆ రోజు అర్ధరాత్రి న్యూయార్క్ లో తన అపార్ట్మెంట్ లో పని పూర్తి చేసుకొని, లాప్ టాప్ షట్ డౌన్ చేసి పడుకోవడానికి వెళ్తూ యధాలాపంగా ఫోన్ లో మెస్సేజిలు చూసుకుంటున్నప్పుడు పక్కింటి ఆంటీ పంపిన మెస్సేజ్ చూసింది.
“సితార… వెంటనే ఫోన్ చేయి. నీ నాన్న ఆరోగ్యం చాలా విషమంగా ఉంది” అన్న ఆ మాటలు చూడగానే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లయ్యాయి. గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయి గబగబ కొట్టుకోవడం మొదలైంది.
చేతులు వణుకుతుండగా అమెరికాలోని తన నివాసపు బాల్కనీలో నిలబడి గజగజ వణుకుతూ వెంటనే స్వదేశానికి ఫోన్ చేసింది. అవతలి వైపు రింగ్ అవుతున్న ప్రతి క్షణం ఒక యుగంలా తోచింది. తండ్రి చిరునవ్వు, ఆయనతో గడిపిన జ్ఞాపకాలు కళ్లముందు కదలాడాయి. కానీ ఫోన్ ఎత్తిన స్వరం మాత్రం ఆమె ఊహించినది కాదు. ఆ గొంతులో వణుకు, భారమైన నిశ్శబ్దం ఆమెను భయపెట్టాయి.
అవతల యమునా ఆంటీ దీనంగా “సితార… ధైర్యంగా ఉండాలి అమ్మా… నాన్న… ఇక లేరు” అని చెప్పగానే ఆమె ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కళ్లముందు చీకట్లు కమ్మాయి. చేతిలోని ఫోన్ నేలపాలవగా, గుండెను పిండేసే ఆవేదనతో ఆమె అక్కడే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. కాలం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. కన్నతండ్రిని కడసారి చూసే భాగ్యం కూడా కలగలేదన్న పశ్చాత్తాపం ఆమెను దహిస్తుండగా నోట మాట రాక మూగబోయింది.
ఆ ఒక్క మాటతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా మౌనంగా మారిపోయినట్లైంది. ఆమె చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. కళ్లలో నీళ్లు నిండిపోయాయి. “నాన్న…” అని మాత్రమే ఆమె నెమ్మదిగా చెప్పగలిగింది.
రెండు రోజుల్లోనే ఆమె భారతదేశానికి చేరుకుంది. హైదరాబాద్లోని ఆ చిన్న నివాసము ముందు ఇప్పటికే బంధువులు, పొరుగువాళ్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆవరణ అంతా ఒక రకమైన నిశ్శబ్ద రోదనతో నిండిపోయింది.
గుండె నిండా భారంతో ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఆమె చూపు ఒకచోట ఆగిపోయింది. హాల్లో మధ్యలో ఒక ఫ్రీజర్ బాక్స్ వుంది ఉంది. అందులో ఆమె నాన్న రాఘవ్ నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లు పడుకుని ఉన్నాడు. సితార కాళ్లు వణికాయి, అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారింది. నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి గాజు పలక మీద వణుకుతున్న చేతిని పెట్టి నిలబడింది. ఆ ముఖం ఆమెకు ఎంతో పరిచయం, తన చిన్నతనం నుండి వెన్నంటి నిలిచిన ధైర్యం అది. కానీ ఈసారి ఆ కళ్లు తెరచుకోవడం లేదు, ఆ పెదవులపై చిరునవ్వు కదలడం లేదు. ప్రాణం లేని ఆ దేహాన్ని చూస్తుంటే గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించింది.
“నాన్నా…” అని ఆమె గట్టిగా కేక వేస్తూ ఏడ్చింది. ఆ పిలుపులో ఎంతో వేదన, ఒంటరితనం ధ్వనించాయి. దుఃఖం ఉప్పెనలా ముంచెత్తడంతో ఆమె ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. స్పృహ తప్పుతున్నట్లుగా అనిపించగా బంధువులు, స్నేహితులు పరుగెత్తి వచ్చి ఆమెను పట్టుకున్నారు. కన్నీళ్లు ముఖాన్ని తడుపుతుండగా ఆమె శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.
చుట్టూ ఉన్నవారు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా ఆమె మనసు మాత్రం తండ్రి జ్ఞాపకాల్లోనే ఉండిపోయింది. “ధైర్యంగా ఉండమ్మా… నీ నాన్న చాలా మంచి మనిషి, ఎందరికో సాయం చేసిన మహానుభావుడు” అని ఒక మామయ్య ఆమె భుజంపై చేయి వేసి ఎంతో ఆత్మీయంగా సాంత్వన చెప్పాడు. ఆయన మాటలు వింటున్నా ఆమెకు మాత్రం తనను ఒంటరిని చేసి వెళ్ళిపోయిన తండ్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
మరుసటి రోజు అంత్యక్రియలు జరిగాయి. చుట్టూ చాలా మంది ఉన్నా, సితారకు మాత్రం ప్రపంచం ఖాళీగా అనిపించింది. అగ్ని జ్వాలలు పైకి లేస్తున్నప్పుడు ఆమె కళ్లలోని కన్నీళ్లు ఆగలేదు. సాయంత్రానికి అందరూ నెమ్మదిగా ఇంటి నుంచి వెళ్లిపోయారు.
ఆ అపార్ట్మెంట్లో ఇప్పుడు సితార ఒక్కతే ఉంది. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. గోడపై వేలాడుతున్న తన , తండ్రి వ్కలిపి వున్న ఫొటోలలో తన చిన్నప్పటి జ్ఞాపకాలు కనిపించాయి.
ఆమె సోఫాలో కూర్చుని నెమ్మదిగా గతాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. సితార ఒక సంవత్సరం వయసులో ఉండగానే ఆమె తల్లి మరణించింది. ఆ రోజు నుంచి రాఘవ్ ఒక్కరే ఆమె ప్రపంచమయ్యాడు. తండ్రిగా మాత్రమే కాదు, తల్లిగా కూడా ఆమెను పెంచాడు.
చిన్నప్పుడు ఒకసారి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ రాత్రి మొత్తం రాఘవ్ ఆమె పక్కనే కూర్చుని ఉండిపోయాడు. ప్రతి అరగంటకోసారి నీళ్లు ఇచ్చి మందు పెట్టాడు. “నాన్నా… మీరు నిద్రపోరా?” అని చిన్న సితార అడిగింది.
“నీకు జ్వరం తగ్గాకనే నేను నిద్రపోతాను అమ్మా,” అని అతను మెల్లగా చెప్పాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే ఆమె గుండె చెరువైంది. తన కోసం ఎన్ని రాత్రులు ఆయన మేల్కొన్నారో, తన ఎదుగుదల కోసం ఎన్ని ఇష్టాలను త్యాగం చేశారో తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
బయట వీధి దీపాల వెలుతురు గదిలోకి ప్రసరిస్తున్నా, తన జీవితంలో వెలుగు నింపిన మనిషి లేని ఆ గది ఆమెకు చీకటి గృహంలా తోచింది. తండ్రి వాడే వస్తువులు, ఆయన చదివే పుస్తకాలు ఇంకా అక్కడే ఉన్నాయి, కానీ వాటిని స్పృశించే ఆ చేతులు మాత్రం శాశ్వతంగా దూరమయ్యాయి. ప్రతి అడుగులోనూ తండ్రి నీడను వెతుక్కుంటూ, ఆయన నేర్పిన ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తూ సితార ఆ నిశ్శబ్దంలో తన తండ్రిని తలచుకుంది.
మరొకసారి పాఠశాలలో మదర్స్ డే కార్యక్రమం జరిగింది. అందరి పిల్లల తల్లులు వచ్చారు, కానీ సితార మాత్రం ఒక మూలలో ఒంటరిగా నిలబడి ఉంది. అప్పుడే అక్కడికి రాఘవ్ వచ్చాడు. చేతిలో ఒక చిన్న పూల గుత్తి పట్టుకుని ఉన్నాడు.
“ఈ రోజు నేను నీ అమ్మగానూ వచ్చాను అమ్మా,” అని నవ్వాడు. ఆ రోజు సితార తన తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది.
ఇంకోసారి పాఠశాల నృత్య పోటీకి వెళ్లే ముందు ఆమె చాలా భయపడింది. “నాన్నా… నేను పడిపోతే?” అని అడిగింది. రాఘవ్ చిరునవ్వుతో, “నువ్వు పడిపోతే కూడా నేను ఇక్కడే ఉంటాను అమ్మా,” అని అన్నాడు. ఆ మాటలు ఆమెకు కొండంత ధైర్యం ఇచ్చాయి. వేదికపై ఆమె అడుగులు తడబడకుండా నాట్యం చేయడానికి ఆ భరోసాయే కారణమైంది.
రాఘవ్ తన జీవితాన్ని సితార భవిష్యత్తు కోసం ఒక యజ్ఞంలా ధారపోశాడు. భార్య మరణం తర్వాత తనకంటూ ఏ కోరికలూ లేవన్నట్లుగా, ఆమె ఎదుగుదలే తన శ్వాసగా బతికాడు. ముఖ్యంగా సితార చదువు విషయంలో ఆయన చూపిన శ్రద్ధ అసాధారణమైనది. రాత్రిపూట ఆమె పుస్తకాల ముందు కూర్చుంటే, తను పక్కనే ఉండి ప్రోత్సహించేవాడు. క్లిష్టమైన పాఠాలను అర్థం చేసుకోవడంలో సాయం చేస్తూ, ఆమె విజ్ఞాన దాహాన్ని తీర్చడానికి తన శక్తికి మించి పుస్తకాలను సమకూర్చేవాడు.
కేవలం తండ్రిగానే కాకుండా, ఒక మార్గదర్శిగా ఆమె ఆలోచనలను తీర్చిదిద్దాడు.
ఇక కౌమార దశలో ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకు తల్లి అవసరం ఎంతగా ఉంటుందో రాఘవ్ గుర్తించాడు. శారీరక, మానసిక మార్పుల వల్ల సితార అయోమయానికి గురైనప్పుడల్లా, ఆయన ఒక తల్లిలాంటి మమకారంతో ఆమెను అక్కున చేర్చుకున్నాడు.
ఆమె ఇబ్బందులను మొహమాట పడకుండా పంచుకునేలా ఒక స్నేహితుడిలా వాతావరణాన్ని కల్పించాడు. సమాజం రకరకాలుగా మాట్లాడుతున్నా, తనే ఒక రక్షణ కవచంలా నిలబడి ఆమె ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టాడు.
తన వ్యక్తిగత సుఖాలను, అవసరాలను పూర్తిగా విస్మరించి, చిరిగిన బట్టలు వేసుకున్నా సితారకు మాత్రం ఉత్తమమైన వస్తువులనే అందించాడు. ఆమెకు ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, ఆయన మనసు విలవిలలాడిపోయేది. సితారకు రాఘవ్ కేవలం తండ్రి మాత్రమే కాదు, ఆమె ప్రతి అడుగులోనూ ఒక ప్రేరణగా, నైతిక బలంగా నిలిచాడు.
విదేశాలకు వెళ్లే వరకు ఆమె నీడలా ఉండి, ప్రతి క్షణం తన వెన్నంటే ఉన్నాననే భరోసాను ఇచ్చాడు. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణిస్తున్నా, ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఆ అనుబంధం రక్తసంబంధాన్ని మించిన ఒక పవిత్రమైన బంధంగా పరిమళించింది.
"నాన్నా, మీరే నా సర్వస్వం" అని ఆమె అన్నప్పుడు, ఆయన కళ్లలో కనిపించే ఆ తృప్తి వెలకట్టలేనిది. తన ప్రాణం ఉన్నంత వరకు ఆమెను ఒక మహారాణిలా చూడటమే తన జీవిత పరమార్థంగా రాఘవ్ భావించాడు.
సంవత్సరాలు గడిచాయి, ఆమె చదువులో ఎంతో ముందుకు వెళ్లింది. రాఘవ్ తన పరిమితమైన జీతం నుంచి కొంచెం కొంచెంగా పొదుపు చేస్తూ, తన అవసరాలను పక్కన పెట్టి ఆమెను నగరంలోని ఒక ప్రతిష్టాత్మక కళాశాలలో చేర్పించాడు. తన పాత సైకిల్పైనే తిరుగుతూ, చిరిగిన దుస్తులతోనే కాలం వెళ్లదీస్తూ కూతురి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించాడు.
సితారకు ఏ లోటు రాకూడదని, ఆమె కళ్లలో ఆనందం చూడటమే తన ధ్యేయంగా బతికాడు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పడుతున్న కష్టం చూసి సితార కళ్లు చెమర్చినా, ఆయన మాత్రం ఎప్పుడూ అలసటను బయటకు రానివ్వలేదు. తన కష్టాన్ని చిరునవ్వుతో దాచిపెట్టి, ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన జీవిత పరమార్థంగా భావించాడు. కూతురు సాధించే చిన్న విజయమైనా ఆయనకు ఎంతో గర్వాన్ని ఇచ్చేది. తండ్రి అందించిన ఆ ప్రోత్సాహం, ఆయన చూపిన నిస్వార్థ ప్రేమే ఆమెను ఈ స్థాయికి చేర్చాయి.
ఒక రోజు ఆమెకు అమెరికాలో ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో ఎం ఎస్ సీటు వచ్చిందని చెప్పినప్పుడు అతని కళ్లలో ఆనందం మెరిసింది.
“నీ కలలు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు అమ్మా, నీ ఎదుగుదలే నా విజయం” అని ఎంతో గర్వంగా చెప్పాడు. విమానాశ్రయంలో ఆమె వెళ్లే రోజు రాఘవ్ నవ్వుతూనే ఉన్నాడు. కానీ ఆమెకు మాత్రం అతని కళ్ళలో దాగి ఉన్న ఒంటరితనం, ఆత్మీయురాలైన కూతురు దూరమవుతుందన్న బాధ స్పష్టంగా కనిపించింది.
“నాన్నా, మిమ్మల్ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు” అని ఆమె అన్నప్పుడు, ఆయన ఆమె చేతులు పట్టుకుని “వెళ్ళు తల్లీ, నీ ఆశయాలు నెరవేర్చుకో, నేను ఇక్కడే నీ కోసం వేచి ఉంటాను” అని ధైర్యం చెప్పాడు.
ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆమె మనసులో సుడిగుండంలా తిరుగుతున్నాయి. సితార నెమ్మదిగా లేచి నిశ్శబ్దంగా ఉన్న తన తండ్రి గదిలోకి వెళ్లింది. అక్కడ పాత టేబుల్పై ఒక చిన్న దినచర్య పుస్తకం కనిపించింది.
అది రాఘవ్ స్వయంగా రాసినది. వణుకుతున్న చేతులతో ఆమె ఆ పుస్తకాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. అందులో ప్రతి పుటలోనూ ఆమె గురించిన ప్రస్తావనే ఉంది.
“ఈ రోజు సితార అమెరికాకు వెళ్ళింది. ఇల్లు వెలితిగా ఉంది, నేను ఒంటరిగా ఉన్నాను. కానీ నాకు బాధ లేదు. ఎందుకంటే నా కూతురు తన కలల వైపు స్వేచ్ఛగా ఎగురుతోంది. నా ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆమెకు చెప్పకూడదు, అది తన పనికి ఆటంకం కాకూడదు.
ఒక రోజు ఆమె తిరిగి చూసినప్పుడు… ఆమె వెనక నేను నిలబడి ఉన్నానని గుర్తుపెట్టుకుంటే చాలు. నా చివరి శ్వాస వరకు తన క్షేమాన్నే కోరుకుంటాను” అన్న వాక్యాలు చదవగానే సితార కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తన అనారోగ్యాన్ని కూడా దాచిపెట్టి, తనను ఉన్నత స్థితిలో చూడాలని తపించిన తండ్రి ప్రేమ ముందు తను ఎంత చిన్నదైపోయానో ఆమెకు అర్థమైంది. ఆ అక్షరాల వెనుక ఉన్న తండ్రి త్యాగం ఆమె గుండెను పిండేసింది.
ఆ మాటలు చదివిన వెంటనే సితార కన్నీళ్లు ఆగలేదు. తన కోసం తండ్రి పడిన తపన, దాచుకున్న వేదన ఆ అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె గుండె చెరువైంది.
ఆమె నెమ్మదిగా ఆ డైరీని తన గుండెలకు గట్టిగా హత్తుకుంది. ఆ పుస్తకంలోని ప్రతి పేజీలోనూ తండ్రి స్పర్శ ఉన్నట్లు, ఆయన తన వెంటే ఉండి ఓదారుస్తున్నట్లు ఆమెకు అనిపించింది.
ఆ రాత్రి ఆ అపార్ట్మెంట్ ఎంతో నిశ్శబ్దంగా ఉంది. కానీ సితారకు మాత్రం ఒక విషయం ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్థమైంది.
తండ్రి అంటే కేవలం రక్తం పంచుకున్న ఒక మనిషి మాత్రమే కాదు; ఆయన ఒక ఆశ్రయం ఇచ్చే నీడ, గుండెకు నిశ్చలమైన ధైర్యం. ఆయన భౌతికంగా మన కళ్ళముందు కనిపించకపోయినా, మనం నడిచే ప్రతి అడుగులోనూ ఒక అదృశ్య శక్తిలా మనతోనే ఉండే అనంతమైన ప్రేమ ఆయన. ఎన్ని సవాళ్లు ఎదురైనా, తండ్రి నేర్పిన విలువలే తనను ముందుకు నడిపిస్తాయని ఆమె గ్రహించింది. సితార కిటికీ బయట అనంతమైన ఆకాశాన్ని చూసింది. అక్కడ మెరుస్తున్న నక్షత్రాల్లో తన తండ్రి చిరునవ్వును వెతుక్కుంది. కళ్లలోని నీటిని తుడుచుకుంటూ, ఆయన ఆశయాలను గౌరవిస్తూ ధైర్యంగా బతకాలని నిశ్చయించుకుంది.
"నాన్నా, మీరు ఎక్కడ ఉన్నా… నేను ఇప్పటికీ మీ చిన్న సితారనే. మీరు నాలో ఎప్పుడూ జీవించే ఉంటారు. మీరు గర్వపడేలా నేను ఎదుగుతాను. నా ప్రతి విజయంలోనూ మీ సంతకం ఉంటుంది. నన్ను ఒంటరిని చేయలేదు మీరు, నా గుండెలో ధైర్యాన్ని నింపి వెళ్లారు" అని సితార తండ్రిని తలచుకుంటూ మనసులోనే గట్టిగా చెప్పుకుంది.
ఆకాశం మౌనంగా ఉంది. కానీ ఆమె హృదయంలో మాత్రం తన తండ్రి ప్రేమ ఎప్పటికీ మిగిలి ఉంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
మాతృత్వం - ఓ భార్య మనోవేదన
రచన: N. ధనలక్ష్మి
“ఏమ్మా డాక్టర్ గారు ఏమన్నారు?” అంటూ హాస్పిటల్ నుండి వచ్చిన కోడలితో వ్యంగంగా అడిగారు అరుణ గారు..
“అది.. అత్తయ్య.. ఇద్దరం హెల్తీగా ఉన్నాము. మెడిసిన్స్ 3 నెలలు వాడమని చెప్పారు”
“అనుకున్నా ఇదే జవాబు మళ్ళీ వింటానని! వెళ్ళిన ప్రతి హాస్పిటల్ డాక్టర్ ఇదే మాట అంటూన్నారు.. కానీ ఫలితం మాత్రం శూన్యం”.
సౌమ్య కాస్త చిన్న బుచ్చుకుంది.. అది గమనించిన కిరణ్ "అమ్మా! డాక్టర్స్ చెప్పిందే కదా మేము చెప్తున్నాం. నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడడము ఏ మాత్రం నచ్చడం లేదు "..
“ఇంకేమి చేయమంటావు నువ్వే చెప్పు కిరణ్ !? పెళ్ళై నాలుగు ఏళ్ళైనా ఎటువంటి శుభవార్త మీరు చెప్పడం లేదు. మీతో పాటు పెళ్ళి అయిన నీ ఫ్రెండ్ వర్ధన్ గాడికి ఓ కొడుకు, పక్కింటి సరోజ గారి అబ్బాయికి పెళ్ళై ఏడాది గడిచిందో లేదో వారికి కూడా కవల పిల్లలు పుట్టారు.. కానీ మన ఇంట్లో ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. బయటకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎక్కడ మనవడు, మనవరాలు గురించి అడుగుతారని వారికి సమాధానం చెప్పలేక ఇంట్లోనే ఉంటున్నాను.. నా తలరాతలో రాసి పెట్టీ లేదేమో మనవడితో ఆడుకునే అదృష్టం. సర్లే, ఎన్నో అనుకుంటాము.. అన్ని అవుతాయా.. వంట సిద్దం చేసి టేబుల్ పై పెట్టాను. తినేసి నిద్ర పొండి” అంటూ తన బాధను చెప్పేసి తన రూంలోకి వెళ్తూ కోడలి సౌమ్య వైపు కోపంగా, అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయారు అరుణ గారు..
“అత్తయ్య పిల్లల కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అండి. కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది. ఇద్దరిలోనూ ఎటువంటి లోపం లేదు. మనం రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నాము. ఎటువంటి ప్రీకషన్ వాడటం లేదు కదా. కానీ ఎందుకు నేను గర్భవతి కాలేక పోతున్నాను”
“అబ్బా!? మనకేమి వయసు దాటి పోలేదు సౌమ్య.. అమ్మ గురించి నీకు తెలిసింది కదా.. అమ్మన్న మాటల గురించి ఆలోచించి మనసును కష్ట పెట్టుకోకు..”
“పోనీ మీరు ఇంకో పెళ్ళి చేసుకుంటే అత్తయ్య కోరిక నెరవేరుతుందేమో కదండీ..”
“పెళ్లై కదా! చేసుకుంటాను. నువ్వే అమ్మాయిని చూడు. అలాగే నీ కోసం కూడ ఓ మంచి అబ్బాయిని చూసుకో. ఇద్దరం కలిసి ఒకే మండపంలో పెళ్ళి చేసుకుందాం. ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావు??”
“ఏవండీ! ఏంటండీ అంత మాట అన్నారు.. మీరు నా ప్రాణం అండి.. ఈ తనువు, ఈ మనసు మీదే.. మరెవరికీ చోటు ఇవ్వలేను అండి..”
“మరెలా నేనెలా ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోగలను.. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరుకు సౌమ్యని మరవడం జరగదు..”
“క్షమించండి.. చాలా తప్పుగా మాట్లాడాను..”
“నేను చాలా హర్ట్ అయ్యాను.. దానికి పనిష్మెంట్ గా ఈ రోజంతా నిన్ను వదిలిపెట్టను” అంటూ సౌమ్యను అల్లుకుపోయాడు.. ఆ రోజును ఇద్దరికీ మధుర రాత్రిగామల్చుకున్నారు..
సౌమ్య, కిరణ్ ది ప్రేమ వివాహం.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఒక్క పిల్లలు లేరన్న లోటు తప్ప వారి మధ్య ప్రేమకు ఏ లోటూ లేదు.
అరుణగారికేమో మనవడు, మనవరాలు పుడితే వారితో సమయాన్ని గడపాలని కోరిక.. బంధువుల, ఇరుగు పొరుగువారి అందరి ఇళ్ళలో పిల్లలు ఉన్నారు.. తన ఇంట్లో లేరన్న బాధ ఒక కారణమైతే, ఎక్కడకి వెళ్తున్న అడిగే ప్రశ్నలు మరోక కారణం..
సౌమ్య కూడ పిల్లలు కలగాలని కనిపించిన ప్రతి దేవుడిని వేడుకుంటుంది. వాళ్ళ అత్తయ్య చెప్పినట్టుగా నోములు చేస్తూ, ఉపవాసాలు చేస్తుంది. కానీ ఫలితం మాత్రం శూన్యం.. తిరగని హాస్పిటల్ లేదు మొక్కని దేవుడు లేరు..
ప్రతి రోజు అరుణ గారు ఎదొకటీ పిల్లల గురించి అనడం, సౌమ్య ఏడుస్తూ ఉండటం. అది విని కిరణ్ నచ్చచెప్పడం ఇదే తంతు..
“ఏంటి సౌమ్య! పూరి చేసినా, ఓట్స్ తింటున్నావు..”
“అదేమీ లేదండి. డైట్ మారుస్తున్న..”
“సౌమ్య.. ఇలా తిండి కంట్రోల్ చేసుకుంటే పిల్లలు పుట్టరు.. కడుపు నిండా తిని, మనం ప్రేమగా ఉంటే పుట్టేది. తిను” అంటూ బలవంతంగా పూరి తినిపించాడు కిరణ్..
ఆఫీసు కి వెళ్తూ "అత్తయ్యా! మీ కోసం గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, క్యారట్ ఫ్రై చేశాను.. మీరు రైస్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. "..
“సరే సౌమ్య.. మీరిద్దరూ రేపు ఆఫీసుకి సెలవు పెట్టండి..”
“ఎందుకమ్మా..”
“నీ చెల్లెలు అనుకి సీమంతం రా.. మొన్ననే మీ పిన్ని వచ్చి నన్ను, సౌమ్యని పిలిచి మరీ వెళ్ళింది”
“అది కాదమ్మా సౌమ్య ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టుకుంది. మళ్ళీ లీవ్స్ అంటే కొంచం కష్టం అవుతుందేమో..”
“అవ్వన్నీ నాకు తెలీదు. మనం ఫంక్షన్స్ కి వెళ్ళాలి అంతే..”
“సరే రా సౌమ్య, మనకి లేట్ అవుతుంది..” బైక్ పై వెళ్తూ“అమ్మకి తోడుగా పక్కింటి సరోజ గారు వెళ్తారు లే.. ఆవిడని కూడ మా పిన్ని పిలిచింది అంటా..”
“ఏవండీ! నేను సర్ ని రిక్వెస్ట్ చేసి వీకెండ్స్ లో వర్క్ చేస్తానని చెప్తాను.. మనం ఫంక్షన్ కి వెళ్దాం.. అత్తయ్య బాధ పడటం నేను చూడలేను..”
“సరే నీ ఇష్టం..”
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
మరుసటి రోజు ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు..
ఆ ఫంక్షన్ కి వచ్చిన వారిలో ఎవరో అబ్బాయి ఏడుస్తుంటే సౌమ్య ఎత్తుకుంది.. ఆ అబ్బాయి కూడా ఏడుపు ఆపేసి కిల కిల నవ్వుతున్నాడు..
అక్కడున్న కిరణ్ తరుపున బంధువులు అంతా మీరెప్పుడు శుభవార్త చెప్తారంటూ అడుగుతూనే ఉన్నారు.. కిరణ్ త్వరలోనే చెప్తానంటూ నవ్వుతూ సమాధానం చెప్తూ ఫంక్షన్ పనుల్లో సాయం చేస్తున్నాడు.
అరుణ గారిని ఇదే ప్రశ్నలు అడుగుతుంటే నవ్వుతూ సమాధానం దాటేసింది. ఎక్కడకి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురువుతుంటే పిల్లాడిని ఆడిస్తున్న కోడలి వైపు కోపంగా చూసింది.
అత్తయ్యా తన వైపు ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక బాధగా అనిపించి ఆ అబ్బాయిని వాడి కన్నతల్లికి చేర్చి పనుల్లో సాయం చేస్తుండిపోయింది.
సీమంతం జరగుతున్న అనూకి తాను కూడా పసుపు రాసి కుంకుమ పెట్టాలని సౌమ్య ముందుకు వెళ్తుంటే" అమ్మ! అను కిచెన్లో గిఫ్ట్స్ పెట్టాను.. ఎక్కువగా ఉన్నాయి.. కాస్త సాయంగా రామంటు "లోపలికి పిలుచుకొని వెళ్ళింది అను వాళ్ళమ్మ..
“చెప్పండి చిన్న అత్తయ్యా గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయో..”
" గిఫ్ట్స్ అనేవి ఏమి లేవు ఇక్కడ.. అయిన ఏ మొహం పెట్టుకొని నా బిడ్డకి పసుపు రాసి ఆశీర్వదించాలనిఅనుకున్నావు. పెళ్ళై నాలుగు ఏళ్ళైనా ఇంత వరుకు ఏ శుభవార్త లేదు.. నీ మొహం చూస్తూంటే అర్థం అవుతుంది. పిల్లలూ ఇంకపై పుట్టేరేమొన్న అనుమానం వస్తుంది. నీలాంటి గొడ్రాలు నా బిడ్డని ఆశీర్వదించకూడదు"..
ఎదో ఫోన్ వస్తే మాట్లాడుతూ కిరణ్ అటువైపుగా వచ్చి వీరి మాటలు విన్నాడు.. కోపంగా వారి వద్దకు వచ్చాడు.
"పిన్ని.. అసలు మీరు ఆడవారేనా. బిడ్డలు లేరన్న ఒకే ఒక్క కారణంతో నా భార్యను అవమానించే హక్కు మీకు ఏ మాత్రం లేదు. మీరే కదా మా ఇంటికి వచ్చి ఫంక్షన్ కి రమ్మని ఆహ్వానించారు. అందుకే కదా మేము ఇక్కడకి వచ్చాము.. ఇలా పిలిచి అవమానించడం సబబునేనా. ఈ ఫంక్షన్ కి రావడం కోసం మేమిద్దరం వీకెండ్స్ లో వర్క్ చేస్తామని పర్మిషన్ తీసుకుని ఇక్కడకి వచ్చినందుకు మాకు బాగానే బుద్ది చెప్పారు.. "
అరుణ గారిని, సౌమ్యని తీసుకోని ఇంటికి వెళ్లిపోయాడు కిరణ్..
జరిగిన దానికి ఏడుస్తున్న సౌమ్య తన మాటలతో ఒదార్చాడు కిరణ్..
సీమంతం ఫంక్షన్లో జరిగిన విషయం అరుణ ద్వారా విన్న పక్కింటి సరోజ గారు "సౌమ్యకి ఎదో ప్రాబ్లెమ్ ఉన్నట్టుగా ఉంది. అందుకేనేమో తనకి పిల్లలు పుట్టడం లేదు. అమ్మ కాలేని అమ్మాయి జీవితం ఎప్పటికీ అసంపుర్ణమే. తన వల్ల మీ వంశం అగిపోకూడదు. నా మాట విని కిరణ్ కి మరొక పెళ్ళి చేయండి" అంటూ ఉచిత సలహా ఇచ్చింది..
అప్పుడే ఆఫీసు నుండి తిరిగి వచ్చిన కిరణ్, సౌమ్య విన్నారు..
“వారెవ్వా ఆంటీ! ఏం సలహా ఇచ్చారు.. సౌమ్య ప్లేస్ లో మీ కూతురు అక్షర ఉంటే ఇలాగే సలహా ఇస్తారా!?? ఒకరి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు.. అయిన ప్రాబ్లెమ్ ఉండేది సౌమ్య లో కాదు నాలో.. మీరు మనిషేనా.. మొన్న మీకు జ్వరం వచ్చి చూసే దిక్కు లేకపోతే నా భార్య దగ్గరుండి సపర్యలూ చేసింది. కనీసం ఆ కృతజ్ఞత కూడ లేదు. దయచేసి మా ఇంటికి రాకండి..”
సరోజ గారు సిగ్గుతో తలదించుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు..
“ఏంటి కిరణ్ ఏమి అంటూన్నావు? నీలో లోపం ఉందా!??”
“అవునమ్మ. డాక్టర్ ఇందాకే కన్ఫర్మ్ చేశారు. మెడిసిన్ వాడితే ఒన్ ఆర్ టూ యియర్స్ లో నయం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఏమో.. నాకు ఎప్పటికీ నయం కాకపోతే సౌమ్య జీవితం నాశనం అవుతుందేమో కదా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్న.. సౌమ్యకి విడాకులు ఇస్తాను.. తాను ఇంకొక పెళ్ళి చేసుకొని పిల్లలను కని అమ్మ అవుతుంది. అందరి చేత మాటలు పడే కర్మ తనకుండదు..”
“అదేంటి రా.. అలా అంటావు.. అమ్మాయికి.. అందులో నీ భార్యకి మరో పెళ్ళెలా చేస్తారు”.
“తనలో లోపం ఉంటే నేను ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు. అదే లోపం నాలో ఉంటే మాత్రం తను చేసుకోకూడదు.
వారెవ్వా, ఏమి చెప్పావు అమ్మ.
. సౌమ్య ప్లేసులో నీ కూతురి ఉంటే ఇలాగే అలోచిస్తావా!? లేదుగా.. అత్తగా కాకుండా అమ్మగా ఆలోచించు అమ్మ.. అది కుదరదా కనీసం ఓ ఆడదానిగా తన బాధను అర్థం చేసుకో అమ్మ..”
అరుణ గారికి తను చేసిన తప్పుమిటో అవగతం అవ్వడంతో బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోయారు..
“ఏవండీ!? ఎందుకు మీలో లోపం ఉన్నట్టుగా చెప్పారు..”
“కావాలనే చెప్పాను సౌమ్య.. నాలో లోపం ఉందంటే నిన్ను పిల్లల గురించి పదే పదే అడుగుతూ విసిగించండం మానేస్తారు.. ఆడవారిలో లోపం ఉంటే వేలెత్తి చూపే సమాజం అదే లోపం మగవారిలో ఉంటే సైలెంట్ గా ఉంటారు..”
‘దేవుడు బిడ్డ విషయంలో నన్ను చిన్న చూపు చూస్తున్న భర్త విషయంలో మాత్రం చాలా గొప్ప వరాన్నే ఇచ్చాడు’ అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకుంది..
కిరణ్ ప్రేమగా తనని గుండెలకు హత్తుకుని "చూస్తుండు సౌమ్య త్వరలో మన జీవితంలో కూడా దేవుడు సంతోషాలను తీసుకోని వస్తాడు"..
కిరణ్ మాటల ప్రభావం అరుణ గారి మీద బాగానే పని చేసింది. సౌమ్యను ప్రేమగా చూడటం మొదలు పెట్టారు..
కిరణ్ కూడ వాళ్ళమ్మలో వచ్చిన మార్పుకు ఆనందపడ్డాడు..
రోజులు అలా సరదాగా దొర్లి పోతుండగా..
ఒక రోజు టీవీలో ఎవరో అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో వదిలిపెట్టి వెళ్ళారు అని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు..
“నాకు బిడ్డలు పుట్టరని తెలిసి ఎంత బాధ పడుతున్న.. అలాంటిది ఆ పసికందును ఎలా అండి చెత్త కుప్పలో విసిరేసి వెళ్ళారు.. వాళ్ళకి కొంచం కూడా పాపం అనిపించలేదా.. ఏవండీ! మనం ఆ బిడ్డను తెచ్చుకుందామా.. !??” అని సౌమ్య అడగడంతో.. “తప్పకుండా ! రా ఇప్పుడే వెళ్దాము. ఇంకా నుంచి మన బిడ్డగా తను పెరుగుతుంది” అంటూ నేరుగా న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
కిరణ్, సౌమ్య కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తి చేసి పాపని తెచ్చుకున్నారు.. ఆనాటి నుండి పాపే వారి లోకం అయింది.. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు..
ప్రతి నెల సౌమ్యను, పాపని కలిపి రకరకాలుగా ఫోటోలు తీసి వాటిని గోడలపై అందంగా అలకరించేవాడు కిరణ్.
తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాప అంటే ఇద్దరికీ పంచప్రాణాలు.. పాపకి శిశిర అని పేరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కోర్ట్ లో మగ్గుతున్న తమ పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఇకపై సౌమ్యదేనని తీర్పు ఇచ్చారు.
అదంతా శిశిర తమ జీవితంలోకి రావడం వల్లే అని తమ ఇంటి మహాలక్ష్మి గా భావించారు. అరుణ గారు కూడా కొడుకు, కోడలి సంతోషమే ముఖ్యమని భావించి పిల్లల గురించి ఏ రోజు ప్రస్తావించలేదు..
పాప అమ్మ అంటూంటే సౌమ్య ఎంతో పొంగిపోయేది. పాపకి మూడు ఏళ్ళు ఉన్నప్పుడు సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయింది.. కంగారు పడిన కిరణ్, డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు..
సౌమ్య నెల తప్పిందని చెప్పారు డాక్టర్.. రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి.. ఈ మందులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడండి అని డాక్టర్ సూచనలు ఇచ్చారు..
ఇంటికి చేరుకొని శిశిరను తీసుకొని ముద్దులతో ముంచెత్తి రేయ్ కన్న నువ్వు అడుకోవడానికి తమ్ముడూ రాబోతున్నారు అని ఆనందపడ్డారు ఇద్దరు.. అరుణ గారు కూడ ఎంతో సంతోషించారు..
మాతృత్వంలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తోంది సౌమ్య..
శిశిర వల్లే తమకి ఈ అదృష్టం దక్కిందని వాళ్ళ నమ్మకం. కొన్ని నెలల తరువాత సౌమ్యకి కవలలు పుట్టారు ఆ పిల్లలను చూసి ఎంతో ఆనంద పడ్డారు.
శిశిర అయితే తన తమ్ములను ఇద్దరినీ చూసితెగ ముద్దులు పెడుతూ మమ్మీ నా కోసమే ఇద్దరు వచ్చారు.. థాంక్స్ మమ్మీ అంటూ సౌమ్య మొహానికి ముద్దులు పెట్టింది..
మరి పప్ప కు లేదా అని అనడం ఆలస్యం కిరణ్ చేరి ముద్దులు పెట్టింది శిశిర.
దీక్షిత్, దక్షిత్ అని పేర్లూ పెట్టారు పిల్లలకి.. పిల్లల ప్రతి పుట్టిన రోజుకి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నారు..
దీక్షిత్, దక్షిత్ ను ఎవరైనా ఏమైనా అంటే శిశిర అసలు ఊరుకోదు.. చివరకి అమ్మ, నాన్న అయిన సరే.. శిశిర కు తన తమ్ముళ్ళ పైనున్న ప్రేమను చూసి మురిసిపోయే వారు సౌమ్య, కిరణ్..
శిశిర, దీక్షిత్, దక్షిత్ అల్లరి కేరింతలతో ఆనందంగా వారి జీవితం సాగిపోతుంది..
*****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
పుణ్యం కోసం
(హాస్య కథ)
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
“అలా డబ్బాలు వెతుకోక్కపోతే నాలుగు జంతికలు వేసుకోవచ్చుగా, నాకు కుడి చెయ్యి పని చెయ్యదు. లేకపోతే నేనే చేసే దానిని” అంది శ్రీలక్ష్మి, భర్త శేఖరం తో.
“జంతికలు చెయ్యడానికి నీ చెయ్యి పనికిరాదు, తినడానికి నాకు పళ్ళు నొప్పి. అందుకే పాత స్టాక్ ఏమైనా వుందేమో అని డబ్బాలు వెతుకుతున్నాను” అన్నాడు.
“సరే గాని 24 గంటలు ఆ భగవంతుడి థ్యాసే గాని భర్తకి రెండు మైసూర్ బజ్జిలు గాని, లేదా ఏ టమోటో పులిహోర చేద్దామని గాని నీకు వుండదా” అన్నాడు భార్య తో.
“తిరిగి తిరిగి నా మీదకి వచ్చారా, సాయంత్రం అలా బజారు వెళ్ళినప్పుడు ఏమైనా కొని తెచ్చుకోవాలి, అన్నీ ఇంట్లోనే అమర్చి పెట్టాలి అంటే నా వల్ల కాదు. రోజూ మీరు కూడా ఆ భగవంతుడి గురించి కొంతసేపు తలుచుకుంటే మళ్ళీ మానవ జన్మ వస్తుంది, లేకపోతే జంతువు గా పుడతారని గరికిపాటి వారు, చాగంటి వారు రోజూ చెపుతున్నారు” అంది శ్రీలక్ష్మి.
“నాతో చెప్పినప్పుడు చూద్దాం లే, అయినా నీ పుణ్యం లో సగం నాకిస్తావుగా” అన్నాడు..
“ఇదేమన్నా వండుకున్న కూర అనుకున్నారా నాకు లేకపోయినా మీకు వడ్డించడానికి, నా మాట విని రేపటి నుండి ఏ భాగవతం పుస్తకం నుంచి రెండు పేజీలు చదువుకోండి, మీ మంచికే చెప్పేది” అంది.
“సరే రేపటి నుండి చదువుతానులే” అని మేడ మీదకి వెళ్ళిపోయాడు శేఖరం మొక్కలకి నీరు పోయడానికి.
తోటలో కాసిన గులాబీలు, చామంతి, మల్లెపూలు కోసి దేముడు గదిలో పెట్టాడు, భార్య ఉదయమే లేచి స్నానం చేసి దేముడికి ఒక గంటసేపు అయినా పూజ చేస్తుంది. శేఖర్ లేచి సాయిరాం అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్లి కాఫీ కలుపుకుని వచ్చి టీవీ లో న్యూస్ చూడటం మొదలుపెట్టాడు.
మేడమీద నుంచి కిందకి దిగుతో, “త్వరగా స్నానం చేసి ఆ శివుని విగ్రహం మీద పాలు పోసి, మారేడు దళం పెట్టండి, ఈ రోజు శివరాత్రి అని గుర్తుందా” అంది భర్త తో శ్రీలక్ష్మి.
“ఓహో ఈరోజు శివరాత్రా, అయితే చలి తగ్గిపోతుంది” అన్నాడు.
“నా ఖర్మ, ఈ రోజు నేను ఉపవాసం, మీరు కూడా ఉపవాసం వుంటారా” అంది.
“షుగర్ పేషెంట్స్ ఉపవాసం వుండకూడదు, నేను నాకోసం వంట చేసుకుంటాలే” అన్నాడు శేఖర్.
“సరే అయితే త్వరగా స్నానం చేసి రండి శివాలయం కి వెళ్లి అభిషేకం చేసుకుందాం, ఈరోజు చేసిన అభిషేకం ఎంతో పుణ్యం యిస్తుంది” అంది శ్రీలక్ష్మి.
“చూడు.. ఒక పక్కన పూజలతో పుణ్యం సంపాదించుకుని, యింకో పక్కన నన్ను సాధిస్తో పాపం తెచ్చుకుంటున్నావు. చివరికి మిగిలేది సున్నా, అందుకే నీ పూజలు నువ్వు చేసుకో, నా దారికి రాకు, నేను మనసులోనే దేముడిని తలచుకుంటో వుంటాను తెలుసా” అన్నాడు శేఖర్.
తలుపు దగ్గరగా వేసి “నేను గుడికి వెళ్తున్నా” అంది.
“వుండు, ఎండలో ఎలా వేడతావు, నేను దింపుతాను” అని లేచి చెంబుడు నీళ్లు తలమీద పోసుకుని, బట్టలు మార్చుకుని కారు గుడివైపు పోనిచ్చాడు.
“బాబోయ్ ఏమిటి ఈ జనం, అభిషేకం చేయాడానికే! నేను ఈ అరుగు మీద కూర్చొని వుంటాను, నువ్వు త్వరగా పూజ ముగించుకుని రా” అన్నాడు శేఖర్.
“యింత దూరం వచ్చారుగా, మీరుకూడా రండి అభిషేకం చేద్దురుగాని” అంది శ్రీలక్ష్మి.
“ఈ జనం లో నేను నుంచోలేను, త్వరగా రా” అని అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. చాలా పెద్ద గుడి, ఈ గుడి చుట్టూ నాలుగు సార్లు తిరిగేస్తే ఈరోజు వాకింగ్ అయిపోతుంది అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. మనసు తనంతట తనే శంభో శంకరా అంటోంది. అరగంట తరువాత శ్రీలక్ష్మి బయటకు వచ్చి భర్త కోసం చూస్తే, గుడి చుట్టూ తిరిగేస్తున్న శేఖర్ కనిపించాడు.
“మీరే నయ్యం గుడి చుట్టూ ప్రదక్షణ చేసుకున్నారు, నన్ను ఒక్కక్షణం కూడా దేముడిని చూడనివ్వలేదు పాడు జనం” అంది శ్రీలక్ష్మి.
“అయితే అభిషేకం చెయ్యలేదా?” అన్నాడు శేఖర్.
“ఎక్కడా, జనం తోసేస్తో వుంటే” అంది చేతిలోని బుట్ట భర్త చేతికి యిస్తో.
“సరే కూర్చో”, అంటూ బుట్టలోని అరటిపళ్ళు అక్కడే వున్న ఆవుకి వేసి, పాలు ఆవు మీద పోసాడు.
“అయ్యో అయ్యో అదేమిటి.. నేను సాయంత్రం వేరే గుడికి వెళ్దాం అనుకుంటూ వుంటే పళ్లు, పాలు ఆవుమీద గుమ్మరిస్తారా, నాదీ తప్పు బుట్ట మీ చేతికివ్వడం” అంది కోపంగా శ్రీలక్ష్మి.
“యింకా శివరాత్రి సాయంత్రం కూడా వుందా” అన్నాడు నవ్వుతు కారు ముందుకి పోనిస్తో.
“నన్ను విసిగించకండి. చిరాకుగా వుంది” అంది శ్రీలక్ష్మి.
శేఖర్ తన కోసం వండిన అన్నం తినేసి పడుకున్నాడు. శ్రీలక్ష్మి భక్తి టీవీ లో శ్రీశైలమహాత్యం చూస్తో కూర్చుంది.
కారులో వెళ్తున్న శేఖర్ దంపతులని ఎదురుగా లారీ వచ్చి గుద్దేసేంది.
“నడవమ్మా పెళ్లి నడకలు, యిలా అయితే ఇంద్రసభ లో రంభ డాన్స్ వుంది మిస్ అయిపోతాము” అంటున్న దేవభటులుని చూసి శ్రీలక్ష్మి అయితే తను చనిపోయి స్వర్గం కి వచ్చాను అన్నమాట, అవునులే ఎన్నీ పూజలు చేసాను, ఫలితం వుంటుంది మరి అనుకుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
‘పాపం ఆయనని ఏ లోకంలోకి తీసుకుని వెళ్ళారో, అప్పటికి చెపుతోనే వున్నాను కొద్దిగా కృష్ణా రామా అనుకోమని, వింటేనా పాపం ఆ యమలోకంలో ఏం బాధ పడుతున్నారో’ అనుకుంది భర్త శేఖర్ గురించి.
ఇంద్రలోకం లోకి ప్రవేశించారు, కిటకిట లాడుతున్న సభని పరికించి చూసి, సినిమాలో చూపించినంత అందంగా లేదు అనుకుంది శ్రీలక్ష్మి. అదేమిటి ఇంద్ర దేముడి ఆసనం పక్కన వున్న ఋషి గారితో తన భర్త కూర్చుని ఏదో కబుర్లు చెప్పేస్తున్నారు అనుకుని తన పక్కన వున్న భటుడిని, “బాబూ నేను పూజలు చేసాను కాబట్టి స్వర్గం కి వచ్చాను, మరి అటువైపు ఋషి గారితో మాట్లాడుతో కూర్చుని వున్న మా ఆయన ఏ పూజ చెయ్యకుండా యిక్కడికి ఎలా వచ్చారు” అంది.
“మీ ఆయన అంటే మాకేం తెలుసమ్మా, వుండు ఎలా వచ్చాడో తెలుసుకుని చెపుతాను” అని మాయం అయిపోయాడు.
“ఒక గడియలో మళ్ళీ వచ్చిన భటుడు, “అమ్మా! ఆయన నీ కంటే ఎక్కువ పుణ్యం సంపాదించాడు. నువ్వు చేసే దేముడు పూజలకు రోజూ పువ్వులు కోసి సిద్ధం చేసేవాడు, నువ్వు ప్రశాంతం గా పూజ చేసుకోవటానికి తన టిఫిన్ తనే చేసుకునేవాడు, ఎండలో గుడికి వెళ్తోంది పాపం అని నిన్ను తన కారులో తీసుకుని వెళ్ళేవాడు. అన్నిటికంటే శివరాత్రి నాడు గోవు కి అభిషేకం చేసి శివకేశవులకి బేధం లేదని నిరూపించాడని శివుడు మెచ్చి స్వర్గంలోకం ప్రాప్తిరస్తు అన్నారుట, అది విషయం” అన్నాడు.
ఇంతలో ‘నారాయణా నారాయణ’ అంటూ సభలోకి నారదుడు ప్రవేశించాడు. ఆయన గురించి భూలోకంలో ఎన్నో కథలు విన్న శ్రీలక్ష్మి భక్తి గా ఆయన కాళ్లకు నమస్కారం చేసింది.
“లేమ్మా, యింతవరకు భార్యాభర్తలు యిద్దరూ కలిసి ఒకే లోకం కి రావడం యిదే మొదటిసారి. అటు చూడు తల్లీ, మీ ఆయన దేవ గురువుగారిని కాకా పట్టి తను శాశ్వతంగా స్వర్గంలో వుండేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు చూడు గురువుగారు అలా విరగబడి నవ్వడం నేను అదివరకు చూడలేదు.
నీ భక్తికి మెచ్చి నీకు ఒక సహాయం చేస్తాను, వెళ్లి నీ భర్తకి నమస్కరించు, ఆయన చెప్పినట్టు చెయ్యి” అన్నాడు నారద ముని.
‘సరే స్వామి’ అని, మెల్లగా వెళ్లి భర్త కి ఎదురుగా నుంచుని నమస్కారం చేసి “మిమ్మల్ని మళ్ళీ యిలా కలవడం చాలా సంతోషం గా వుంది’.
నారద ముని మహిమ వల్ల తన భార్యని గుర్తించి, “గురువుగారికి ప్రణామం చెయ్యి”, “స్వామి ఈమె నా భార్య, మహా భక్తురాలు, నిత్యం దైవ స్మరణతో గడిపేది, అందులో మీ మహిమలు గురించి ఎన్నో ప్రవచనాలు వినేది” అని చెప్పేడు..
సంతోషం తో గురువుగారు కమండలంలోని జలం తీసుకుని శ్రీలక్ష్మి మీద చల్లి, శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు.
“మా ఆవిడ ని వదిలి వుండలేను, నేను చేసిన పుణ్యం అయిపోగానే వెళ్ళిపోవాలి స్వామి, నా మీద కూడా కటాక్షం చూపించండి గురువుగారు” అన్నాడు శేఖర్.
నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనేక కథలు చెప్పి నవ్వించావు అని కమండలం లోనుండి జలం తీస్తోవుంటే, “గురువుగారు, నీళ్లు కొద్దిగానే జల్లండి, నాకు నెత్తిమీద నీళ్లు పడితే జలుబు చేస్తుంది” అన్నాడు శేఖర్ తలవంచుతూ.
“మళ్ళీ నవ్వించేశావు” అంటూ జలం చల్లి “శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు” అని దీవించారు. అంతే గురువుగారి కుర్చీనుంచి మాయం అయ్యిపోయారు
“గురువుగారు గురువుగారు” అంటూ కంగారుగా పిలుస్తున్న శేఖర్ దగ్గరికి నవ్వుతు వచ్చిన నారద ముని, “యింకా ఎక్కడ గురువుగారు, తను చేసిన తపస్సు ఫలితం వలన ఇంద్రుడు కి గురువుగారు గా పదవి వచ్చింది. యిప్పుడు తన తపస్సు ఫలం ఉపయోగించి మీకు శాశ్వతంగా యిక్కడ ఉండేడట్లు దీవించారు. దానితో ఆయన తపస్ ఫలితం అయిపొయింది, భూలోకం లో కి వెళ్లిపోయారు, మళ్ళీ ఒక యుగం తపస్ చెయ్యాలి నారాయణా” అన్నాడు నారద ముని.
“అయ్యో మా వల్ల గురువుగారు మళ్ళీ భూలోకంలో కి వెళ్లిపోయారా నారాయణా నారాయణ” అన్నాడు చెంపలు వేసుకుంటో శేఖర్.
“ఏమిటి కళ్ళు తెరవగానే వాట్సాప్ మెసేజ్ లు చూసుకునే మీరు, నారాయణా నారాయణ అంటూ కలవరింతలు, లేవండి, తొమ్మిది గంటలు అయ్యింది” అంటున్న భార్య గొంతు విని, ఉలిక్కిపడి లేచి, ‘అమ్మయ్యా ఇదంతా కల అన్నమాట. గురుద్రోహం చేసాను అని భయపడ్డాను’ అనుకుని లేచి స్నానం పూర్తి చేసుకుని పట్టుపంచె కట్టుకుని పూజా గదిలోకి ప్రవేశించాడు.
అప్పటికే దీపారాధన చేసి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేసుకుని శ్రీలక్ష్మి వెళ్లినట్టుంది, దీపారాధన కాంతులతో వేంకటేశ్వరస్వామి మెరిసిపోతున్నాడు, శివుడి మీద పాలు పోసి, నుదుటిన విభూతి రాసుకుని రుద్రాక్ష మాలతో కళ్ళుమూసుకొని జపం చేసుకువడం మొదలెట్టాడు. మొహం కడుకోవడానికి వెళ్లిన భర్త యింకా రాలేదేమిటి అనుకుంటూ మేడమీద గదికి వచ్చి చూసిన శ్రీలక్ష్మి పూజాగదిలో కఠోర జపం లో వున్న భర్తని చూసి, బాగానే వుంది ఏమిచేసినా అతే అనుకుంటూ వచ్చేసింది.
మొహం నిండా విభూతి నుదట కుంకం బొట్టుతో మెట్లు దిగుతు “ఏమో అనుకున్నాను.. పూజామందిరం లో వున్న ప్రశాంతత ఎక్కడా దొరకదు లక్ష్మి, యిన్నాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేసాను, ఈ రోజు నుంచి నాది నీ దారే” అంటూ రాత్రి వచ్చిన కల గురించి వివరించి చెప్పాడు.
“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం గురించి నీకు బాధ్యత లేదు, అది నేను చూసుకుంటా” అన్న భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ ని నమ్మి ఎవ్వరికీ అపకారం చేయకుండా మన జీవితం గడపాలి అంతే” అంది శ్రీలక్ష్మి.
శుభం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
ఒక యోచన - ఒక అవలోకన
రచన: పాండ్రంకి సుబ్రమణి
మంగళాపురం కాలనీ మొదటి రోడ్డు వచ్చేటప్పటికి దక్షిణ మూర్తి కారు వేగం తగ్గించి సుదీర్ఘంగా సాగే పక్క దారిలోకి మలుపు తిప్పాడు. కాసేపు ముందుకు కారుని డ్రైవ్ చేస్తూ ఆపాడు. పిదప ఫ్రంట్ డోరు తెరిచి డ్రైవింగు సీటునుండి క్రిందకు దిగి నవ్వు ముఖంతో మేనల్లుడు సుదర్శనం వేపు సాభిప్రాయంగా చూసి, ఇక దిగమన్నట్టు సంజ్ఞ చేసాడు.
సుదర్శనం వెంటనే దిగలేదు. ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ “మీ ఫ్రెండు వాళ్ళ యిల్లు అన్నావే! ఇదేనా మామయ్యా! ”
దక్షిణమూర్తి విప్పారిన ముఖంతో తలూపాడు. అప్పుడు సుదర్శనం తల విదిలిస్తూ అన్నాడు- “కాదు మామయ్యా! ముమ్మాటికీ ఇది ఇల్లు కాదు. సుందరమైన శ్వేత భవంతి” అంటూ ఆ ఇంటిని ఇంకా విస్మాయాత్మకంగా పరకాయిస్తూ కారు నుండి దిగాడు. ఆ యింటిని చూసి సుదర్శనం అంతలావు అబ్బురపడటానికి కారణం ఉంది. బోలెడంత కారణం ఉంది. దక్షిణామూర్తి వాళ్ల చిన్ననాటి మిత్రుడింటికని బయల్దేరదీసినప్పుడు అదేదో తమ స్థాయిలోనో లేక తమకంటే కాస్తం పై ఎత్తున ఉండే బంగళా టైపు ఇల్లో అయుంటుందనుకునే మామయ్య వెంటవచ్చాడు. తీరా యిప్పుడిక్కడకు వచ్చి చూస్తే అదొక వైట్ హౌస్ తరహా కళాత్మక కట్టడంలా ఉంది.
మామయ్యతో కలసి అడుగులు చేస్తూ అన్నాడతను- “అయితే మామయ్యా.. మొత్తానికి మీ దివంగత ఫ్రెండు మోతుబరి వ్యాపారస్థుడే కాదు, మంచి రసికత గల కళాకారుడు కూడానన్నమాట! ”
“వ్యాపారం వల్ల చేకూరిన ద్రవ్యార్జన మాత్రమే కాదు, అతడికి పిత్రార్జితంగా యాబై యెకరాల వరిభూమి కూడా సక్రమించింది”.
అప్పుడు సుదర్శనం గంభీరవదనంతో అన్నాడు-“బ్యాడ్! వెరీ బ్యాడ్! పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళి పోయినవాడు తానుగా వెళ్ళిపోకుండా తన భాగస్వామినిని కూడా వెంట తీసుకెళ్ళిపోయాడు. అందుకే అంటారు దేనికైనా ప్రాప్తం ఉండాలని! ”
ఈ లోపల దక్షిణమూర్తి వచ్చిన అలికిడి గమనించి, నౌఖర్లిద్దరూ మెయిన్ గేటు తీసి దక్షిణాముర్తికి దండాలు పెట్టి అతడి చేతినుండి సూటుకేసు అందుకుని “అమ్మగారు మీ కోసం యెదురు చూస్తున్నారయ్యా! ” అంటూ లోపలకు వెళ్ళిపోయారు; వాళ్ళు వచ్చిన కబురు మృణాళినికి అందజేయడానికి.
అప్పుడు దక్షిణమూర్తి అదే చెరగని చిరునవ్వుతో వెనుతిరిగి అడిగాడు- “తోట నచ్చింది కదూ! ”
దానికి సుదర్శనం నవ్వూతూ స్పందించాడు- “మళ్ళీ అదే మాటా! ఇది భూలోకానికి చెందిన తోట కాదు మామయ్యా! కుబేరుడి చైతన్యరథం. ఇంకానయం, దీనిని సత్యభామ చూడలేదు. చూసుంటే శ్రీకృష్ణుడి చెవిలో ఊది సొంతం చేసుకున్ను. మరి దీనిని సాకటానికి చాలా ఖర్చే--”
“కాదు. అంతవదు. హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన మృణాళినికి ఈ పనంటే చాలా ఇష్టం. తోటిమాలితో కలిసి అంతా తానై చూసు కుంటుంది. తోటిపని ఆహ్లాదకరమైన వ్యాయామం కదూ! “
“వావ్! షి ఈజ్ గ్రేట్! అయినా నువ్విక్కడికి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చి నాకు అన్యాయం చేసావు మామయ్యా! ”
“అన్నీ కుదరాలి కదోయ్! మనూరేమో ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. నువ్వేమో ఊళ్లో ఎప్పుడు కుదురుగా ఉన్నావని? ఆది నుంచీ రెసిడెంటు కాలేజ్లోనూ, కాలేజీ హాస్టల్ లోనూ కాలం గడిపేవాడివి. ఇప్పుడిప్పుడే కదా కోర్సులన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి ఊరుచేరావు. ఆ తరవాత తీరుబడిగా నా కంటబడ్డావు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? “
“అమ్మా నాన్నా ఇక్కడికెప్పుడైనా వచ్చారా మామయ్యా! ”
“రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఒకసారేమో తిరునాళ్ళప్పుడు మృణాళినితో రోజుంతా గడిపి వెళ్ళారు కూడాను“
“ఇంతకూ నేనెందుకు ఇక్కడికి వచ్చానో మృణాళినికి తెలుసా మామయ్యా? లేక ఆమెను సస్పెన్షన్ లో ఉంచేసావా? ”
దక్షిణ మూర్తి బదులివ్వలేదు. నవ్వి ఊరుకున్నాడు. చిరువయసు నుండీ అతడికి మామయ్య వద్ద మాలిమెక్కువ. ఇద్దరూ లోపలకొచ్చి ఆసీనులవడానికి సిధ్ధమవుతున్నప్పుడు మృణాళిని మేనత్త కాంచనమాల కళ్లజోడు సవరించుకుంటూ వచ్చి వాళ్ళకెదురుగా కూర్చుంది. దక్షిణామూర్తి సోఫాలో కూర్చున్నాడు గాని సుదర్శనం మాత్రం ఆసీనుడు కాలేదు. నమస్కరించి నిల్చున్నాడు.
ఆమె తనలోని ఆరాటాన్ని ఆపుకోలేక అతడి నమస్కారాన్ని అందుకోకుండానే కూర్చోమని సైగ చేస్తూ అతణ్ణి కన్నార్పకుండా చూడసాగింది. సుదర్శనం మరుపలుకు లేకుండా కూర్చున్నాడు, లోలోన యిబ్బందికి లోనవు తూనే-- ఆమె అంత దీర్ఘంగా యెందుకు చూస్తుందో అతడికి తెలియకపోలేదు. సకల సంపదలకూ యేకైక వారసురాలైన ఆమె మేన గోడలకు తను తగిన వాడా కాడా అన్నదే ఆమె కున్న జిజ్ఞాస!
అసలామెగారి మేనగోడలు అంతటి శ్రీమంతురాలని తన కెలా తెలుసు? మామయ్య పూర్తిగా చెప్తేనేగా! ఎట్టకేలకామె తనలో తను నవ్వుకుంటూ మనసున కలిగిన సంతృప్తి భావానికి సూచనగా తల పంకిస్తూ దక్షిణమూర్తి వేపు మెచ్చుకోలుగా చూసింది. మొత్తానికి ఎక్స్ రే వంటి ఆమె చూపులు మొదట సుద ర్శనానికి అసహనం కలిగించినా ఆమె ప్రశాంత వదనం తెరపిని కలిగించింది. సోఫాలో కుదురుగా సర్దుకుని కూర్చుంటూ అనుకున్నాడు; ఇక్కడ కథ కొంచెం తారు మారుగానే ఉందనిపించింది.
ఫెళ్ళి చేసుకోబోయేవాడికి అమ్మాయి నచ్చిందో లేదో అన్నది కాదిక్కడ ముఖ్యమైన అంశం. తను నచ్చాలి! అలా ఆలోచిస్తున్నప్పుడు అటునుంచి వినిపించింది ఉత్సాహంతో ఉరకలెత్తే ఒక తియ్యటి గొంతు-“ఎప్పుడొచ్చారు పెదనాన్నా? మీరొచ్చిన అలికిడే వినిపించలేదు, తోటమాలి వచ్చి చెప్తే తెలిసింది“ అని రంగుల రవ్వల్ని వెదజల్లుతున్నట్లు గల గలా మాట్లాడుతూ సుదర్శనాన్ని ఓపారి నిదానందా చూసి “హాయ్ ఎలాగున్నారు? బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసరు పోస్టులో జాయినయారటగా! ప్రక్క ఊళ్ళోనే పోస్టింగటగా! కంగ్రాట్స్! “అంటూ వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
సుదర్శనం మర్యాదపూర్వకంగా లేచి ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాడు. మామయ్య చెప్పినట్టు మృణాళిని అందంగా విరబూసిని గుళాబీ మొక్కలా నిండుగా ఉంది. ఫొటోలో చూసినట్లే చెక్కుచెదరని సౌందర్యం! నిగనిగలాడే తుమ్మెదల్లాంటి విశాలమైన కురులామెవి. నుదుట గుండ్రటి బొట్టుతో చేతిలోని చిత్ర వీణ మీటుతూన్న సరస్వతీదేవి రూపంలా ముఖం కళకళ్ళాడుతూంది. ఆమె నిండు రూపంలో యేదో ఒక సౌమ్ర శుభ్ర తేజస్సు ఉన్నట్లని పించిందతనికి. ఇంకా అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తూంది.
వెనువంటనే ఒక అనుమానం కూడా పొడసూపింది. మరింతటి పొడవైన జుత్తుతో రేపు పై చదువుల కోసం మంచు ప్రదేశాలకు వెళ్ళి యెలా మనుగడ సాగించగలదు! ఈమె వెళ్ళబోయేది వాషింగ్టనో ఇంగ్లాండో అని మామయ్య తనతో చెప్పాడాయె. అక్కడ ఇంత పొడవైన ఒత్తైన శిరోజాలను పరామర్షించుకోవడం వీలుపడని కార్యం. తను విన్నంతవరకు- చాలా మంది భారతీయ యువతులు అక్కడకు చేరిన తరవాత చేసే మొదటి పని జుత్తుని కత్తిరించుకుని బాబ్డ్ హెయర్ గా మార్చుకోవడం లేదా సగానికి పైగా కుదించుకోవడమే!
ఆ తరవాత తెల్లమ్మాయిలతోనో లాటిన్ అమ్మాయిలతోనో కలగలసి పోవడానికి ప్రయత్నించడం.
మరింతటి ఒత్తైన జుత్తుని షార్ట్ గా కత్తరించకోవడానికి మృణాళినికి మనసొప్పుతుందో లేదో! తల్లి దండ్రుల్ని చిన్నప్పుడే కోల్పోయిన మృణాళినికి వితంతువైన వాళ్ళ మేనత్తగారే అంతా తానై ఆమె ఆలనా పాలనా చూసుకొస్తున్నట్టున్నారు. ఇంతటి పొడవై న జుత్తు ఈమెగారి చలవే అయుంటుంది. ప్రాత కాలపు స్త్రీలకు జుత్తే కదా ఆభరణం!
అప్పుడతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, కాంచనమాలగారికి సంకేతం యిస్తూ లేచాడు దక్షిణమూర్తి “ఈ యేడాదికి సంబంధించిన ప్రొపర్టీస్ రిటార్న్ సరిచూసుకోవాలి. రేపు టాక్స్ కన్సెల్టెంటని కూడా చూసిరావాలి. మీరిద్దరూ పక్క గదిలోకి వెళ్ళి టీ పుచ్చుకుంటూ మాట్లాడుతుండండి. అన్నట్టు-- మృణాళిని టీ బాగా చేస్తుంది. అంతేకాదు. జపానీయుల్లా కళాత్మకంగా చేస్తుంది” అంటూ అటు తిరిగి అన్నాడు “కాంచనమాలగారూ! మీకిది గుడికెళ్ళే సమయం కదూ! ”అని. ఆమె తలూపుతూ అతణ్ణి వెన్నంటి వెళ్ళింది.
పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరవాత సుదర్శనం మృణాళినీ యిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని అసంకల్పితంగా నవ్వుకున్నారు. అలా నవ్వుకుంటూనే పక్కగది వేపు నడిచారు. గది లోపలకు వెళ్ళిన వెంటనే సుదర్శనాన్ని కూర్చోమని చెప్పి ఆమె అంది “అవును సుదర్శనం గారూ! నేను చేసే టీ మీకు నచ్చుతుందో లేదో గాని నాకు మాత్రం జపానీయుల్లా టీని సంప్ర దాయ బధ్ధంగా చేయడమంటే ఇష్టం. మీరుండండి. ఐదు నిమిషాలలో టీ చేసి తీసుకొస్తాను. ”అంటూ వంటగది వేపు వెళ్ళింది.
ఆమె అక్కణ్ణించి కదలివెళ్ళిన వెంటనే అతడి ఆలోచనలు కూడా దిగ్గున లేచి ఆమెను వెన్నంటి వెళ్ళాయి. మాటల సందర్భన మామయ్య చెప్పినట్టు గుర్తు, ఆమెది కుంభరాశని. కుండ నిండా నీళ్లున్నట్లు గుండెనిండా ప్రేముంటుందట ఆ రాశి గలవాళ్లకు. ఆ ప్రేమను సరైన రీతిలో అందుకుంటే- దానికి తగ్గట్టు సరైన మోతాదున స్పందిస్తే ఆ రాశిగల వాళ్ళ ఆనందానికి హద్దుండదట. ఈ రాశివాళ్లు రహస్యాలు దాచుకోలేరు. అంతర్గతంగా నీతీ నిబధ్ధతా కోరుకుంటారు. లాలనగా మాట్తేడేవారిని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అలా లాలనగా ప్రేమను చూపించే వారికి తనివిదీర ఆనందాన్నిస్తారు.
స్వాభావికంగా ఈ రాశిగలవాళ్ళకు అమోఘ మైన తెలివి తేటలుంటాయట. అయితే యెటొచ్చీ ఆ రాశుల్నీ, అటువంటి జాతకాలనీ యెంత వరకు నమ్మోలో, నమ్మి యెన్నిటిని ఆచరణలో పెట్టగలమో అన్నది అతడికి అంతుపట్టని విషయం..
కాసేపు తరవాత దక్షిణమూర్తి తనకున్న అత్యవసరమైన పనులన్నీ ముగించుకుని తిన్నగా మృణాళిని స్టడీ రూములో కి వచ్చి చూసాడు. అక్కడెవరూ కనిపించలేదు. అతడికి ఆశ్యర్యం కలిగింది. ”ఎక్కడికి వెళ్ళుంటారు చెప్మా! ” అనుకుంటూ నడవమ్మట వచ్చి చూపు సారించాడు. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడతను. బయట తోటలోనున్న బొగడ చెట్టు క్రింద ఒంటరిగా నిల్చుని కనిపించాడు సుదర్శనం.
మేనల్లుడలా ఒంటరిగా ఉండటం అతడికి అసహనాన్ని కలిగించింది. అంతేకాక, అతడికది అంత శుభసూచకంగా కూడా తోచలేదు. ఆదిలోనే హంసపాదవుతుందేమో! అతడు మెట్లుదిగి మేనల్లుడి వద్దకు నడిచి వెళ్ళాడు. ”ఏమైందోయ్? నువ్వేమిటి ఒంటరిగా మీనమేషాలు లెక్కిస్తూ-! ”
“అబ్బే! మరేం లేదు మామయ్యా! తోటంతా అలా ఓసారి హాయిగా తిరిగొద్దామని--“
“అది సరేనోయ్! అదే పని మృణాలనీతో కలసిచేయొచ్చుకదా? ఇంతకీ మృణాళిని యెక్కడికెళ్ళిందని? ”
“ఇంట్లోనే ఉంది మామయ్యా! ప్రతిరోజూ పూజాగదిలోని పూజాసామగ్రిని ఆమే శుభ్రం చేస్తుందట, అవన్నీ చూసుకుని వస్తానంది“
దక్షిణమూర్తి అసంకల్పితంగా నోరు తెరిచాడు. ”పూజా గదిలోకి వెళ్ళిందా! ఇప్పుడా! ” అతడి బుర్ర గిర్రున తిరిగినట్లయింది. జోరున దొర్లే రథ చక్రాల్లా అనుమానాలు చెలరేగాయి. ఇద్దరి మధ్యా యేదో జరిగుంటుంది! సుదర్శనం అంత దూరం నుంచి యింటికెందు కొచ్చాడో మృణాళినికి తెలియదా! ఎందుకిలా ప్రవర్తిస్తుంది? సుదర్శనమంటే ఇష్టం ఉన్నదీ లేనిదీ చెప్పడానికి మొహమాటం అడ్డువస్తే ఆ మాట కాంచనమాలతోనే చెప్పి ముగించవచ్చు కదా!
అప్పుడు సుదర్శనం మామయ్య చేయి పట్టుకుని అన్నాడు:“మామయ్యా! నీతో మృణాళిని గురించి కొంచెం మాట్లాడాలి. లోపలకు వెళ్థామా! ”
అతడు తలూపి మేనల్లుణ్ణి వెంబ డించాడు. ఇప్పుడతడిలోని అనుమానం రెట్టింపయింది. అంతా అశుభసూచకంగానే తోచనారంభించింది.
ఇద్దరూ స్టడీ రూములోకి వచ్చింతర్వాత సుదర్శనం చెప్పనారంభించాడు- “నేనిలా అంటున్నానని మరోలా అనుకోకు మామయ్యా. ఆమెను యిప్పుడిప్పుడే పెళ్ళి చేసుకొమ్మని బలవంతపెట్టకు మామయ్యా! ”
కనురెప్పల్ని అల్లల్లాడించి చూసాడు ఎందుకన్నట్టు దక్షిణమూర్తి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
”షీ ఈజ్ ఎ జీనియస్! ఆమె జ్ఞాన సంపత్తిని మొక్కలోనో తుంచేయకండి. మామూలు చిన్నాచితకా పనులకు ఆమె సరిపోదు. ఉన్నవ ప్రేమాబాయిలా, సరోజినీ నాయుడులా, విజయలక్ష్మిపండిత్ లా, పి, శారదా దేవిలా గొప్పగొప్ప కార్యాలు చేయగల దిట్ట. ఆమెను అమెరికాకి గాని పంపిస్తే ఆమె తప్పకుండా కొన్నాళ్ళకు కౌంటీ హెడ్గానో బిజినస్ సి ఇ వో గానో యెదగ గల సర్వ సమర్థురాలు”
అతడదంతా విని ముఖం అదోలా పెట్టాడు. ”అదంతా తరవాత వింటాను గానీ! మొదట దీనికి బదులియ్యి. నికార్సుగా బదులిస్తావా? ’
సుదర్శనం బుర్రూపాడు.
“నువ్వన్నట్లు మృణాళిని నిజంగానే చాలా గొప్ప జీనియస్సే అనుకో! ఆరు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల నుండి స్కాలర్ షిప్పులతో సీట్లిస్తామని ఆఫర్లు వచ్చాయి కాబట్టి ఆమె నిజంగానే గగన కుసుమాన్ని అందుకోగల మేధావే అనుకో! మరి ఆమెకు జీవితంలో ఏదో ఒకనాడు తోడన్న వాడు కావాలా వద్దా? రేపో మాపో ఆ పిల్లకు తనకంటూ ఒక కుటుంబం ఉండాలా వద్దా! కాలమంతా నేనూ కాంచనమాలగారు ఆ పిల్లకు తోడుగా ఉండం కదా! బంగారు పళ్ళేనికి కూడా గోడ ఆసరా ఉండాలి కదా! ”
ఆ మాటతో సుదర్శనం కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరవాత తన రీతిలో బదులిచ్చాడు- “కాదనను మామ య్యా! కాని ఆమె తన కాబోయే భర్తను వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురవదు. ఆమె ఔననాలేగాని ఎంత మంది క్యూ కట్టరూ? ”
ఈసారి దక్షిణమూర్తి సన్నటి నిట్టూర్పు విడుస్తూ ఉండిపోయాడు. కాసేపు తరవాత, ఆలోచనలనుండి తేరుకుంటూ అన్నాడు. ”ఇంత చెప్పావు. ఇంకా యేదేదో చెప్పాలను కుంటున్నా వు. ఒకటి మాత్రం ఇంతవరకూ నువ్వు చెప్పనేలేదురా సుదర్శనం! ”
అదేమటన్నట్టు కళ్లెత్తి చూసాడతను.
“మృణాళినిని పెళ్ళి చేసుకోవడం నీకిష్టమేనా? “
“అదేం ప్రశ్నమామయ్యా? నేనెప్పడు వద్దన్నానని! మీరేది చేసినా నామంచికే చేస్తారన్నది నాకు తెలియనిదా? నేను చెప్పొచ్చే దేమంటే ఆమెను యే మగాడూ కాదనలేడంటాను”
“విషయం పూర్తిగా తెలుసుకోకుండా నువ్విక్కిడే తడుముతూ పొరపడుతున్నావోయ్! మృణాళినికి కావల్సింది మగాడు కాదు. జీవితాంతం తోడుగా నీడగా ఉండాల్సిన భర్త. పాణి గ్రహణం చేసిన భర్త. ఈ మామూలు విషయాన్ని నేనింత సీరియస్ గా యెందుకు నొక్కి చెప్తున్నాననే కదూ ఆశ్చర్యపోతున్నావు! ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. నేను చెప్పబోయే ఈ విషయం కాంచన మాలగారికి కూడా తెలియదు.
మృణాళిని చిన్నప్పట్టినుంచి ఒంటరిగానే పెరిగి పెద్దదయింది. బియ్యం బస్తాల గోడౌన్ లో చిక్కు కున్న చిట్టెలుకలా పెరిగింది. ఎందుకంటే ఆ పిల్ల జీవితం చిన్నప్రాయం నాడే అస్తవ్యస్థంగా తయారయింది. నీకు ఒకవిషయాన్ని సగం చెప్పా ను, మరొక సగం విప్పలేదు. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కాబట్టి ఇక చెప్పకుండా ఉండలేను. ఆ పిల్ల తల్లి దండ్రులిద్దరూ యెలా చనిపోయారనుకుంటున్నావు? ”
”చెప్పారు కదా మామయ్యా! భార్యా భర్తలిద్దరూ పయనం చేస్తున్న విమానం నడి సముద్రాన కూలిపోవడంవల్లపోయారని—“
“కాదు! నిజం అది కాదు. నేను చెప్పబోయే విషయాన్ని యెక్కడా పొక్కనివ్వకు. ఇద్దరూ స్విసైడ్ చేసుకున్నారు. మామూలుగా కాదు. ఒప్పందం ప్రకారం. అంటే స్వీసైడ్ ప్యాక్టు ప్రకారం కూడబల్కుకొని ప్రాణత్యాగం చేసుకున్నారు! ” అది విని సుదర్శనం ఆశ్చర్యంగా కుర్చీనుండి లేచి నిల్చున్నాడు. ”మ్యూచ్వల్ అగ్రిమెంటుతో ప్రాణాలు తీసుకోవడమా! ఎందుకు మామయ్యా? ”
“ చెప్తాను. ముందు కూర్చో! విపరీతమైన మనోద్రేకాలతో చెలరేగి పోయే రెండు మదపుటేనుగులు గుద్దుకుంటే యేం జరుగు తుంది? అడవి దద్దరిల్లిపోతుంది. అదే జరిగింది! ఇద్దరిదీ ఒకరితో ఒకరు సర్దుకుపోయే మనస్తత్వం కాదు. ఇద్దరిదీ ఒకే విధమైన సైకలాజికల్ కంపల్సివ్ డిస్ ఆర్డర్. అంటే-ఎక్స్టీమ్ టెంపర్ మెంటల్ సైకలాజికల్ డిస్ ఆర్డరన్నమాట. పూర్తిగా ఒకరినొకరు ద్వేషిం చుకోలేరు. అదే సమయంలో పూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకోనూ లేరు. ఆ అవగుణాలు సరాసరి వాళ్ల జన్యువుల్లో యిమిడి ఉన్నప్పుడు దాని ప్రభావం నుండి వాళ్లెలా బయట పడగలరు? సహనాన్ని ఎలా అలవర్చేకోగలరు?
ఇద్దరూ ఒక రోజు కూడబలుక్కుని నాకు ఫోను చేసి- తాము చేసుకోబోయే దాని గురించి నాకు చెప్పి- నేను వద్దంటూ గోలపెడ్తూ వచ్చే లోపల ఇద్దరూవి గత జీవులై పడున్నారు. నేనొచ్చేటప్పటికి పాప గుక్క తిప్పుకోకుండా యేడుస్తూ నేల పైన దొర్లుతూంది. పాపతో బాటు నాకంతా అప్పజెప్పి వెళ్తున్నట్టు ఇద్దరూ వ్రాతమూలంగా వ్రాసి పెట్టారు. నా వరకు మృణాళిని నాకు మేనకోడులు వంటిది కాదు. కూతురు కంటే అధికం. నా ప్రాణానికి మరు ప్రాణం”
సుదర్శనం మాట్లాడుకుండా మౌనంగా ఉండిపోయాడు.
“ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పు. వాళ్ళిద్దరిలో కొట్టుమిట్టాడిన మనోభావాల తీవ్రత కొంతలో కొంతైనా మృణాళినిలో కూడా ఉంటుందా లేదా! ”
అతడు దిగ్భ్రాంతితో మామయ్య వైపు చూసాడు. మామయ్యది ఎంతటి లోతైన ఆలోచన! సాలోచనగా బుర్రూపాడతను “శ్రీ రామచంద్రుడిలో చాలా గొప్ప గుణాలున్నాయి. వాటిలో రెండు చాలా ఉన్నతమైనవి-ఒకటి శాంత స్వభా వం. రెండవది-కృతజ్ఞతా భావం. చిన్నప్పటినుంచీ నిన్ను చూస్తున్నవాడిని కాబట్టి ఆ గుణాలు నీలో కూడా ఉన్నాయనుకుంటు న్నాను. అందుకే మృణాళినిని నీకప్పగించి మీ అత్తయ్యతో కలసి తీర్థయాత్రలకు బయల్దేరా లనుకుంటున్నాను. ఇక ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఆ పిల్ల ప్రవర్తన చూస్తుంటే ఇప్పటికిప్పుడే పెళ్ళి చేసుకునే మూడ్ లో లేదనుకుంటాను. ఇక నేను మాత్రం చేసేదేముంది? ఆ పిల్ల తలవ్రాత! వేదాంతం వల్లించడం కాదు గాని, మనం అనుకున్నవన్నీ మనకు అనుకూలంగా జరగవుకదా! ”
అప్పుడు గది గుమ్మం వద్ద అలికిడి వినిపించింది. ఇద్దరూ అటు తిరిగి చూసారు. కొత్త చీర కట్టుకుని మృణాళిని గది గుమ్మం వద్ద నవ్వుతూ నిల్చుంది. “నేను డిస్టర్బ్ చేస్తున్నానా పెద నాన్నా! ”
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
“లేదమ్మా! నీ కోసమే యెదురు చూస్తున్నాం. సుదర్శనం బయల్దేరుతానంటున్నాడు. నేనే నీ కోసం ఆపాను! “
అది విని నివ్వెర పోయినట్లుచూసింది మృణాళిని. ”ఏంవి టేంవిటీ! ఇచ్చిన మాట మరచి వెళ్ళిపోతాడా మీ మేనల్లుడు! అయినా ఇంతచిన్నవయసులో ఇంతటి మతిమరుపా? ”
దక్షిణమూర్తిఅర్థం కానట్టు మేనల్లుడి వైపు చూసాడు సంగతేమిటన్న ట్టు. సుదర్శనమేమో అయోమయంగా మృణాళినిని చూడసాగాడు కళ్ళప్పగించి.
“ఇంకా జ్ఞాపకం రావడం లేదా మహాశయా! ”
తల అడ్డంగా తిప్పాడు సుదర్శనం అర్థం కానట్టు.
“నేను పూజాగది శుభ్రం చేసి స్నానం చేసి వచ్చింతర్వాత నన్ను సర్వ మంగ ళ ప్రదాయిని మీ ఊరి అమ్మవారి గుడికి తీసుకెళ్తాననలేదూ! ”
అతడికేమి చెప్పాలో తెలియక అవున్నట్టు తలూపాడు.
“అంతేకాదు. నన్నొక విషయంలో చాలెంజి కూడా చేసారు కూడాను! అదైనా జ్ఞాపకం ఉందా లేదా? ”
ఈసారి ఉలిక్కిపడుతూ లేచి నిల్చున్నాడు-: “నేను మీతో సవాల్ చేసానా! ”
“కాక పోతే మీ మామయ్యగారితోనా? నేను బాగా వంట చేస్తానంటే, మీరేమన్నారు? మీ అమ్మగారి కంటే బాగా చేయలేరని నన్ను నిలదీయ లేదూ! అప్పుడు నేనేమన్నాను? బాగా జ్ఞాపకం చేసుకోండి”
“నిజంగా నాకేమీ జ్ఞాపకం రావటం లేదండీ! “అంటూనే మనసు లోపల అనుకున్నాడు-“అబ్బో! మహా గడుసుదానిలాగుందే! అనని మాటల్ని తన నోటమ్మట అన్నట్టు యెంత చక్కగా రప్పిస్తూంది! ”
“అదీ నేనే చెప్పాలా! చెప్తాను. నేను మీ అమ్మగారి కంటే బాగా చేయలేక పోవచ్చుగాని కచ్చితంగా మీ అమ్మగారిలా వంటా వార్పూ చేయగలన్నాను. కావాలంటే నేనిప్పుడే మీ యింటికొచ్చి చేసిపెడ్తానన్నాను. అప్పుడు మీరేమన్నారూ! ఇప్పుడు గాని బస్సులో గాని వెళ్తే చాలా ఆలస్యమవుతుందని- ఆ విషయం తరవాత చూద్దామన్నారు. అప్పడు నేనేమన్నానూ! ఆలస్యం అవదూ, నేనే స్వయంగా కారునడిపి మిమ్మల్ని మీ ఊరు చేరుస్తానన్నాను. ఇవన్నీ మీ యింట్లోవాళ్ళకు చెప్పకుండా సైలెంటు గా వచ్చి వంటావార్పూ చేసి ఇంటిల్లిపాదికీ నేనే వడ్డన చేస్తానన్నానా! “
అతడు బిత్తర పోయినట్లు చూస్తూ తలూపాడు మరొకమారు. ఇంతకీ అతడెన్నిసార్లు తలుపాడు? లెక్కకందలేదు.
“మరింకా ఆలస్యం యెందుకండీ! ఇక నన్ను తీసుకెళ్లండి సుదర్శనంగారూ! “అంటూ మృణాళిని కుడి చేతిని ముందు కు చాచింది. ఈసారి అతను జంకలేదు. తను తక్కువ తిన్నవాడేమీ కాదని నిరూపించడానికి పూనుకుంటూ నున్నటి ఆమె చేతి ని అందుకుని మృదువుగా తన పెదాలాతో స్ప్శశించి ఆమె నడుం చుట్టూ చేతుల్ని పోనిచ్చి ముందుకు నడిపించాడు. ”అందుకున్న చేతిని మధ్యలో విడిచి పెట్టేయరు కదూ! ”
“అది మా యింటి వంశంలోనే లేదు. కావలిస్తే మీ పెదనాన్నగారినే అడిగి చూడు! ”
మేఘాల్లో కదిలే గాంధర్వుల్లా నడచి వెళ్ళి పోతూన్న ఆ జంటను పూరించిన మనసుతో కనులప్పగించి చూస్తూండి పోయాడు దక్షిణమూర్తి. ఇప్పుడతని మనసు తేలికపడింది. స్వర్గానికేతెంచిన మిత్రుణ్ణీ మిత్రుడి భార్యనూ తలచుకుని తడిసిన కళ్ళను తుడుచుకున్నాడు.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
మరణ శిక్ష
రచన: పద్మావతి దివాకర్ల
పట్టణం దాటి పది కిలోమిటర్లు దూరం వచ్చిన తర్వాత, ఆటో ఆపమని చెప్పి కిందకి దిగాడు అంకిత్. జేబులో చెయ్యపెట్టి పర్సులో మిగిలిన ఆఖరి పచ్చ నోటు వంక ఆప్యాయంగా చూసి తనివితీరా తడిమి, ఆటో డ్రైవర్ చేతిలో పెట్టాడు. అతనివంక విచిత్రంగా చూసాడా ఆటో డ్రైవర్, "ఎక్కడికెళ్తారు సార్ ఇక్కణ్ణుంచి?" అని అడిగాడు.
ఎందుకంటే అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టుపక్కలెక్కడా ఇల్లూ, వాకిళ్ళూ కూడా లేవు. కొద్ది దూరంలో చాలా స్టీప్ గా ఉన్న కొండప్రదేశం పక్కనే లోతైన లోయ మాత్రమే ఉంది.
"ఏమో నాకే తెలియదు!" విరక్తిగా ఓ నవ్వు నవ్వి అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు అంకిత్. అతనివైపు అయోమయంగా ఓ క్షణం చూసి, తనకెందుకని అనుకున్నాడో ఏమో ఆటో వెనక్కి తిప్పి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
అక్కణ్ణుంచి అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఓ పక్కన ఎత్తైన పర్వత ప్రదేశం ఉంది. ఆ కొండ మీదో చిన్న పాతకాలంనాటి శివుడి గుడి ఉంది. శివరాత్రి, కార్తీక సోమవారాలులాంటి పర్వదినాల్లో తప్పించి అక్కడికెవరూ వెళ్ళరు. ఆ గుడి పూజారి మాత్రం ప్రతీ రోజూ ఉదయం వెళ్ళి శివునికి ధూపదీప నైవేద్యాలు మాత్రం సమర్పించి వస్తూంటాడు. పిక్నిక్ సీజన్లో మాత్రం జనం వనభోజనాలకోసం అక్కడికి వెళ్తూఉంటారు అంతే! మిగతా రోజుల్లో పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుందా ప్రదేశం.
ఆటో అతను కనుమరుగయ్యేదాకా చూసి, అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు. ఎప్పుడో ఉదయం తిన్న టిఫిన్ అరిగిపోయి, ఆకలి వేస్తోంది. దాహం కూడా వేస్తోంది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కడుపునిండా నీళ్ళు తాగిన తర్వాత మనసు కొద్దిగా శాంతించింది. ఖాళీ అయిన వాటర్ బాటిల్ ని దూరంగా విసిరేసాడు. అయినా, ఇంకొద్ది గంటల్లో దేహం చాలించబోతున్న తనకి ఆకలేమిటి, దప్పికేమిటి?
విరక్తిగా నవ్వుకొన్నాడు. శివాలయానికి దారితీసే మట్టి రోడ్డులో నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. మనసులో ఆలోచనలు చెలరేగుతున్నాయి. సాధ్యమైనంత వరకూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మాత్రం అతన్ని వదలటం లేదు.
చిన్నప్పుడే తండ్రి పోవడంతో, తల్లి వర్ధనమ్మ కాయకష్టంతో పెరిగాడు అంకిత్. చాలా కష్టపడి కొడుకుని పెంచిందామె. చదువు పూర్తై, మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో చాలా సంతోషించాడు. తనని అంత కష్టపడి పెంచి, చదివించినందుకు ఆమెని పువ్వుల్లో పెట్టుకొని చూడాలనుకున్నాడు. కానీ అతని ఆశ నెరవేరలేదు.
ఉద్యోగం వచ్చిన రెండునెలల్లోనే ఆమె కనుమూసింది. తన అనారోగ్యాన్ని కూడా ఖాతరు చెయ్యకుండా కష్టపడిన ఆమె ఆరోగ్యాన్ని రకరకాల జబ్బులు బాగా దెబ్బ తీసాయి. సరైన చికిత్స అందకముందే, కొడుకుని వంటరివాణ్ణి చేసి ఆమె వెళ్ళిపోయింది. తండ్రిప్రేమ ఎరుగని అంకిత్ తల్లి అండనే బతికాడిన్నాళ్ళూ. ఆమె కూడా పోవడంతో దిక్కులేనివాడయ్యాడు. తనకి భగవంతుడు ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష విధించాడో బోధపడలేదు అంకిత్కి.
తల్లి ఋణం తీర్చుకొనే అవకాశమే లభించలేదు అంకిత్ కి. చాలా రోజులవరకూ మామూలు మనిషి కాలేకపోయాడు. సరిగ్గా అప్పుడే అంకిత్ జీవితంలో ప్రవేశించింది అలేఖ్య. ఎడారిలాంటి తన జీవితంలో ఒయాసిస్లా సేద తీర్చిందామె సాంగత్యం. ఆమెతో పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే జీవితంలో తనకి తగిలిన దెబ్బలని మర్చిపోగలిగాడు అంకిత్. అమెతో మాట్లాడితే మధువనంలో విహరించినట్లు ఉండేది. అమెని మనసారా ప్రేమించాడు అంకిత్. అలేఖ్య కూడా అతనితోటే తన జీవితమనేది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని షికార్లు, సినిమాలు తిరిగారు. ఇక తన జీవితం ఆనందమయం కాబోతోందని అనుకున్నాడు అంకిత్.
అప్పుడే తెలిసింది అలేఖ్య తన కంపెనీ యజమాని దామోదరరావు ఒక్కగానొక్క కూతురని, తండ్రి తదనంతరం ఆమె ఆ కంపెనీ వారసురాలని. ఆ విషయం తెలియగానే అతని భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఇన్నాళ్ళూ నింగినంటిన ఆశలు ఒక్కసారి నేలకూలాయి.
సినిమాలో ప్రేమలాగ వాళ్ళిద్దరి ప్రేమ సుఖాంతం కాలేదు. వాళ్ళిద్దరి ప్రేమ దామోదరరావు కంట్లో పడింది. అతని హోదాకి తను ఏ మాత్రం తగనని అంకిత్ కి బాగా తెలుసు. అయినా తన ప్రేమ మీద, అలేఖ్య ప్రేమ మీద అంతులేని నమ్మకం ఉన్న అంకిత్ వెనక్కి తగ్గలేదు. తన కూతురు అలేఖ్య అతనితో కలుసుకోకుండా కట్టడి చేసాడు దామోదరరావు.
అంతటితో ఊరుకోలేదు అతను. ఫలితంగా అంకిత్ ఉద్యోగం కోల్పోయాడు. ఇంకా దామోదారరావు కసి తీరలేదు. తన కూతురిపై కన్ను వేసిన అంకిత్ కి తగిన బుద్ధి చెప్పడానికి కొంతమంది కిరాయి రౌడీలను నియమించాడు. ఆస్పత్రి పాలైన అంకిత్ కోలుకొనేసరికి అలేఖ్యకి పెళ్ళి కూడా కుదిరిపోయింది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.
అలాంటి పరిస్థితిలో ఆమెని కలుసుకోవడం దాదాపు అసాధ్యమైన పనైనా సాహసం చేసాడు అంకిత్.
తన ప్రాణాలకు తెగించి సాహసం చేసి ఆమెని కలిసాడు అంకిత్. అలేఖ్య ఒప్పుకుంటే దామోదరరావుని ఎదురించైనా ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆమె మాటలు విన్న అంకిత్ పూర్తిగా హతాశుడైయ్యాడు.
"నువ్వంటే నాకు ప్రేముంది, కాదనను. కానీ, ఇప్పుడు ఏ ఉద్యోగమూ లేని నువ్వు నన్నెలా పోషిస్తావు? నీ మాట విని నిన్ను పెళ్ళాడితే నాన్న తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మనకి ఇవ్వరు. ప్రాణంకన్నా పరువుని మిన్నగా భావిస్తారు. పైగా నాన్న ఇప్పుడు తెచ్చిన సంబంధం నీకన్నా ఎన్నో రెట్లు గొప్పది. పెళ్ళికొడుకు రేయాన్ష్ కి యుఎస్లో పలు వ్యాపార సంస్థలున్నాయి. అశ్వైరవంతుడేకాక, అందగాడు కూడా! పెళ్ళవగానే అమెరికాలోనే కాపురం! ఇంతవరకూ ఇంట్లో గారాబంగా పెరిగిన నేను, నీవెంట వెళ్ళి కష్టాల జోలికి పోలేను. నీ కోసం అంతమంచి సంబంధం వదులుకోలేను. నా మాట విని నన్ను మరిచిపో! అది మనిద్దరికీ శ్రేయస్కరం. " అని మరో మాటకు తావులేకుండా అతని మొహం మీదే తలుపేసుకుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
అలేఖ్య మాటలు అశనిపాతంలా తోచాయి అంకిత్ కి. ప్రేమించి తన వెంట తిప్పుకొని చివరికి తనని మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించాడు. అటు ఉద్యోగం పోయింది, ప్రేమ కూడా దక్కలేదు. మరో ఉద్యోగం కూడా అతనికి దొరకుండా తన పరపతిని ఉపయోగించాడు దామోదరరావు. ఫలితంగా అంకిత్ బతుకు నానాటికీ దుర్భరం అయింది. ఇల్లు కూడా దామోదరరావు నియమించిన గుండాల కబ్జాకి గురై, నిలువనీడ లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. ఎక్కడా అప్పు పుట్టే ప్రసక్తే లేదు. ఇంక, ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళాలని సిద్ధమైయ్యాడు.
అప్పుడు జరిగింది మరో సంఘటన. అతనిపై కసి తీరని దామోదరరావు అన్యాయంగా చోరీ కేసులో ఇరికించాడు. ఫలితంగా సెక్యూరిటీ ఆఫీసర్ల లాఠీ దెబ్బలు రుచి చూడవలసి వచ్చింది. ఎక్కడలేని కేసులు అతనిమీద బనాయించ బడ్డాయి. ఇవన్నీ అలేఖ్యని ప్రేమించడంవలన వచ్చిన దుష్పరిణామాలని తెలిసినా ఆమెమీద ఆగ్రహం కలగలేదు అంకిత్కి. అంతగా ఆమెని ప్రేమించాడు మరి! అతి కష్టం మీద బైయిల్ పై విడుదలైన అంకిత్ కి జీవితం మీద ఆశ నశించింది. ఇంక కష్టాలు భరించే ఓపిక లేదు. ఆత్మహత్యే శరణ్యమని ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఆలోచించుకుంటూ ఆ కొండపైకి చేరుకున్నాడు అంకిత్. అప్పటికి అక్కడ అంతటా చీకట్లు ముసురుకుంటున్నాయి. గుడి ఆవరణలో ఉన్న మర్రిచెట్టు గాలికి తలూపుతోంది. కొండమీదనున్న శివాలయం వరండాలో నిలబడ్డాడు. బయటనుండి దేవుణ్ణి క్షమించమని, వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి జన్మ మాత్రం ప్రసాదించొద్దని మనసులోనే వేడుకున్నాడు. అలసటవల్ల కొద్దిసేపు అరుగుమీద కూర్చోవాలనుకున్నాడు. ఇంకొద్దిసేపట్లో చనిపోబోయే మనిషికి అలసటేమిటి అనుకొని నవ్వొచ్చింది అతనికి. అయినా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు. ఇక తన నిర్ణయం అమలుపర్చడానికి కొండ అంచువరకూ వెళ్ళాడు.
వంద అడుగులకు పైగా ఉన్న ఆ లోయ భయంకరంగా కనిపించింది. ఒక్కసారి అంకిత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తల్లి గుర్తుకు వచ్చింది. తన జీవితం ఇలా అంతమవుతుందని అమెప్పుడూ భావించి ఉండదు. తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అలేఖ్య కూడా ఆ చివరి క్షణంలో గుర్తుకు వచ్చింది.
తనకి ఈ స్థితి కల్పించిన భగవంతుణ్ణి చివరిసారిగా స్మరించి లోయలోకి దూకడానికి ఉద్యుక్తుడయ్యాడు అంకిత్.
"హల్లో.. గురూ ఆత్మహత్యా ప్రయత్నమా! ప్రేమ ఫెయిలైయ్యిందా లేక అప్పులుపాలయ్యావా?" ఎవరిదో గొంతు వెనకనుండి వినిపించడంతో ఉలిక్కిపడి తన ప్రయత్నం ఆపి, మాట్లాడిందెవరా అని వెనుతిరిగి చూసాడు అంకిత్.
చీకట్లో ఎవరో మనిషి తను ఇంతకుముందు కూర్చున్న అరుగు మీద కూర్చొని ఉండటం కనిపించింది. ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడా వ్యక్తి. కోరమీసాలు, మాసిన గడ్డంతో భయంకరంగా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం. చీక్కట్లో నల్లగా మెరుస్తున్నాడు. ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో మందుసీసాతో భయం గొల్పుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే తనపై ఇంతకుముందు దాడిచేసిన కిరాయి గుండాలు గుర్తుకు వచ్చారు అంకిత్కి.
నవ్వు వచ్చింది. ఇంకొద్ది క్షణాల్లో యమపురికి చేరబోతున్న తనని చంపడానికి ఇతన్ని నియమించాడా దామోదరరావు? ఆ క్షణంలో ఏ మాత్రం భయం కలగలేదు అతనికి.
అంకిత్ ఏమీ మాట్లాడకపోగా అతని పెదవులపైన విరిసిన నవ్వుని చూసి విస్మయం చెందాడు ఆ మనిషి.
"ఏం, ఆగిపోయావు, ఆత్మహత్య చేసుకోకుండా?" అన్నాడు నవ్వుతూ అంకిత్ వైపు తిరిగి. నవ్వితే మరింత భయంకరంగా కనిపించాడా వ్యక్తి.
"హేయ్! ఎవరు నువ్వు? దామోదరరావు నియమించిన గుండావా?" అడిగాడు అంకిత్.
"దామోదరరావా? అతనెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి.
"మరి నువ్వెవరు? ఎవరు పంపించారు నిన్ను? ఎందుకిక్కడికి వచ్చావు?" అడిగాడు అంకిత్.
ఎక్కడో చూసినట్లుంది కానీ, అతనెవరో చప్పున గుర్తుకు రాలేదు.
"బిల్లా.. ఆ పేరెప్పుడైనా విన్నావా?" అన్న ఆ మనిషి మాటలకి ఉలిక్కిపడ్డాడు అంకిత్.
అప్పుడు గుర్తొచ్చింది అతన్ని ఎక్కడ చూసాడో అన్న సంగతి. టివిలో చూసాడు.
'బిల్లా!' అన్న పేరు వినగానే ఎవరికైనా గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. అంత భయంకరమైన వ్యక్తి బిల్లా! కరుడు కట్టిన నేరస్థుడు! నేర సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు బిల్లా! ఎంత మందిని కడతెర్చాడో లెక్కలేదు. ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసాడో అతనికే తెలియదు. కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అతను. చాలా మంది మహిళలను వేధించాడు కూడా! చాలాసార్లు సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కినట్లే చిక్కి పారిపోయేవాడు. బిల్లా ఎవరికైనా ఎదురుపడ్డాడంటే, వాడికి మూడినట్లే!
అలాంటి బిల్లా కొన్నాళ్ళ కిందట సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కి జైల్లో ఉన్నాడని విన్నాడు అంకిత్. అతను చేసిన నేరాలకుగాను కోర్టు మరణ శిక్ష విధించిందని, త్వరలో ఆ శిక్ష అమలు జరుగుతుందని కూడా వార్తల్లో చూసాడు. జైలు నుండి ఎలా బయటపడ్డాడు బిల్లా? ఎక్కడికెందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు? అంకిత్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అలాంటి బిల్లా పేరెవరికి తెలియదు? అప్రయత్నంగా తెలుసునని తలూపాడు అంకిత్.
బిగ్గరగా నవ్వాడా వ్యక్తి. "నిజమే! నేను తెలియనిదెవరికి? అది సరే! నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు చెప్పు, వింటాను. " అన్నాడు బిల్లా. బిల్లా ఎదుట నిలబడటానికి భయపడలేదు అంకిత్. చావబోతున్న వాడికి భయమెందుకు? అతని ఎదురుగా నిర్భయంగా కూర్చొని తన కథంతా చెప్పుకొచ్చాడు అంకిత్. అంతా విని నిట్టూర్పు విడిచాడు బిల్లా. ఆ తర్వాత చేతిలోని సీసా ఎత్తి గటగటా తాగాడు అందులోని ద్రవాన్ని.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
తర్వాత అంకిత్ వైపు ఛీత్కారంగా చూసి, "కేవలం ఆడదాని ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకుంటావా? నీకు జరిగిన అవమానానికి ఆ అమ్మాయికి తగిన బుద్ధి చెప్పవలసింది. నేనైతేనా.. " అంటూ ఏదో చెప్పబోయే బిల్లా మాటలకి అడ్డువచ్చాడు అంకిత్.
"కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు. నేను ఈ భూమి మీద బతకడానికి అన్ని దార్లూ మూసివేసాడు ఆ దామోదరరావు. జీవితంలో చిత్తుగా ఓడిపోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. " అని చెప్పి అక్కణ్ణుంచి లేచాడు అంకిత్.
"ఆగు! నీ కథ చెప్పావు, మరి నా కథ వినవా?" అన్నాడు బిల్లా.
"నీకథ తెలియనిదెవరికి? ఏ పేపరు చూసినా నీ కథే, ఏ టివి ఛానెల్ చూసినా నీ గురించిన వార్తలే! ఇప్పుడు నువ్వు జైలు నుండి తప్పించుకున్నావని తెలిసే ఉంటుంది, నీ గురించిన చర్చా వేదిక ప్రతీ ఛానెల్లో వస్తూ ఉంటుంది ఈపాటికి!" చెప్పాడు అంకిత్.
బిల్లా చరిత్ర పూర్తిగా తెలిసిన అంకిత్ కి అతనంటే భయం కన్నా అసహ్యం ఎక్కువ కలిగింది.
బిగ్గరగా నవ్వాడు బిల్లా. "మొత్తానికి నిజం చెప్పావు! నేనెంత మందినో చంపాను. ఎన్నో అత్యాచారాలు చేసాను. దొంగతనాలు, దోపిడీలకు లెక్కేలేదు. ఇప్పుడు కూడా జైలు నుండి పారిపోయి వస్తూ జైలర్ని, నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్ల్ని చంపాను. మరణశిక్ష పడిన నాకు కూడా బతుకు మీద తీపి ఉంది. నేను చావడానికి సిద్ధంగా లేను. కావాలంటే అందుకోసం ఇంకెంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనుకాడను.
అలాంటిది, ఏ తప్పు చెయ్యని నువ్వు కావాలని మృత్యవాత ఎందుకు పడాలని అనుకుంటున్నావో నాకు మాత్రం బోధపడటం లేదు. అసలు ఎలాంటి తప్పూ చేయని నీకు మరణశిక్ష ఎందుకు? అది నీకై నువ్వు విధించుకున్న శిక్ష కాక మరేమిటి? మరణశిక్ష పడిన నేనే నా జీవితం గురించి భయపడటంలేదు. నువ్వెందుకు జీవించడానికి భయపడుతున్నావు?" అని అంకిత్ని సూటిగా ప్రశ్నించాడు.
బిల్లావైపు అసహ్యంగా చూసాడు అంకిత్. బిల్లాలాంటి నరరూప రాక్షసులకు ఈ సమాజంలో స్థానం లేదు. అలాంటివాళ్ళు బతకకూడదు. మరణ శిక్ష నుండి తప్పించుకున్న బిల్లా మున్ముందు ఇంకెంత మంది ప్రాణాలు తీస్తాడో?
"ఇప్పుడసలు ఇక్కడికెందుకొచ్చానో తెలుసా? ఈ శివాలయంలో గర్భగుడి కింద నిధి ఉందన్న రహస్యం ఈ మధ్యే నాకు తెలిసింది. ఈ నిధి గురించి ప్రయత్నించే లోపలే సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టుబడ్డాను. ఇప్పుడు ఈ నిధిని చేజిక్కించుకొని మారుపేరుతో ఈ సమాజంలో పెద్దమనిషిలా బతుకుతాను. " అన్నాడు.
ఈసారి అంకిత్కి అసహ్యంతోపాటు బిల్లాపై కోపం కూడా కలిగింది. కొండ అంచుదాకా వెళ్ళిన అంకిత్ గిరుక్కున వెనుదిరిగాడు. తనెలాగూ కొద్ది క్షణాల్లో మరణించ బోతున్నాడు. మరణించేముందు ఓ మంచిపని చెయ్యాలన్న సంకల్పం అతని మదిలో ఒక్కసారి జనించింది. ఆ తలంపు కలగ్గానే ఊహించనంత వేగంగా కదిలి తన బలమంతా ఉపయోగించి బిల్లా చెయ్యపట్టిలాగి అతనితోపాటు లోయలోకి జారిపోయాడు అంకిత్.
ఊహించని ఈ హఠాత్ పరిణామానికి అదుపు తప్పిన బిల్లా కూడా బిగ్గరగా కేకలు వేస్తూ అంకిత్ తో పాటు వంద అడుగుల అగాధంలోకి జారిపోయాడు. బిల్లాకి పడిన మరణ శిక్ష ఆ విధంగా అమలు చేసాడు అంకిత్. చనిపోబోయే ముందు ఓ మంచి పని చేసానన్న తృప్తితో తనువు చాలించాడు అంకిత్.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
పుణ్యం కోసం
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
“అలా డబ్బాలు వెతుకోక్కపోతే నాలుగు జంతికలు వేసుకోవచ్చుగా, నాకు కుడి చెయ్యి పని చెయ్యదు. లేకపోతే నేనే చేసే దానిని” అంది శ్రీలక్ష్మి, భర్త శేఖరం తో.
“జంతికలు చెయ్యడానికి నీ చెయ్యి పనికిరాదు, తినడానికి నాకు పళ్ళు నొప్పి. అందుకే పాత స్టాక్ ఏమైనా వుందేమో అని డబ్బాలు వెతుకుతున్నాను” అన్నాడు.
“సరే గాని 24 గంటలు ఆ భగవంతుడి థ్యాసే గాని భర్తకి రెండు మైసూర్ బజ్జిలు గాని, లేదా ఏ టమోటో పులిహోర చేద్దామని గాని నీకు వుండదా” అన్నాడు భార్య తో.
“తిరిగి తిరిగి నా మీదకి వచ్చారా, సాయంత్రం అలా బజారు వెళ్ళినప్పుడు ఏమైనా కొని తెచ్చుకోవాలి, అన్నీ ఇంట్లోనే అమర్చి పెట్టాలి అంటే నా వల్ల కాదు. రోజూ మీరు కూడా ఆ భగవంతుడి గురించి కొంతసేపు తలుచుకుంటే మళ్ళీ మానవ జన్మ వస్తుంది, లేకపోతే జంతువు గా పుడతారని గరికిపాటి వారు, చాగంటి వారు రోజూ చెపుతున్నారు” అంది శ్రీలక్ష్మి.
“నాతో చెప్పినప్పుడు చూద్దాం లే, అయినా నీ పుణ్యం లో సగం నాకిస్తావుగా” అన్నాడు..
“ఇదేమన్నా వండుకున్న కూర అనుకున్నారా నాకు లేకపోయినా మీకు వడ్డించడానికి, నా మాట విని రేపటి నుండి ఏ భాగవతం పుస్తకం నుంచి రెండు పేజీలు చదువుకోండి, మీ మంచికే చెప్పేది” అంది.
“సరే రేపటి నుండి చదువుతానులే” అని మేడ మీదకి వెళ్ళిపోయాడు శేఖరం మొక్కలకి నీరు పోయడానికి.
తోటలో కాసిన గులాబీలు, చామంతి, మల్లెపూలు కోసి దేముడు గదిలో పెట్టాడు, భార్య ఉదయమే లేచి స్నానం చేసి దేముడికి ఒక గంటసేపు అయినా పూజ చేస్తుంది. శేఖర్ లేచి సాయిరాం అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్లి కాఫీ కలుపుకుని వచ్చి టీవీ లో న్యూస్ చూడటం మొదలుపెట్టాడు.
మేడమీద నుంచి కిందకి దిగుతో, “త్వరగా స్నానం చేసి ఆ శివుని విగ్రహం మీద పాలు పోసి, మారేడు దళం పెట్టండి, ఈ రోజు శివరాత్రి అని గుర్తుందా” అంది భర్త తో శ్రీలక్ష్మి.
“ఓహో ఈరోజు శివరాత్రా, అయితే చలి తగ్గిపోతుంది” అన్నాడు.
“నా ఖర్మ, ఈ రోజు నేను ఉపవాసం, మీరు కూడా ఉపవాసం వుంటారా” అంది.
“షుగర్ పేషెంట్స్ ఉపవాసం వుండకూడదు, నేను నాకోసం వంట చేసుకుంటాలే” అన్నాడు శేఖర్.
“సరే అయితే త్వరగా స్నానం చేసి రండి శివాలయం కి వెళ్లి అభిషేకం చేసుకుందాం, ఈరోజు చేసిన అభిషేకం ఎంతో పుణ్యం యిస్తుంది” అంది శ్రీలక్ష్మి.
“చూడు.. ఒక పక్కన పూజలతో పుణ్యం సంపాదించుకుని, యింకో పక్కన నన్ను సాధిస్తో పాపం తెచ్చుకుంటున్నావు. చివరికి మిగిలేది సున్నా, అందుకే నీ పూజలు నువ్వు చేసుకో, నా దారికి రాకు, నేను మనసులోనే దేముడిని తలచుకుంటో వుంటాను తెలుసా” అన్నాడు శేఖర్.
తలుపు దగ్గరగా వేసి “నేను గుడికి వెళ్తున్నా” అంది.
“వుండు, ఎండలో ఎలా వేడతావు, నేను దింపుతాను” అని లేచి చెంబుడు నీళ్లు తలమీద పోసుకుని, బట్టలు మార్చుకుని కారు గుడివైపు పోనిచ్చాడు.
“బాబోయ్ ఏమిటి ఈ జనం, అభిషేకం చేయాడానికే! నేను ఈ అరుగు మీద కూర్చొని వుంటాను, నువ్వు త్వరగా పూజ ముగించుకుని రా” అన్నాడు శేఖర్.
“యింత దూరం వచ్చారుగా, మీరుకూడా రండి అభిషేకం చేద్దురుగాని” అంది శ్రీలక్ష్మి.
“ఈ జనం లో నేను నుంచోలేను, త్వరగా రా” అని అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. చాలా పెద్ద గుడి, ఈ గుడి చుట్టూ నాలుగు సార్లు తిరిగేస్తే ఈరోజు వాకింగ్ అయిపోతుంది అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. మనసు తనంతట తనే శంభో శంకరా అంటోంది. అరగంట తరువాత శ్రీలక్ష్మి బయటకు వచ్చి భర్త కోసం చూస్తే, గుడి చుట్టూ తిరిగేస్తున్న శేఖర్ కనిపించాడు.
“మీరే నయ్యం గుడి చుట్టూ ప్రదక్షణ చేసుకున్నారు, నన్ను ఒక్కక్షణం కూడా దేముడిని చూడనివ్వలేదు పాడు జనం” అంది శ్రీలక్ష్మి.
“అయితే అభిషేకం చెయ్యలేదా?” అన్నాడు శేఖర్.
“ఎక్కడా, జనం తోసేస్తో వుంటే” అంది చేతిలోని బుట్ట భర్త చేతికి యిస్తో.
“సరే కూర్చో”, అంటూ బుట్టలోని అరటిపళ్ళు అక్కడే వున్న ఆవుకి వేసి, పాలు ఆవు మీద పోసాడు.
“అయ్యో అయ్యో అదేమిటి.. నేను సాయంత్రం వేరే గుడికి వెళ్దాం అనుకుంటూ వుంటే పళ్లు, పాలు ఆవుమీద గుమ్మరిస్తారా, నాదీ తప్పు బుట్ట మీ చేతికివ్వడం” అంది కోపంగా శ్రీలక్ష్మి.
“యింకా శివరాత్రి సాయంత్రం కూడా వుందా” అన్నాడు నవ్వుతు కారు ముందుకి పోనిస్తో.
“నన్ను విసిగించకండి. చిరాకుగా వుంది” అంది శ్రీలక్ష్మి.
శేఖర్ తన కోసం వండిన అన్నం తినేసి పడుకున్నాడు. శ్రీలక్ష్మి భక్తి టీవీ లో శ్రీశైలమహాత్యం చూస్తో కూర్చుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
కారులో వెళ్తున్న శేఖర్ దంపతులని ఎదురుగా లారీ వచ్చి గుద్దేసేంది.
“నడవమ్మా పెళ్లి నడకలు, యిలా అయితే ఇంద్రసభ లో రంభ డాన్స్ వుంది మిస్ అయిపోతాము” అంటున్న దేవభటులుని చూసి శ్రీలక్ష్మి అయితే తను చనిపోయి స్వర్గం కి వచ్చాను అన్నమాట, అవునులే ఎన్నీ పూజలు చేసాను, ఫలితం వుంటుంది మరి అనుకుంది.
‘పాపం ఆయనని ఏ లోకంలోకి తీసుకుని వెళ్ళారో, అప్పటికి చెపుతోనే వున్నాను కొద్దిగా కృష్ణా రామా అనుకోమని, వింటేనా పాపం ఆ యమలోకంలో ఏం బాధ పడుతున్నారో’ అనుకుంది భర్త శేఖర్ గురించి.
ఇంద్రలోకం లోకి ప్రవేశించారు, కిటకిట లాడుతున్న సభని పరికించి చూసి, సినిమాలో చూపించినంత అందంగా లేదు అనుకుంది శ్రీలక్ష్మి. అదేమిటి ఇంద్ర దేముడి ఆసనం పక్కన వున్న ఋషి గారితో తన భర్త కూర్చుని ఏదో కబుర్లు చెప్పేస్తున్నారు అనుకుని తన పక్కన వున్న భటుడిని, “బాబూ నేను పూజలు చేసాను కాబట్టి స్వర్గం కి వచ్చాను, మరి అటువైపు ఋషి గారితో మాట్లాడుతో కూర్చుని వున్న మా ఆయన ఏ పూజ చెయ్యకుండా యిక్కడికి ఎలా వచ్చారు” అంది.
“మీ ఆయన అంటే మాకేం తెలుసమ్మా, వుండు ఎలా వచ్చాడో తెలుసుకుని చెపుతాను” అని మాయం అయిపోయాడు.
“ఒక గడియలో మళ్ళీ వచ్చిన భటుడు, “అమ్మా! ఆయన నీ కంటే ఎక్కువ పుణ్యం సంపాదించాడు. నువ్వు చేసే దేముడు పూజలకు రోజూ పువ్వులు కోసి సిద్ధం చేసేవాడు, నువ్వు ప్రశాంతం గా పూజ చేసుకోవటానికి తన టిఫిన్ తనే చేసుకునేవాడు, ఎండలో గుడికి వెళ్తోంది పాపం అని నిన్ను తన కారులో తీసుకుని వెళ్ళేవాడు. అన్నిటికంటే శివరాత్రి నాడు గోవు కి అభిషేకం చేసి శివకేశవులకి బేధం లేదని నిరూపించాడని శివుడు మెచ్చి స్వర్గంలోకం ప్రాప్తిరస్తు అన్నారుట, అది విషయం” అన్నాడు.
ఇంతలో ‘నారాయణా నారాయణ’ అంటూ సభలోకి నారదుడు ప్రవేశించాడు. ఆయన గురించి భూలోకంలో ఎన్నో కథలు విన్న శ్రీలక్ష్మి భక్తి గా ఆయన కాళ్లకు నమస్కారం చేసింది.
“లేమ్మా, యింతవరకు భార్యాభర్తలు యిద్దరూ కలిసి ఒకే లోకం కి రావడం యిదే మొదటిసారి. అటు చూడు తల్లీ, మీ ఆయన దేవ గురువుగారిని కాకా పట్టి తను శాశ్వతంగా స్వర్గంలో వుండేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు చూడు గురువుగారు అలా విరగబడి నవ్వడం నేను అదివరకు చూడలేదు.
నీ భక్తికి మెచ్చి నీకు ఒక సహాయం చేస్తాను, వెళ్లి నీ భర్తకి నమస్కరించు, ఆయన చెప్పినట్టు చెయ్యి” అన్నాడు నారద ముని.
‘సరే స్వామి’ అని, మెల్లగా వెళ్లి భర్త కి ఎదురుగా నుంచుని నమస్కారం చేసి “మిమ్మల్ని మళ్ళీ యిలా కలవడం చాలా సంతోషం గా వుంది’.
నారద ముని మహిమ వల్ల తన భార్యని గుర్తించి, “గురువుగారికి ప్రణామం చెయ్యి”, “స్వామి ఈమె నా భార్య, మహా భక్తురాలు, నిత్యం దైవ స్మరణతో గడిపేది, అందులో మీ మహిమలు గురించి ఎన్నో ప్రవచనాలు వినేది” అని చెప్పేడు..
సంతోషం తో గురువుగారు కమండలంలోని జలం తీసుకుని శ్రీలక్ష్మి మీద చల్లి, శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,700
Threads: 166
Likes Received: 11,730 in 2,337 posts
Likes Given: 7,789
Joined: Nov 2018
Reputation:
797
“మా ఆవిడ ని వదిలి వుండలేను, నేను చేసిన పుణ్యం అయిపోగానే వెళ్ళిపోవాలి స్వామి, నా మీద కూడా కటాక్షం చూపించండి గురువుగారు” అన్నాడు శేఖర్.
నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనేక కథలు చెప్పి నవ్వించావు అని కమండలం లోనుండి జలం తీస్తోవుంటే, “గురువుగారు, నీళ్లు కొద్దిగానే జల్లండి, నాకు నెత్తిమీద నీళ్లు పడితే జలుబు చేస్తుంది” అన్నాడు శేఖర్ తలవంచుతూ.
“మళ్ళీ నవ్వించేశావు” అంటూ జలం చల్లి “శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు” అని దీవించారు. అంతే గురువుగారి కుర్చీనుంచి మాయం అయ్యిపోయారు
“గురువుగారు గురువుగారు” అంటూ కంగారుగా పిలుస్తున్న శేఖర్ దగ్గరికి నవ్వుతు వచ్చిన నారద ముని, “యింకా ఎక్కడ గురువుగారు, తను చేసిన తపస్సు ఫలితం వలన ఇంద్రుడు కి గురువుగారు గా పదవి వచ్చింది. యిప్పుడు తన తపస్సు ఫలం ఉపయోగించి మీకు శాశ్వతంగా యిక్కడ ఉండేడట్లు దీవించారు. దానితో ఆయన తపస్ ఫలితం అయిపొయింది, భూలోకం లో కి వెళ్లిపోయారు, మళ్ళీ ఒక యుగం తపస్ చెయ్యాలి నారాయణా” అన్నాడు నారద ముని.
“అయ్యో మా వల్ల గురువుగారు మళ్ళీ భూలోకంలో కి వెళ్లిపోయారా నారాయణా నారాయణ” అన్నాడు చెంపలు వేసుకుంటో శేఖర్.
“ఏమిటి కళ్ళు తెరవగానే వాట్సాప్ మెసేజ్ లు చూసుకునే మీరు, నారాయణా నారాయణ అంటూ కలవరింతలు, లేవండి, తొమ్మిది గంటలు అయ్యింది” అంటున్న భార్య గొంతు విని, ఉలిక్కిపడి లేచి, ‘అమ్మయ్యా ఇదంతా కల అన్నమాట. గురుద్రోహం చేసాను అని భయపడ్డాను’ అనుకుని లేచి స్నానం పూర్తి చేసుకుని పట్టుపంచె కట్టుకుని పూజా గదిలోకి ప్రవేశించాడు.
అప్పటికే దీపారాధన చేసి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేసుకుని శ్రీలక్ష్మి వెళ్లినట్టుంది, దీపారాధన కాంతులతో వేంకటేశ్వరస్వామి మెరిసిపోతున్నాడు, శివుడి మీద పాలు పోసి, నుదుటిన విభూతి రాసుకుని రుద్రాక్ష మాలతో కళ్ళుమూసుకొని జపం చేసుకువడం మొదలెట్టాడు. మొహం కడుకోవడానికి వెళ్లిన భర్త యింకా రాలేదేమిటి అనుకుంటూ మేడమీద గదికి వచ్చి చూసిన శ్రీలక్ష్మి పూజాగదిలో కఠోర జపం లో వున్న భర్తని చూసి, బాగానే వుంది ఏమిచేసినా అతే అనుకుంటూ వచ్చేసింది.
మొహం నిండా విభూతి నుదట కుంకం బొట్టుతో మెట్లు దిగుతు “ఏమో అనుకున్నాను.. పూజామందిరం లో వున్న ప్రశాంతత ఎక్కడా దొరకదు లక్ష్మి, యిన్నాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేసాను, ఈ రోజు నుంచి నాది నీ దారే” అంటూ రాత్రి వచ్చిన కల గురించి వివరించి చెప్పాడు.
“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం గురించి నీకు బాధ్యత లేదు, అది నేను చూసుకుంటా” అన్న భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ ని నమ్మి ఎవ్వరికీ అపకారం చేయకుండా మన జీవితం గడపాలి అంతే” అంది శ్రీలక్ష్మి.
శుభం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|