Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
ఆ ఇంతి దమయంతి
రచన: వీరేశ్వర రావు మూల
నలుడు చాలాకాలం తర్వాత తన శయనమందిరమున ఏకాంతముగా ఉన్నాడు. శని ప్రభావం తప్పించుకుని మరల గ్రహణము వీడిన భానుడి వలే భాసించు చున్నాడు.
అతని శయనమందిరము నానా పుష్ఫ సుగంధములచే పరిమళభరితమైనది. కల కూజితములచే ఆ మందిరము రస రంజితమైనది. అతని విశాల వక్ష స్థలమును పూల పుప్పొడి తాకి విరహజ్వాలలు రేపు చున్నది.
"ఏల దమయంతి రాలేదు? ఇంకనూ అలంకారము పూర్తి కాలేదా? స్త్రీలు అలంకార ప్రియులు. నా మనస్సు ఆ మనోహర సౌందర్య రాశి ని చూడవలెనని ఉవ్విళ్ళూరుచున్నది. ఆమెకు అందమే కాదు. ప్రజ్ఞ యందు ఎవ్వరికి తీసిపోదు. కనుకనే తన యుక్తిని ఉపయోగించి దేవతల నుండి తనను రక్షించింది.
స్వయంవరమున వరించింది. దేవతల ఈర్ష్య అసూయలకు కారణమై, జీవితమే రణమైనది. ఒహో అది గతము. ఎన్ని క్లేశములు అనుభవించినా మొక్కవోని ఆమె ధైర్యమే ఆమె సౌందర్య కీలకం కాబోలు. ప్రస్తుతం హంస లేదు వర్తమానం పంపడానికి. హంస ఏ హంసను కూడుటకు పోయినదో!
ఘడియలు గడుచుచున్నవి. దమయంతి కానరావడం లేదు. అలుక కాదు కదా! దమయంతి అనగా దమం కలిగిన ఇంతి కదా! ఇంద్రియ నిగ్రహం పాటించుచున్నదా?
అద్వైతమై రసాంబుధిలో మునక వేసి తరించవలిసిన క్షణాలు కదా!
నలుడు పరి పరి విధముల తలపోసి, వేచి వేచి అలసటచే నిద్రించెను.
********
మనస్సును సుగంధ పరిమళం చుట్టుకొనుటచే కనులు
విప్పెను. పక్కలో, పక్కనే దమయంతి. కాని ఏమి లాభం? అటు తిరిగి నిద్రించుచున్నది.
"దేవీ"
జవాబు లేదు. దమయంతి అటు వైపునే ఉన్నది.
నలుడు ఆమె చరణములను ముద్దాడి, ‘నా వల్లే కదా నాడు అడవిలో ఈ పాదములు గాయములు పాలయినవి’ అని కించిత్ చింతించినాడు.
"ఇటు తిరిగి నలునిడిని కాంచవా?"
"కాంక్ష లేనప్పుడు ఎటు తిరిగిన ఏమి?"
"అదేమి? నాడు నీ గాఢ పరిష్వంగమున లోకములను మరిచితినే. నేడు ఇదేమి? ఐననూ నష్టం లేదులే" అని పద్యం చదివెను.
వరబింబాధరమున్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనోహర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత నేమాయె నీ గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకున్ జాలవే! గంగకద్దరి మేలిద్దరి కీడనన్ గలదె యుధ్యద్రాజబింబాననా!
(ఏమయిందో ఏమో నాయిక పెడమొగం పెట్టి అటు తిరిగిపోయింది. చూసే చూపు, మనసులో ప్రేమ ఉండాలి కానీ అందగత్తె ఎటు తిరిగితే ఏమవుతుంది? సౌందర్యం ఎక్కడికి పోతుంది? నాయిక అందాన్ని ఆస్వాదించడంలో నాయకుడిది ఎంత గడుసుదనమో!
దొండపడులాంటి పెదవులు, ఎత్తయిన పయో ధరాలు, వంపులు తిరిగిన ముంగురులు చూపకుండా నువ్వు వెనక్కి తిరిగి నిలబడితే మాత్రం ఏమిటీ? వెనుకవైపు ఉన్న నీ విశాల జఘన భాగం, చక్కనైన నల్లని నాగుపాము వంటి వేణి(జడ) నాకు చాలవేంటి? గంగానదికి అవతలి వైపు మంచిది, ఇవతలి వైపు చెడ్డది అని ఉంటుందా? అలాగే అందమైన నిన్ను ఏ వైపునుంచి చూసినా కనువిందే కదా!)
దమయంతి నలుని గడుసుతనానికి సంతసించి,
"స్వామి, రెండు వరములు ఇచ్చిన అటు తిరిగెదను" నవ్వూతూ అన్నది.
నలుని కరము ఆమె వెన్ను నుండి పాకి కుచ గిరులపై క్రీడించుచున్నది. చిరు కోపమును క్రీగంట ప్రదర్శించింది.
"వరములన్న భయము దేవి. నాడు దశరథుడు కైకకు వరములు ఇచ్చి ఎట్లు ఇక్కట్ల పాలయ్యినాడో చూచితిమి కదా" అన్నాడు నలుడు చిరు ఆందోళనగా.
"అది సమర సందర్భం" అంది దమయంతి.
"ఇది మాత్రం తక్కువా? శృంగార సమరం"
చెరకు వింటి వేలుపు తన శరములు సంధించగా, నలుడు దమయంతి అధరామృతం గ్రోలవలెనని, స్థనాగ్రముల స్పర్శతో కనురెప్పలు సరసీరుహములుగా రూపాంతరం చెందాలని, అతని మనస్సు మోహతీరమున మీనము వలే కొట్టుకునుచున్నది.
"సరే దేవి, రెండు వరములు కోరుకొనుము"
"స్వామి రెండు వరములు"
"చెప్పు" అన్నాడు నలుడు సుగంథభరిత నల్లని జడను కంఠానికి చుట్టుకుంటూ.
"ఒకటి మీ వంట రుచిచూడవలెనని. రెండు మీరు శాశ్వతంగా జూద క్రీడను విరమించవలెను."
"రమించు సమయమున ఈ వరములా?"
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
27-12-2025, 06:48 PM
(This post was last modified: 27-12-2025, 06:49 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
"వంట.." అంటూ నలుడు గొణుగు చుండెను.
"బాహుకుడి గా మీ పాక నైపుణ్యం ఋతుపర్ణుని రాజ్యమున చూపలేదా? "
"అవును"
"జూదమే గదా మనల్ని దు:ఖ లోయ లోకి తోసినది"
"అవును"
నలుడు రెండు వరములు ఇవ్వగానే దమయంతి లేచి అతని పాదములకు నమస్కరించినది.
నలుడు సంతసించి దమయంతిని బిగియార కౌగలించుకొనెను. అకస్మాత్తుగా అతని దృష్టి అంత:పుర మున మూలనున్న వస్త్రము పై పడినది.
"అది"
" మీరు నన్ను అడవినందు వదలి, కొంత భాగం చింపుకుని వెళ్లిన చీర"
"ఎందులకు దాచావు?"
"మనకు దిక్సూచి గా ఉపయోగపడుతుందని"
దమయంతి ఎప్పుడూ ఆతనికి ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది.
"నీకు వరములు దక్కినవి. మదన కదన రంగమున
శక్తి పరీక్షించుకుందునా"
"చూద్దాం" అని అతనికి దొరకకుండా పరుగెత్తినది. నలుని బలమునకు ఓడి అతనికి చిక్కినది.
అతని పెదవులు ఆమె అధరామృతం ను తనివితీరా గ్రోలినవి.
అతని మోము ఆమె కుచకుంభములతో క్రీడించి, సైకత శ్రేణిని తలపించు ఉదరభాగమును చేరినది.
మన్మధుని సతి ఆమెను ఆవహించి రతి కి ప్రేరేపించుచున్నది. చంద్రుడు వారి సమాగమమును చూచి సిగ్గుపడి మేఘ సుందరి పరదాలలో తలదాచుకున్నాడు.
నాభి అతనికి శృంగార ఊబి ని చూపించగా, మునక వేసి,
అద్భతమై డెందాలకు ఆనందమై, అనఘమై, అద్వైతమై
విల్లు లా ఒంగిన దేహాలు ఖజరహో శిల్పాలై...
ఆనందానికి అంచులు చేరి ఇద్దరూ విజేతలయిన
రస వితర్ధిక పై సైనికులై..
ఆ క్షణం
అమృత క్షణం..
రస జ్వలన అను క్షణికం....
సమాప్తం
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
బార్బరీకుడు
రచన: Ch. ప్రతాప్
భారతీయ పురాణాలలో బార్బరీకుడు ఒక అసామాన్య వీరుడు. మహాభారతంలోని మహా పాండవ యోధుడు భీమసేనుడి మనవడు.
ఘటోత్కచుడు నాగవంశానికి చెందిన మౌర్వి దేవితో వివాహం చేసుకోవడం ద్వారా జన్మించిన పుత్రుడే బార్బరీకుడు. ఈ వీరవంశంలో పుట్టిన అతడు చిన్ననాటి నుంచే యుద్ధ విద్యలో అసాధారణ ప్రతిభను కనబరిచాడు.
అస్త్రశస్త్రాల పట్ల అతడిలో ఉన్న ఆసక్తి, సాధన చూసి దేవతలు సంతుష్టులై, బార్బరీకునికి మూడు దివ్య బాణాలను వరంగా ప్రసాదించారు. ఈ మూడు బాణాల శక్తి అద్భుతమైనది; వాటి సహాయంతో ఏ యుద్ధాన్నైనా క్షణాల్లో ముగించే సామర్థ్యాన్ని అతడు పొందాడు. అందుకే ఆయనకు “త్రిబాణధారి” అనే అపూర్వ బిరుదు లభించింది.
కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే వేళ, ఈ ధర్మయుద్ధంలో పాల్గొనాలనే సంకల్పంతో బార్బరీకుడు బయలుదేరాడు. వెళ్లే ముందు తల్లి మౌర్వి అతడికి ఒక గంభీరమైన మాట తీసుకుంది— “యుద్ధంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, వారికే నీ సహాయం అందించాలి.” తల్లిపట్ల విధేయుడైన బార్బరీకుడు ఆమె మాటకు కట్టుబడ్డాడు. అయితే ఈ ప్రమాణంతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన అతడు, తన మూడు బాణాల శక్తిని ఉపయోగిస్తే, రెండూ పక్షాలు పూర్తిగా నశించి, చివరికి తానే ఒక్కడిగా మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించాడు.
ఈ అపూర్వ శక్తి యుద్ధ ఫలితాన్ని వక్రీకరించవచ్చని భావించిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణ వేషంలో బార్బరీకుణ్ని పరీక్షించాడు. “మూడు బాణాలతో కొలిమి వంటి ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తావు?” అని ప్రశ్నించగా, బార్బరీకుడు తన దివ్య బాణాల శక్తిని వివరించాడు— మొదటి బాణం శత్రువులని గుర్తిస్తుంది, రెండోది తనవారిని రక్షిస్తుంది, మూడోది లక్ష్యాన్ని నిర్మూలించి తిరిగి వస్తుంది. ఈ శక్తితో యుద్ధాన్ని నిమిషాల్లో ముగించగలనని అతడు ధైర్యంగా తెలిపాడు.
బార్బరీకుని వీరశక్తి, ప్రమాణం కలిసిపోతే ధర్మయుద్ధం యొక్క అసలు ప్రయోజనం నష్టపోతుందని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు, తన దివ్యరూపం చూపించి, యుద్ధం ప్రారంభానికి ముందే బార్బరీకుని తలను బలిగా కోరాడు. ఈ బలి ద్వారా యుద్ధ ఫలితం నిష్పాక్షికంగా తెలిసేలా అవుతుందని వివరించాడు. ధర్మం కోసం ప్రాణం అర్పించడం ఆనందంగా స్వీకరించిన బార్బరీకుడు, తల బలి ఇచ్చాడు. తన త్యాగాన్ని యుద్ధాన్ని పర్యవేక్షించే మహాశక్తిగా నిలబెట్టాలని ప్రార్థించగా, శ్రీకృష్ణుడు కలియుగంలో “ఖటూశ్యామ్”గా పూజలు అందుకుంటావని వరం ఇచ్చాడు.
యుద్ధం అనంతరం, బార్బరీకుని తల రాజస్థాన్లోని ఖటూ గ్రామంలో దర్శనమిచ్చింది. అప్పటి నుంచి ఆయన “ఖటూశ్యామ్”గా భక్తుల పూజలు అందుకుంటూ వస్తున్నారు.
నేటికీ భక్తులు “జయ శ్యామ్” నామస్మరణతో ఆయన త్యాగాన్ని స్మరించి కృప కోరుతారు. ధైర్యం, త్యాగం, విధేయత, ధర్మనిష్ఠ— ఈ నాలుగు మహిమాన్విత గుణాలకు బార్బరీకుడు నిత్య ప్రతీకగా నిలిచాడు.
బార్బరీకుని కథ మనకు అందించే శాశ్వత ఉపదేశం— శక్తి స్వార్థానికి కాదు, ధర్మానికి; అహంకారానికి కాదు, త్యాగానికి వినియోగించబడాలి. తల్లి మాట, ధర్మ నియమాలు అన్నిటికంటే గొప్పవిగా భావించి ప్రాణం అర్పించిన ఈ మహాత్ముని గాథ భారతీయ పురాణాల్లో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
సమాప్తం
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
అశ్వద్ధామ ఘాతుకం
రచన: Ch. ప్రతాప్
మహాభారత సంగ్రామం కేవలం ఆయుధాల యుద్ధం కాదు; అది కోపం, ప్రతీకారం, ధర్మం, అధర్మం మధ్య నడిచిన అంతర్యుద్ధం. యుద్ధం చివరి రోజుల్లో జరిగిన అశ్వత్థామ ఘాతుకం ఈ మహాకావ్యంలోని అత్యంత హృదయ విదారక ఘట్టం. అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుల మరణాన్ని అంగీకరించలేకపోయాడు. పాండవులు “అశ్వత్థామ హతః” అని అబద్దం చెప్పి ద్రోణుణ్ణి ఆయుధాలు వదిలించడంతో, ఆచార్యుడు నిరాయుధంగా వధింపబడ్డాడు. ఈ మోసంతో కూడిన వధ అశ్వత్థామ మనసును బద్దలుకొట్టింది. ఆ బాధ అతని హృదయాన్ని అగ్నిపర్వతంలా మండేలా చేసింది.
తండ్రిపై ఉన్న భక్తి, గౌరవం, ప్రేమ — ఇవన్నీ ఒక్కసారిగా ప్రతీకారాగ్నిగా మారిపోయాయి. అతనికి అప్పటి నుండి పాండవులను ఎలాగైనా శిక్షించాలన్న ఆవేశం అతనిలో ఆవహించింది .
ఆ ప్రతీకారభావంతో ఒక రాత్రి వేళ పాండవుల శిబిరంలోకి రహస్యంగా ప్రవేశించి, నిద్రలో ఉన్న ద్రౌపది ఐదుగురు కుమారులను పాండవులని భావించి వధించాడు. వారి చేతుల్లో ఆయుధం లేదు. వారు యుద్ధంలో లేరు. వారికీ , ద్రోణాచార్యుడి మరణానికి ప్రత్యక్ష సంబంధం అసలు లేనే లేదు.
ఇది శౌర్యం కాదు — అవివేకం. ఇది ప్రతీకారం కాదు — ఆవేశం.
ఆ దారుణమైన అపరాధానికి, ఆ కపట చర్యకు ప్రతిఫలంగా సాక్షాత్తు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడి శాపం అతనికి లభించింది. ఆ శాపం కేవలం మరణంతో అంతమయ్యేది కాదు.
ఆ శాపం ప్రభావంతో, అతడికి మరణమనే మోక్షం దక్కకుండా పోయింది. అతడి శరీరం నశించదు, కానీ ఆత్మకు శాంతి లభించదు. ఆ శాపం అతడిని యుగయుగాల పాటు వెంటాడే ఒక నశించని జీవితాన్ని, నిత్యం వెంటాడే దుర్భరమైన బాధను ప్రసాదించింది. ప్రతి యుగంలో, ప్రతి కాలంలో అతడు జీవించి తీరాలి; తాను చేసిన నేరం యొక్క భయంకరమైన జ్ఞాపకాలు అతడి అంతరంగంలో నిప్పుల కొలిమిలా మండుతూనే ఉండాలి.
అతడి కళ్ల ముందు కాలాలు మారినా, ప్రపంచాలు నశించినా, తన శరీరం మాత్రం ఆ పాపపు ఫలితాన్ని భరిస్తూ, అమరత్వపు భారాన్ని మోస్తూనే ఉండాలి. ఆ శిక్ష కేవలం వేదన కాదు; అది పశ్చాత్తాపం అనే అగ్నిలో నిత్యం కాలిపోతూ, మరణం కోసం వేడుకుంటూ జీవించే దైవ నిర్ణయం. అతడి ఉనికి, ఇకపై కృష్ణుడి న్యాయానికి ఒక శాశ్వత ప్రతీకగా మిగిలిపోయింది.
భారతంలో ఈ ఘట్టంలో ఉదహరింపబడిన ఒక ప్రముఖ శ్లోకం అశ్వత్థామ భయంకరమైన కోపాన్ని, ఆవేశాన్ని నొక్కి చెబుతుంది.
శ్లోకం:
క్రాధ్దూత బుద్ధిం నిధనేషు కృత్వా ధర్మం విముచ్య రణే చ రాత్ర్యాం
పాండవానాం చ శిబిరం ప్రవిశ్య నిహతాః సుప్తాన్ అపి బాలకాన్ సః
ఆవేశంతో, ప్రతీకారంతో బుద్ధిని, వివేక విచక్షణాలను కోల్పోయి, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి, అసుర స్వభావంతో అశ్వత్థామ రాత్రివేళ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి అక్కడ నిద్రపోతున్న అభం శుభం తెలియని ఆ పసి బాలలను (ఉపపాండవులను) సైతం నిర్దాక్షిణ్యంగా వధించాడు.
మరొక శ్లోకం అశ్వత్థామ నిద్రలో ఉన్నవారిని చంపడం ద్వారా చేసిన ఘోరమైన అకృత్యాన్ని వివరిస్తుంది.
శ్లోకం:
సుప్తానిమాన్ శిషువన్ నిహత్య ధర్మస్య మార్గం సమతిక్రమ్య |ద్రౌపద్యాః పుత్రాన్ పంచైవ హత్వా ధర్మజస్య సభాసనాన్ గతాః
అశ్వద్ధామ ధర్మ మార్గాన్ని పూర్తిగా అతిక్రమించి ,నిద్రపోతున్న ఈ శిశువులను (ఉపపాండవులను) చంపే ఒక దారుణ కార్యాన్ని ఆచరించాడు.
ఈ శ్లోకాలు, ఎంతటి శక్తిమంతుడైనా, ఆవేశం మరియు విచక్షణారాహిత్యం కారణంగా దారుణమైన అధర్మానికి పాల్పడతారని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకే ధర్మం, న్యాయం ఎప్పుడూ పాటించాలని మహాభారతం బోధిస్తుంది.
ఎంతటి బలం ఉన్నా — ఆవేశం మనల్ని దుర్బలుల్ని చేస్తుంది. కోపం, తొందరపాటు స్వభావం మనిషి పతనానికి ప్రధాన కారణాలు అవుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.. అదుపులేని కోపం, ఆలోచనా శక్తిని హరించి, మనిషిని విచక్షణారహితంగా వ్యవహరించేలా చేస్తుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, నోటి నుంచి జారిన కఠిన వాక్యాలు దీర్ఘకాలికంగా సంబంధాలను నాశనం చేస్తాయి. శత్రుత్వాన్ని పెంచుతాయి.
ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకునే వ్యక్తి మానసిక ప్రశాంతత కోల్పోతాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఉన్నత స్థానంలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆగ్రహం వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా గౌరవాన్ని కోల్పోయి, పతనం దిశగా పయనించక తప్పదు. అందుకే, శాంతమే మనిషికి నిజమైన బలం. ఈ అంశాలను మనం అశ్వద్ధామ జీవితం నుండి నేర్చుకోవచ్చు.
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
17-01-2026, 06:23 PM
(This post was last modified: 17-01-2026, 06:26 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నిజమైన వీరుడు ఎవరంటే శత్రువును ఓడించేవాడు కాదు.తనలోని కోపాన్ని జయించేవాడు.అశ్వత్థామ వద్ద శక్తి , సాహసం,జ్ఞానం మరియు గురు భక్తి వున్నాయి. అపారమైన శాస్త్ర పాండిత్యం కూడా ఉంది. అయితే ఏం లాభం ? అన్ని వున్నా కూడా తన ఆవేశాన్ని, ప్రతీకారేచ్ఛను ఆపలేకపోయాడు.అందుకే అతను చరిత్రలో వీరుడిగా కాక ఒక పిరికిపందలా, కనీస మానవత్వం మిగలని ఒక అసుర స్వభావం కలవాడిగా చరిత్రలో మిగిలిపోయాడు.
ప్రతీకారంలో ఎన్నటికీ నిజమైన విజయం ఉండదు. అది కేవలం ఒక క్షణికావేశం, అంతిమంగా అంతులేని దుఃఖానికి దారితీసే ఒక విష వలయం మాత్రమే. నిజమైన శాంతి నిబిడీకృతమైంది క్షమాగుణంలో మాత్రమే. మనసును స్థిరంగా ఉంచుకొని, విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకున్నప్పుడే, ఆ చర్యలో శాశ్వత విజయం సాధ్యమవుతుంది.
కోపం అనే అగ్ని జ్వాల మన అంతరంగాన్ని దహించడానికి ఉవ్వెత్తున లేచినప్పుడు, అశ్వత్థామ అనే ప్రతీకార రూపం మనలో మేల్కొనడానికి సిద్ధమవుతుంది. అటువంటి క్లిష్ట సమయంలో, ఆ ఆవేశాన్ని అదుపు చేయడానికి, మనం మనసులో ఒక్కసారి గంభీరంగా, స్థిరంగా ‘ఇది ప్రతీకారం చూపే సమయం కాదు; ఇది ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే సమయం’ అని చెప్పుకోవాలి.
ఆగ్రహం యొక్క అంధకారం మనల్ని ఆవరించినప్పుడు, మనం దానిని తక్షణమే నిలువరించాలి. ఆవేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, దాని వెనుక ఉన్న తార్కికతను ధ్వంసం చేస్తుంది. మనలో మెదిలే ప్రతి స్పందనకూ వెంటనే ప్రతిచర్య చూపకుండా, ఒక్క క్షణం ఆగి, విచక్షణ అనే కవచాన్ని ధరించాలి.
ఎందుకంటే, ఆవేశాన్ని జయించినవాడే నిజమైన యోధుడు, నిజమైన విజేత. అంతరంగంలో జరిగే ఈ ధర్మ యుద్ధంలో గెలిచినప్పుడే, బాహ్య ప్రపంచంలో శాంతి, గౌరవం, స్థిరత్వం అనే పతాకాలు ఎగురుతాయి. మన శాంతి మన చేతుల్లోనే ఉంది.
సమాప్తం
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
శకటాసుర వధ
![[Image: image-2026-02-02-092803806.png]](https://i.ibb.co/N2trjfgW/image-2026-02-02-092803806.png)
రచన: Ch. ప్రతాప్
శ్రీకృష్ణుని బాల్యలీలల్లో శకటాసుర వధ ఒక అద్భుతమైన ఘట్టం. మధురానగరాధిపతి కంసుడు తన వధకుడు వ్రేపల్లెలో పుట్టాడని తెలిసి, వరుసగా రాక్షసులను పంపిస్తూనే ఉండేవాడు. ఆ రాక్షసుల్లో శకటాసురుడు ఒకడు. ఈ లీల కేవలం ఒక రాక్షసుని నాశనం కాదు, కృష్ణుని దివ్యశక్తి లోకానికి తెలిసే ఘట్టం.
శకటాసురుడు గతజన్మలో ఉత్కచుడనే గంధర్వుడు. అహంకారంతో అష్టావక్ర మహర్షిని అవమానించడంతో, మహర్షి శపించి రాక్షసునిగా జన్మించేలా చేశాడు. ఆ శాపం వల్ల కంసుడి సైన్యంలో చేరి, శకటాసురుడయ్యాడు.
భాగవతం ఇలా చెబుతుంది:
“స కృత్వా రౌరవం ఘోరం బ్రహ్మస్వం చోపజీవతి ।శకటాఖ్యో మహాఘోరః ప్రాప్తస్ తద్బాలఘాతకః ॥” (10.7.7)
అంటే, బ్రాహ్మణ సంపదను అన్యాయంగా వినియోగించినందుకు రౌరవ నరకంలో పడి, రాక్షసరూపం ధరించి, శకటాసురుడిగా కృష్ణుని వధించేందుకు వచ్చినాడని భావం.
ఈ సంఘటన కృష్ణుని నామకరణం అనంతరం జరిగింది. యశోద మాత అతడిని ఒక పాత శకటం క్రింద ఉయ్యాలలో పెట్టింది. ఆ శకటంలో పాల పదార్థాలు నిండిపోయి ఉండేవి. ఇదే సమయం కోసం శకటాసురుడు వేచిచూస్తున్నాడు. శకటరూపంలోనే దాగి, బండిని కృష్ణునిపై పడేయాలని ప్రయత్నించాడు.
అప్పుడే ఊయలలో పడి ఉన్న పసికృష్ణుడు తన చిన్నపాటి పాదంతో బండిని తన్నాడు. ఒక్క క్షణంలో శకటమంతా విరిగి నలుదిక్కులా చెల్లాచెదురైంది.
భాగవతంలో ఈ దృశ్యాన్ని ఇలా వర్ణించింది:
“శయాన్యస్యాధరే శకటం విప్రో జనార్థితమ్ ।పదాఘాతం కరోతి స్మ స శకటం వ్యధూనయత్ ॥” (10.7.8)
అంటే, నేలపై ఉన్న బాలుడు పాదంతో తాకగానే ఆ బండి మొత్తం కూలిపోయిందని భావం.
ఆ శబ్దం విని యశోద, నందుడు, గోపికలు అక్కడికి పరుగెత్తారు. పసికృష్ణుడు క్షేమంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద బండి విరగడానికి కారణం ఏమిటో వారికర్థం కాలేదు. పెద్ద పిల్లలు “ఈ బాబు పాదంతో తన్నాడు” అని చెప్పినా, వారు నమ్మలేకపోయారు. యశోద దీనిని ఏదో అపశకునం లేదా అదృశ్యశక్తి ప్రభావంగా భావించింది.
శకటాసురుడు విముక్తి పొంది, మునుపటి రూపంలోకి తిరిగి చేరుకున్నాడు.
ఈ లీలకు లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. శకటం అంటే మనిషి జీవితాన్ని కట్టిపడేసే అహంకారం, గతకర్మలు, అదృష్టం వంటి బంధనలు. కృష్ణుడు చిన్నపాటి పాదంతో వాటిని ధ్వంసం చేశాడు. దీని ద్వారా ఆయన భక్తుల జీవితాన్ని అడ్డుకునే శక్తులను సైతం తొలగించగల పరమాత్ముడని ఈ లీలా తెలియజేస్తుంది.
మన జీవితాల్లో కూడా అహంకారం, క్రోధం, లోభం వంటి ప్రతికూల శక్తులే శకటాసురాల్లాంటివి. ఇవి మనలో దాగి, మన శాంతి–ఆనందాలను నాశనం చేయాలనుకుంటాయి. కృష్ణభక్తి అనే విశ్వాసం పాదఘాతం అయితే, ఆ బంధనలు ఒక్కసారిగా చెదిరిపోతాయి. ఈ లీల మనకు అందించే గాఢమైన సందేశం ఇదే.
***
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
గోడగూచి
రచన: సుధావిశ్వం ఆకొండి
'మాతా చ పార్వతీదేవీ - పితాదేవో మహేశ్వరః.
బాంధవాః శివ భక్తశ్చ - స్వదేశో భువన త్రయమ్'
జీవులు అందరికీ అమ్మ పార్వతీదేవి అయితే, తండ్రి పరమేశ్వరుడు, శివునికి నిజమైన భక్తులు అయినవారు బంధువులు అయితే, ముల్లోకాలు కూడా మన దేశమనే భావన కలిగివుండాలి అని శంకర భగవత్పాదులు చెప్పారు.
అటువంటి భావనలు ఉంటే సులభంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన వద్ద ఏమి తెలియని పసిపాపలాగే ఉండాలి. తల్లిదండ్రుల పైన పసిపిల్లలు ఎంతటి ప్రేమను కలిగివుంటారో, వారిని వదిలి ఉండలేకపోతారో అలాంటి భావనలు భగవంతునిపై కలిగివుండాలి.
తనకు తినమని అమ్మనాన్నలు ఇచ్చిందే వాళ్లకు పెడతానని, వాళ్లు కూడా తినాలని మారాం చేసే పసిపిల్లల వలె ఉంటే గనుక, జగత్తుకే తల్లిదండ్రులు అయినా, అంతటివారు ఆ ప్రేమకు పొంగిపోయి తాము దిగివస్తారు. అనుగ్రహించి, చివరకు తమలోకి తీసుకుని మోక్షాన్ని కూడా ఇస్తారు. అందుకు సాక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే, ఎందరో భక్తుల చరిత్రలు అందుకు ఉదాహరణలు!
శివ భక్తులైన నాయనార్లలో ఎంతోమంది అలా స్వామి అనుగ్రహం పొందినవారే! ఇంకా ఎందరో శివభక్తులు ఉన్నారు. కొందరు ముసలితనంలో ముక్తిని పొందితే, కొందరు మధ్యవయస్సులో, మరికొందరు పసి వయస్సులోనే ఈ లోకం పోకడలు తెలిసి, సంసారం అనే సాగరం ఈదులాడకుండానే ముక్తిని పొందారు. వారి పూర్వజన్మ సుకృతం! ఆ భోళా శంకరుని అనుగ్రహం!
అటువంటి వారిలో చాలా పసిపిల్లలా ఉన్నప్పుడే, శివుని వద్ద అలాగే మారాం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొంది, ముక్తిని పొందిన ఒక పసిపాప కథనే ఈ గోడగూచి.
పూర్వం శివదేవుడు అనే ఒక గృహస్తు ఉండేవాడు. అతడు మహా శివభక్తుడు. తమ ఊళ్లోని శివాలయంలో అర్చకుడు అతడు. ఆయన రోజూ శివాలయానికి బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసిన తరువాత ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని ప్రతిరోజూ ఎంతో భక్తితో అర్చించేవాడు.
అలా గడిచిపోతుండగా ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లకతప్పని పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగని ఆలోచించాడు.
చివరికి తన కూతురిని దగ్గరికి పిలిచాడు.
“అమ్మా గోడగూచీ! నేనూ, అమ్మ ఊరికి వెళ్తున్నాం! మేము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు తల్లీ!
అలాగే ఇంకో ముఖ్యమైన పని నీకు అప్పజెప్పి వెళ్తాను! జాగ్రత్తగా చేయాలి! అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా! ప్రతిరోజూ నేను శివుడికి పాలు ఇచ్చి వస్తాను కదా! ఇప్పుడు ఆ పని ఎలాగని ఆలోచించాను. శివుడికి రోజూ పాలు ఆరగింపు చేయకపోతే ఎలా? అందుకని ఆ పని నువ్వు చేయాలి! నీకు అప్పజెప్పి వెళ్తాను. రోజూ జాగ్రత్తగా స్వామికి పాలు ఇవ్వాలి నువ్వు. ఆటలు అంటూ ఎటూ వెళ్ళకు తల్లీ!
జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి ఈ పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని సావాసకత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మా! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!” అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.
"అలాగే నాన్నగారూ! తప్పకుండా చేస్తాను. మీరు పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి!' అంది.
అలా ప్రతిరోజూ గుడికి వెళ్లి, పాలు సమర్పించే పని కూతురు గోడగూచికి అప్పగించాడు శివదేవుడు. తర్వాత శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు.
మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాదులు ముగించుకొని, మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి, సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.
గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది. రెండు చేతులెత్తి స్వామికి భక్తిగా మొక్కింది.
తర్వాత పాల వైపు చేతులు చూపిస్తూ......
“శివయ్యా! ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను! ఆరగించవయ్యా!” అని శివుడికేసి చూస్తూ చెప్పింది.
శివుడు మాట్లాడలేదు. పాలు తాగలేదు.
'ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు? నేను ఇలాగే చూస్తుంటే తాగడం ఎలా అని తాగడం లేదో!' అని అనుకుంది మనసులో.
వెంటనే కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలోకి తొంగి చూసింది. గిన్నెలో ఉన్న పాలు అలాగే ఉన్నాయి. ఆ గిన్నె వైపు విచిత్రంగా చూసింది.
"అయ్యో! శివయ్యా! పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. నీకు తాగటానికి ఏమిటి ఇబ్బంది? ప్రతిరోజూ నాన్నగారు తెచ్చి ఇస్తారు కదా నీకు! అలాగే తీసుకుని వచ్చాను. కానీ కొంచెం కూడా తాగలేదు నువ్వు. ఎందుకు? అన్ని పాలు అలాగే ఉన్నాయి. నేను తెచ్చిన తాగవా! తాగు తాగు!" అంటూ శివుడికేసి చూసి ఆదేశించినట్లుగా అంది.
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
ఊహు! శివుడు తాగలేదు. మాట్లాడలేదు.
ఆ చిన్నపిల్లకు చింత మొదలైంది. రకరకాలైన ఆలోచనలు వచ్చాయి.
'అమ్మానాన్నలు చెప్పి వెళ్ళారు. నాన్న చెప్పినట్లు నేను చేసాను. ఎలా పాలు తీసుకుని శివునికి ఇవ్వమని నాన్న చెప్పారో అలాగే తీసుకుని వచ్చానే! మరి లోపం
ఎక్కడ జరిగిందో! శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు? పోనీ తనకి ఒంట్లో ఏమైనా బాధగా ఉందేమో!' అనుకుని మళ్లీ అడిగింది ఆయన్ని.
"ఏమైంది శివయ్యా? నీకేమైనా ఒంట్లో బాగులేదా? అయినా పాలు మంచివే కదా! అవి తాగితే అన్నీ బాధలు తగ్గుతాయి. అమ్మ చెబుతుంది ఎప్పుడూ! నేను అందుకే అమ్మ ఇవ్వగానే తాగుతాను. నువ్వు కూడా పాలు తాగు! అన్నీ తగ్గిపోతాయి! సరేనా! మంచివాడివి కదా! తాగు త్వరగా!" అంది గోడగూచి మళ్లీ.
అయినా పాలు తాగలేదు సరికదా, ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు.
దాంతో గోడగూచికి భయం పట్టుకుంది.
'శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! నాన్న నియమాన్ని ఖచ్చితంగా పాటించమని మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఇప్పుడు చూస్తే శివుడు పాలు త్రాగడం లేదు!' అనుకుని
శివుడి వైపు దీనంగా చూస్తూ...
"పాలు ఎందుకు తాగడంలేదు? తాగవయ్యా! ఓ లింగమూర్తి!" ప్రాధేయపడింది.
అయినా మాట్లాడకపోయేసరికి...
"పాలు సరిగ్గా కాచలేదా! రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందా? నీళ్లు కలిపానని అనుకుంటున్నావా? ఒకవేళ ఆవుపాలు కావేమో అని అనుకుంటున్నావా?
పోనీ ఆకలిగా లేదా? రోజూ పాలేనని మొగం మొత్తిందా? లేదంటే కుంచెడు పాలు లేవని అనుకుంటున్నావా? నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నానని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు అనుకునేది తప్పు! నేను నీళ్లు కలపకుండా మంచి ఆవుపాలు చక్కగా కాచి, నాన్న చెప్పినట్లే చేసి, తీసుకుని వచ్చాను.
నాన్న ఇస్తే రోజూ చక్కగా త్రాగుతున్నావు కదా! ఇప్పుడు ఎందుకు త్రాగడం లేదు? ఓహ్! ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ చిన్నపిల్ల పాలు తెస్తే నేను తాగాలా? అని కోపమా? ఎందుకు అలా కోపం? చిన్నపిల్లలను అయితే ఏమిటి! నాన్న చెప్పినట్లే తీసుకుని వచ్చాను కదా! తాగవయ్యా!" అంటూ నిలదీయటం మొదలెట్టింది.
అయినా పాలు తాగలేదు శివుడు.
“పరమశివా! పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదంటే, పోనీ అదైనా నోరు తెరచి చెప్పాలి కదా! ఏం మాట్లాడవు!
చెప్పలేదు పోని నీకు ఆకలిగా లేకపోతే ఒక్క గుటక అన్నా తాగు! నేను తృప్తి చెందుతాను! నాన్నకు శివుడికి ఆకలిగా లేదని చెప్పాడని చెబుతాను" అంటూ ఆ పసిపిల్ల పరమశివుడిని బ్రతిమాలుతూనే ఉంది.
"నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు! అలా కొట్టిస్తావా? అలా కొట్టిస్తే నీకు సంతోషమా? నామీద ప్రేమతోనైనా త్రాగవా?
నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా నన్ను సాధిస్తున్నావు! పోనీ ఇవి ఈ పాలు కాకుండా ఇంకా ఏమైనా కావాలా? అవైనా అడుగు! నిమిషంలో తీసుకొస్తా! కానీ పాలు తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి! మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతర అప్పుడు నిన్ను పంపిస్తాగా! మా నాయన కదూ! మా శివయ్య కదూ! తాగవయ్యా!" అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది. ఏడుస్తోంది.
ఆ పరమేశ్వరుడు చిన్నపాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ వున్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకుండా ఎలా ఉంటాడు? అయినా పరిక్షిస్తూ వున్నాడు ఆ పాపను.
గోడగూచి కిందపడి ఏడుస్తూ గిలగిలా కొట్టుకోసాగింది.
'ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా వున్నాడు? నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు. కొడతారు!' అని అంటూ ఏడవసాగింది.
స్వామి వైపు చూస్తూ...
"నువ్వు ఈ పాలు తాగలేదంటే, నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు, కోపంతో నన్ను చంపేస్తారు.
నాన్నగారు పదేపదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం! అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు!" అని తలను శివలింగానికేసి బాదుకుంది ఏడుస్తూ.
ఆ సర్వేశ్వరుడు, భక్త వత్సలుడు ఒక్క క్షణం ఆగకుండా ఆ పాపను పట్టుకొని ఆపాడు తలకు దెబ్బ తగలకుండా. ఆ వెంటనే చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. పాలగిన్నెను తీసుకొని అందులోని పాలు మొత్తం తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది.
"హమ్మయ్య! త్రాగావా! ఇంత ఏడిపించావు! అమ్మానాన్న వచ్చేవరకూ రోజూ నేను పాలు తెస్తాను! ఇలాగే చక్కగా త్రాగాలి. నన్ను ఏడిపించకుండా తాగాలి! సరేనా!" అంది.
ఆయన సరేనని చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించాడు.
శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడనీ, పిలిస్తే పలుకుతాడనీ, పెట్టినవన్నీ ప్రేమగా పెడితే తింటాడనీ, మన మాటలు వింటాడనీ అనుకుని ఆనందించింది ఆ పసి పాప.
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయింది, పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం, ఆయన త్రాగడం జరుగుతోంది. అది శివుడికి కూడా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగి పోతున్నాయి.
ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలోనే గోడగూచి పాలను శివుడికి అరగింపు పెట్టి, తిరిగి ఇంటికి వెళ్తూ ఉంది.
అమ్మానాన్నలు రావడం చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో ఆమె తండ్రి శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూసాడు. పాత్రలో పాలు లేవు.
"ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుంచి వస్తున్నావు?" అని సందేహంగా అడిగాడు కూతురును.
పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు.
"శివుడు పాలు త్రాగడమేంటి? నువ్వు ఏదో అబద్దం చెప్పుతున్నావు. శివుడి పేరు చెప్పి పాలు నువ్వే త్రాగేశావా? నిజం చెప్పు! శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ! మన నియమాన్ని పాడుచేశావు కదా!" అంటూ ఆగ్రహంతో కూతురును తిట్టాడు.
పాప ఎంతచెప్పినా తన మాటలు నమ్మని శివదేవుడు మరునాడు కూతురు వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజూలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది.
"లింగమూర్తి అరగించవయ్యా!" అని పిలిచింది. స్వామి పలకలేదు.
"అయ్యో! నిన్నటివరకూ బాగానే త్రాగావు కదా! మళ్లీ ఏమైంది? నాన్న నా మాటలు నమ్మడం లేదు. రోజూలాగే వచ్చి పాలు త్రాగవయ్యా!" అని మళ్లీ.
అయినా శివుడు రాలేదు. త్రాగలేదు.
అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది.
"ఓసి! రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? కనీసం చూడను కూడా లేదు? కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే? ఎంత శివ ద్రోహం చేసావే? శివుడికి తెచ్చిన పాలను నీపొట్టలో పోసుకున్నావా? ఉండు! నీ పని చెప్పుతా ఎంత నాటకం ఆడావే? నిన్ను వూరికే వదిలి పెట్టను. నీ పొట్ట చీలుస్తా!" అంటూ వెర్రి కోపంతో కూతురి పైకి ఉరికాడు ఆ తండ్రి.
ఆ పసిపాప భయంతో వణకిపోయింది. ఎటు వెళ్లాలో తేలిక గట్టిగా ఏడుస్తూ...
"హా! లింగ! హా! లింగ!" అంటూ ఆ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఏడుస్తూ.
"ఇదిగో నేనున్నాను! భయపడకు!" అత్యంత దయతో మహాలింగ మూర్తి ఆ పసిపాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది.
వెర్రి కోపంతో కూతురు వెంట పడుతున్న ఆ శివదేవునికి పాప దాక్కోవడానికి వెళ్ళింది ఎక్కడ అనేది గ్రహింపుకు రానేలేదు. కోపంగా తండ్రి వెంటపడుతూ కూతురు వెంట్రుకలను చిక్కించుకున్నాడు.
"ఎక్కడికి పారిపోతావే?" అంటూ ఇవతలకి లాగబోయాడు. అప్పటికే ఆ పసి గోడగూచి శివుడిలో ఐక్యమైపోయింది.
ఆ దివ్యలింగం లోనికి వెళ్లి, ఆ పాప మాయమైపోయింది. కొద్దిసేపటికి శివదేవునికి జరిగిన విషయం అర్థం అయ్యింది.
ఎంతో నిశ్చలమైనది ఆ పసిపాప భక్తి! ఆ అమాయకత్వం శివుడికి ఇష్టమైనది అందుకే భక్తుడే అయినా తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చి, తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ భక్తవశంకరుడు. భక్తికి ఈశ్వరుడు వశం అవుతాడని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది!
కార్తీక సోమవారం గోడగూచి కథలో గోడగూచితో పాటుగా, ఆ కథలోకి మన మనసు ప్రవేశిస్తే, ఆ పరమేశ్వరుని దర్శనం, సాన్నిహిత్యం మనకూ లభిస్తుంది!
నమః శివాయ!
పార్వతీపతయే హర హర మహాదేవ!
������శ్రీకృష్ణార్పణమస్తు����������
•
Posts: 3,417
Threads: 160
Likes Received: 10,656 in 2,116 posts
Likes Given: 7,007
Joined: Nov 2018
Reputation:
742
సుషేణుడు
రచన: Ch. ప్రతాప్
భారతీయ ఇతిహాసాలలో, ముఖ్యంగా రామాయణంలో, యుద్ధరంగంలో ధైర్యసాహసాలు చూపేవారితో పాటు, తమ జ్ఞానం మరియు నైపుణ్యంతో కథాగమనాన్ని మార్చిన ముఖ్య పాత్రలు కూడా ఉన్నాయి. అలాంటి కీలకమైన పాత్రలలో ఒకరు సుషేణుడు. ఈయన లంకాధిపతి రావణుడి ఆస్థాన వైద్యాచార్యుడిగా ప్రసిద్ధి చెందారు. కానీ, రామాయణ యుద్ధంలో ఈయన పోషించిన పాత్ర రావణుడి వైపు కాకుండా, రామచంద్రుడి విజయం వైపు ఉండటం విశేషం.
సుషేణుడిని రావణుడి ఆస్థానంలో అత్యంత గౌరవనీయుడైన, మేధావియైన వైద్యుడిగా వర్ణిస్తారు. అద్భుతమైన ఆయుర్వేద జ్ఞానం, అసాధారణమైన మూలికా వైద్య నైపుణ్యాలు ఆయన సొంతం. రావణుడు సుషేణుడిని ఎంతగానో విశ్వసించేవాడు. అయితే, సుషేణుడు ధర్మపరుడు, న్యాయాన్ని పాటించేవాడు. ఆయుర్వేదం, వైద్య ధర్మం ప్రకారం, ఆయనకు ప్రాణం ముఖ్యం.
సుషేణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యత రామాయణ యుద్ధ సమయంలో స్పష్టమవుతుంది. ఇంద్రజిత్తు వేసిన శక్తి ఆయుధం తాకిడికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు, వానర సైన్యం, శ్రీరాముడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ శక్తి అసాధారణమైనది కావడంతో, హనుమంతుడు, జాంబవంతుడు వంటివారు కూడా చికిత్స చేయలేకపోయారు.
ఆ సమయంలో, లక్ష్మణుడి ప్రాణాలను కాపాడగలిగే ఏకైక వ్యక్తి సుషేణుడు మాత్రమే అని జాంబవంతుడు తెలియజేస్తాడు. ఇక్కడ సుషేణుడి ధర్మనిరతి ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయన రావణుడి ఆస్థానంలో ఉన్నా, మానవత్వం మరియు వైద్య ధర్మాన్ని అనుసరించి, శత్రుపక్షంలో ఉన్న లక్ష్మణుడికి చికిత్స చేయడానికి అంగీకరిస్తారు.
సుషేణుడు లక్ష్మణుడిని పరీక్షించి, ఆయన ప్రాణాలను కాపాడటానికి గల ఏకైక మార్గం హిమాలయ పర్వతాలలోని ద్రోణగిరి శిఖరంపై లభించే నాలుగు దివ్య ఔషధాలైన సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి మరియు సవర్ణకరణిని వినియోగించడమే అని చెబుతారు. ఈ మూలికలను తెచ్చే పనిని పరాక్రమవంతుడైన హనుమంతుడికి అప్పగిస్తారు.
హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని మోసుకొచ్చిన తర్వాత, సుషేణుడు తన అపారమైన వైద్య పరిజ్ఞానంతో ఆ మూలికలను సరిగ్గా గుర్తించి, వాటిని కలిపి లక్ష్మణుడికి చికిత్స చేస్తారు. సుషేణుడి చికిత్స ఫలితంగా లక్ష్మణుడు మళ్లీ ప్రాణం పోసుకుని, ఆరోగ్యంగా యుద్ధరంగంలోకి అడుగుపెడతారు.
సుషేణుడు తన జీవితాన్ని, వైద్య వృత్తిని ధర్మానికి అనుగుణంగా నడిపించారు. ధర్మాన్ని బలపరుస్తూ, దాని విజయానికి సహకరించడం చాలా ముఖ్యం. ధర్మం ఎప్పుడూ ఏ పక్షానికీ చెందదు, ఇది విశ్వవ్యాప్తం. సుషేణుడు రావణుడి ఆస్థానంలో ఉన్నప్పటికీ, మానవ ధర్మాన్ని (ప్రాణాలు కాపాడటం) అనుసరించడం వలన ధర్మానికే మద్దతునిచ్చారు. తన వైద్య జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, ప్రాణాలను రక్షించడానికి ఉపయోగించడం ద్వారా, సుషేణుడు తన జ్ఞానానికి సార్థకత చేకూర్చారు. సుషేణుడి చర్యలు శత్రు-మిత్ర భేదం లేకుండా, న్యాయం మరియు నీతిని సమతుల్యం చేశాయి, ఇది అంతిమంగా ధర్మ విజయాన్ని సులభతరం చేసింది.
ఈ సందర్భం సుషేణుడి గొప్పతనాన్ని, ఆయన వైద్య నీతిని నిరూపిస్తుంది. సుషేణుడి దృష్టిలో రోగికి సహాయం చేయడమే పరమ ధర్మం, యుద్ధంలో పక్షాలకంటే ప్రాణానికి ఎక్కువ విలువనిచ్చారు. ఆయన లక్ష్మణుడిని రక్షించాలనే నిర్ణయం రామాయణంలో కీలక మలుపునకు దారితీసింది. లక్ష్మణుడు బ్రతకడం వలన శ్రీరాముడికి ధైర్యం వచ్చి, యుద్ధాన్ని ముందుకు నడిపించగలిగారు.
సుషేణుడి పాత్ర ద్వారా రామాయణం మనకు, జ్ఞానం, నైపుణ్యం ఏ పక్షానికీ చెందినవి కావు, అవి మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలని సందేశాన్ని ఇస్తుంది. ఒక గొప్ప వైద్యుడిగా, మానవతావాదిగా సుషేణుడి పాత్ర చిరస్మరణీయం. ఈయన నిస్వార్థ సేవ మరియు అపారమైన వైద్య జ్ఞానం వల్లే లక్ష్మణుడి జీవితం నిలబడింది, యుద్ధ ఫలితం రామచంద్రుడికి అనుకూలంగా మారింది.
సమాప్తం
•
|