03-12-2024, 05:05 PM
Good story
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
|
12-12-2024, 03:58 PM
దసరా టు దీపావళి
రచన: తాత మోహనకృష్ణ సుబ్బారావు చిన్ననాటి నుంచీ చాలా పొదుపు పాటించే మనిషి. ప్రతీ రూపాయి ఎంతో అలోచించి ఖర్చు చేస్తాడు. అతను చాలా జాగ్రత్త అని అనుకుంటాడు.. కానీ, చుట్టూ చూసే జనం మాత్రం పిసినారి అంటుంటారు. సుబ్బారావు ఇలాంటి మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇలాంటి మనిషికి పెళ్ళి చేద్దామని అనుకున్నారు తల్లిదండ్రులు. అమ్మాయి ఫోటో చూసి పెళ్ళిచూపులు అరేంజ్ చేసారు. పెళ్ళి చూపులలో.. కట్నం అడిగితే బాగుండదు అనుకుని.. ఒక ప్లాన్ వేసాడు సుబ్బారావు. పెళ్ళి ఖర్చు అంతా ఆడపెళ్ళివారిదే.. దానితో పాటు అమ్మాయికి ఒక పెద్ద వడ్డాణం చేయించాలనేది షరతు గా పెట్టాడు. పెళ్ళికూతురు నడుము కొలత ముందే చూసి.. బంగారం లెక్క వేసాడు సుబ్బారావు.. ఎంత కాదన్నా.. ఎక్కువే ఉంటుంది బంగారం. "ఈ వడ్డాణం.. మీరు కొంచం లూజు గా చేయించండి.. మీ అమ్మాయి వొళ్ళు చేసినా సరిపోతుంది" అని సుబ్బారావు అన్నాకా.. ఆడపెళ్ళి వారంతా చాలా ఆశ్చర్యపోయారు. అయినా తప్పక ఒప్పుకున్నారు కాబోయే మావగారు.. ఆడపెళ్ళి వారిదే కదా ఖర్చు మరి.. పెళ్ళి కార్డ్స్ ఊరంతా పంచేసాడు సుబ్బారావు.. ఎంతకాదన్నా.. కట్నం డబ్బులు బదులు చదివింపులు బాగానే కిట్టు బాటవుతాయని ప్లాన్ వేసాడు . అనవసరంగా.. ఒక గ్లాస్ మంచినీరు కుడా తాగని సుబ్బారావు.. పెళ్ళి లో అందరికీ కూల్ మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వాలని అడిగాడు మావగారిని. తన ప్యాంటు షర్టు కొలతలు తెచ్చి.. పెళ్ళివారి అందరికీ చాలా కాపీలు పంచాడు సుబ్బారావు.. "ఇది ఎందుకండీ! అని అడిగారు కాబోయే మావగారు" "ఏమీ లేదు! అందరూ.. ప్యాంటు షర్టు ముక్కలు పెట్టేస్తున్నారు.. కొలతలు ఇస్తే.. కుట్టించి పెడతారని.. నాకూ గ్రాండ్ గా ఉంటుందని.. " పెళ్లి గ్రాండ్ గా జరిగింది.. ఆడపెళ్ళివారికి తప్పదు కదా! ఎంతైనా.. ఎక్కడైనా మరి! పెళ్ళి కానుకల విషయం లో ముందే చాలా క్లారిటీ తో ఉన్నాడు సుబ్బారావు.. ఒక్కొక్కరికి ఒక్కో ఐటెం అసైన్ చేసేసాడు గిఫ్ట్ కింద. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, డిష్వాషర్, కూలర్, ఇలా ఐటమ్స్ లిస్టు అందరినీ పంచుకోమన్నాడు. హనీమూన్ ట్రిప్ ఒకటి మిగిలింది. లక్కీ గా మావగారు.. టికెట్స్ ముందే బుక్ చేసేసారు. కూతురి కోసం చెయ్యాలి కదా మరి! హనీమూన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసారు కొత్త జంట.. ఎంతైనా ఫ్రీ యే కదా!.. బిల్ వర్రీ మాత్రం మావగారికి.. కొత్త పండక్కి అల్లుడుకి ఆహ్వానం వచ్చేసింది.. "అల్లుడుగారూ! మీరు అమ్మాయిని తీసుకుని ఈ దసరా పండక్కి ఒక వారం రోజులు సెలవు పెట్టి మా ఇంటికి రావాలి. ఇదే మా ఆహ్వానం!" "మావగారు! నేను ఆఫీస్ లో కొంచం బిజీ గా ఉన్నాను. అందులోనూ.. ఈ మధ్య అస్సలు ఖాళీ ఉండట్లేదు.. మీరే ఆ టికెట్స్ బుక్ చేసేయండి. నేనూ.. మీ అమ్మయీ పది రోజుల ముందే వచ్చేస్తాము. అంతగా పిలుస్తుంటే, ముందే రావాలనిపిస్తుంది మరి!" ఆ మాటలు విని మావగారు బిత్తరపోయాడు (ఇదేమిటి సెలవు ఉండదు.. ఒక రోజే వస్తారేమోననుకుంటే.. ముందే వస్తానంటాడేమిటి అల్లుడు?.. మనసులో అనుకున్నారు మవగారు) "ఏమండీ! అదేంటి అలా చెప్పారు? మీకు అన్ని రోజులు సెలవులు ఎక్కడ దొరుకుతాయి?" "అదేమిలేదే! 'వర్క్ ఫ్రొం అత్తారిల్లు' చేస్తాను. నాకు సెలవు పెట్టక్కర్లేదు.. అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా!" "ఏమిటో.. ?" "మనం ఇంట్లో లేకపోతే, మనకి.. కరెంటు ఖర్చు మిగిలిందా! పాలు, కిరాణా.. అన్నీ ఆదా.. సెలవు పెట్టను కాబట్టి జీతం కుడా నష్టం లేదు.. టికెట్స్ ఎలాగో ఫ్రీ యే కదా!.. పైగా.. మీ అమ్మ ఎలాగో.. తీసుకుని వెళ్ళమని ఆవకాయలు ఒక అరడజను రకాలు.. ఆ పొడి.. ఈ పొడి అని ఇస్తుంది కదా!.. మనకి అంతా లాభమే కదా! మరి.. " "అలా మూతి విరవకే సుమిత్రా!.. ఈ ట్రిప్ లో ఎలా ఆనందంగా ఉండాలో ఆలోచించు!" "ఇన్ని పిసినారి బుద్ధులున్నా.. మా పుట్టింటికి ముందుగా తీసుకెళ్తున్నారు.. అదే హ్యాపీ నాకు!" "నీ ఆనందాన్ని డబల్ చేసే ఇంకో విషయం తర్వాత చెబుతాను !!!" "హమ్మయ్యా! నవ్వింది మా ఆవిడ!" "ఏమండీ! అయితే బ్యాగ్ సర్దేస్తాను" "ఒసేయ్ ! రెండు జతలే పెట్టు" "అదేంటి!" "పండుగ కదా! ఎలాగో నీకో అరడజను చీరలు.. నాకో మూడు జతలు పెడతారు.. అవి వేసేసుకుంటే సరిపోతుంది.. ఎక్కువైతే మళ్ళీ ఆ పోర్టర్ కు అనవసరంగా మొయ్యడానికి డబ్బులు తగలెయ్యాలి!" ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది.. ట్రైన్ లో బెర్త్ ఎక్కి కూర్చున్నారు సుబ్బారావు దంపతులు. మనము ఒక నాలుగు గంటల్లో మీ ఊరు వెళ్లిపోతాము కదా! ఈ రెండు బెర్తులు మనకి అవసరమా చెప్పు! పాపం ఆ అమ్మాయి చూడు.. నిల్చొని ఎంత కష్టపడుతుందో.. ఒక బెర్త్ ఇచ్చేద్దాము సుమిత్రా!.. మనం ఒకే బెర్త్ లో పడుకోవచ్చుగా.. "బాగుండదేమోనండి!" "కొత్తగా పెళ్లైంది గా.. ఏమీ అనుకోరు లే.. మనకీ బాగుంటుంది!" "ఆ అమ్మాయిని పిలిచి బెర్త్ ఇవ్వు శ్రీమతి.. " "ఇచ్చేసానండీ శ్రీవారు!" "అదేంటి.. డబ్బులు తీసుకున్నావు?" "మీకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాను, మీతో కాపురం చేసి. ఫ్రీ గా ఎందుకు ఇవ్వడం అని.. ఒక ఐదొందలు అడిగా.. ఇచ్చేసింది. "పాపం! ఆ అమ్మాయికి బాగా నిద్ర వస్తున్నట్టు ఉంది మరి! మొత్తానికి నా లైన్ లోకి వచ్చేస్తున్నావే సుమిత్రా డియర్!" అన్నాడు సుబ్బారావు "సుమిత్రా! ఆకలి వేస్తోందే! ఏమైనా తెచ్చావా ఇంటి నుంచి?" "సమోసా తింటారా?" "మళ్ళీ అదో ఖర్చు లేవే !" "మీరు ఏది కావాలంటే అది తినండి. నేను చూసుకుంటాను!" "ఇంక చుసుకో.. నా ఆర్డర్ లిస్టు.. " ఈలోపు సుమిత్ర ఫోన్ అందుకుంది. "నాన్నా! మేము బయల్దేరాము.. ఉదయానికి అక్కడ ఉంటాము.. నా ఫోన్ లో బ్యాలన్స్ లేదూ.. ఊ .. ఊ.. " "అయ్యో! ఎందుకు కష్టపడతావు తల్లీ! ఒక వెయ్యి వెయ్యనా?" "మా నాన్నకి నేన్నంటే ఎంత ప్రేమో.. ఉంటాను నాన్నా!" "నువ్వు సూపర్.. సుమిత్రా!" "ఏమనుకున్నారు.. అవును మరి.. ఆరు నెలలు సావాసం చేస్తే, వారు వీరు అవుతారంటారు.. ఇదేనేమో" "నువ్వు ఇంకా ముందే మారిపోయావు సుమిత్రా! నీలో ఇంత మార్పు వచ్చింది కనుకా.. ఆ విషయం చెప్పాల్సిందే మరి!" "చెప్పండి ప్లీజ్!!" "నీ సంతోషం కోసం.. ఈ దసరా ట్రిప్ దీపావళి వరకూ పొడిగించాలని నిర్ణయించుకున్నాను.. దీనికి నీ సపోర్ట్ కావాలి నాకు" "దానికేముందండీ! మా నాన్న ఎలాగో పైసా ఖర్చు చెయ్యడు.. నా కోసం అయితే, బాగా ఆలోచించి ఖర్చు చేస్తాడు.. ఇప్పుడు మన కోసం ఖర్చు చేయిస్తాను .. ఆయన మీకన్నా పిసినారి" "నేను పిసినారి కాదు.. జాగ్రత్త పడతాను అంతే!" "మీరు ఎలాగనుకుంటే, అలగేలెండి!" "మరి మీ ఇంట్లో ఏమిటి చెబుతావు?" "దసరా టు దీపావళి ఎన్నో రోజులు లేవు కదా.. అలాగ అక్కడ చుట్టు పక్క ప్రదేశాలు తిరిగితే సరి! అదీ మా నాన్న చేత స్పాన్సర్ చేయిస్తాను.. " "చూస్తూ ఉంటే.. మీ నాన్న తో చాలా చేయించుకునే లాగ ఉన్నవే!" "ఇప్పుడు మనిద్దరి కోసం మా నాన్న కు తప్పుదు!" "అయితే.. దసరా టు దీపావళి సంబరాలు స్టార్ట్! పైసా ఖర్చు లేకుండా!" ****
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
19-12-2024, 02:29 PM
'పందిట్లో పెళ్లవుతున్నది'
రచన: విజయా సుందర్ "పిల్ల చాలా బాగున్నది కదరా" తల్లి మాటకి రాజీవ ముక్తసరిగా, "ఆ.. బాగున్నదమ్మా"అన్నాడు. కొడుకు ఇంత ముక్తసరిగా మాట్లాడటం ఎరగని శాంత విస్తుపోయింది! తల్లి తాము చూసి వచ్చిన అమ్మాయి గురించి తన అభిప్రాయం చెప్పమంటే రాజీవ్, " అమ్మా! ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది. కానీ.. మర్యాద అనే మాటకు అర్థం తెలియని దానిలా విసురుగా కూర్చుని, ‘మిస్టర్ రాజీవ్! నాకు ఇప్పుడ్డప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదీ ఇలా సంతలో పశువులా, ఓ ఎక్జిబిట్ లా అసలే ఇష్టం లేదు. మా నాన్న చాదస్తంతో.. ఎనీవే నేను ఆయన కూతుర్నే. నాకు మీ సంబంధం ఏ రకంగానూ నచ్చలేదని చెప్పేస్తాను’ అని వెళ్ళిపోయింది. “అమ్మా! ఇదా పద్ధతి ? అసలు నాకు ఏమి మాట్లాడటానికి ఇష్టమనిపించట్లేదు. నిష్కర్షగా చెప్పెయ్యండి వద్దని" అని రాజీవ్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న శాంత, భర్త రామనాథం నిస్పృహతో నిట్టూర్చారు! కాఫీ అడగడానికి వచ్చిన రాజీవ్, ఇంకా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. "అదేమిటి నాన్నా అలా అయిపోయారు? ఆ అమ్మాయి మీ ప్రాణ స్నేహితుడి కూతురు.. ఆంతే కదా అంతమాత్రాన, నేను ఆ అమ్మాయిని కాదంటే ఇంతలా రియాక్ట్ అయ్యారేమిటీ?" అన్నాడు. "రాజూ! కొన్ని విషయాలు నిలుచున్న పళంగా తేల్చి చెప్పలేము నాన్నా! ఆ అమ్మాయి తండ్రి నాకు స్నేహితుడు ఒక్కడే కాదురా.. నా ప్రాణదాత!" "ప్రాణదాతా?" శాంత రాజీవ్ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, "మీ నాన్న కి నువ్వు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు షుగర్ పెరిగి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి! నా కిడ్నీ సూట్ కాలేదు. కొనడానికి ప్రయత్నం చేస్తే ఏవీ సూట్ కాలేదు. అప్పుడు తన ప్రాణ స్నేహితుడు గంగాధరం, "అరేయ్ ఏంట్రా అలా కృంగిపోతున్నావు? నువ్వు డిప్రెస్ అయితే ఈ సంసారానికి దిక్కెవరు? నాకు రెండు కిడ్నీలున్నాయి కదరా.. నీకొకటిస్తాను.. అంతే సింపుల్" అంటూ ఏదో రెండు ఆపిల్స్ ఉంటే ఒకటి ఇస్తానన్నంత తేలిగ్గా అన్నాడు. అన్నీ తానే నిర్ణయాలు తీసుకుని డాక్టర్ తో మాట్లాడి, తన కిడ్నీ మ్యాచ్ అయిందని తెలుసుకుని, అన్ని ఏర్పాట్లు చేసి, కిడ్నీ ట్రాన్సప్లాంట్ చేయించేశాడు. తన కుటుంబం నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా కేర్ చెయ్యలేదు. భార్య రెండేళ్లు పుట్టింట్లోనే ఉండి పోయింది. నాన్న తన వలన వాళ్లిద్దరూ విడిపోతున్నారని, ఆవిడ దగ్గరకు వెళ్లి, బతిమాలి, బామాలి పిల్లకోసమైనా తప్పదని ఇద్దర్నీ కలిపారు. తిరిగి వచ్చిందన్న మాటే గానీ, భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడిపోయింది. నాన్న తన వలననే అని బాధపడితే గంగాధరం, " నీ మొహం నీ వల్లనేమీ కాదురా. నేను చదువుకునే రోజుల్లో వాళ్ళ ఇంట్లో వారాలు చేసుకున్నాను. వాళ్ళ నాన్న కష్టపడి పైకొచ్చే నన్ను మెచ్చి, ఆవిడ మెడలు వంచి మా పెళ్లి చేసాడుట. అది నాకు తెలియదు. అందుకని నేనెప్పటికీ ఆవిడకి రాంగ్ నెంబర్నే" అని ఓదార్చేవాడు. " తల్లి ముగించింది. రామనాథం, "ఈ మధ్య వాడు కూతురి గురించి బాధపడ్డాడు. చిన్నప్పుడు తన దగ్గరే ఎంతో మాలిమిగా ఉండే పిల్ల, పెద్దది అవుతున్నప్పట్నుండి తల్లి ప్రభావం పడుతున్నదనీ, తొందరగా పెళ్లి చేసి పంపాలని ఉన్నదనీ, మనలాంటి మంచి ఇంట్లో అయితే బాగుంటుందని తన మనసు విప్పి చెప్పాడు. అందుకే మేము ఆశపడ్డాము ఇలా వాడి రుణం తీర్చుకోవచ్చునని.. కొడుకు మనసులో మెదిలే ఆలోచనలు పసికట్టినట్లు ఆయన, "అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యాలని కాదు.. అయినా ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పేస్తానన్నది కదా. చూద్దాం ఏం జరుగుతుందో?" అన్నాడు. *** రాజీవ్ ముఖకవళికలను బట్టి, తన కూతురి గురించి తెలిసిన గంగాధరం వాళ్ళు వెళ్ళగానే మిహిరను నిలదీసాడు. "అవును నేను చెప్పాను అతను నాకు నచ్చలేదని" నిర్లక్ష్యంగా చెప్తున్న మిహిరని చురచురా చూస్తూ, "ఆ అబ్బాయికి ఏమి లోపమున్నదని నచ్చలేదో చెప్పమ్మా" లేని సహనం తెచ్చుకుని అడిగాడు. "నాకు నచ్చలేదంతే. " " అంటే కేవలం నేను చెప్పిన సంబంధమని, అంతేనా?". మిహిర తల్లి రాధ, "దానికి నచ్చలేదంటే వినరేమిటీ? మీకెందుకంత పట్టుదల?" ఎన్నడూ రానంత కోపమొచ్చింది గంగాధరానికి, "నువ్వు నోర్ముయ్.. దాన్ని కూడా నీ లాగానే తయారు చేస్తున్నావు. పిల్లవాడు మేలిమి బంగారం. మిహీ బంగారు తల్లీ! నా మాట వినమ్మా.. నువ్వు చాలా సుఖఃపడతావు. "
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
19-12-2024, 02:32 PM
కూతురు మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తుంటే రామనాథం, ఆ అబ్బాయి గుణగణాలు ఇంకా వర్ణిస్తూ, "మీ అమ్మకి అంతస్థు సరిపోలేదుట.. అమ్మా నాకున్నదంతా నీదే కదా! ఇంకా ఎందుకు సంపద? అయినా వాళ్ళూ అంత లేని వాళ్లేమీ కాదు. ఆ అబ్బాయి మంచి కంపెనీలో ప్రాజెక్ట్ మానేజర్ పోస్ట్ లో ఉన్నాడు! మీ అమ్మ రాక్షసి!. ఇల్లరికం రావాలంటుంది. అమ్మా నీకు తెలియదు.. ఆ జీవితం నరకం.. నేను అనుభవించాను పెళ్లి అయిన పదేళ్లు. " ఇంకా ఏవో చెప్తూనే ఉన్నారు ఆయన.. మిహిరకి వాస్తవం అప్పుడు గుర్తొచ్చింది. ' అమ్మో గీచి గీచి ఖర్చు పెడతారని చెప్పింది అమ్మ. అయినా ఈ నాన్న తక్కువవాడా అమ్మ ఎన్ని చెప్పింది ఈయన గురించి? అసలు ఎవరన్నా తన శరీరంలో భాగం ఇచ్చేస్తారా? అదీ భార్య ఇష్టానికి వ్యతిరేకంగా.. ఊహు.. నాకు అమ్మని బాధ పెట్టిన వాళ్లంటే అసహ్యం. నా నిర్ణయం సరి అయినదే' అని తలపోసి, "నాన్నా! నువ్వు అమ్మని అంతలా ఆడిపోసుకోవటం నాకు నచ్చలేదు. నాకు వాళ్ళు నచ్చలేదని చెప్పేసెయ్యి వాళ్ళకి!" మిహిర మాటలు గంగాధరానికి ఆశనిపాతాలయ్యాయి!
ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడేమో, ఆఖరి అస్త్రం కూడా ఉపయోగించాడు. "మీ అమ్మ ఈ ఆస్తి తన తండ్రిది అనుకుంటున్నదేమో.. చాలా భ్రమలో ఉన్నదని చెప్పు. వాళ్ళ నాన్న మిగిల్చింది ఈ ఇల్లు మాత్రమే! ఈ ఆస్తంతా నా స్వార్జితం! నీ బాగు కోసమే ఈ సంబంధం చేసుకో మంటున్నాను. నువ్వు మొండికేస్తున్నావు. నేనూ మొండివాణ్ణే. ఈ ఆస్తిలో నీకు, మీ అమ్మకి ఎటువంటి హక్కు లేదని పత్రాలు తయారు చేయించేస్తాను. దీనికి తిరుగులేదు అంతే! ఇంకా ఏమిటి మీ అమ్మని బాధ పెట్టానంటున్నావు కదూ.. ఎవరు ఎవర్ని ఎలా బాధ పెట్టారో మీ అమ్మనే అడుగు. నా నోరు తెరిపించకు. మర్యాదగా నువ్వు ఈపెళ్ళికి ఒప్పుకోవడం ఒక్కటే నీకున్న ఛాయిస్!" ఆ తల్లి కూతుళ్లు మ్రాన్పడిపోయారు.. ఎంత మాత్రమూ ఊహించని ఈ మలుపుకి! అప్పుడే తన ఆలోచనల్ని అమలు చేయడం మొదలుపెట్టేసాడు గంగాధరం.. బీరువా తాళం చెవి తన దగ్గరే పెట్టుకున్నాడు. జాయింట్ అకౌంట్లు సింగిల్ ఆపరేషన్ చేసేసాడు.. హడలి పోయారు తల్లీ కూతుళ్లు! ** గంగాధరం, రామనాథంతో తన బాధనంతా చెప్పుకున్నాడు.. ఆయన తన కొడుకుని ఈ పెళ్లికి సుముఖుణ్ణి చెయ్యాలని బ్రతిమాలాడు.. "మిహిర. చెడ్డది మాత్రం కాదురా రామం.. నాకు నమ్మకముంది రాజు దాన్ని దారిలో పెట్టగలడని" స్నేహితుడి కన్నీళ్లు రామనాథాన్ని ఆలోచింపచేసాయి.. 'తన కూతురే ఇలా ఉంటే.. ' అంతే, "పెళ్లికి ముహూర్తాలు పెట్టించరా" అన్నాడు. *** రాజీవ్ తండ్రి మాటకి, ఋణవిముక్తికి, మీదు మిక్కిలి తనకి ఆ అమ్మాయిని చూడగానే కలిగిన గిలిగింత తలపులకి, ఆమెని తాను మార్చుకోగలనన్న ధైర్యానికి బద్ధుడై, పెళ్ళికొడుకు అయినాడు! వేద మంత్రాలు, పెళ్లి జరిగేటప్పుడు ఆ సాన్నిహిత్యం మిహిర అంతరంగాన అతని మీద ప్రేమ కలిగిస్తున్న ప్రతిసారి, తల్లి వాళ్ళ గురించి చెప్పే హీనోక్తులు మనసును ఎదురు తిరిగేట్లు చేస్తున్నాయి. దాంతో ఆమె ప్రవర్తన నలుగురూ చెవులు కొరుక్కునేట్లు ఉన్నది. తనదైన వ్యక్తిత్వంతో రాజీవ్, మిహిర ప్రవర్తనని అడుగడుగునా కమ్ముకుంటూ వస్తున్నాడు. శాంత, రామనాథంలు అన్నీ తెలిసిన వాళ్ళు కనక తమ ప్రేమతో మిహిరని శాంతపరుస్తున్నారు. అత్తగారిల్లంటే ఎంత విముఖాత ఉన్నా, అక్కడ ఉన్న మూడు రోజులూ రామనాథం, శాంతల అన్యోన్యత మిహిరని అబ్బురపరచింది! 'ఆంటీ ఎందుకు అంకుల్ పిలవగానే 'జీ హుజూర్ 'అన్నట్ల వెళ్తుంది అనుకున్నానో లేదో అంకుల్ అందరి ఎదురుకుండానే ఆంటీ కాళ్ళకి నూనె రాస్తున్నారు! నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను!. ఇంత పెద్ద వాళ్లయినా, ఇద్దరూ కలిసి కూర్చుని, హాసప్రతిహాసాలతో, ఒకరికొకరు సాయ చేసుకుంటూ.. ఇలా ఉంటారా భార్యా భర్తలంటే.. " తన తల్లిదండ్రుల దగ్గర ఎన్నడూ చూడని ఈ సన్నివేశాలు మిహిర హృదయంలో ఓ సున్నిత కోణాన్ని తట్టి లేపాయి! రాధ నిర్లక్ష్య వైఖరి తెలిసిన గంగాధరం, రాజీవ్ కోరినట్లు తమ ఇంట మూన్నిద్రలు లాంటి సాంప్రదాయాలని పక్కన పెట్టేసి, నూతన వధూవరులు హనీమూన్ కి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. రాజీవ్ తన ఖర్చుతో, తన లైఫ్ స్టైల్ లో మాత్రమే భార్యతో ఊటీ, కోడైకెనాల్ వెళ్లడానికి డిసైడ్ అయ్యాడు! *** ఎంతో సతాయించాలని, తన తండ్రి మీద పగ, భర్త మీద తీర్చుకోవాలని ఎన్నో ప్లాన్లు తల్లితో కలిసి వేసిన మిహిరకి, రాజీవ్ ప్రవర్తన అవకాశమే ఇవ్వలేదు. సుందర ప్రదేశాలన్నీ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా ఒక ప్రాణస్నేహితుడు లాగా తిప్పి చూపించాడు. ఒక్కటే మంచం మీద పడుకున్నా ఎటువంటి వికారమూ లేకుండానే ఉన్నాడు! మిహిర ఒకానొక చలిరాత్రి దగ్గరగా రాబోయినా, సున్నితంగా పక్కకి జరిగి లేచి వెళ్లి సోఫాలో పడుకున్నాడు. ఆ రోజు మొదలు ప్రతీ రాత్రీ అంతే! మిహిర అహానికి అది పెద్ద దెబ్బ! ఉక్రోషంతో కసి, కోపంతో మిహిరని ఆందోళన, ఆవేదన, అనురాగం ముప్పిరిగొనగా రాజీవ్ స్థితప్రజ్ఞతతో, ఏమాత్రం కొరుకుడు పడకుండా నిలిచాడు! రామనాథం రోజూ కొడుక్కి మెసేజ్ చేసి విషయాలు తెలుసుకుంటున్నాడు. శాంతకి భర్త ద్వారా తెలుస్తున్నాయి. ఒకరోజు శాంత రాజీవ్ కి, "మరీ ఓవర్ డోస్ ఇవ్వద్దు.. వికటించగలదు" అని. మెసేజ్ చేసింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
19-12-2024, 02:33 PM
ఫస్ట్ క్లాస్ కుపేలో రాజీవ్ నిద్రపోకుండా, అటు ఇటు మెదుల్తున్న భార్యని, "ఏమయ్యింది నా చిన్నీ" అన్నాడు.
అంత తలనెప్పిలోనూ ఉలిక్కిపడ్డది మిహిర, తన తండ్రి తనను మొన్న మొన్నటిదాకా ప్రేమతో పిలిచిన పిలుపు.. వివశురాలైపోయింది.. ప్రేమ కోసం వాచి పోయిన ఆ చిన్న ప్రాణం! తనను దగ్గరకు తీసుకుంటున్న రాజీవ్ ని చుట్టుకుపోయి బావురుమన్నది. ఏదో మాట్లాడుతున్న ఆమె పెదవులని తన పెదవులతో మూసేసాడు! ఆ రాత్రి వారి తొలిరేయి అయింది! ** కూతురి కోసం బెంగ పడి జ్వరం తెచ్చుకున్న తల్లిని చూడటానికి వచ్చినరోజునే పుట్టినింటికి వెళ్ళింది.. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళడానికి చెప్పులు వేసుకుంటున్న మిహిరని ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్కర్లేదా?" రాత్రి అంత మార్దవంగా, సన్నిహితంగా మెసిలిన భర్త కరకు కంఠంలోని అధికార ధోరణికి కంగుతిన్నది మిహిర! ఒక్క నిమిషంలో ఆమెలోని ఆభిజాత్యం పడగ విప్పి "నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు" అన్నది. "ఇది పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్. ఈ ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఈ ఇంటి సభ్యులు పాటించి తీరాలి!" "షిట్! ఆఫ్ట్రాల్ నేను మా ఇంటికి వెళ్ళడానికి.. " "ఓకే నాకు ఇన్ఫర్మేషన్ అందింది. నువ్వు భోజనానికి వస్తావో రావో చెప్పి వెళ్ళాలి. మా ఇంట్లో మేము అనవసరంగా వేస్ట్ చెయ్యము" రాజీవ్ మాట లెక్కలేనట్లుగా వెళ్ళిపోయింది! తల్లి ఉద్బోధలు, రాజీవ్ తో గడిపిన మధురమైన కాలాన్ని మరుగున పడేసి, మిహిరలోని మూర్ఖత్వాన్ని తట్టి లేపింది. అత్తగారింట్లో ఎలా గొడవలు లేవదీయాలో, .. అదీ అవతలి వాళ్లదే తప్పనిపించేట్లు, తన భర్త చేసిన పెళ్లిని ఎలా తలక్రిందులు చేయాలో వైనవైనాలగా చెప్పింది. మిహిరలో ఉన్న ద్వంద్వ ప్రకృతి ఆమెని పూర్తిగా తల్లి మాట శిరోధార్యంగా తీసుకోనివ్వడం లేదు.. రాజీవ్ సాన్నిహిత్యం కోరుకుంటున్న మనసు, శరీరం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆ చిరాకంతా తల్లి మీదే చూపించి అన్నం తినకుండా వచ్చేసింది. సరిగ్గా బైట అడుగుపెట్టగానే బయటకు వెళ్లి వస్తున్న తండ్రీ కనపడ్డాడు. ఆయన చేసిన పెళ్లి అని ఆయన్ని నాలుగు దులిపేసింది.. అన్నింటికీ పర్మషన్ అడగాలని ఆంక్షలు విధిస్తున్నాడు రాజీవ్ అంటూ. అప్పుడే రాజీవ్ తో మాట్లాడి అంతా బాగుంటుందన్న ఆశాభావంతో ఉన్న గంగాధరం గారు చిన్నబోయారు! ** మిహిర అన్నం తినటానికి వచ్చి, డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉండటం చూసి, అవాక్కయింది!. "నేను అన్నం తినాలి. అక్కడ ఏమీ లేవు" మిహిర విసురుగా అంది. అప్పడే ఆమెని చూస్తున్నట్లు రాజీవ్, " ఓ నువ్వు అన్నం తినాలా? మాకు తెలియదే నువ్వు భోజనానికి వస్తావని. అమ్మా వాళ్ళు పెళ్లికి వెళ్లారు. నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ లో భోజనం చేసేసాను. అదేమిటీ మీ అమ్మ అన్నం పెట్టలేదా?" మిహిర ఆకలికి.. కళ్ళు తిరిగినట్లై పడబోయింది. రాజీవ్ లోని మనిషి మేల్కొన్నాడు. గబగబా లేచొచ్చి మిహిరని మంచం మీద పడుకోబెట్టి, మారు మాట్లాడకుండా షర్ట్ వేసుకుని, దగ్గర్లో ఉన్న కర్రీ పాయింట్ లో అన్నం కూరలు తెచ్చి, గబగబా ప్లేట్ లో అన్నం కూరలు కలిపి నోట్లో పెట్టాడు. మిహిరలోని అహం బుసలు కొడుతున్నా, ఆకలి, రాజీవ్ ప్రేమ మారుమాట్లాడకుండా కలిపినవన్నీ తినేసేట్లు చేసింది. రాజీవ్ కి బాగా అర్థమయింది మిహిరలోని ద్వంద్వ ప్రవృత్తి! 'ఎలా కాపాడుకోను నా చిన్నిని, తల్లి అనే ఆ రాక్షసి నుండి? *** పసిపిల్లలాంటి మనసు ఒకవైపు తల్లి మాటలకి తాన తందాన అనే అహంకారి మిహిర మరోవైపు! తాను బాధపడుతూ, భర్తని, అత్తమామల్ని బాధ పెడుతూ, ఆఖరికి తల్లి మాట ప్రకారం భర్త దగ్గరకు వెళ్లక యాడాది గడిచిపోయింది. కొద్ధి రోజులు స్వేచ్ఛాజీవితాన్ని ఎంజాయ్ చేసింది. తోటి వాళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.. ఒంటరిగా పార్టీల కొచ్చే మిహిర మీద కన్నేసిన రాహుల్ ఆ రోజు ఇంట్లో దింపుతానని తీసుకు వెళ్లి, తన గెస్ట్ హౌస్ లో బలవంతం చేయబోతే, అదృష్టవశాత్తు ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ తమ ఇంట్లో డ్రైవర్ గా చేసిన అతను కావడం వలన, రాహుల్ తో కలియబడి రక్షించాడు!, బాధాతప్త హృదయంతో తల్లి దగ్గరకు వెళ్లబోయిన మిహిర తండ్రి గొంతు విని ఆగిపోయింది. గెస్ట్ హౌస్ వాచ్మెన్ ఫోన్ వలన విషయం తెలిసిన గంగాధరం మళ్లీ చరిత్ర పునరావృతమైతున్నదని గ్రహించి భార్యతో ఒక పుష్కరం తర్వాత ఏకాంతం ఏర్పరుచుకుని', "నీకు జరిగిన అన్యాయం నీ కూతురికి కూడా జరగబోయి, దేవుడి దయ వలన తప్పిపోయింది! నీకెంతమాత్రమన్నా ఆరోజు నా క్షమకు విలువ అనేది ఉంటే వెంటనే దానికి భర్త విలువ తెలియచెప్పి రేపటి కల్లా చీరె సారెతో నువ్వే దింపి రావాలి. ఇందుకు భిన్నంగా జరిగితే, నాకు ఎల్లుండి ఉదయం అనేది ఉండదు" విసవిసా బైటకు వచ్చిన గంగాధరం, కూతుర్ని అక్కడ చూసి, సిగ్గుతో చితికిపోయాడు! మిహిర, తన తండ్రి పాదాలు తాకి తనని క్షమించమన్నది. కూతుర్ని దగ్గరకు తీసుకొని భార్య దగ్గరకు వెళ్ళాడు. చూడు మిహిరా! ఇప్పుడు నువ్వు విన్నది ఇక్కడే మర్చిపోతానని నీకెంతో ఇష్టమైన మీ అమ్మ మీద ప్రమాణం చెయ్యి. ఇది కేవలం మా భార్యాభర్తలకి మాత్రమే సంబంధించింది! మిహిర తల్లి రాధ తన అర్థం లేని అహంకారం కూతురి జీవితాన్నే బలి తీసుకోబోవడంతో, భర్తని క్షమించమని కాళ్ళు పట్టుకున్నది. గంగాధరం భార్యని పొదువుకుని, "తానెప్పటికీ ఆమెకి బాసటగా నిలుస్తా" నన్నాడు. మిహిరకి తండ్రి ఔన్నత్యం, అన్నిటినీ మించి భార్యాభర్తల అనుబంధం యొక్క విలువ, వేదమంత్రాల సాక్షిగా పడ్డ మూడుముళ్ల శక్తి అవగతయింది! **** రాజీవ్ వివాహానికిచ్చే ఇచ్చే విలువ మూలంగా ఎంతమంది ఎన్నిసార్లు మళ్లీ పెళ్లి చేసుకోమన్నా, , "మిహిర నా భార్య.. మా బంధానికి గ్రహణం పట్టింది కానీ అది వీడిపోనిది! ఇది రాముడు ఏలిన రాజ్యం!" అనేవాడు. రాజీవ్ లాగా భార్యాభర్తల బంధాన్ని అర్థం చేసుకుంటే మామిడాకులే గానీ విడాకులుండవు కదా! *** పందిట్లో పెళ్లవుతున్నది! మిహిర, రాజీవ్ దండలు మార్చుకుంటున్నారు.. కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవళ్ళు మనవరాళ్ల సమక్షంలో, షష్టిపూర్తి మహోత్సవంలో! సమాప్తము
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
20-12-2024, 06:37 AM
24-12-2024, 10:40 PM
ఆఖరి ఆకలి
రచన: పిట్ట గోపి ఈ సృష్టిలో ఆడ మగ, చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో శత్రువుగా ఉండేది ఏదైనా ఉందంటే అది ఆకలి మాత్రమే. ఆకలిని జయించటం దాదాపు ఏ మనిషికీ సాద్యం కాకపోవచ్చు. ఈరోజుల్లో అనేక మంది అవినీతి, దొంగతనాలు, దోపిడీలుతో ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేస్తూ.. చంపుకుంటూ సంపాదిస్తున్నారు అంటే.. !దానికి కారణం ఆకలే. ఎందుకంటే.. తాము బాగా సంపాదిస్తే... కానీ తమ వారసులుకు ఆకలి బాధలు, ఆర్థిక సమస్యలు తప్పవు. లేకపోతే వారి పరిస్థితి వేరేలా ఉంటే ఆకలితో అలమంటించాల్సిన పరిస్థితి వస్తుందని, అందుకే ఏం చేసైనా పెద్దగా ఆస్తులు, డబ్బు పోగేసుకుని తద్వారా భవిష్యత్ లో తమ వారిని ఆకలి కేకల నుండి తప్పించవచ్చని. ఇలాంటి ఆలోచనలు ఉన్న ఈ సమాజంలో కూడా కొందరు ఆహారాన్ని వృధా చేయటం చూస్తూనే ఉంటాం. ఇక ధనవంతులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం రుచిగా లేకపోయినా తినే అహారం పై కోపాన్ని ప్రదర్శించి మరీ విసిరేసే సందర్భాలు లేకపోవు. మణి ధనవంతులు ఇంటిలో పుట్టి పెరిగాడు. వడవడిగా ఐదో తరగతిలోకి అడుగుపెట్టాడు. ఆఫీసు పనితో బిజీగా గడిపే ఈరోజుల్లోని తల్లిదండ్రులకు పిల్లలకు మంచి బుద్దులు నేర్పించటం ఎలా వస్తుంది.. ? పోనీ.. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఉంటే బాగున్ను కానీ.. ! ఏం చేస్తాం వాళ్ళకి దూరం పెట్టి భార్య పిల్లలతో మాత్రమే బతికే సమాజం అయిపోయింది. అయితే మణికి మాత్రం నాన్నమ్మ శారద రూపంలో మంచి విషయాలు చెప్పే మనిషి ఉంది. మణి నిజంగా చిన్నతనం నుండే చాలా పెంకితనంతో ఉండేవాడు. వాడు ఏది కావాలంటే అది తెచ్చి పెట్టాలి. లేదంటే వాడి అల్లరి అలాంటిది, ఇలాంటివి కాదు. ఏది పడితే అది విసిరేస్తు రచ్చరచ్చ చేస్తాడు. వాడి అల్లరికి తల్లిదండ్రులు మహేష్, శ్యామలలే సహనం కోల్పోతు.. మణి అసలు అల్లరి చేయకుండా ఏం కావాలంటే అది ఇచ్చేసే వాళ్ళు. మణికి పన్నెండేళ్ళు వచ్చినా ఎప్పుడు సరిగ్గా చేతులు పెట్టె బోజనం చేయడు. రుచిగా లేదని విసిరేస్తుంటాడు. అవన్నీ శారద ఓపిగ్గా ఓర్చుకుంటూ ఎప్పుడూ మణికి మంచి విషయాలు చెప్తు వాడిలో మంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంత చేస్తున్నా కూడా కన్న కొడుకు కానీ.. కోడలు శ్యామల కానీ ఏనాడూ శారదాకు గౌరవించలేదు. సరికాదా ఆమె ఇంట్లో ఉండటమే వాళ్లకు ఇష్టం ఉండేది కాదు ఎలాగో నెట్టుకొస్తున్నారు. మణిని చూసుకుంటుంది అని కానీ.. ఇప్పుడు మణి తల్లిదండ్రులు ఆఫీసుకి వెళ్ళినా... అతడు మరి చిన్నపిల్లడేమి కాదు. అందుకే తల్లిని వదిలించుకునేందుకు వారికి ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఒక రోజు ఆదివారం మహేష్ శ్యామలలు ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు. ఇంట్లో మణి శారదాలు మాత్రమే ఉన్నారు. బోజనం పెడుతుంటే మణి రుచిగా లేదని అన్నాన్ని విసిరేశాడు. అన్నం చెల్లాచెదురుగా పడింది. శారదా మౌనంగా ఆ అన్నాన్ని ఊడ్చి మరలా పళ్లెంలో వేసి ఆ పళ్ళేన్ని, మణిని తీసుకుని బయటకు వచ్చింది. అలా కొంతదూరం వెళ్ళగా ఆకలితో పస్తులు ఉంటూ ఏ ఆధారం లేక రోడ్లపై బికారంగా తిరుగుతున్న పిల్లలకు ఇచ్చింది. ఆ అన్నాన్ని వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆత్రతగా అన్నం కడుపులోకి వెళ్ళగా ఆనందంతో వచ్చే కన్నీళ్ళని తుడుచుకుంటూ తింటున్నారు. మిగతాది గుడి ముందు ఉన్న బిచ్చగాళ్ళకి పెట్టగా వారు చేతులు జోడించి మరలా మణి తల పై చెయ్యి వేసి దీవించారు. ఈ రెండు సంఘటనలు మణిని తీవ్రంగా కలచివేశాయి. నాన్నమ్మ ఒక్క మాట కూడా అనకుండానే మణి తనలో తనకు తెలియకుండా తన మనసు కరిగిపోయింది. "బాబు మణి, ఏంటీ ఆలోచిస్తున్నావు. రుచిగా లేదని నువ్వు పారేసిన అన్నాన్ని వాళ్ళు ఎలా తిన్నార్రా... ? అన్ని ఉండి కూడా కావాల్సింది తినకుండా ఇలాంటి వంకలు పెడుతున్నాం. కానీ.. ! ఏమీ లేని వాళ్ళు చూడు రుచులతో పనే లేకుండా ఏది దొరికితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. అన్నం రుచిగా లేదని పారేసే మనం అది కూడా లేని ఇలాంటి అభాగ్యులను చూసైనా మారాలి. ఉన్నవాళ్ళు తిన్నది అరగక తిరుగుతుంటే.. లేనివాళ్ళు కడుపు నింపుకోటానికి తిరుగుతున్నారు. నీకు ఎక్కువ అయి పారేసే ఎంగిలి కూడు, ఏమీ లేనివారికి ఒక విందు భోజనంలా ఉంటుంది. ఇకనైనా పద్దతిగా అల్లరి చేయకుండా ఉండు. అలాగే ఆకలి అనే గమ్యంను చేరుకోవాలంటే అభాగ్యులు ఎంత కష్టపడుతున్నారో.. ఆలోచించు. ఆకలి అందరికీ శత్రువే. ఈరోజు నువ్వు పారేస్తే రేపు నీకు ఆ అన్నం దొరకకపోవచ్చు. పదా " అంటూ తీసుకుపోయింది. ఇంటికి వచ్చి అన్నం వేసిన పళ్లెం ముందు కూర్చుని "దేవుడా! ఎవరు పండిస్తే ఈ అన్నం నాకు దొరుకుతుందో వారి కుటుంబం ఆనందంగా ఉండేలా చూడు " అని ప్రార్ధించడం శారదకు తృప్తినిచ్చింది. అక్కడితో శారదా, మణీల బంధం సరి. అవును. శారద ఆ తర్వాత రోజు నుండి తమ ఇంట్లో లేదు. మణి అడిగితే బంధువులు ఇంటికి వెళ్ళింది అని చెప్పారు. అలా శారదను మణి మర్చిపోయాడు. ఇప్పుడు మణి పెద్దవాడు అయ్యాడు. చదువు కొనసాగిస్తున్నాడు. మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అంతేకాదు, తల్లిదండ్రుల సంపాదనలో కొంత ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా అన్నాన్ని పెడుతు వారి ఆకలి తీరుస్తున్నాడు. ఒకరోజు కాలేజీ క్యాంపు నుండి అందరూ విద్యార్థులుతో మణి ఒక వృద్దాశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడకు వెళ్ళగా మణికి గుండె కలుక్కుమంది. అవును! బంధువుల దగ్గరకు వెళ్ళిందనుకున్న నాన్నమ్మ, విశాలమైన బంగ్లా లాంటి ఇళ్ళు, ఆస్తులు, కొడుకు, కోడలు మనుమడు ఇలా అందరూ ఉండే నాన్నమ్మ, ఏ ఆధారం లేని వాళ్ళకి నిలయమైన ఈ వృద్దాశ్రమంలో ఉండటంతో మణి కళ్ళలో కన్నీరు సముద్రాన్ని తలపించింది. ‘నాన్నమ్మా’ అంటూ శారదా ఒడిలో వాలిపోయి బిగ్గరగా ఏడ్చాడు. మణిని ఓదార్చటం శారదా, మరియు స్నేహితులు వల్ల సాద్యం కాలేదు. కొడుకు, కోడలు, మనుమడుతో.. ఉన్నంత కాలం సరదాగా గడిపాలని ఏ తల్లికి ఉండదు.. ! శారదకి వాళ్ళని వదిలే ఉండటం ఇష్టం లేకపోయినా కొడుకు కోడలే స్వయంగా ఇక్కడికి చేర్చటంతో ఇంట్లో తాను ఉండటం వారికి ఇష్టం లేనప్పుడు వారి ఇష్టానికి అనుగుణంగా నడుస్తు తన ఆనందాన్ని మనసులోనే సమాధి చేసుకుంటూ బతుకుతుంది శారదా. మణి వేరే ఆలోచన చేయకుండా నాన్నమ్మను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆఫీసు నుండి వచ్చిన తల్లిదండ్రులు శారదని చూసి షాక్ అయ్యారు. "అమ్మా.. నువ్వు ఎప్పుడు వచ్చావు".. ? ప్రశ్నించాడు మహేష్. లోపలి నుండి మణి వస్తు.. " ఈ రోజే నాన్న.. మీరు ఏ బంధువుల ఇంటికి నాన్నమ్మనీ తీసుకెళ్ళారో... ఆ బంధువుల ఇంటికి ఈరోజు నేను వెళ్ళాను. చాలా రోజులు అయింది కదా అందుకే తీసుకొచ్చా " అన్నాడు వెటకారం చేస్తూ ఆ మాటలకు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇంకా తేరుకోనే లేదు. "చూడండి, నాకు జన్మనిచ్చారు. కానీ.. ! నాకంటే ఎక్కువ సమయం మీరు ఆఫీసు పనికే కేటాయించారు. అన్ని తానై పాఠశాలలో కూడా నేర్పని ఎన్నో మంచి విషయాలను నేను నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. అలాంటి నాన్నమ్మను, నన్ను దూరం చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రేపు నేను కూడా మీకు అలా చేస్తే మీరు ఎంత క్షోభ అనుభవిస్తారో.. నాన్నమ్మకు మీరంటే ఎంత ఇష్టం. అది మీకు తెలియని విషయం కాదు. తాను చివరి శ్వాస వరకు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేస్తే నేను ఊరుకోను. చివరగా ఒక్క మాట.. మిమ్మల్ని వదిలేసి ఉండలేని ఏ మనుషులనైనా నిర్ధాక్షిణ్యంగా వదిలివేయకండి" అన్నాడు. నాన్నమ్మ సహాయంతో, మనసు మార్చుకున్న తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడు మణికి ఒకటే ఆకలి. అది తన కంటికి ఏ ఒక్కరు ఆకలి బాధతో కనపడకూడదని. అది తన ఆఖరి ఆకలి కూడా.. అంటే చివరి శ్వాస వరకు ఈ ఆకలి తీరదన్న మాట. ****** ****** ****** ******
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
02-01-2025, 03:06 PM
ఆన్లైన్ బిర్యానీ
రచన: తాత మోహనకృష్ణ సుబ్బారావు కి చిన్నప్పటినుంచి దెయ్యాలంటే చాలా భయం. ఆ భయం తనతోపాటు అలానే పెరుగుతూ వచ్చింది. అందుకే, హారర్ సినిమాలంటే, చాలా దూరంగా ఉంటాడు. అలాంటి మనిషికి పెళ్ళయింది. తలంటు పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్న తన పెళ్ళాన్ని దగ్గరగా చూస్తే.. ఆ రోజు సుబ్బారావు కు గుండె దడే..! ఇద్దరు పిల్లలతో జీవితం హ్యాపీ గానే సాగిపోతుంది. ఒక రోజు తన భార్య పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి భర్త దగ్గరకు వచ్చింది పెళ్ళాం.. "ఏమండీ! మా నాన్నకి ఒంట్లో బాగోలేదంట. నా గురించి కలవరిస్తున్నారు. నేను ఇప్పుడే బయల్దేరతానండి..ఇలా వెళ్లి, నాన్నను చూసి..అలా వచ్చేస్తాను. ఒక్క రోజు అడ్జస్ట్ చేసుకోండి. పిల్లల్ని మీరు చూసుకోలేరు..నాతో తీసుకెళ్తాను. ఇలాంటి పరిస్థితిలో 'నో' అని అనలేడు సుబ్బారావు. పెళ్ళయిన దగ్గర నుంచి ఎప్పుడూ పెళ్ళాన్ని విడచి ఒంటరిగా ఉన్నది లేదు. మా ఆవిడ ఊరు ఉదయం వెళ్లి.. సాయంత్రానికి వస్తే బాగుండేది. ఇలా సాయంత్రం బయల్దేరితే..రాత్రంతా నేను ఒక్కడినే ఇంట్లో ఉండాలా..? తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది. అసలే మొన్న దెయ్యం కనిపించిందని ఆ రామారావు వీధిలో అందరికీ చెప్పాడు. పైగా, ఈ పండుగ టైం లో దొంగతనాలు ఎక్కువనీ... రాత్రి పూట జాగ్రతగా ఉండమని సెక్యూరిటీ ఆఫీసర్ల హెచ్చరిక ఉండనే ఉంది. ఇదంతా మరచిపోయి..కాసేపు టీవీ చూద్దాం అనుకున్నాడు సుబ్బారావు. అదే టైం లో, టీవీ లో క్రైమ్ ప్రోగ్రాం వస్తోంది. అందులో..ఇంట్లో ఒక్కడే ఉన్న ఇంటి ఓనర్ పై దొంగలు దాడి చేసి..హత్య చేసి ఇల్లంతా దోచుకున్నారని చూపిస్తున్నారు. 'ఇదేదో నన్ను ఇబ్బంది పెట్టడానికే చెబుతునట్టు ఉంది' అని భయమేసి ఛానల్ మార్చేశాడు సుబ్బారావు. మరొక ఛానల్ లో..చనిపోయిన మనిషి దెయ్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడని చూపిస్తున్నారు...అంతే..! భయమేసి టీవీ ఆపేసాడు. నా పెళ్ళాం అర్జెంటు గా వెళ్లిపోయింది. వంట కుడా ఏమీ చెయ్యలేదు. వెళ్తూ..తన పెళ్ళాం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పినట్టు గుర్తు వచ్చింది. ఏం చేస్తాం...? ఆకలి ఆగదు కదా..! అనుకున్నాడు సుబ్బారావు. ఫోన్ తీసి..ఆన్లైన్ యాప్ లో తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ చేసాడు. అది కుడా ఫేమస్ హోటల్ నుంచి..ఆ హోటల్ చాలా దూరంగా ఉండడం చేత, డెలివరీ టైం ఒక గంటకు పైగానే చూపించింది. ఈ లోపు అలా వరండా లోకి వెళ్లి చూసాడు. చల్లటి గాలి వేస్తోంది. గాలికి కదులుతున్న కొబ్బరి ఆకుల నీడ గోడ పై పడి..ముందుకు వెనక్కు కదులుతుంది. అసలే భయానికి కేర్ అఫ్ అడ్రస్ అయిన మన సుబ్బారావు...దానిని చూసి భయపడి వెంటనే తలుపు వేసేసాడు. సోఫా లో కూర్చొని..ఫుడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోపు మెల్లగా వాన మొదలైంది. చిన్న చినుకు గా మొదలైనది కాస్త పెద్దది అయ్యింది. అలా వాన లో సిటీ అంతా తడిసి ముద్దవుతున్నాది. ఈలోపు న్యూస్ కోసం టీవీ పెట్టాడు సుబ్బారావు. బ్రేకింగ్ న్యూస్ లో సిటీ అంతా జలమయం..ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక చేసారని న్యూస్. ఆకలి వేస్తున్న సుబ్బారావు, నా బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని తన యాప్ ఓపెన్ చేసి.. ట్రాకింగ్ చూసాడు. 'హమ్మయ్యా! నా ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యలేదు...దారిలో ఉంది..'.. ఇలా అనుకున్నాడో లేదో...ఆ కరెంటు కాస్తా పోయింది. ఒకేసారి ఇల్లంతా చీకటిమయం. ఫోన్ లో టార్చ్ వెయ్యడానికి కుస్తీ పడ్డాడు. మొత్తానికి వెలిగింది.. అంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్ గా కిచెన్ లో ఏదో చప్పుడు.. సుబ్బారావు గుండె జారింది..దొంగా? అని కంగారు పడుతూ..మెల్లగా వెళ్లి చూసాడు. పెరటి తలుపు తీసి ఉంది..మొదట్లో దొంగ అని భయపడ్డాడు..తర్వాత 'మియావ్' అని వినిపించడం తో...ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు. చాలాసేపు తర్వాత..కరెంటు వచ్చింది. అప్పుడే.. కాలింగ్ బెల్ మోగింది. బిర్యానీ వచ్చిందేమోనని ఆనందంలో తలుపు తీసాడు. ఎదురుగా ఒక మనిషి ఫుడ్ పార్సెల్ పట్టుకుని పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. "సర్! పూర్తిగా తడిసిపోయాను..ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా వర్షం తగ్గలేదు. నాకు ఆకలి వేస్తోంది. నేను మీతో పాటు డిన్నర్ ఇక్కడే చేయవచ్చా?" అడిగాడు వచ్చిన డెలివరీ బాయ్ "ఒంటరిగా ఉండలేక...తోడు దొరికిందన్న ఆనందంలో...లోపలికి రమ్మన్నాడు సుబ్బారావు" లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తున్నారు..డెలివరీ బాయ్ తన ఇంట్లోంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు.. సుబ్బారావు పార్సెల్ లో బిర్యానీ తింటున్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
02-01-2025, 03:10 PM
"సర్..ఇంట్లో ఒక్కరే ఉన్నారా?" అడిగాడు డెలివరీ బాయ్
"అవును.." "కొంచం మంచి నీళ్ళు ఇస్తారా సర్!.." కిచెన్ లోకి వెళ్లి సుబ్బారావు గ్లాసు తో నీళ్ళు తెచ్చాడు. హాల్ లోకి వచ్చి చూస్తే.. డెలివరీ బాయ్ లేడు. మొత్తం అంతా చూసాడు. ఎక్కడా లేదు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్న మనిషి సడన్ గా ఎక్కడకు వెళ్ళాడు? అని అనుకుంటుండగానే..భయానికి చెమటలు పట్టేసాయి సుబ్బారావు కు. సుబ్బారావు సోఫా మీద ఉన్న రిమోట్ పై అనుకోకుండా కూర్చున్నాడు...వెంటనే టీవీ ఆన్ అయ్యింది.. బ్రేకింగ్ న్యూస్...ఫుడ్ డెలివరీ బాయ్...వర్షం లో గల్లంతు..ఫుడ్ డెలివరీ కోసం వెళ్తుండగా ఘటన..అని అతని ఫోటో చూపించారు.. న్యూస్ చూసి సుబ్బారావు కు చెమటలు ఇంకా ఎక్కువ అయ్యాయి...చూపిస్తున్న వ్యక్తి గల్లంతైతే.. మరి ఇప్పటివరకు ఇక్కడ ఉన్నది ఎవరు...?అతనే ఇతను కదా! కొంపదీసి దెయ్యం అయి వచ్చాడా..? తలచుకుంటూ...గజ గజ వణికిపోయాడు సుబ్బారావు. ఇంక జన్మలో ఆన్లైన్ లో బిర్యానీ తెప్పించనని డిసైడ్ చేసుకుని.. టీవీ ని ఆపేసాడు. ఈలోపు..సుబ్బారావు భార్య నుంచి ఫోన్ వచ్చింది.. "ఏమండీ! ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? భోజనం చేసారా?" అని ప్రశ్నల వర్షం కురిపించింది "వచ్చింది...ఏదో చేసాను..." "ఏం తిన్నారు...బిర్యానీ యే కదా ..!" అంది భార్య "ఆ మాట ఎత్తకు...నాకు ఒణుకు వస్తుంది..." "మీకు ప్రతిదానికి భయమే...! ఇప్పుడు మా నాన్నకు బాగానే ఉంది. నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను లెండి...కమ్మగా వండి పెడతాను.." పెళ్ళాం మాటలతో కొంచం రిలీఫ్ వచ్చినా..మరో పక్క డెలివరీ బాయ్ విషయంలో.. భయం ఇంకా పోలేదు సుబ్బారావు కు.. టీవీ న్యూస్ లో...ఆన్లైన్ డెలివరీ బాయ్ తమ్ముడు.. తన అన్న డెలివరీ కోసం వెళ్లి చనిపోయాడని బాధపడుతున్నట్టు చూపిస్తున్నారు. "మేము ఇద్దరమూ ట్విన్స్..చూడడానికి ఒకేలాగ ఉంటాము. ఆన్లైన్ డెలివరీ చేస్తాము. నేను ఇప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత..ఫోన్ రావడంతో వెంటనే ఇక్కడకు వచ్చేసాను. ఈ రోజు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య..!" అని విలపిస్తున్నాడు..సుబ్బారావు కు బిర్యానీ డెలివరీ చేసిన బాయ్ ఈ విషయం తెలియక సుబ్బారావు..పాపం! రాత్రంతా భయపడుతూనే ఉన్నాడు.. *****
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
08-01-2025, 09:37 AM
మాతృదేవోభవ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి ఆ రోజు నేను క్లాస్ కి వెళ్ళేసరికి విద్యార్థులంతా నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఆరోజు నేను వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక వైకల్యం గురించి కొత్త టాపిక్ చెప్పబోతున్నాను. ఇది చాలా క్లిష్టమైన పాఠ్యాంశం. సైన్స్ తో పాటు సైకాలజీ కూడా జోడించి చెప్పవలసి ఉంటుంది. అందుకే నేను శని, ఆదివారాలు పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు క్లాస్ కి వచ్చాను. ఎనిమిదేళ్ళ కిందట ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసి ఆ తరువాత ఎయిమ్స్ లో న్యూరాలజీ లో ఎండీ చేసాను. ఆతరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయ వైద్యకళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి క్రితం సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాను. చేరిన అనతి కాలంలోనే మంచి ప్రొఫెసర్ నని పేరు తెచ్చుకున్నాను. నేను తరగతి గదిలోకి వెళ్ళగానే విద్యార్థులంతా లేచి నిలబడ్డారు. నేను వాళ్ళందరికీ హాజరు వేసి, డిజిటెల్ బోర్డు మీద పాఠం చెప్పటం మొదలు పెట్టాను. "డియర్ స్టూడెంట్స్! ఈరోజు మనం మెంటల్ రిటార్డేషన్ అంటే ఇంటలెక్ట్యువల్ డిసెబిలిటీ గురించి నేర్చుకోబోతున్నాము. అసలు మెంటల్ రిటార్డేషన్ అంటే ఏమిటి? ఇది ఉన్న వ్యక్తికి సాధారణంగా అందరికీ ఉండే తెలివితేటల కన్నా తక్కువ ఉంటాయి. దీనివల్ల అతను అందరిలా చదువుల్లో రాణించలేడు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు కొత్త విషయాలను త్వరగా ఆకళింపు చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ మానసిక వైకల్యం సాధారణంగా బాలికల్లో కన్నా బాలురలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది పుట్టుక నుంచో లేకపోతే బాల్యం నుంచో వస్తుంది. ఈ రుగ్మతను పిల్లలకున్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా పోల్చుకోవచ్చు. ఆ లక్షణాలలో ముఖ్యమైనవి ఏంటంటే మొదటిది వీళ్ళు మిగతా పిల్లల్లా తెలివితేటలు ప్రదర్శించలేకపోవడం, రెండవది మిగతా వారికన్నా ఆలస్యంగా కూర్చుకోవడం, మెల్లగా నడవటం. అలాగే మిగతావారిలా స్పష్టంగా మాట్లాడలేకపోవటం. ఆ తరువాత ముఖ్యమైనది జ్ఞాపకశక్తి లేకపోవటం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చర్యలకు వీళ్ళు సరిగ్గా స్పందించ లేకపోవడం. అంటే ప్రతి చర్యలు ఉండవు. లాజికల్గా ఆలోచించ లేకపోవటం. వయసు ఎక్కువున్నా చిన్నపిల్లల్లా ప్రవర్తించటం, ఆసక్తి లేకపోవటం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో నిరాసక్తత, సాధారణ జీవనం గడపడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
08-01-2025, 09:40 AM
ఈ రుగ్మత లక్షణాలు. ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా సరే ఆ పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు భావించాలి . వీళ్ళ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఫిషెంట్ 10 స్కేలు మీద 4 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ రుగ్మత లేని పిల్లలికి ఈ ఐక్యూ 6 కన్నా ఎక్కువ వుంటుంది.
సాధారణంగా గర్భందాల్చిన తరువాత అతిగా మద్యపానాన్ని సేవించడం, పుట్టుకలో ఏర్పడిన సమస్యలు, జన్యుపరమైన సమస్యలు, వంశపారంపర్యంగా ఉన్న రుగ్మతలు. ఇలా ఇది రావడానికి ఎన్నో కారణాలు, ముఖ్యంగా తల్లి తండ్రులలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు ఈ రుగ్మత వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాగే పి. కె. యు. అంటే ఫినైల్ కెటోనూరియా లాంటి జీన్సు పరమైన సమస్యలు, క్రోమోజోముల సమస్యలు ఇలా ఈ రుగ్మత రావడానికి వీటిలో ఏదైనా కారణం కావచ్చు. అలా ప్రవాహంలా 3 గంటల సేపు వాళ్ళకు మెంటల్ రిటార్డేషన్ గురించి సమగ్రంగా చెప్పాను. ఆ తరువాత వడివడిగా బయటకు వచ్చి ఇంటికి బయలుదేరాను. అప్పటికే అరగంట ఆలస్యం అయింది. ఇంటి దగ్గర నా కోసం నా భార్య మిథున ఎదురుచూస్తూ ఉంటుంది. ఉదయం నేను లేచి పేపరు చదువుకుంటున్న సమయంలో తనకు రెండు నెలల నుంచి నెలసరి కావటంలేదని చెప్పటంతో సాయంత్రం మా ఫేమిలీ డాక్టర్ ఇందిర గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అర గంటలో ఇంటికి చేరుకుని ఫ్రెషప్ అయి మిథునని తీసుకునీ ఇందిర గారి నర్సింగ్ హోంకి వెళ్ళాను. ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల పది నిముషాల్లో మమ్మల్ని లోపలికి పిలిచారు డాక్టర్ ఇందిర. ఆ తరువాత మిథునకి గర్భధారణ పరీక్ష చేసి, గర్భం దాల్చినట్లు నిర్ధారణ చేసి మా ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపింది డాక్టర్ ఇందిర. ఆ తరువాత మా ఇద్దరి రక్త నమూనాలు తీసుకొని కొన్ని పరీక్షలు చేయడానికి పంపించింది. ఆమె చేయిస్తున్న పరీక్షలు ఒక డాక్టరుగా నాకు తెలుసు. గర్భం దాల్చగానే భార్యాభర్తలిద్దరికీ రక్త పరీక్షలు జరపడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా జన్యు లోపాలుంటే అవి తెలుస్తాయి. దాని వల్ల వాటిని సరిచేసుకునే అవకాశం కలుగుతుంది. అది కుదరకపోతే గర్భస్రావం చేయించుకోవచ్చు. దానివల్ల అనారోగ్య శిశువు లను నివారించవచ్చు. గంట తరువాత రక్త పరీక్షల ఫలితాలకోసం మమ్మల్నిద్దరినీ రేపు సాయంత్రం రమ్మనమని చెప్పారు డాక్టర్ ఇందిర. ఆమర్నాడు సాయంత్రం మేమిద్దరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ ఇందిర పిడుగు లాంటి వార్త చెప్పింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
08-01-2025, 09:41 AM
``మిస్టర్ వంశీ! మీ ఇద్దరికీ జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్ష జరిపాను. ఆ పరీక్షల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. మీ భార్య శరీరంలో కొన్ని ఎబ్నార్మల్ జీన్స్ అంటే అసాధారణ జన్యు కణాలు కనిపించాయి. దానివల్ల మీకు పుట్టబోయే బిడ్డకు సిస్టిక్ ఫైబ్రోసిస్ (సి. ఎఫ్), స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ (ఎస్. ఎం. ఎ), మెంటల్ రీటార్డేషన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మెంటల్ రిటార్డేషన్తో పుడితే ఆ బిడ్డతో మీరు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. ఒక డాక్టర్గా మీకు నేను ఆ విషయం చెప్పనవసరం లేదు. అందుకే బిడ్డను కనలా వద్దా అని మీ దంపతులు నిర్ణయించుకోండి. లేకపోతే ఆ బిడ్డ తల్లితండ్రులుగా మీరిద్దరూ జీవితాంతం బాధపడవలసి ఉంటుంది`` అని చెప్పింది డాక్టర్ ఇందిర. ఆమె మాటలు విని మిథున స్థాణువైంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించసాగింది నాకు. నేను ఆమె చేతిని నొక్కతూ ``గాబరాపడకు. ఇంటికెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం`` అని చెప్పాను. వెంటనే మిథున ఆందోళన నిండిన స్వరంతో ``డాక్టర్! పుట్టబోయే శిశువుకు మీరు చెప్పిన వ్యాధి వచ్చే అవకాశం ఎంత వరకూ ఉంటుంది?`` అని అడిగింది. ``మిథునా! 80 శాతం ఆ వ్యాధితో పుట్టే అవకాశం ఉంది. నీ రక్తంలో దానికి సంబంధించిన జీన్స్ కనిపించాయి. ఆ వ్యాధితో పుడితే ఆ శిశువు జీవితాంతం చిన్నపిల్లల్లాగే ప్రవర్తిస్తుంది . వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉండదు. సరిగ్గా మాట్లాడలేరు . నడవ లేరు . మెదడు సరిగ్గా పనిచెయ్యదు. తమ పనులు తాము చేసుకోలేరు . మిగతా విషయాలు వంశీ మీకు చెబుతారు`` అని చెప్పింది. ఆ తరువాత మేమిద్దరం కారులో ఇంటికి బయలుదేరాము. కారులో మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం చోటుచేసుకుంది. ఆమెను ఎలా ఓదార్చాలో నాకర్థం కావటం లేదు. నాకా సమయంలో అంతకు రెండు రోజుల ముందు నేను నా విద్యార్థులకు చెప్పిన మెంటల్ రిటార్డేషన్ పాఠం గుర్తుకు వచ్చింది. ఆ పాఠం వాళ్ళకి చెబుతున్నప్పుడు అలాంటి సమస్య నాకే ఎదురౌతుందని నేనూహించలేదు. ఇదంతా యాదృచ్ఛికమా లేక సిక్త్ సెన్స్ నాకు ముందే చెప్పిందా అన్న సంశయం నాకు కలిగింది. ఇంటికి వెళ్ళిన తరువాత మిథునకు ఆ వ్యాధి గురించి, పుట్టబోయే బిడ్డ వల్ల ఎన్ని కష్టాలు పడవలసి ఉంటుందో వివరించి చెప్పి, అబార్షన్ చేయించుకోమని చెప్పాను. కానీ మిథున ఎట్టిపరిస్థితుల్లోను గర్భ విచ్ఛిత్తికి ఒప్పుకోలేదు. పైగా డాక్టరు 80 శాతమే అలా పుట్టడానికి అవకాశం ఉందని చెప్పిందనీ, అంటే మామూలుగా పుట్టే అవకాశం 20 శాతం వరకు ఉందనీ, కాబట్టి తాను 20 శాతాన్ని నమ్ముతాననీ, ఒక తల్లిగా బిడ్డ ఎలా పుట్టినా స్వీకరిస్తానని చెప్పి అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
08-01-2025, 09:42 AM
ఆ తరువాత మా ఇద్దరి మధ్య ఎడం పెరిగింది. నెల్లాళ్ల పాటు ఇద్దరం మాట్లాడుకోలేదు. మొదటి సారి గర్భం దాల్చినపుడు భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందించి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటారు. భర్త భార్యను కాలు కింద పెట్టనీయకుండా అన్ని పనులు తానే చేస్తూ ఒక దేవతలా చూసుకుంటాడు.
కానీ మా విషయంలో అది తప్పైంది. నేను ఓ డాక్టర్ని కావడం వల్ల వాస్తవంగా ఆలోచించడంతో ఈ సమస్య జటిలం అయింది. నేను ఆ మర్నాడు మరొకసారి మిథునతో తల్లిగా ఆమె ఎదుర్కోబోయే కష్టాల గురించి మళ్ళీ చెప్పాను. “తల్లిని చేస్తాడన్న కారణంతోనే ప్రతీ స్త్రీ తన భర్త మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది. నెల తప్పిన దగ్గర్నుంచీ ఆ స్త్రీ తనకు పుట్టబోయే బిడ్డ గురించే కలలు కంటుంది. "అమ్మ అని విన్నప్పుడే ఆడబతుకు గెలుపు! అందుకే ప్రతి నిత్యం ప్రసవించును తూరుపు"! అంత గొప్పది మాతృత్వం. అటువంటి మాతృత్వాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ప్రసవించే ప్రతీ తల్లికీ భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది. నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని బాధలు పడటానికైనా నేను సిద్ధం`` అని మిథున నాకు కరాఖండీగా చెప్పడంతో నాకేం చెయ్యాలో తోచలేదు. *** *** *** 9 నెలల తరువాత మిథున ఒక మగ పిల్లవాణ్ణి ప్రసవించింది. డాక్టరు చెప్పినట్లే ఆ పిల్లవాడు నల్లగా, పెద్దతల, సన్నటి కాళ్ళు, చేతులతో వికృతంగా మానసిక వైకల్యంతో పుట్టాడు. నెలరోజుల దాకా వాడు పాలు తాగలేదు. చొంగకారుస్తూ, తల వాలుస్తూ నిస్తేజంగా ఉన్నాడు. ఆ తరువాత వాడిని డాక్టరుకి చూపిస్తే కొన్ని మందులు వాడమని సూచించారు. ఆరు నెలల తరువాత వాడికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. వాడికి పాలు తాగించటం ఓ పెద్ద సమస్యగా మారింది. ప్రతీ గంటకు మలమూత్ర విసర్జన, కళ్ళు తేలవేస్తూ ఉండటంతో వాడు ఎప్పుడు ఏమౌతాడో నన్న భయం మాకు కలుగుతూ ఉండేది. నేను విసుక్కుంటానేమోనని మిథునే వాడిని కంటికి రెప్పలా చూసుకునేది. అలా రెండు సంవత్సరాలు వాడితో ఎన్నో బాధలను అనుభవించింది మిథున. దాంతో ఇంట్లో మా ఇద్దరికీ మానసిక ప్రశాంతత కరువైంది. ప్రతీరోజూ నా మాట విని అబార్షన్ చేయించుకోనందుకు మిథున మీద నాకు విపరీతమైన కోపం కలుగుతుండేది. ఈ రెండు సంవత్సరాల పాటు నేను ఆ పిల్లాణ్ణి ఒక్కసారి కూడా ఎత్తుకొని ముద్దాడ లేదు. వాడిని ఓ శతృవులా, ఓ అంటరాని వాడిలా చూసాను తప్పా నా రక్తం పుట్టిన కొడుకుగా భావించలేదు. వాడు ఎప్పుడు చనిపోతాడో తెలియక వాడికి పేరు కూడా పెట్టలేదు నేను .
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
08-01-2025, 09:43 AM
రెండు సంవత్సరాల ప్రత్యక్ష నరకం తరువాత ఆ పిల్లడు చనిపోయాడు. ఏనాటి ఋణమో తీర్చుకునేందుకు మిథున కడుపున పుట్టినట్లున్నాడు. ఋణం తీరగానే వెళ్ళిపోయాడు.
వాడు చనిపోయిన తరువాత నేను ఊపిరి పీల్చుకుంటే మిథున మాత్రం కన్నీరు మున్నీరైంది. ఆమె దుఃఖాన్ని ఆపటం నావల్ల కాలేదు. అంతటి మానసిక అంగవైకల్యంతో పుట్టిన వాడి మీద ఎందుకంత ప్రేమ పెంచుకుందో నా కర్థం కాలేదు. కొన్నాళ్ళ తరువాత ఆమె మామూలౌతుందని నేను మౌనం దాల్చేను. కానీ అప్పుడప్పుడు నాక్కూడా ఆ పిల్లడు గుర్తుకొచ్చి కంటనీరు తిరుగుతుండేది. దుఃఖం ముంచుకొచ్చేది. ఎంతైనా ఇంట్లో మాతో పాటు రెండేళ్ల ఉన్నాడు. వాడి ఏడుపుతో లేచే వాడిని. వాడి ఏడుపు వింటూ పడుకునే వాడిని. అటువంటిది ఒక్కసారిగా ఇంట్లో నిశ్శబ్దం ఆవరించటంతో నాక్కూడా ఇంట్లో ఉండబుద్దేసేది కాదు. వాడు చనిపోయి సంవత్సరం అయిపోయినా మిథున మామూలు మనిషి కాలేకపోయింది. నిర్లిప్తత ఆమెని ఆవహించింది. మౌనం ఆమె భాష అయింది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే ఆమె ఏమౌతోందన్న భయం నన్నావహించి డాక్టర్ని కలిసాను. డాక్టరు ఇందిర నా బాధ అర్థం చేసికొని ``వంశీ! మీరు ఇంకో బిడ్డ కోసం ప్రయత్నించండి. మళ్ళీ తల్లైతే ఆమె మామూలు మనిషయ్యే అవకాశం ఉంది`` అని చెప్పింది. ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. "డాక్టర్! మీరేం చెబుతునారో నాకు అర్థం కావటం లేదు. మళ్ళీ మిథున గర్భం ధరించినా మామూలు శిశువుకు జన్మనిస్తుందన్న భరోసా ఉందా ? ఈసారి కూడా అలాంటి శిశువే జన్మిస్తే ఏం చెయ్యాలి?. అప్పుడు మిథున పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది" అన్నాను. "వంశీ! ప్రతీసారీ అలాగే పుట్టే అవకాశం లేదు. ఒక్కోసారి మనం రిస్కు తీసుకోక తప్పదు. అంతకన్నా మీకు మరో అవకాశం లేదు. ఒక్కోసారి ప్రకృతి మనకు మంచి చేస్తుంది. ఎంత డాక్టర్లమైనా మనం కూడా మనుషులమే. దేవుణ్ణి నమ్మక తప్పదు. ప్రయత్నించండి. తలుపు తట్టబోయే అవకాశం కోసం దాని దగ్గర ఓపిగ్గా నిలబడక తప్పదు. సైన్స్ ఒకోసారి అద్భుతాలను సృష్టించి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది" అంది డాక్టరు ఇందిర. ఆమెను ఆ సమయంలో చూసినప్పుడు దేవదూతలా కనిపించింది నాకు. *** *** *** కాలచక్ర భ్రమణంలో సంవత్సరం తిరిగింది. మిథున గర్భం ధరించి ఈరోజే ఒక అందమైన పిల్లని ప్రసవించింది. అదృష్టవశాత్తూ డాక్టరు ఇందిర చెప్పినట్లు ఆ పిల్ల ఆరోగ్యంగా, అందంగా, పెద్ద పెద్ద కళ్ళతో, అందమైన ముఖంతో చలాకీగా పుట్టి మా దంపతులిద్దరికీ ఆనందాన్ని తెచ్చింది. రెండేళ్ళ క్రితం పోయిన వసంతాన్ని తిరిగి తెచ్చింది. మోడులా మారిన మా జీవితాలను చిగురింపచేసింది. ఇప్పుడు మిథునకు ఆ పిల్ల తోడిదే జీవితం. ఒక తల్లిగా ఆ పిల్లను చూస్తూ మురిసి పోతోంది. మోడు వారిన జీవితం మళ్ళీ చిగురించినందుకు నాకు ఆనందంగా ఉంది. ఆ సమయంలో ఆనాడు మిథున చెప్పిన “తల్లిని చేస్తాడనే మగని పైన వలపు నెల తప్పిన నాటి నుంచి బిడ్డడిపై తలపు" అన్న మాటలు గుర్తుకొచ్చి నాకు కంటనీరు తిరిగింది. మాతృత్వం యొక్క గొప్పతనం తెలిసింది. (సమాప్తం )
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
21-01-2025, 04:25 PM
గురుబ్రహ్మ
రచన: సుజాత స్వర్ణ "రోజా! తొందరగా రావే! ఆలస్యమవుతోంది" స్కూటీని స్టార్ట్ చేస్తూ కేకేశాను నేను. "ఇదిగో వస్తున్నా అంత తొందరైతే ఎలా?" అంటూ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చి బండెక్కింది రోజ. "ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. రామనాథం మాస్టారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పాను కదా! ఇప్పుడు సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలయ్యింది. కార్యక్రమం నాలుగు గంటలకే మొదలవుతుందన్నారు. మనం అక్కడికి చేరుకునేసరికి ఎంత సమయమవుతుందో ఏమో!" కంగారుగా అన్నాను నేను. "సరేలే సుజా! సన్మాన సమయానికి ఉంటే సరిపోతుంది కదా! మాస్టారంటే అంత అభిమానం ఉన్న దానివి ఒక్క పూట బడికి సెలవు పెట్టొచ్చు కదా! పెట్టలేదు. ఇప్పుడేమో హడావిడి చేస్తున్నావు" అంది రోజ. "కార్యక్రమం సాయంత్రమని, బడి వదలగానే వెళ్ళొచ్చని అనుకున్నా. నువ్వు ఆలస్యం చేస్తావని నేనేమైనా కలకన్నానా?" అన్నాన్నేను కొంచెం ఉక్రోషంతో. "అబ్బా! సరేలే! తొందరపడకోయ్ సుందరవదనా! నువ్వు కంగారుపడి నీ వాహనాన్ని ఏ భారీ వాహనానికో ముద్దు పెట్టావనుకో!.. సన్మానానికి ఏమో గానీ.. పైకి పోతాం" ఆకాశం వైపు వేలు చూపుతూ నవ్వుతూ అంది రోజా. ఆ మాటలకు కాసేపు ఇద్దరం నవ్వుకున్నాం. ఏ కాస్త సమయం దొరికినా తన హాస్యవల్లరితో ఎదుటి వారిని రంజింపజేస్తుంది రోజ. రోజ నా సహాధ్యాయిని. మేము సీతానగరం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాము. ఇంచుమించు ఇద్దరం ఒకే వయసు వారం కావడం వల్ల మా మధ్య స్నేహం త్వరగా చిగురించింది. మండలంలో ఏ సమావేశం జరిగినా, ఏ కార్యక్రమానికైనా ఇద్దరం కలిసే వెళ్తాం. మమ్మల్ని అందరూ 'జంట కవులు' అని సంబోధిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మాకు వీలుపడక ఒక్కరమే కనబడితే, ''ఏంటండీ ఈరోజు జంట కవులలో ఒకరు తగ్గారే?' అంటారందరూ. రామనాథం మాస్టారు నా గురువుగారు. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆయన కృషి చాలా ఉంది. ఆయన మాకు గణితం బోధించే వారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రథమంలో ఉండే నాకు, గణితమంటే గుండెపట్టుకునేది. ఆ విషయాన్ని గుర్తించిన మాస్టారు, మా నాన్నతో మాట్లాడి నన్ను సెలవు రోజుల్లో వారింటికి పిలిపించి, అర్థం కాని లెక్కలను అర్థమయ్యేలా చెప్పేవారు. అలా నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో నేను పదవ తరగతి గట్టెక్కగలిగాను. ఆ తర్వాత పై చదువులు చదివి నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కూడా ఆయనే సలహాలు ఇచ్చారు. అందుకే మాస్టారంటే నాకు ఎంతో గౌరవం, భక్తీనూ. పావుగంట పైనే పట్టింది మేము అక్కడికి చేరుకోవడానికి. రామనాథం మాస్టారు మా మండల కేంద్రమైన రామాపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కనే ఉంటుందా ఊరు. సాయంత్రమైనా పెద్దగా వాహనాలేవీ అడ్డురాలేదు కానీ ఊర్లోని గేదెలను తప్పించుకుని బయటపడడం మాత్రం కష్టమైంది మాకు. మేమెళ్ళేసరికి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు అప్పుడే వస్తున్నారు. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకొని స్కూటీకి స్టాండ్ వేసి పక్కన ఉంచాను. ఇద్దరు పిల్లలు ఎదురొచ్చి మాకు స్వాగతం పలికారు. పిల్లలు, పెద్దలతో ఆవరణంతా నిండిపోయింది. వాతావరణం కోలాహలంగా ఉంది. మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో వేదికను పెళ్లి మండపంలా అలంకరించారు. నేలంతా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. మార్చి నెల కావడంతో భానుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. పచ్చని చెట్లు ఎక్కువగా ఉన్నందున ఏదో తెలియని హాయిగొలుపుతోంది అక్కడి వాతావరణం. మాస్టారు దంపతులు వేదిక ముందు కూర్చుని ఉన్నారు. మేము వారి వద్దకు వెళ్లి నమస్కరించగా, కుశల ప్రశ్నలు వేసి మమ్ము ఆశీర్వదించి కూర్చోమని చెప్పారు వారు. కొద్దిసేపటి తర్వాత అందరికీ నమస్కారం మరికొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుందంటూ వ్యాఖ్యానం వినిపించింది. దాంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో అటువైపు నుంచి కార్ల కాన్వాయ్ వస్తుండడం చూసి అందరి దృష్టి అటు మరలింది. రోజాతో కబుర్లలోఉన్న నేను కూడా అటు చూశాను. కార్లు దిగి వస్తున్నవారికి స్వాగతం పలకడానికి కొందరు ఎదురెళ్ళారు. కలెక్టర్ హోదాలో ఉన్న ఓ వ్యక్తి, పక్కన జవాన్ పరిగెత్తుకుని వస్తుండగా రామనాథం మాస్టారి దగ్గరికి వచ్చారు. ఎవరో అధికారి వచ్చారనుకొని లేచి నిల్చోబోయిన మాస్టారిని పొదివి పట్టుకుని కూర్చోబెట్టి పాదనమస్కారం చేశాడు వచ్చినాయన. ఆ చర్యకు మాస్టారు ఆశ్చర్య పడతుండగా"గుర్తుపట్టలేదా మాస్టారూ.. నేను భరత్ ఐఎఎస్. మీ ప్రియశిష్యుడిని" అన్నాడు. ఆనందపారవశ్యంతో మాస్టారు ఆతడిని ఆలింగనం చేసుకున్నారు. కాసేపటివరకు ఇద్దరు మాట్లాడలేక పోయారు. ఆనందభాష్పాలు కన్నుల నిండాయి. వారిద్దరి మధ్య ఏర్పడిన ఆ అవ్యాజమైన ప్రేమకి ఎంతని వెలకట్టగలం? చూపరులకు ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం (https://xossipy.com/thread-66514.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]() |
« Next Oldest | Next Newest »
|