Posts: 830
Threads: 4
Likes Received: 329 in 247 posts
Likes Given: 570
Joined: Nov 2018
Reputation:
6
23-05-2020, 01:14 PM
(This post was last modified: 23-05-2020, 01:25 PM by Loveizzsex. Edited 1 time in total. Edited 1 time in total.)
Super work
Yedurinti pellam story update unte link share cheyandi please
•
Posts: 2
Threads: 0
Likes Received: 21 in 7 posts
Likes Given: 1
Joined: May 2019
Reputation:
0
సరిత్ గారూ! ఇండెక్స్ పేజీలో ఏదో సమస్య వచ్చింది. నేరుగా ఇండెక్స్ రావడం లేదు.
లాగిన్ అవబోతే మరొక పేజీ ఏదో దూరుతోంది. ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు.
•
Posts: 13,187
Threads: 244
Likes Received: 18,528 in 9,647 posts
Likes Given: 1,924
Joined: Nov 2018
Reputation:
381
(02-06-2020, 01:45 PM)lotuseater Wrote: సరిత్ గారూ! ఇండెక్స్ పేజీలో ఏదో సమస్య వచ్చింది. నేరుగా ఇండెక్స్ రావడం లేదు.
లాగిన్ అవబోతే మరొక పేజీ ఏదో దూరుతోంది. ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు.
అన్న గారూ
ఇండెక్స్ పేజీ అంటే మొదట వచ్చే login పేజీ.
మొబైల్ లోనా లేదా laptop లోనా .
వీలయితే screen shot పెట్టగలరు చూస్తాను.
•
Posts: 2
Threads: 0
Likes Received: 21 in 7 posts
Likes Given: 1
Joined: May 2019
Reputation:
0
(04-06-2020, 11:49 PM)sarit11 Wrote: అన్న గారూ
ఇండెక్స్ పేజీ అంటే మొదట వచ్చే login పేజీ.
మొబైల్ లోనా లేదా laptop లోనా .
వీలయితే screen shot పెట్టగలరు చూస్తాను.
ఆలస్యంగా రెస్పాండ్ అవుతున్నాను-సారీ సరిత్ గారూ! మొబైల్ లో అలా జరిగింది. మన సైట్ లాగిన్ అవుతుండగా మరో పేజీ వచ్చింది. తమాషా ఏమిటంటే మన సైట్ లో కథల పేర్లే లాగిన్ అవక్కర్లేకుండా ప్రత్యక్షమయ్యాయి. అది మన సైట్ మాత్రం కాదు. ఒకటికి రెండుసార్లు ఏడిపించి మళ్ళీ కనబడలేదు. ఒకవేళ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోవడం నాకు రాదు. వైరస్ అయినా కావొచ్చు. నేనందులోకి వెళ్ళలేదు. మళ్ళీ కనిపిస్తే చెబుతాను.
•
Posts: 16
Threads: 0
Likes Received: 5 in 4 posts
Likes Given: 2
Joined: May 2019
Reputation:
0
sarit garu, me daggara నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ story pdf format lo undha, ippati varaku ayina updates motham.plz untey share cheyandi.Thanks
•
Posts: 7,408
Threads: 1
Likes Received: 4,927 in 3,820 posts
Likes Given: 47,014
Joined: Nov 2018
Reputation:
81
sarith garu yahoo group's lo oka patha katha (Trushna by saroja) undi, ee srotie pdf unte ivvara pls
•
Posts: 171
Threads: 0
Likes Received: 58 in 42 posts
Likes Given: 60
Joined: Mar 2019
Reputation:
1
Sarit bhayya kamagni ani oka gold lanti old story undi meku telise untundi. Adi sagame undi full story unte upload cheyagalaru
•
Posts: 13,187
Threads: 244
Likes Received: 18,528 in 9,647 posts
Likes Given: 1,924
Joined: Nov 2018
Reputation:
381
(20-06-2020, 08:13 PM)Super star Wrote: Sarit bhayya kamagni ani oka gold lanti old story undi meku telise untundi. Adi sagame undi full story unte upload cheyagalaru
మిత్రమా , అది అసంపూర్తి కథ.
•
Posts: 265
Threads: 9
Likes Received: 83 in 74 posts
Likes Given: 2
Joined: Jul 2019
Reputation:
0
•
Posts: 13,187
Threads: 244
Likes Received: 18,528 in 9,647 posts
Likes Given: 1,924
Joined: Nov 2018
Reputation:
381
•
Posts: 148
Threads: 0
Likes Received: 92 in 77 posts
Likes Given: 119
Joined: Nov 2018
Reputation:
1
Banduvulu Chanipoyinappudu doooranga and daggara ga unde valluuu theeskovalsina jagrathalu emiti?
•
Posts: 11,598
Threads: 14
Likes Received: 51,952 in 10,333 posts
Likes Given: 14,086
Joined: Nov 2018
Reputation:
1,021
సరిత్ గారు గురు పుజోత్సవం సంధర్బం గా మీకు వందనాలు ఎందుకు అంటే ఈ వెబ్ సృస్తి కర్త మీరే కాబట్టి మీరే లేకపోతే మేము లేము ఇక్కడ
•
Posts: 13,187
Threads: 244
Likes Received: 18,528 in 9,647 posts
Likes Given: 1,924
Joined: Nov 2018
Reputation:
381
(05-07-2020, 06:08 AM)stories1968 Wrote: సరిత్ గారు గురు పుజోత్సవం సంధర్బం గా మీకు వందనాలు ఎందుకు అంటే ఈ వెబ్ సృస్తి కర్త మీరే కాబట్టి మీరే లేకపోతే మేము లేము ఇక్కడ
![[Image: nit5.jpg]](https://i.ibb.co/5rbj97P/nit5.jpg)
అన్న గారూ
•
Posts: 662
Threads: 0
Likes Received: 282 in 241 posts
Likes Given: 330
Joined: May 2020
Reputation:
10
ikkada 1st page lo ichina stories ela chavaloo cheppagalaru pls
Posts: 11,598
Threads: 14
Likes Received: 51,952 in 10,333 posts
Likes Given: 14,086
Joined: Nov 2018
Reputation:
1,021
మాకు తెలియని విషయాలు నాగుల చవతి గురుంచి తెలపండి
Posts: 323
Threads: 16
Likes Received: 902 in 409 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
నాగుల చవితి
భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా- సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి.
కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.
నాగదేవతను పూజించే సత్సంప్రదాయం జపాన్, చైనా, గ్రీకు దేశాలకు సైతం వ్యాపించింది. పుట్టకు పూజ చేసే పండుగ- నాగుల చవితి. ఇందులో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు. తెల్లవారుజామునే తలంటి స్నానం, శుభ్ర వస్త్రధారణ, పూజ సామగ్రితో సమీపంలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజించడం ఈ పర్వదిన కార్యక్రమం. దీపావళినాడు కాల్చగా మిగిలిన టపాసుల్ని నాగుల చవితినాడు వెలిగించి పిల్లలు సంబరపడతారు.
దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.
వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.
పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు!
పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.
సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.
పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ!
నాగుల చవితి
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.
నాగుల చవితి అనగానే ఉదయాన్నే బావి వద్దక వెళ్లి స్నానమాచరించి ఏమీ తినకుండా చాలా నిష్టగా ఉండాలనే తెలుసు. రోజూ చేసినట్లుగా పూజ చేసి తర్వాత మిగతా పనుల్లో నిమగ్నమవుతారు. నాగేంద్రుడుకు ప్రత్యేకమైన పూజ చేయాలి. దానికో పద్ధతి కూడా ఉంది. నాగుల చవితి రోజున చేసే పూజా విధానం మీ కోసం.
నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి ఐష్టెశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకని నాగుల చవితి రోజున నాగేంద్రా! మేము మా వంశములో వారం నిన్ను ఆరాధిస్తున్నాము. పోరపాటున తోక తొక్కితే తొలిగిపో. నడుం తొక్కితో నా వాడనుకో.. పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు. ఇంకా ఆ రోజు ఉదయం ఐదింటికి లేచి, శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పైజామందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్ర్తాన్ని పురుచుకోవాలి. నాగేంద్రస్వామి ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి.
పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిఇలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజ పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము. నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్రస్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపములతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. ఇకపోతే.. నాగుల చవితి నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం.
అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. అందుచేత నాగుల చవితి రోజున నాగదేవతలను నిష్టతో పూజిద్దాం.
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.
జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.
నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం :
పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.
”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.
Posts: 323
Threads: 16
Likes Received: 902 in 409 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
Posts: 323
Threads: 16
Likes Received: 902 in 409 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
*మత్స్య మహాపురాణమున 170వ అధ్యాయమున-
విశ్వేశం ప్రథమం తావ న్మహాతాపస మాత్మజమ్ l
సర్వమంత్రహితం పుణ్యం నామ్నా ధర్మం స సృష్టవాన్. 26
దక్షం మరీచి మత్రిం చ పులస్త్యం పులహం క్రతుమ్ l
వసిష్ఠం గౌతమం చైవ భృగు మంగిరసం మునిమ్. 27
అథై వాద్బుత; విత్యేతే జ్ఞేయాః పైతామహర్షయః.
ఇచ్చట మొదటివాడు ధర్ముడు; తరువాత చెప్పబడినవారు ఇతరత్రకూడ బ్రహ్మమానస పుత్త్రులుగా చెప్పబడినవారే; కడపట చెప్పబడిన 'అద్బుత' శబ్దవాచ్యుడు పండ్రెండవ కుమారుడనుట సమంజసము; అథ- అనుటను బట్టి ఇది పై వానితోపాటు సంజ్ఞవాచకమే కాని విశేషణమయి యుండదు. కాని కన్నడానువాదమున దీనిని విశేషణముగా భావించి అనువదించుట జరిగినది.
ఈ అద్బుత శబ్దమును సంజ్ఞా వాచకముగా గ్రహించినచో మొదటివాడగు ధర్ముడు యజ్ఞరూపుడు కాగా అద్బుతుడు 'అపూర్వము' అను యాగజన్య సంస్కార మనుకొనవచ్చును.
అనంతరము దక్షుడు మరీచి అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు వసిష్ఠుడు క్రతవు గౌతముడు భృగుడు అంగిరుడు అను పదిమంది ప్రజాపతులను సృజించెను. అందరకంటె కడపట' అద్బుతుడు' అను కుమారుని కూడ సృజించెను. వీరు అందరును బ్రహ్మమానస పుత్త్రులగు ఆదిఋషులు; వీరినే పైతామహ (పితామహునినుండి మానసులుగా జనించిన) ఋషులందురు. వీరిలో ధర్ముడు పదుమూడు గుణములు (లక్షణములు) కలవాడు; (లక్షణములు) కలవాడు; అతనిని మహర్షులును ఉపాసింపసాగిరి.
దక్షుడు తన కుమారైలలో అదితి- దితి -దనువు-కాల-అనాయువు- సింహిక -ముని - తామ్ర- క్రోధ-సరస-వినత- కద్రూ-అను పండ్రెండుమందిని మరీచి ప్రజాపతి పుత్త్రుడగు కశ్యపునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఈ కశ్యపుడు తపో మూర్తి; ఈ దక్షుడు తన కుమార్తెలలో మరికొందరుగు రోహిణి మొదలగు ఇరువది ఏడు నక్షత్రములను సోమునకు ఇచ్చెను. వీరందరును పవిత్రమూర్తులు.
సృష్టిప్రక్రియను బాగుగ ఆలోచించిన బ్రహ్మచే పూర్వము సృష్టింపబడిన లక్ష్మి- మరుత్వతీ -సంధ్య (సాధ్య) విశ్వేశా - సరస్వతీ అను ఐదుమందిని ఆ బ్రహ్మ శుభరూపుడగు ధర్మునకు ఇచ్చెను. ఈ ఐదుగురును పరిష్ఠలును - దేవతా శ్రేష్ఠలును;*శబ్ద స్వరూపమును అర్థమును కల ధర్ముని పత్ని (సరస్వతి) సురభియను రూపము ధరించి లోకహితము గోరి బ్రహ్మను సేవించరాగా లోకపూజితుడును లోకసృష్టి హేతువు అగు ప్రక్రియను ఎరిగినవాడు నగు బ్రహ్మ గోజాతి సృష్టి సంకల్పముతో ఆమెతో కూడెను. అమెయందు విశాలరూపులు పొగవంటివారు సంధ్యాకాలమందలి మేఘములవలె ప్రకాశించువారు తీక్ష్ణతేజము గలవారు లోకములనే కాల్చివేయునట్లున్న వారు కలిగిరి. వారు (రుదంతః-) ఏడ్చుచు (ద్రవంతః-) పరుగెత్తుచు బ్రహ్మకడకు పోయిరి. ఈ హేతువుచే వారు (ఈ రెండు పదములందలి ప్రథమాక్షరముల కూర్చచే ) 'రుద్ర' అను పదములో వ్యవహరింపబడిరి. వీరు నిరృతి- శంభుడు - అపరాజితుడు- మృగవ్యాధుడు- కవర్ది-ఖరుడు అహిర్బుధ్న్యుడు- కపాలి- పింగళుడు- సేనాని అని పదునొకండు మంది.
తస్యామేవ సురభ్యాంచ గావో యజ్ఞేశ్వరాశ్చవై. 40
ప్రకృష్టాశ్చ తథా మాయా స్సురభ్యాం వశవో7క్షరాః l
అజాశ్చైవ తు హంసాశ్చ తథైవామృత ముత్తమమ్. 41
ఓషధ్యః ప్రవరాయాశ్చ సురభ్యా స్తా స్సముత్థితాః l
ధర్మా ల్లక్ష్మీ స్తథా కామం సాధ్యా సాధ్యా న్వ్యజాయత. 42
భవంచ ప్రభవం చైవ హీశంచాసురహంప తథా l అరుణ్యం చారుణించైవ విశ్వావసు బలధ్రువౌ. 43
హవిష్యంచ వితానంచ విధానశమితావపిl వత్సరం చైవ భూతించ సర్వాసు రనిషూదనమ్. 44
సువర్వాణో బృహత్కాన్తి స్సాధ్యా లోకవమస్కృతా l తమేవానుగతా దేవీ జనయామాస వై సురా9.
వరంవై ప్రథమం దేవం ద్వితీయం ధ్రువ మవ్యయమ్ l
విశ్వావసుం తృతీయంచ చతుర్థం సోమ మీశ్వరమ్ . 46
______________________________________________________________________________
*మత్స్య- 170 అ; శ్లో. 34
''యారూపార్థవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ. ''
రూపం - శబ్ద స్వరూపం - అర్థశ్చ అస్యా ః - స్తః ఇతి రూపార్థవతీ - సరస్వతీ - ఇత్యర్థః.
రూపము - శబ్ద స్వరూపమును - అర్థమును కలది- శబ్దము; అటువంటి బ్రహ్మదేవుని పత్ని అనగా వాగ్రూపయగు సరస్వతీ.
ఈ అధ్యాయములొ అన్ని ప్రతులయందును ధర్ముని పత్నిరుందు కలిగిన సంతానము విషయమున ఎన్నో పాఠ భేదములున్నవి.
తతోనురూపమాయంచ యమ న్తస్మా దనన్తరమ్ l సప్తమంచ తథా వాయ మష్టమం నిరృతిం వసుమ్. 47
ధర్మస్యాపత్య మేతద్వై సురభ్యాం సమజాయతl విశ్వే దేవాశ్చ విశ్వాయాం ధర్మాజ్జాతా ఇతి శ్రుతిః. 48
దక్షశ్చైవ మహాబాహు పుష్కరస్వన ఏవచ l చాక్షుషశ్చ మనుశ్చైవ తథా మధుమహోరగౌ. 49
విశ్వాంతశ్చ వసు ర్బాలో విష్కమ్భశ్చ మహాయశాః l రురు శ్చైవాతిసత్త్వౌజా భాస్కర ప్రతిమద్యుతిః. 50
విశ్వాన్దేవా న్దేవమాతా విశ్వేశా7జనయత్సుతా9 l మరుత్వతీతు మరుతో దేవా నజనయత్సుతా9. 51
అగ్నిం చక్షూ రవింజ్యోతి స్సావిత్రం మిత్రమేవచ l అమరం శరపృష్టించ సుకర్షంచ మహాభుజమ్. 52
విరాజంచైవ వాచంచ విశ్వం వసుమతిం తథా l అశ్వమన్తంచిత్రరశ్మిం తథా నిషధనం నృప. 53
హూయన్తం బాడబంచైవ చారిత్రం మదపన్నగమ్ l బ్రహన్తంచ బృహద్రూపం తథావై పూతనానుగమ్.
మరుత్వతీ పురా జజ్ఞే ఏతన్వై మరుతాం గణా 9l
ఆ సురభియందే బ్రహ్మవలన యజ్ఞముపై ఆదిపత్యముగల గోవులు ఉత్తమములగు మాయులు (?) శాశ్వత యోగ్యతగల పశువులు మేకలు హంసలు ఉత్తమమగు అమృతము ఉత్తమములగు ఓషధులు జనించెను.
లక్ష్మి ధర్మనివలన కాముని కనెను; సాధ్య అను నామె ధర్ముని వలననే సాధ్యులను దేవజాతలనస కనెను. సాధ్యులు నామములు - భవుడు ప్రభవుడు ఈశుడు అసురహుడు అరుణుడు ఆరుణి విశ్వావసువు బాలధ్రువుడు హవిష్యుడు వితానుడు విధానుడు శమితుడు వత్సరుడు సర్వాసుర నాశకుడగు భూతి సుపర్వన్ అనువారు మహాకాంతి శాలినియగు సాధ్యకు కుమారులైరి. మనస్ - మంతా - ప్రాణుడు నరుడు- అపానుడు- వీర్యవాన్ - వినిర్భయుడు- నయుడు- దంశుడు- నారాయణుడు- వృషుడు - ప్రముంచుడు- అని అగ్ని పురాణమునందు కలదు.
(సరస్వతీరూప విశేషమేయగు ) సురభి ధర్మునే అనుగమించి ఆతని వలన వసువులనెడు దేవతాగణములను కనెను వారు: వరుడు అవ్యయుడగు ధ్రువుడు ఈశ్వరుడగు సోముడు ఆయుడు యముడు వాయువు నిరృతి అనువారు ఎనిమిది మంది.
ఈ వసువులు సురభి (సరస్వతి) యందు ధర్ముని వలన కలిగిన సంతతి.
విశ్వేశా (విశ్వా) అను ధర్ముని పత్నియందు ధర్మని వలన విశ్వేదేవులను దేవగణములు కలిగిరి. వారు మొత్తము పదిమంది; వారు: మహాబాపూడగు దక్షుడు పుష్కరస్వనుడు చాక్షుషుడు మనువు (చాక్షుష మనువు) మధువు మహోరగుడు విశ్వాంతుడు వసువు బాలుడు (బాలుడగ వసువు) మహాయశశ్శాలియగు విష్కంభుడు అత్యధికమగు సత్త్వమును ఓజస్సును కలవాడు భాస్కరుడువలె కాంతిమంతుడునగు రురుడు అనువారు; దేవమాతలలో నొకతెయగు విశ్వేశయను నామె ధర్ముని వలన వీరిని జనింపజేసెను.
మరుత్వతి యను నామెకు ధర్ముని వలన మరుతులను గణదేవతలు కలిగిరి. వారు ; అగ్ని- చక్షుడు- రవి -జ్యోతి- సావిత్రుడు- మిత్రుడు- అమరుడు- శరవృష్టి- మహాభుజుడగు సుకర్షుడు- విరాట్ - వాచ్- విశ్వుడు- వసుమతి- అశ్వవంతుడు- చిత్ర రశ్మి- నిషధనుడు- హూయంతుడు- బాడబుడు- చారిత్రడు- మదపన్నగుడు- బ్రహద్రూపుడగు బృహత్ -పూతనానుగుడు అను వారు.
అదితిః కశ్యపా జ్జజ్ఞే ఆదిత్యా న్ద్వాదశైవ హి. 55
ఇన్ద్రో విష్ణు ర్బగ స్త్వష్టా వరుణో హ్యర్యమా రవి ః l పూషా మిత్రశ్చ ధనదో ధాతా పర్జన్య ఏవ చ . 456
ఏతేవై ద్వాదశాదితగా వరిష్ఠా స్త్రిదినౌకసామ్ l ఆదిత్యస్యాశ్వినౌ నాసత్యౌ జజ్ఞాతే ద్వౌ సుతౌ వరౌ. 57
తపశ్శ్రేష్ఠౌ గుణిశ్రేష్ఠౌ త్రిదివస్యాపి సమ్మతౌ l దనుస్తు దానవా న్జజ్ఞే దితి ర్దైత్యా స్వ్యజాయత. 58
కాలాతు వై కాలకేయా నసురా న్రాక్షసాంస్తువై l అనాయుషాయా స్తనయా వ్యాధయ స్సుమహాబలాః. 59
సింహికా గ్రహమాతా వై గన్దర్వ జననీ మునిః l
తామ్రా త్వప్సరసాం మాతా పుణ్యానాం భారతోద్బవా. 60
క్రోధాయా స్సర్వభూతాని పిశాచాశ్చైవ పార్థివ l జజ్ఞే యక్షగణాం శ్చైవ రాక్షసాంశ్చ విశామ్పతే. 61
చతుష్పదాని సత్త్వాని తథా గావస్తు సౌరసాః l సుపర్ణా న్పక్షితశైవ వినతాయాం వ్యజాయత. 62
మహీధరా న్త్సర్వనాగా న్దేవీ కద్రూర్వ్యజాయతః l ఏవం వృద్ధిం సమగమన్ విశ్వే లోకాః పరస్పరమ్. 63
తదా వై పౌష్కరో రాజ న్ప్రాదుర్భావో మహాత్మనః l
ప్రాదుర్బావః పౌష్కరస్తే మహా9 ద్వైపాయనేరితః 64
పురాణః పురుషశ్చైవ మయా విష్ణు ర్హరిః ప్రభుః l కథితస్తే 7నుపూర్వేణ సంస్తుతః పరమర్షిభిః. 65
యశ్చైతదగ్య్రం శృణుయా త్పురాణం సదా నర( పర్వసు చోత్తమాంశ్చ l
అవాప్య లోకా న్త్సహి వీతరాగః పరత్రవై స్వర్గఫలాని భుజ్త్కే. 66
చక్షుషా మనసా వాచా కర్మణాచ చతుర్విధమl ప్రసాదయతి యః కృష్ణం తసై#్మ కృష్ణః ప్రసీదతి. 67
రాజాచ లభ##తే రాజ్య మధన శ్చోత్తమం ధనమ్ l క్షీణాయ ర్లభ##తే చాయు స్సుతకామ స్సుతాం స్తథా. 68
యజ్ఞాన్ వేదాం స్తథాకామం స్తపాంసి వివిధానిచ l ప్రాప్నోతి వివిధం పుణ్యం విష్ణు భక్తో ధనాని చ . 69
యద్యత్కామయతే కిఞ్చి త్తత్త ల్లోకేశ్వరా ద్భవేత్ l ఏష పౌష్కరకో నామ ప్రాధుర్బానో మహాత్మనః.
కీర్తితస్తే మహాభాగ వ్యాస శ్రుతినిదర్శనాత్ l సర్వం విహాయ య ఇమం పఠే త్పౌష్కృరకం హరేః. 71
ప్రాదుర్బావం మను శ్రేష్ఠ న కదా7ప్యశుభం భ##వేత్. 71 ||
ఇతి శ్రీమత్స్యమహాపురాణ పద్యోద్బవ ప్రాదుర్బావకథనే బ్రహ్మాదివకృతవేదాది
సృష్టిర్నామ స ప్తత్యుత్తర శతతమో7ధ్యాయః.
ఇక కశ్యపుని భార్యలలో అదితియందు ఇంద్రుడు విష్ణువుభగుడు త్వష్ట వరుణుడు అర్యమన్ రవి పూషన్ మిత్రుడు ధనదుడు ధాత వర్జన్యుడు అను ద్వాదశాదిత్యులు కలిగిరి. వీరిలో (ద్వాదశాదిత్యాదిష్ఠాతయగు) ఆదిత్యునకు ఆశ్వినులు నాసత్యులు అని ప్రసిద్ధగల ఇద్దరు శ్రేష్ఠులగు సుతులు కలిగిరి. వారు తపములచె సద్గుణములచే గొప్పవారును స్వర్గమునకు పూజ్యులును; దనువునందు దానవులు దితియందు దైత్యులు కాలయందు కాలకేయులను అసురులు రాక్షసులు అనాయుషయందు మహాబలురగు వ్యాధులు సింహికయందు (ప్రాణులను పట్టి బాధించు) గ్రహములు ముని అనునామె యందు గంధర్ములు తామ్రయందప్సరసలు క్రోధయందు భూత పిశాచములు యక్షరాక్షసులు సురనయందు చతుష్పాత్ర్పాణులు గోజాతులు వినతయందు గరుడాది పక్షులు కద్రువయందు పర్వతములు నాగులు కలిగిరి. ఇట్లు సర్వలోకములు కలిగి పరస్పర మేళనముచే వృద్ధినందెను.
మనురాజా! అపుడు(ఆది కాలమున) మహాత్ముడగు బ్రహ్మకు కలిగిన పౌష్కర (పుష్కరము=జలము: పద్మము; దానినుండి కలిగిన) ప్రాదుర్బావ స్వరూపము ఇటువంటిది; మత్స్యుడు మనువునకు చెప్పినదిగా ద్వైపాయనునిచే చెప్పబడిన దానిని నేను (సూతుడు) మీకు (ఋషులకు) చెప్పితిని. పరమర్షులు స్తుతులనందుకొను ప్రభుని-పురాణ పురుషుని- గూర్చి ఆనుపూర్వితొ (క్రమముగా) మీకు తెలుపబడినది; అగ్ర్యము (మొదటిది) ఉత్తమమునగు పురాణమును వైరాగ్య దృష్టితో ఎల్లప్పుడును విశేషించి పర్వదినములందున విను నరుడు ఇహమున ఉత్తమములగు లోకముసుఖములను పొంది వరలోకమున స్వర్గసుఖమును పొందును . చక్షువుతో (దర్శించి) మనస్సుతో (ఆలోచించి) వాక్కుతో (స్తుతించి) కాయముతో (అర్చించి ) నాలుగు విధములుగ కృష్ణుని ఆరాధించి అనుగ్రహింపజేసికొను వానియందు కృష్ణుడనుగ్రహము చూపును. రాజు రాజ్యవృద్దిని ధనహీనుడు ధనమును అల్పాయుష్కుడధికాయువును సుతకాముడు సుతులను పొందును. విష్ణుభక్తుడు యజ్ఞములను వేదములను కామములను వివిధ తపస్సులను వీటిని యథావిధిగా అనుష్టించుటచే కలుగు వివిధ పుణ్యమును పొందును. పలుమాటలేల? ఏది ఏది కొంచెమో గొప్పయో కోరునో అది ఎల్ల ఆ లోకేశ్వరునివలన లభించును. మహాభాగా! మనూ! వ్యాసప్రోక్త శ్రుతి (పురాణ సంహితా ) నిదర్శించిన (నిరూపించిన) దాని ననసరించి నీకు మహాత్ముడగు చతుర్ముఖుని పౌష్కర పాధుర్భామును కీర్తించితిని. ఎవడైన ఇతర (వాజ్మయ) మంతయు విడిచియు హరివలన కలిగిన ఈ పౌష్కర ప్రాదుర్బావ మాత్రమును అధ్యయనము చేసినను వాని కశుభుములు సంభవింపకుండును; శుభములు కలుగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున పద్మోద్భవ ప్రాదుర్భవ కథనమున బ్రహ్మకృత
--------------------------------------------------------------------------
Posts: 323
Threads: 16
Likes Received: 902 in 409 posts
Likes Given: 138
Joined: Jul 2019
Reputation:
348
- కద్రువకు జన్మించినవారు నాగులు. కద్రుజకశ్యపునికి భార్య కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు
కశ్యపుడు
కశ్యపుడు, అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన వామనుడు, బలి చక్రవర్తి సభలో
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు. కశ్యపుడు ' ఆకారాత్ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. ' కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.
ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి. ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం- కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది..
- కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
- కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు
- కశ్యపునికి భార్య కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది
- భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.
ప్రస్థానము
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-
దక్ష ప్రజాపతి తనకు గల మరో 27 మంది కుమార్తెలను ( అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు. [1] కశ్యప సంతానం
కశ్యపుడు తన వివిధ భార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి: - బిందు జాబితా
- దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు.
- అదితికి పుట్టినవారు దేవతలు, ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి.
- దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే.
- సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.
- క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు.
- వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.
- కద్రువకు జన్మించినవారు నాగులు. కద్రుజ
- మనుకు జన్మించిన వారు మానవులు.
- అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి
1. దితి 2. అదితి 3. దను 4. కష్ట 5. అరిష్ట 6. సురస 7. ఇళ 8. ముని 9. క్రోధావసు 10. తమ్ర 11. సురభి 12. సరమ 13. తిమి అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం. - తిమి వల్ల జన్మించినవి జలచరాలు,
- సరమ వల్ల భయంకరమైన జంతువులు,
- సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు,
- తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు,
- ముని వల్ల దేవతలు, అప్సరలు,
- క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు,
- ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు,
- సురస వల్ల చెడు ఆత్మలు,
- అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ),
- విశ్వ వల్ల యక్షులు,
- దితి వల్ల 49 మంది వాయుదేవులు,
- అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు.
- మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.
అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6 గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.
వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.
వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు.
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి.
కాశ్యప గోత్రము
హిందూ సమాజములో సంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును. అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను.
శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే | ; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
Posts: 11,598
Threads: 14
Likes Received: 51,952 in 10,333 posts
Likes Given: 14,086
Joined: Nov 2018
Reputation:
1,021
ఇంతటి మేధావి సమాధానం ఇచ్చు కోవలసి వచ్చేనా హతవిది
|