Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Apocalypse : where it begins?
#1
Chapter (1) Apocalypse: where it begins?

మాండ్వాకా అనే గ్రహంలో ఎన్నో రాజ్యాలు ఉండేవి రాజ్యాల్లో ఒకటైన మఖండ్వా అనే రాజ్యం ఉండేది రాజ్యాన్ని పాలిస్తున్న హురువు అనబడే వంశస్థులు. వంశంలోని వారంతా మిగతా రాజ్యాల్ని ఆక్రమించాలని ఎన్నో యుద్ధాలు చేసేవారు యుద్ధాల వలన ఎంతో మంది చనిపోయారు. కానీ ఎవరు గ్రహాన్ని పూర్తిగా గెలవలేకపోయారు. అయినప్పటికీ  వంశమంటే ఇప్పటికి మిగతా రాజ్యాల వారికీ భయం ఉండేది. ఇది ఇలా ఉండగా    గ్రహంలో  ఉన్న  మంత్రవాదులు గ్రహానికి ఆపద రాబోతోంది అని గుర్తించి గ్రహంలో ఉన్న ఖంగ్వ  అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ప్రదోత్య ని కలిసి విషయం గురించి చెప్తారు. అప్పుడు ప్రదోత్య హురువు వంశం వల్లే ఆపద రావొచ్చు అనుకోని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని భావించి అన్ని రాజ్యాలని కలుపుకుని మఖండ్వా రాజ్యం పై యుద్ధానికి వస్తారు. అప్పటికే మఖండ్వా రాజ్యాన్ని పాలిస్తున్న హురువు వంశంలో అందరు చనిపోయుంటారు వారి వంశంలో చివరిగా మిగిలింది ఇద్దరు మాత్రమే.

 ఒకరు యుక్త వయసు కూడా రాణి మఖ్రద్వ ఇంకొకరు మాటలు కూడా సరిగా రాణి మరుఖండ్వా ఆ వంశం మొత్తం నాశనం అవ్వాలని మఖండ్వా పైకి యుద్ధానికి వస్తారు. రాజ్యాన్ని పాలిస్తున్న మహారాణి, యువరాజులు తల్లి (తాను ప్రదోత్య చెల్లెలు కూడా) ఐన ప్రత్యోస్తి యుద్ధానికి వెళ్తుందిహురువు రక్తం తన కడుపులో ఉందని తెలిసి  ప్రత్యోస్తి ని చంపేస్తారు. ఇదంతా చూస్తున్న ప్రదోత్య కూడా ఏమి చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తనకు గ్రహాన్ని రక్షించడం ముఖ్యం కాబట్టి.
 మఖండ్వా రాజ్యపు సేనాధిపతి ఇద్దరు యువరాజులతో : యువరాజ, మీరు తమ్ముడు అడవి ద్వారా తప్పించుకోండి, నేను అంతలోపు సైన్యాన్ని అడ్డుకుంటాను, పరిగెత్తండి అంటూ తన మీద కి వస్తున్నా శత్రు సైన్యాన్ని  తన  సైన్యం  తో  అడ్డుకుంటాడు . యువరాజు  మరియు  ఇంకా  మాటలు  కూడా  రాణి  తన  తమ్ముడిని  ఎత్తుకొని  అడవి  లోకి  పరిగెత్తుతాడు . అడవిలో  చాల  దూరం  తన  తమ్ముడిని  ఎత్తుకొని  పరిగెత్తి  అలసిపోతారు  మఖ్రద్వ .   లోపు  చీకటి పడుతుంది.
మఖండ్వా రాజ్యాన్ని  పూర్తిగా  ఆక్రమించుకొని  సేనాధిపతిని  సైన్యాన్ని  బంధించి    రోజు  రాజులందరూ  మంత్రవాదులతో  సమావేశమవుతారు .   సమావేశంలో  మంత్రవాదులకు  నాయకుడు  మరియు  శక్తివంతుడైన  మాంత్రికుడు  ఇలా  అంటదు  :   గ్రహానికి  ఆపద  ఇంకా  పొంచి  ఉంది  చేదు  సంకేతాలు  ఇంకా  కనబడుతున్నాయి  శవాలతో  నిండిపోవడం  నాకు  ఇంకా  కనబడుతోంది  అని  అంటదు . అప్పుడు  మహారాజుల్లో  ఒకరు  ఖచ్చితంగా  ఇది    వంశం  వాళ్ళ  వల్లే  అయ్యుంటుంది    వంశం  లో  వారంతా  చనిపోయారు, ఇద్దరినీ కూడా  చంపెయ్యడానికి మన సైన్యాన్ని తూర్పు  భాగం  వైపున్న  అడవుల  వైపు  పంపించాం  వాళ్ళని  రేపటిలోగా  పట్టుకొని  చంపేస్తారు  అంటదు .   తర్వాత  మంత్రవాదుల్లో  ఒకరు  మనం  వాళ్ళని  మాత్రమే  కాదు  వారి  పూర్వికులైన  సమాధులని  తవ్వి  వాటిని  కాల్చి బూడిద  చెయ్యాలి  అప్పుడు  కానీ  మనం    ఆపద  నుండి  బయటపడలేం  అని  అంటారు  అందుకు  అందరు  ఒప్పుకొని  అందు  కోసం  వారి  సమాధులని  వెతికి  కాల్చేయడం  ప్రారంభిస్తారు.
హురువు  వంశస్థుల  సమాధులన్ని  ఒకొక్కటిగా    సమాధుల  మీదున్న  వారి  విగ్రహాలని  బట్టి  వాటిని  గుర్తించి  తవ్వి  కాల్చడం  మొదలు  పెడతారు . ప్రదోత్య  మాత్రం  తన  చెల్లెల్ని  గురించి  బాధపడుతూ  తన  చెల్లెలి  శవాన్ని కాల్చేస్తాడు.యువరాజు  అడవిలో  చాల  దూరం  పరిగెత్తి  అలసిపోయి    రోజు  అడవిలోనే  దిక్కు  తోచని  స్థితిలో  ఎం  చెయ్యాలో  తేలిక  ఉండిపోతాడు.   రోజు  అడవిలోనే  తన  తమ్ముడితో  పాటు అక్కడే ఉన్న జంతువులని చంపి కడుపు  నింపుకుంటారు  ఇద్దరు. మరుఖండ్వా  నిద్రపోతాడు  కానీ  మఖ్రద్వ  తన  తల్లి  చివరిసారి  తనతో  చెప్పిన  మాటలు  గుర్తు  చేసుకుంటాడు   "మఖ్రద్వ  నేనొకవేళ  తిరిగి  రాకపోతే  బాధపడకు, తమ్ముడిని  బాగా  చూసుకో , ఇద్దరు  కలిసే  ఉండండి  ఎం  జరిగిన  సరే  హురువు  వంశం  మీతోనే అంతం అయిపోకూడదు " అని ఇద్దరు కొడుకుల  మీద  ముద్దు  పెట్టి  వెళ్ళిపోతుంది. అదే  మఖ్రద్వ  తన  అమ్మ  ను  చుసిన  చివరి  చూపు . మఖ్రద్వ  నిద్రలోకి  జారుకుంటారు   తెల్లవారుతుంది  మఖ్రద్వకి  మెలుకువ  వస్తుంది .
 తన  తమ్ముడిని  ఎత్తుకొని  దగ్గరలో  ఉండే  నీటి  కొలను  లో  నీళ్లు  తాగుతుంటాడు    సమయంలో  పై  నుండి  ఒక  గ్రహశకలం    గ్రాహం  పై  పడుతూ  ఉండటం  నీటిలో  చూస్తాడు . ఇటువైపు  రాజులూ , ప్రజలు  కూడా  చూస్తుంటారు  వాళ్ళు  చివరి శవాన్ని  అప్పుడే  కాల్చేసి  ఉంటారుఒక్కసారిగా  అది  దిశను  మార్చుకుని  మఖ్రద్వ  తన  మీదకి  రావడం  గమనిస్తాడు నిజానికి శకలం  తమ  పూర్వీకుడైన  అతి  భయఙ్కరమైన  ఎలాంటి  జాలి  దయ  లేని  అతడి  వంశస్థుడు  సమాధి  మీద  పడాలి  కానీ    సమయానికే    మహారాజులు  మంత్రవాదులు  కలిసి  అతడి  సమాధి  ని  తవ్వి  శరీరాన్ని  కాల్చేస్తారు . అందువల్ల    గ్రహశకలం  దిశా  మార్చుకుని  తన  మీదకు  వస్తుంది  అక్కడి  నుంచి  పరిగెత్తి  కొద్దీ  దూరం  వెళ్ళగానే    గ్రహ  శకలం  నీటి  కొలను  మీద  పడి నీరు  మొత్తం  ఇంకిపోతాయి .  నీటి   కొలను  దగ్గరగా  ఉండడం  వలన తాను  ఎగిరిపడి  చెట్టుకు  తగులుకుంటాడు .
 తనకు  తన  తమ్ముడికి  కొన్ని  గాయాలు  అవుతాయి . తన  తమ్ముడి  తల మీద  కారుతున్న  రక్తాన్ని  తుడుస్తాడు. ఆలా  తుడుస్తున్న  తన  చేతి  మీద  కూడా  గాయం    రక్తం  కారుతుంటుంది  అని  తెలుసుకుంటాడు . అప్పుడు  తాను    నీటి  కొలను  వైపు  చూస్తాడు  అక్కడ  పడిన    గ్రహ  శకలం  దగ్గరకు  వెళ్తే  అందులో  ఒక  లోహం  మెరుస్తూ ఉంటుంది. తన  గాయమై  రక్తం  కారుతున్న  చేతితోనే    లోహాన్ని  ముట్టుకుంటాడు .తన  రక్తం    మెరుస్తున్న  లోహం  పై  పడగానే వెంటనే  అతను, అతను ఎత్తుకున్న  తన  తమ్ముడు  ఇద్దరు  వేరే  లోకానికి వెళ్లారు. వాళ్ళ శరీరాలు అక్కడే  ఉన్న  వాళ్ళ మైండ్ presence వేరే చోటు ఉంటుంది. యువరాజు  చుట్టూ చూస్తుంటాడు తాను ఎక్కడున్నాడో తనకేమి అర్థమవ్వదు  . ఆలా  చూస్తుండగా  తనకు  దూరంగా  ఒక  సింహాసనం కనిపిస్తుంది .   సింహాసనం  నుండి  ఒక  రకమైన  శబ్దం  వినిపిస్తుంటుంది  ఎవరో  బాధ  తో  నొప్పి  తట్టుకోలేక  అరుస్తున్న  శబ్దం  అది.   అది    ఉన్న  చోటంతా  వ్యాపిస్తూ  ఉంటుంది . ఆలా  తాను  సింహాసనాన్ని  చూస్తుండగా  వెనకనుండి  ఒకరు  : నువ్విప్పుడు  మహాప్రభువు  సింహాసనం  ముందు  ఉన్నావుమోకరిల్లు  అని  ఒక  ఆడగొంతు  వినిపిస్తుంది  తాను  ఆలా  చెప్పి  అక్కడ  నెల  మీద  కొడుతోంది  అప్పుడు  ఒక  ప్రకంపన  వాళ్ళ  యువరాజు  ఒంటి  మోకాలి  మీద  కూర్చుంటాడు .
వెనక  ఇద్దరు  నడుచుకుంటూ  యువరాజు  పక్కనుంచి  వెళ్లి  ఎదురుగ  మహాప్రభువు  సింహాసనం  ముందు  ఉన్న  ఎనిమిది  సింహాసనాల్లో  వారి  వారి  స్థానాల్లో  కూర్చుంటారు . అందులో  ఒకరు  : మహాప్రభువు  లోహం  ఒక  చిన్న  పిల్లోడికి  దక్కింది  అని నిరాశపడతాడు. అప్పుడు  అక్కడ  ఉండే  ఇంకొకరు  ఏది  ఏమైనా మనం  చెయ్యాల్సిన  పని  మనం  చెయ్యాలి  అని  చెప్పి   యువరాజుతో   లోహం నిన్ను  ఎంచుకోవడం  వాళ్ళ  నువ్వు  శక్తివంతుడివి  అయ్యావ్    లోహాన్ని తాకడం వాళ్ళ  నీ  శరీరం  కూడా    లోహం  లగే  ధృద్ధమైనదిగా  శక్తివంతంగా  తయారయింది  అని  చెప్తుంది .   లోహం  తో  నువ్వు  ఆయుధాల్ని  తయారు  చేసుకోవచ్చు  అలాగే  చనిపోయిన  వారిని  కూడా  బ్రతికించవచ్చు  అని  చెప్తుంది .   మాటలు  అన్ని వింటున్న యువరాజుకు  తనకు  తెలియని  భాషలో  మాట్లాడుతున్న  తనకు  ఎలా  అర్థమవుతోందో  అర్థం  కావడం  లేదు . ఆలా  అంత  విన్న  తరవాత  తాను  మల్లి  తన  గ్రహంలోకి  వస్తాడు . తన  ఒంటి  మీద  గాయాలన్ని   నయమవుతాయి . ఆలా    లోహంతో  తాను  ఒక  ఖడ్గాన్ని  తయారు  చేసుకుంటాడు . అప్పుడే    గ్రహశకలం  పడిన  చోటు  తెలుసుకొని  అక్కడికి  వచ్చిన  సైనికులు  తనని  చంపడానికి  ప్రయత్నిస్తారు  అప్పుడు  యువరాజు  అందరిని  చంపేస్తాడు  వాళ్ళతో  పోరాడే  తప్పుడు  తన  మీదకు  ఎన్నో  సార్లు  ఆయుధాలు   తగిలిన  తనకు  ఒక్క  చిన్న  గాయం  కూడా
అవ్వదు . ఆలా  తన  తమ్ముడికి  కూడా  ఒక  కవచాన్ని  తయారు  చేస్తాడు . ఆలా  ఒక్కడే  తన  రాజ్యాన్ని తిరిగి దక్కిచుకోవడానికి తన  రాజ్యానికి  వెళ్తాడు.తన  సేనాధిపతి తన  సైన్యాన్ని  తిరిగి  విడిపిస్తాడు .   లోహ ప్రభావం  వాళ్ళ అతను  ఇంతకూ  ముందు  కంటే క్రూరంగా  మారుతుంటాడు...
[+] 2 users Like zenitsu_a34's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good starting  clps
Like Reply
#3
Dear Zenitsu

చేరిన వెంటనే ఓ కథ మొదలుపెట్టావు, సంతోషం. కథనం బాగుంది. 

కథకు వీలైతే తెలుగులో పేరు పెట్టమని సూచన.

గ్రహాంతర కథ...ఆసక్తికరంగా ఉంది.

congrats

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
Nice start
Like Reply
#5
INTERESTING STORY LINE. పెర్లే కొద్దిగా నాలుక తిరక్కుండా ఉన్నాయి. కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#6
(21-04-2024, 02:36 AM)sri7869 Wrote: Good starting  clps

thank you sri7869 garu
[+] 1 user Likes zenitsu_a34's post
Like Reply
#7
(21-04-2024, 06:42 PM)k3vv3 Wrote: Dear Zenitsu

చేరిన వెంటనే ఓ కథ మొదలుపెట్టావు, సంతోషం. కథనం బాగుంది. 

కథకు వీలైతే తెలుగులో పేరు పెట్టమని సూచన.

గ్రహాంతర కథ...ఆసక్తికరంగా ఉంది.

congrats

thank you k3vv3 garu 
tappakunda telugu peru pedtanandi
[+] 1 user Likes zenitsu_a34's post
Like Reply
#8
(23-04-2024, 02:09 PM)BR0304 Wrote: Nice start

thank you andi BR0304 garu
[+] 1 user Likes zenitsu_a34's post
Like Reply
#9
(23-04-2024, 07:46 PM)Uday Wrote: INTERESTING STORY LINE. పెర్లే కొద్దిగా నాలుక తిరక్కుండా ఉన్నాయి. కొనసాగించండి

thank you Uday garu
[+] 1 user Likes zenitsu_a34's post
Like Reply
#10
అలా సాగిన తన ప్రయాణంలో అందరి రాజులను మంత్రవాదులను తన రాజ్యానికి నాశనం చెయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని రాజుల భార్య పిల్లల్ని వారి బంధువుల్ని అందరిని ఎలాంటి జాలి లేకుండా ఊచకోత కోస్తాడు. ఆలా ఎన్నో ఏళ్ళు సాగిన యుద్ధాల్లో చివరికి తాను యుక్త వయసుకు వచ్చేసరికి అన్ని రాజ్యవంశాలను నాశనం చేసి అన్ని రాజ్యాలు తన రాజ్యంలో భాగం చేస్తాడు అలా గ్రహాన్ని ఏక ఛత్రాధిపత్యంతో  పరిపాలిస్తుంటాడు. ఇటువైపు తన తమ్ముడైన మరుఖండ్వాకి తమ కంటే బలవంతులు ఎవరు ఉండకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఒకసారి పోటీల్లో అందరిని ఒకడు ఓడిస్తాడు తనని అప్పటి వరకు ఎవరు ఓడించి ఉండరు గ్రాహంలోనే బలవంతుడు అనే పేరు అందువల్ల అతనితో పోటీకి దిగుతాడు మరుఖండ్వా అతనిని ఓడించి చంపేస్తాడు. ఆలా మరుఖండ్వా బలవంతులం అని చెప్పుకుని తిరిగే వాళ్ళందిరిని పోటీకి పిలిచి చంపేస్తుంటాడు. మరుఖండ్వాకి ఒకరు ఏడుస్తున్న, ఒకరిని హింసించి ప్రాణం పోయేటప్పుడు చూడటం అన్న చాలా ఇష్టం. విధంగా మరుఖండ్వా కూడా చాలా క్రూరంగా మారిపోతుంటాడు.మఖ్రద్వకి  లోహం గురించి అతను చుసిన వాళ్ళ గురించి వెతకడం ప్రారంభిస్తాడు. అందుకోసం మఖ్రద్వ గ్రహంలో శాస్త్రజ్ఞులని ఏర్పాటు చేస్తాడు. వారు పరిశోధనలు చేస్తూ ఒక గ్రహాన్ని దాటి అంతరిక్షం లోకి ప్రయాణించే స్సెషిప్స్ని కనుక్కుంటారు అలా కొంతమందిని పంపించి వేరే గ్రహాల్లోని జీవరాసులని వెతకమని మఖ్రద్వ పంపిస్తుంటాడు. అలా వెతుకుతూ ఉండగా ఒకానొక సమయంలో ఒక గ్రహంలో జీవం ఉందని వారికి తెలుస్తుంది.

 క్లోత్రాస్ అని పిలవబడే గ్రహంలో అనుకున్న రూపానికి మారిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళు క్లోత్రసిస్ అని పిలుచుకుంటారు. వారిని బంధించి గ్రహాన్ని ఆక్రమించుకుంటారు. గ్రహానికి మహారాజును చంపేస్తారు. మహారాజుకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు. గ్రహంలో ఉండే యూత్ ని  మొత్తం తమ గ్రహానికి తీసుకుని వెళ్తారు అందులో మహారాజు కొడుకు కూడా ఉంటాడు, గ్రహంలో ఉండే దివ్యంగులని, వాళ్ళు ఎలాంటి రూపానికి మారలేరు కాబట్టి వారి వాళ్ళ ఎలాంటి ఉపయోగం లేదని వారిని అందరిని చంపేస్తారు. అందులో మహారాజు కూతురు కూడా ఉంటుంది. రూపాన్ని మార్చుకునే వాళ్ళని ఒక టీంగా ఏర్పర్చి వాళ్ళ మీద ఎన్నో ప్రయోగాలు చేసి వాళ్ళు ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ లాగా మారేలా ట్రైనింగ్ ఇస్తారు. అలా వారిని ఒక టీంకి ముగ్గురు ఉండేలా చేసి వారిని అన్ని వైపులా జీవరాశుల్ని వెతకడానికి పంపిస్తారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జీవరాశులు ఉండే గ్రహాల్ని కనిపెట్టి అక్కడ వారిలో ఒకరిగా కలిసిపోయి వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పంపించాలని, లేదంటే మీ వాళ్ళని చంపేస్తాం అని బెదిరిస్తారు. అలా వాళ్ళు స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు.
మరుఖండ్వాకి  వేరే గ్రహంలో కూడా బలవంతులు ఉంటారని వాళ్ళని ఓడించాలనే బుద్ధి పుడుతుంది. అందుకు తన అన్నతో  "అన్న వేరే గ్రహాన్ని ఆక్రమించే బాధ్యత నాకు ఇవ్వు అక్కడ ఉండే వాళ్లలో బలవంతులు ఉండచ్చు అందుకోసం నేను వస్తాను నేను వాళ్ళని ఓడిస్తాను " అని అంటాడు. కానీ మఖ్రద్వకు భయం తన తమ్ముడికి ఏమైనా అవుతుందేమో అని ఎందుకంటే లోహం తనకు లొంగింది కానీ తన తమ్ముడికి కాదు తనకేమైనా అవుతుందేమో అని అనుకుంటాడు కానీ తమ్ముడు అడిగేసరికి కాదనలేక పోతాడు. మరుఖండ్వా తన అన్నతో "అన్న భయపడకు నాకేమి కాదు మన కన్నా శక్తివంతులు మన కన్నా బలవంతులు విశ్వంలోనే లేరు ఒకవేళ ఉంటె వాళ్ళని చంపేస్తాను" అనగానే.మఖ్రద్వకి ఆ లోహం ఇచ్చిన వాళ్ళు గుర్తుకు వస్తారు విషయం తన తమ్ముడికి తెలిస్తే వాళ్ళను చంపడానికి వెతుక్కుంటూ వెళతాడని అది ప్రమాదమని విషయం మరుఖండ్వాకి చెప్పడు. మరుఖండ్వా మాట చెప్పేటప్పుడు తన అన్న మొహం మారిపోవడం గమనిస్తాడు తన అన్న ఏదో దాస్తున్నాడని అర్థం అవుతుంది. మఖ్రద్వ ఒప్పుకోవడంతో వేరే గ్రహాల్ని ఆక్రమించడానికి వెళ్తాడు. విధంగా 5 గ్రహాలని ఆక్రమించుకొని అందులో ఉండే బలవంతులని లేదా గ్రహానికి చెందిన రాజులను పోటీకి పిలిచి వారిని ఓడించి చంపేస్తాడు.
విధంగా 6   గ్రహం గురించి తెలుసుకుని వెళ్తారు. గ్రహం పేరు గ్జియం. గ్రహాన్ని అర్త్రిస్, జోర్, ఒఓనీల్ అనే ముగ్గురు అన్నదమ్ములు పరిపాలిస్తుంటారు. మఖ్రద్వ ఆక్రమించే గ్రహానికైనా వచ్చినప్పుడు అతని spaceship చుట్టూ ఒక వరిథాకారంలో షీల్డ్ ని ఏర్పాటు చేస్తాడు. షీల్డ్ కొన్ని కిలోమీటర్స్ వరకు చుట్టూ వ్యాపించి ఉంటుంది. అది తన దగ్గరున్న లోహంతో దాన్ని తయారు చేస్తాడు. షీల్డ్ దాటి లోపలికి వచ్చి వారితో యుద్ధం చేయమని 3 రోజుల సమయం ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ఎవరు షీల్డ్ ని దాటి లోపలికి వచ్చి ఉండరు.అన్ని గ్రహాల్లో లాగానే ఇక్కడ కూడా అలానే చేస్తాడు. ఎన్ని ఆయుధాలు ప్రయోగించిన షీల్డ్ ని దాటలేకపోతారు. 3 రోజుల సమయం తర్వాత యుద్ధం మొదలవుతుంది అర్త్రిస్ సైన్యం అంత చనిపోతారు. యుద్ధం ఓడిపోతారు. ముగ్గురు అన్నదమ్ముల్ని బంధిస్తారు. మరుఖండ్వా వాళ్ళని పోటీకి పిలుస్తాడు. అయితే పోటీ రేపనగా, దానికి ముందు రోజు మఖ్రద్వ అన్నదమ్ముల వద్దకు వస్తాడు. తనతోపాటు క్లోత్రసిస్ ఒకడు భాషని translate చేయడం కోసం ఉంటాడు.
మఖ్రద్వ : రేపు జరగబోయే పోటీల్లో నా తమ్ముడి చేతుల్లో మీరు ఓడిపోవాలి, లేదంటే మీ గ్రహం మొత్తాన్ని నాశనం చేస్తా అని అంటాడు. దానిని క్లోత్రసిస్ ట్రాన్సలేట్  చేస్తాడు. వాళ్లకు అర్థమైన కూడా ముగ్గురు మౌనంగా ఉండిపోతారు. నిజానికి ఇంతకు ముందు మరుఖండ్వా తో పోటీ పడిన వాళ్ళందిరిని ఇలానే బెదిరించి ఓడిపోయేలా చేస్తాడు.   విషయం మరుఖండ్వా కి తన అనుచరుడు ఐన రాయిస్ ద్వారా తెలుస్తుంది.
మరుఖండ్వా : నా అన్న ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు తనకు నా మీద ఎందుకు నమ్మకం లేదో తెలీట్లేదు. నన్ను ఎందుకు ఒక చేతకానివాడిలా చూస్తున్నాడో తెలియట్లేదు. ఇన్నాళ్లు నేను ఓడించిన బలవంతులు అందరిని నేనే ఓడించాను అనుకున్న. నన్ను నేను బలవంతుణ్ణి అనుకునే వాడిని. కానీ ఇదంతా నా అన్న వలన అని బాధపడతాడుకొద్దిసేపు తర్వాత తేరుకొని కోపంతో ముగ్గురు అన్నదమ్ముల్ని బంధించిన చోటు వెళ్తాడు.
వాళ్ళతో మరుఖండ్వా : రేపు జరగబోయే పోటీలో మీరు మీ పూర్తి బలాన్ని ఉపయోగించి నా మీద దాడి చెయ్యండి. మీరు ఒకవేళ నన్ను ఓడిస్తే గ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోతాం కానీ నా అన్న బెదిరించాడని కావాలని ఓడిపోతే మాత్రం మీ ప్రజలందరినీ చంపేస్తా అని అంటాడు.
అర్త్రిస్ : మేము దీనికి ఒప్పుకుంటున్నాం కానీ మాదొక షరతు.
మరుఖండ్వా : ఏమిటది
అర్త్రిస్ : మా పూర్వీకులకు తరతరాలుగా ఉన్న ఒక గొడ్డలి ఉంది దానిని పోటీకి  అనుమతించాలి అని అంటాడు. మిగతా తమ్ముళ్ళిద్దరు అన్న వైపు ఆశ్చర్యంగా చూస్తారు. మరుఖండ్వా ఒప్పుకుంటాడు
మరుఖండ్వా  వెళ్ళిపోయాక జోర్ తన అన్నతో : అన్న నువ్వేం మాట్లాడ్తున్నావో అర్థమవుతుందా గొడ్డలి పట్టుకున్న వాళ్ళు ఏమవుతారో నీకు తెలుసు కదా. ఆయుధం పట్టుకున్న వాళ్లకు గెలుపు ఖాయం కానీ దానికి బదులుగా వాళ్ళ ప్రాణం పోతుంది. ఇంతకూ ముందు గొడ్డలి తీసుకున్న మన పూర్వికులు ఏమయ్యారో నీకు తెలుసు కదా. దీనికి మేము అస్సలు ఒప్పుకోము.
ఒఓనీల్ తన అన్న జోర్ చెప్పినదానికి మద్దతు ఇస్తూ : అవును అన్న మేము దీనికి అస్సలు  ఒప్పుకోము. అలా అయితే మనం ముందే షీల్డ్ ని ధ్వంసం చేయడానికి కూడా తీసుకోలేదు ఎందుకంటే  మాకు మీ ప్రాణాలు ముఖ్యం అని అంటాడు.
అర్త్రిస్ : అదే మనం చేసిన తప్పు మనం ఆయుధాన్ని వాడుంటే ఇంత దూరం వచుండేదే కాదు ఇంత మంది ప్రాణాలు పోయేవే కాదు. ఇక అలా జరగకూడదు మన ప్రాణాలు పోయిన పర్లేదు మనం వాళ్ళని ఓడించడం కాదు ఇద్దరు అన్నదమ్ములని చంపెయ్యాలి. లేదంటే వీళ్ళ వల్ల ఇంకెంతోమంది ప్రాణాలు పోతాయి అని అంటాడు. అర్త్రిస్  మాటలకూ ఇద్దరు సరే అని అంటారు. కొద్దిసేపటికి మరుఖండ్వా భోజనం తీసుకుని వస్తాడు. మరుఖండ్వా అనుచరుడు రాయిస్ : తినండి స్వయంగా యువరాజే మీ కోసం వేటాడి తీసుకుని వచ్చాడు అని అంటాడు. మరుఖండ్వా : గ్రహంలో ఎక్కువ తినే ఆహరం ఇదే అని తెలిసింది అందుకే వేటాడి తీసుకు వచ్చాను కనిపించిన వాటిల్లో ఇదే బలిష్టంగా ఉంది. రేపు మీరు పోరాడటానికి బలం ఉండాలి కదా తినండి అని అంటాడు. మీకు ఇంకా ఏం కావాలన్నా సరే అడగండి నేను తెప్పిస్తాను కానీ రేపు జరిగే పోటీలో నన్ను ఓడించడానికి మీ శక్తినంతా ఉపయోగించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ముగ్గురు ఆహరం తినేస్తారు. ఆహరం తిని జోరు మరియు ఒఓనీల్ నిద్రపోతారు. అర్త్రిస్ మాత్రం రాత్రంతా ఎదో ఆలోచిస్తూ ఉండిపోతాడు.
[+] 3 users Like zenitsu_a34's post
Like Reply
#11
పోటీ మొదలవుతూ ఉంటుంది చుట్టూ జనం ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ముల్ని తీసుకుని వస్తారు. దూరం నుండి నలుగురు గొడ్డలిని లాక్కొని వస్తారు. అర్త్రిస్ గొడ్డలిని అందుకుంటాడు. అంత బరువున్న గొడ్డలిని అర్త్రిస్ మాత్రమే మోయగలడు. గొడ్డలిని చూడగానే ప్రజలంతా ఒక్కసారిగా గట్టిగ కేకలు వేయడం మొదలుపెడతారు.
మఖ్రద్వ తన పక్కనున్న ఒక క్లోత్రసిస్ తో అదేంటని అడుగుతాడు. అప్పుడు క్లోత్రసిస్ : ప్రభు, గొడ్డలి వాళ్ల పూర్వీకుల ది, గొడ్డలి అంతరిక్షం నుండి పడిన ఒక లోహం నుండి తయారు చేసారు అని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా మఖ్రద్వ కి భయం మొదలవుతుంది అది చూడటానికి తన దగ్గరున్న లోహం లాగా లేకపోయినా అంతరిక్షం నుండి అనగానే భయం మొదలవుతుంది వెంటనే మఖ్రద్వ అక్కడున్న క్లోత్రసిస్ తో : మరి విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అరుస్తాడు. క్లోత్రసిస్ : క్షమించండి ప్రభు, మరుఖండ్వా యువరాజు కి చెప్తే నేను చూసుకుంటా అని చెప్పాడు. మఖ్రద్వ తన మనసులోనే " మరుఖండ్వా ఎంత పని చేసావ్ " అని అనుకుంటుండగా పోటీ మొదలవుతుంది.
అర్త్రిస్, జోర్, ఒఓనీల్ ముగ్గురు ఒకేసారి మరుఖండ్వా మీద దాడి చేస్తారు. ముగ్గురి దాడుల్ని తప్పించుకుంటాడు. మరుఖండ్వా వద్ద తన అన్న లోహంతో తయారు చేసిన కవచం మరియు చేతి వేళ్ళకి తొడుక్కుని ఒక ఆయుధం ఉంటుంది. ఇటువైపు మరుఖండ్వా కూడా దాడి చేస్తుంటే ముగ్గురు కూడా తప్పించుకుంటారు. ఇలా చాలాసేపు భీకరంగా పోరాడ్తుంటారు. అర్త్రిస్ గొడ్డలితో దాడి చేయబోయిన ప్రతిసారి ప్రజలు కేకలు వేస్తుంటారు కానీ దాడుల్ని మరుఖండ్వా తప్పించుకుంటాడు. అయితే ఒక్కసారిగా జోర్ మరియు ఒఓనీల్ మరుఖండ్వా ని మోకాలి మీద కూర్చోపెట్టి వెనకనుండి భుజాల్ని నేల మీదకి ఆనేల అదిమిపట్టుకుంటారు. తాను విడిపించుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ వాళ్ళు బలంగా పట్టుకోవడం వల్ల విఫలం అవుతాడు. ఇది చూసి వెంటనే మఖ్రద్వ సైనికుల్ని పోటీని ఆపమని పంపిస్తాడు. వాళ్ళు వస్తుండగా అర్త్రిస్ వెంటనే గొడ్డలి పైకి ఎత్తి ఒక్క ఉదుటన పైకి ఎగురుతాడు. ఒక్కసారిగా ప్రజలంతా అరుపులు కేకలతో చోటంతా ప్రతిధ్వనిస్తుంది ప్రతి ఒక్కరు వాడిని చంపెయ్ వదిలిపెట్టకు అని అరుస్తుంటారు. గాలిలో ఉన్న అర్త్రిస్ సరాసరి మరుఖండ్వా మీద వెనుకభాగాన గొడ్డలితో వేటు వేస్తాడు.
ఎప్పుడైతే ఆ గొడ్డలి మరుఖండ్వా చర్మానికి తగుల్తుందో వెంటనే గొడ్డలి తునాతునకలు అయిపోతుంది. అది చూసి ఒక్కసారిగా అందరు నిస్చేష్ఠులవుతారు. ప్రజలంతా ఇది చూసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కొద్దిసేపు అర్త్రిస్ కి ఏమి అర్థం అవ్వదు. మఖ్రద్వ ఆలోచనలో పడిపోతాడు. నిజానికి లోహం వల్ల తనకే కాదు మరుఖండ్వా శరీరం కూడా దృఢమైంది. కానీ ఎలా రోజు కేవలం తన రక్తం లోహం పై పడటం వల్ల అది తనకు లొంగింది లోహం శక్తులన్నీ తనకు వచ్చాయి కానీ తన తమ్ముడికి ఎలా అని గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడు అర్థం అవుతుంది తనకు నిజానికి రోజు తన రక్తం తో పాటు తన తమ్ముడి రక్తం కూడా తన చేతికి ఉంది. అంటే మరుఖండ్వా కూడా తన లాగే  అనుకుంటుండగా. మరుఖండ్వా ఒక్కసారిగా పైకి లేస్తాడు జోర్ ని పక్కకి తోసి ఒఓనీల్ ని పట్టుకుని నేలకు అదిమి పెట్టి తన తలని గట్టిగ పట్టుకుంటాడు. ఒఓనీల్ తల పగిలిపోతుంది. మొహమంతా ఛిద్రమవుతుంది. ఒక్కసారిగా అర్త్రిస్, జోర్ ఇద్దరు షాక్ అవుతారు వారి కళ్ళ వెంట నీరు కారడం మొదలవుతుంది. కానీ జోర్ వెంటనే తేరుకుని మరుఖండ్వా వైపుకి దాడి చేస్తాడు. మరుఖండ్వా ఒక్క గుద్దు గుద్దుతాడు వెంటనే జోర్ ఎగిరి పడి  గోడకు తగులుకుంటాడు. మరుఖండ్వా జోర్ వైపు వచ్చి తన తలను గోడకు అదిమి పిడి గుద్దులు గుద్దుతాడు. గోడతోపాటు తన తల కూడా పగిలిపోయి చనిపోతాడు. చివరిగా మిగిలింది అర్త్రిస్ మాత్రమే. మరుఖండ్వా తన వైపుకు వస్తుంటాడు. అర్త్రిస్ మాత్రం అలాగే ఉండిపోతాడు. తన కళ్ళకు ఇంకా తన తమ్ముల చావులు కనపడ్తున్నాయి. అర్త్రిస్ తన వైపు వస్తున్నా మరుఖండ్వా తో : నా ప్రజల్ని వదిలేయమని మోకాళ్ళ మీద కూర్చుంటాడు. మరుఖండ్వా అర్త్రిస్ ని పిడికిలితో ఒక్కో చోట గుద్దుతాడు. ఎముకలు అన్ని విరిగిపోతాయి. అర్త్రిస్ కోన ఊపిరి తో ఉంటాడు. తనని ఒక మాంసం ముద్దా లాగా చుట్టి దూరంగా విసిరేస్తాడు. ఇది చుసిన ప్రజలంతా నిస్చేష్ఠులవుతారు. పోటీ ముగిసింది. అన్ని గ్రహాల్లో లాగానే ఇక్కడ కూడా ఒక వర్గాన్ని పక్కకి తీసి వాళ్ళని చంపేస్తారు. గ్రహంలో ఉండే విలువైన వస్తువులని తీసుకుని వెళ్తారు. ఇప్పుడు గ్రహం కూడా వాళ్ళ ఆధీనం లోకి వస్తుంది. మాండ్వాకా గ్రహానికి వచ్చిన తర్వాత మరుఖండ్వా అన్న తో మాట్లాడడు. ఇంకా తన అన్న మీద కోపం ఉంటుంది.
అయితే ఒకరోజు మరుఖండ్వా కి ఒక గ్రహం లొకేషన్ తెలుస్తుంది. అది పంపించింది ఒక క్లోత్రసిస్. అతను ఎవరో కాదు క్లోత్రాస్ మహారాజు కొడుకు బార్బెరా. మరుఖండ్వానే బార్బరా ని విశ్వంలో నే శక్తివంతుడిని వెతికి కనుక్కుని చెప్పమని పంపిస్తాడు. క్లోత్రసిస్ చెప్పిన దాన్నిబట్టి ఒక చోట ఒక శక్తివంతుడు ఉన్నాడని తెలుస్తుంది. వెంటనే తన అన్నకు చెప్పకుండా తన తో పాటు తన అనుచరుడు రాయిస్ ని మరియు నైపుణ్యం ఉన్న 100 సైన్యాన్ని తీసుకుని లొకేషన్ కి బయల్దేరతాడు. అయితే విషయం తెలుసుకున్న మఖ్రద్వ వాళ్ళు ఎక్కడున్నా వెతకండి అని కొంతమందిని పంపిస్తాడు. కొన్ని నెలల ప్రయాణం తర్వాత మరుఖండ్వా వాళ్ళు లొకేషన్ కి చేరుకుంటారు. బార్బెరా పంపించిన ఇన్ఫర్మేషన్ మరియు గ్రహం, దాని చుట్టూ ఉండే గ్రహాల hologram exact గా మ్యాచ్ అయ్యాయి. కొద్దిసేపటికి బార్బెరా గ్రహం నుండి మరుఖండ్వా వచ్చిన spaceship లోకి వెళ్తాడు.
మరుఖండ్వా : ధన్యవాదాలు క్లాత్రోసిస్ నా కోసం ఇంత కష్టపడినందుకు అని చెప్పి, నా అన్న నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు నేనెంటో తనకు చూపిస్తాను. గ్రహంలో ఉండే శక్తివంతుణ్ణి అంతం చేసి గ్రహం మొత్తాన్ని నాశనం చేస్తాను గ్రహంలో జీవించే ప్రతి ఒక్క జీవిని చంపేస్తాను. నేనేంటో నా బలం ఏంటో నా అన్నకు నిరూపిస్తాను అని తన దగ్గరున్న గ్రహం hologramని పట్టుకుని గట్టిగ నవ్వుతాడు.
రాయిస్ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ప్రభు. మీ శక్తి ఏమిటో అందరికి తెలిసే సమయం వచ్చింది   గ్రహానికి పట్టే గతితో అది చూడబోతోంది. ఇంతకీ నాశనం అవ్వబోతున్న గ్రహం పేరేమిటి?
బార్బెరా : ఎర్త్
[+] 4 users Like zenitsu_a34's post
Like Reply
#12
Nice update  clps
Like Reply
#13
సూపర్, ఇప్పుడు భూమి పైన యుద్దం మొదలౌతుందా
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply




Users browsing this thread: 1 Guest(s)