Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(‘మిరాకిల్ వినాయగర్ ఆలయం’)
#1
తమిళనాడులో వర్ణ వినాయకుడు..!!?శ్రీ?
(‘మిరాకిల్ వినాయగర్ ఆలయం’)

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. 
అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. 

ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...
‘పిట్ట కొంచం కూత ఘనం’ అన్నట్టు, 
ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. 

అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు  ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. 
ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ 
ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
 దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. 
ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని  భక్తుల విశ్వాసం. 

అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది.
 ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. 
కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., 
నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది 
ఇక్కడున్న ఈ బావి.  
ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., 
ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. 
వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., 
ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., 
వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., 
ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. 

అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. 
కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. 
అవి ఎప్పుడూ సతతహరితాలే. 

కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, 
ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. 
అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. 

ఇక చారిత్రక విషయాల కొస్తే..?
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 
1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, 
ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, 
స్ధానికులు కూడా అదే చెప్తారు. 

నిజానికిది ‘శివాలయం’. 
ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. 
ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 
అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. 

ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. 
ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. 
ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. 
తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాకా, 
ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, 
కేరళప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

ఈ ఆలయానికో చారిత్రక చరిత్ర కూడా ఉంది. 
ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లడం జరుగింది. 
అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది.
 రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి  అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, 
రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. 
కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. 

అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, 
ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. 

ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా 
ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. 
అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి 
ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. 

ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
 ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. 

ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే 
వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది 
ఎవరూ కాదనలేని నిజం.
ఓం గం గణపతియే నమః..!!?

లోకా సమస్తా సుఖినోభవంతు..!!?

                      ?శ్రీ మాత్రే నమః?

Source:Internet
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సంబంధిత చిత్రాలు :

[Image: 7qImdf9.png]

[Image: 7vPlGlb.png]
Like Reply
#3
Like Reply
#4
Like Reply
#5
(04-01-2019, 09:26 PM)~rp Wrote: సంబంధిత చిత్రాలు :

[Image: 7qImdf9.png]

[Image: 7vPlGlb.png]
~rp garu,

Thanks early response and pictures
Like Reply




Users browsing this thread: 1 Guest(s)