Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మత్స్యవల్లభుడు...by kittyboy
#1
Heart 
               మత్స్యవల్లభుడు
[Image: Naked-Anushka-Shetty-cum-on-her-boobs-sexy-nude.jpg]
                                        ...by kittyboy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అది పాతాళలోకం లంకాపురికి దిగువున వున్న ఈ లోకంలో మనుషులందరు సరిసృపాల రూపంలో ఉంటారు. లంకాపురాన్ని మయ బ్రహ్మ నిర్మించాడు,ఒకప్పుడు కుబేరుని ఆధీనంలో ఉండేది.కుబేరుని సంపద అంతా లంకానగర ఖజానాలోనే ఉండేది.
సకల సంపదలతో తులతూగే లంకాపురిని కుబేరుని సవతి సోదరుడు రావణబ్రహ్మ ఆక్రమణ చేశాడు.రావణుడు తన ఖజానాలో వున్న వజ్ర వైఢూర్యాలను పాతాళలోకంలో దాచాడు.పాతాళలోకానికి తన తమ్ముడైన అహిరావణుడిని రాజుని చేశాడు.పాతాళలోకానికి ద్వారపాలకుడు మకరధ్వజుడు .
పాతాళలోకంలో అందరి చర్మం పొలుసులతో వుంటుంది.ఆకారం సముద్ర జీవుల్లా వుంటారు .కానీ మకరధ్వజుడు వీరికి భిన్నంగా ఉంటాడు. ఒళ్ళంతా వెంట్రుకలతో ఒత్తుగా ఉంటుంది.వజ్రకాయుడిలా ఉంటాడు.దవడ కొంచెం ఎత్తుగా ఉంటుంది మకరధ్వజునికి స్వామి భక్తి మెండు .తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించేవాడు.అహిరావణునికి అతని మీద చాలా నమ్మకం .అంతకుమించి వాత్సల్యం ఉండేది. అతడి సహచరులు దీని వల్ల అతడి మీద అసూయ పడేవారు.మకరధ్వజుడుకి కూడా ఒంటరితనం వెంటాడేది.అతడి తల్లి తండ్రులు ఎవరో తనకు తెలియదు.అందరికన్నా అతడు భిన్నంగా ఉండేవాడు,
పాతాళలోకంలో ఒక రోజు అంటే, భూలోకంలో ఒక సంవత్సరం .కాలపరిణామం సముద్రగర్భం వల్ల మారుతుంది .
ఒక రోజు పాతాళలోక రాజు అయిన అహిరావణుడుకి సందేశం వచ్చింది. లంకానగరం దాడికి గురి అయ్యిందని .చాలా మంది లంకాపురి వాసులు పాతాళలోకానికి వస్తారని సందేశం వచ్చింది.అందరికి సదుపాయాలు చూడమని రారాజు ఆజ్జ్ఞ .
మకరధ్వజునికి సందేశం వచ్చింది ఆ సందేశాన్ని తన రాజుకు చూపించాడు . అహిరావణుడుకి ఏం జరిగిందో అర్ధం కాలేదు ,ఏర్పాట్లు చెయ్యమని తన పరివారానికి ఆజ్జ్ఞాపించాడు .మకరధ్వజుడు ఒక్క క్షణం ఆగి "రాజా ! నా తల్లితండ్రులు ఎవరు,నా వృత్తాంతం ఏమిటి? " అని సవినయంగా అడిగాడు.
అప్పుడు రాజు ఇలా చెప్పాడు �మత్స్యవల్లభా ! ఒక రోజు రాజ సభలో ఉండగా నాకు జాలరులు ఒక పెద్ద చేపను బహుకరించారు.దాన్ని వంటవాళ్ళు కోసినప్పుడు అందులో దివ్యతేజస్సు కలిగిన ఒక బుడతడు కనిపించాడు. చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ బుడతడే నువ్వు.ముద్దుగా ఉన్న నిన్ను నేనే పెంచి పెద్దచేశాను . సకల విద్యలు నేర్పించాను.ఈ పాతాళ లోకంలో యోధాను యోధులు కంటే పరాక్రమంలో మేటి అయిన నిన్ను పాతాళలోక పరిరక్షకునిగా నియమించాను.చేప కడుపులో జన్మించావు కాబట్టి "మత్స్యవల్లభుడు" అని పేరు పెట్టాను.
ఈ లోకంలో ఉన్న సిరి సంపదల కోసం యక్షులు కిన్నెరలు, కింపురుషులు దాడులు ఎక్కువగా ఉండేవి. వాళ్ళ దాడులను నువ్వు సక్రమంగా తిప్పి కొట్టావు. అందుకే ఈ దేశపు ధ్వజం అయిన మకరాన్ని నువ్వు కాపాడావు. కాబట్టి అందరూ నిన్ను "మకరధ్వజుడు" అని పిలుస్తున్నారు.
కానీ విచారమయిన విషయం ఏమిటంటే నీ తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు.ఇది నీ జన్మ వ్రుత్తాoతo "అని చెప్పాడు.మౌనంగా విన్నాడు మత్స్యవల్లభుడు.

అంతలో లంకా నగరము నుండి వచ్చిన అసురులు పాతాళలోకానికి చేరుకున్నారు. అందరికీ వారి వారి స్ధావరాల్లో బస ఉండేటట్లు ఏర్పాటు చేసారు.
రాజ దర్బారు నుండి వచ్చిన మకరధ్వజుడు ఏర్పాట్లు చూద్దామని వెళ్ళాడు . మకరధ్వజుడిని చూడగానే అసురులంతా పరుగెత్త సాగారు. అహిరావణుడికి ఈ విషయం తెలిసి అందర్నీ వారించి వారి భయందోళనకు కారణం ఏమిటని అడిగాడు .
అప్పుడు వాళ్ళు చెప్పారు. అసురులు భయకంపితులవుతూ లంకాపురిని దహనం చేసింది ఈ వానరుడే అని పలికారు. అహిరావణుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శివాలయం ప్రధాన పూజారి లంకానగర రహస్య పత్రాలు,దేవుని ఆభరణాలు తీసుకొని పాతాళలోకంలో దాయడానికి వచ్చాడు. నందీశ్వరుడు అని పేరుగల ఆయన తన పురవాసుల పరిస్ధితి చూసి వారికి చెప్పాడు .
"లంకాపురి వాసులారా ! మన సుందర లంకాపురాన్ని నామరూపాలు లేకుండా అగ్నికి ఆహుతి చేసినది వానరుడు ,రామదూత ,అతులిత బలధాముడు ,అంజనీ పుత్రుడు హనుమంతుడు".
ఇతను మకరధ్వజుడు స్వామి భక్తిపరాయణుడు. పాతాళలోకవాసి అని సర్ధి చెప్పాడు.
హనుమంతుని పేరు వినగానే మకరధ్వజుడికి ఒళ్ళు జలదరించింది,గగుర్పాటుకు లోనయ్యాడు .మకరధ్వజుడికి మనసులో ఎన్నో ఆలోచనలు స్పురించాయి. హనుమంతుడుకి తనకి సంబంధం ఏమిటి నా జన్మరహస్యం ఏమిటి,అని తర్జనభర్జనలు పడ్డాడు. ఏమి పాలుపోక నందీశ్వరుని వద్దకు వెళ్ళాడు.
నందీశ్వరుడు లంకాపురికి బయలుదేరుతుండగా తన వద్దకు వచ్చిన మకరధ్వజుని చూసాడు. మకరధ్వజుడు నందీశ్వరునికి నమస్కరించి తన జన్మరహస్యాన్ని తెలిస్తే చెప్పమని ప్రాధేయపడ్డాడు . నందీశ్వరుడు తనకు తెలియదని లోకకల్యాణ కారకుడైన నారదుని ఉపాసించమని చెప్పి వెళ్ళిపోయాడు.

మకరధ్వజునికి తను రాముని శిబిరానికి వెళ్ళి వస్తానని చెప్పి జాగ్రత్తగా ఉండమని అహిరావణుడు నుంచి తనకు వర్తమానం వచ్చింది .
మకరధ్వజుడు కావలి కాస్తూ నారదమహర్షిని ఉపాసించ సాగాడు.
నారద మహర్షి ప్రత్యక్షమై మకరధ్వజునికి ఏం కావాలో కోరుకోమన్నాడు.
అప్పుడు మకరధ్వజుడు "దేవర్షి,నాకు నా జన్మవృత్తాంతము గురించి తెలుసుకోవాలనుంది.
నా మాతృమూర్తి,పితృదేవులు గురించి తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది.
ఈ పాతాళలోకంలో మిగిలినవారితో కంటే భిన్నంగా ఉన్నాను. మహారాజు నన్ను పుత్రవాత్యల్యంతో చూసినా ఏదో తెలియని ఒoటరి తనం, వ్యాకులత నన్ను ఆవహించినవి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నా మనస్సుకు ప్రశాంతత చేకూర్చ ప్రార్ధన." అని నమస్కరించాడు
అప్పుడు నారద మహర్షి బాలకా, "మొదట నీవు తెలుసుకోవలసినది నీ మహారాజు సోదరుడు రావణ బ్రహ్మ గురించి "అని రావణుడు గురించి చెప్పసాగాడు.
Like Reply
#3
నారదుడు ఇలా చెప్పారు

"రావణుడు తండ్రి వివశ్రుడు ,బ్రహ్మదేవునికి మనుమడు విశ్రవుడు. పదిమంది ప్రజాపతులలో, ఏడుగురు మహర్షులలో ఒకరాయన"

విశ్రవుని భార్యలు ఇలావద, కైకశి.

ఇలావద ద్వారా కుబేరుడు మరియు ఇద్దరు పుత్రుల్ని పొందాడు.

బాలకా ! రావణుని తల్లి కైకశి (సుమాలి తండ్రి) మీ సంతతికి చెందింది. తన తమ్ములు విభీషణుడు, కుంభకర్ణుడు, సోదరి శూర్పణక. రావణుడు తండ్రి ద్వారా సకల శాస్త్రాలను, తల్లి ద్వారా క్షత్రియ గుణాలను పొందాడు.

రావణుడు శివ భక్తుడు రుద్ర వీణను వాయించడంలో సిద్దహస్తుడు, మహారుద్రుని కోసం ఘోర తపస్సు చేసి కడుపులో అమృత భాండాన్ని వరంగా పొందాడు.

దేవతలు,యక్షులు,కిన్నెరల, కింపురుషులు, ఎటువంటి జంతువుల వల్ల తన మరణం సంభవించకుండా వరం పొందాడు.తన వర బలంలో భూలోకాన్ని ఆక్రమించాడు. సవతి సోదరుడైన కుబేరుని లంకను,అతని సంపదను ఆక్రమించాడు.కుబేరుడు దేవతలను సాయం కోరగా రావణుడు దేవలోకాధిపతి ఇంద్రుడిని ఓడించి దేవలోకాన్ని హస్తగతం చేసుకున్నాడు.
పాతాళలోకాన్ని ఆక్రమించి సోదరుడు అహిరావణున్ని అధిపతిగా చేసాడు.

ఇలా ముల్లోకాలను జయించాడు.

పరమశివుని ప్రియభక్తుడి వల్ల జరిగిన ఈ దారుణాలను దేవతలు ఆయన వద్దే మొర పెట్టుకున్నారు.

శివునికి ఉపాసన చేసే రావణుడు కైలాస ద్వారపాలకుడు నందిని అవహేళన చేసాడు మూపురం చూపించి.

కోపోద్రిక్తుడైన నంది శపించాడు, �నన్ను కోతిలా ఉన్నావని గేలి చేసావు కాబట్టి నువ్వు వానరుని వలన సర్వనాశనం గావింపబడతావు � అని.

రావణుడు పరమశివునికి పది తలలు బలి ఇచ్చాడు.కానీ ఆ బలి వల్ల మహాకాళుడు లోని పదిరుద్రులు మాత్రమే సంతృప్తి చెందారు. పదకొండవ మహారుద్రుడు శాంతించలేదు.

మహావిష్ణువు మానవరూపం దాల్చే సమయం ఆసన్నమైంది.మహాశివుడు విష్ణు అవతారానికి సాయపడతానని చెప్పాడు.

కానీ మానవ శరీరం మాయలకు, మోహాలకు అవలీలగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే శివుడు వానరరూపం దాల్చడానికి పూనుకున్నాడు.

శాంతించని పదకొండవ మహారుద్రుడు భూమి మీద మహాప్రతాపంతో ఆవిర్భవించబోతున్నాడు.

సతీదేవి శివుని అడిగింది. � ఈ మహత్కార్యంలో తనను కూడా భాగం చేయమని � .ఎప్పుడూ తన వద్ద ఉండేలా అందమైన తోకలా ఉండమని వరం ఇచ్చాడు.

అలా రావణాసుర సంహారానికి హనుమంతుని ఆవిర్భావం జరిగింది.


నారదుడు ఇలా అన్నారు ," హనుమంతుడే మీ జనకుడు.లంకాదహనం చేసి సముద్రం పై ఎగురుతున్న హనుమంతుని స్వేదం ఒక చేప నోట్లో పడి నీవు ఆవిర్భవించావు .ఆ మత్స్యమే అహిరావణుడికి దొరికింది ."
మత్స్యవల్లభుడు భావావేశం తో ఉప్పొంగిపోయి నారదుడికి సాష్టాంగనమస్కారం చేసాడు .
అప్పుడు మత్స్యవల్లభుడు నారదుని తన తండ్రి వృత్తాంతం గురించి చెప్పమన్నాడు.
నారద మహర్షి మకరధ్వజునితో ఇలా అన్నారు. � మీ తండ్రి జననానికి చాలా ప్రక్రియ జరిగింది.�
� శివతేజస్సును గర్భంలో ధరించే పుణ్యం చేసుకున్న మహాసాధ్వి అంజనాదేవి.� ఆమె అప్సరస. గత జన్మలో ఆమె పేరు "పుంజికస్ధల". ఇంద్రుని ఒంటినిండా ఉన్న కన్నుల చూసి నవ్వింది ,అందుకు ఇంద్రుడు ఆమెను కురూపిగా మారమని శపించాడు.కానీ లావణ్యమైన అందం ఆమెకు కోరుకున్నప్పుడు పొందగలదు అని చెప్పాడు.
అంజనాదేవి శివుని పరమ భక్తురాలు ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమె పుత్రునిగా ఉండటానికి అంగీకరించాడు .
దశరధ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు, ఆ యాగ ఫలం పాయశాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు.
కైకేయికి ఇచ్చే సమయంలో దాన్ని గ్రద్ధ తన్నుకుపోయింది.కౌసల్య,సుమిత్ర తమ భాగాన్ని కైకేయి కు ఇచ్చారు. ఆ గ్రద్ధ ఆ పాయసాన్ని అంజనాదేవి ప్రార్ధన చేసే గుడి దగ్గర జారవిడిచింది.ఆ పాయసాన్ని వాయుదేవుడు అంజనాదేవి చేతిలో పడేలా చేసాడు.
వాయుదేవుని సహకారంలో పుట్టాడు కాబట్టి వాయునందనుడు అని పిలుస్తారు.
అప్పుడు మత్స్యవల్లభుడు ఇలా అన్నాడు. � నారదమహర్షి, మరి మా జనకుని పితృదేవుడు ఎవరు? "
అప్పుడు నారదుడు చెప్పాడు
"కేసరి హనుమ జనకుడు.రాజు అయిన కేసరికి చాలా కాలం పుత్రలాభం కలుగలేదు. దాంతో కేసరి ,అంజనాదేవి ఆకాశ గంగ తీరాన శివుని పరమ భక్తితో ఆరాధించేవారు.కేసరి గొప్ప పోరాట యోధుడు.సాంబసదమడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూ ఉంటే కేసరి అతణ్ణి మల్లయుద్దంలో మట్టికరిపించాడు.
.వానర రాజ్యం లంకాపురికి ఉత్తరంగా ఉండేది. వీరికి ఉత్తరంగా కిరాతార్జునుడు అనే మహారాజు ఉండేవారు. వానరులకు (కేసరి) ఆయన మిత్రుడు. ఉత్తర భారతం పై రావణుడు దండయాత్ర చేసి తిరిగి వస్తుండగా కిరాతార్జునుడు రాజ్యం పై దండేత్తాడు.వర గర్వంతో ఊగిపోతున్న రావణుడు కిరాతార్జునిపై విజయం అలవోకగా భావించాడు . కొలనులో కిరితార్జునుడు స్నానం చేస్తున్నాడు.రావణుడు అతని వద్దకు వెళ్లి లొంగిపొమ్మన్నాడు, ఓటమిని అంగీకరించని కిరాతర్జనుడు తన వెయ్యి చేతులలో సమానమైన కబంధ హస్తాలతో రావణుని ఉక్కిరి బిక్కిరి చేసాడు.విడిపించుకోలేక రావణుడు విలవిలలాడి ఓటమిని అంగీకరించాడు.కిరాతార్జునుడు,రావణుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అని రావణుడు బయట పడ్డాడు.అలాంటి హేమాహేమీలతో ఒక బలమైన వర్గంగా మధ్యభారతం వింధ్యకు దక్షిణంగా పెట్టనికోటగా మిగిలింది..
Like Reply
#4
మత్యవల్లభుడు నారద మహర్షి తో "నన్ను బాల్యంలో ఎవరు పెంచారో తెలియదు నేను ఆలనాపాలనకు నోచుకోలేదు .కానీ మా మహారాజు అహిరావణూడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాత్స్యల్యంతో చూచేవారు బాల్యంలో ప్రేమను రుచి చూసింది ఆయన వల్లే ,కానీ మిగిలిన పిల్లలు గేలి వల్ల చాలా భాధపడేవాడిని. తల్లి తండ్రులు ఎవరో తెలిసేది కాదు మహర్షి మీ పుణ్యం వల్ల నేను నా మాత పితలను తెలుసుకోగలిగాను. జన్మధన్య మైనది .నాతండ్రి గారి గురించి ఇంకా చెప్పండి అన్నాడు.
నారదుడు ఇలా చెప్పారు "యువరాజు హోదాలో అన్నీ రాచమర్యాదలు జరిగేవి అంజనీపుత్రునికి.. ఆంజనేయుడు ఉరుకులు ,పరుగులు తో పాకుతూ ఉంటే అందరికీ ఆనంద౦గా ఉండేది . మిగిలిన వానరులకు చాలా తేజస్సుతో ఉండేవారు .వానర వాలం చాలా ముద్దుగా ఉండేది.అందంగా ఉండేది."


మత్య్సవల్లభుడు నారదునితో "మీరు అంజనీపుత్రుడు అంటారు .కానీ అందరూ హనుమంతుడు అంటారు" అని సందేహం వెల్లబుచ్చాడు. "బాలా , అంజనీపుత్రుడు ఒక రోజు ఆరుబయటపాకుతూ ఉండగా ఎర్రని పండు చూసి దాని అందుకోబోయాడు పవన వరప్రసాది అయిన ఆంజనేయుడు. ఒక్క ఉదుటున సూర్యుని వైపు వెళ్ళసాగాడు. శివ ప్రకాశంతో వెలుగొందుతున్న ఆంజనేయుని చూసి పరమేశ్వరా ప్రణామములు అంటూ సూర్యుడు చేతులు జోడించి నమస్కరించాడు .
అప్పుడు రాహువు సూర్యుని మింగబోతే తన పరాక్రమంతో ఆంజనేయుడు రాహువును తరిమి కొట్టాడు. రాహువు ఇంద్రునితో మొరపెట్టుకున్నాడు.ఇంద్రుడు తన మాట ఎక్కడ పోతుందో అని యుద్దానికి వచ్చారు .ఆంజనేయునిపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.వజ్రాయుధం ఆంజనేయుని దవడ ఎముకకు తగిలింది. దాంతో సృహ కోల్పోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుని చూసి అంజనీదేవి స్తంభించిపోయింది.వాయుదేవుడు హూతశుడయ్యి గాలిని నిర్భంధించాడు.సకల జీవరాశులు అష్టకష్టాలు పడ్డాయి ".అప్పుడు ముక్కోటి దేవతలు ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు సృహతప్పిన బాలుని మరల జీవితున్ని చేశారు.
దవడ ముందుకు రావడం వల్ల హనుమంతుడు అని పేరు పెట్టారు.(హను అంటే దవడ)
ఇంద్రుడు వజ్రకాయం ప్రసాదించారు
సూర్యుడు సూర్యతేజస్సు,
యముడు తన పాశం నుండి రక్షణ ను,
విశ్వకర్మ తను తయారు చేసిన ఆయుధాల నుండి రక్షణను, పొందగలవు అని వరం ఇచ్చారు.బ్రహ్మ బ్రహ్మాస్త్రం నుండి రక్షణను,
వాయువు భూత పిశాచ గణాల నుండి రక్షణను ప్రసాదించారు.
అప్పుడు వాయుదేవుడు శాంతించాడు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, సూర్యచంద్రులు తన ఆధీనంలో ఉండాలనుకున్న రావణుడు సూర్యుని వైపు వెళుతున్న హనుమ తోకను పట్టుకున్నాడు.
రావణ సంహరానికై పుట్టిన పదకొండో రుద్రుడు వెంటనే తోకతో రావణాసురుని చుట్టుముట్టాడు.విడిపించుకోలేక పోయిన రావణుడు ఉక్కిరిబిక్కిరి అవుతుండుగా వివశ్రుడు(రావణ తండ్రి) ఆంజనేయున్ని వేడుకున్నాడు విడిచిపెట్టమని.
సర్వశక్తి సంపన్నుడైన హనుమంతునికి అల్లరి మహా మెండు .ఆశ్రమలలో మునులను,వారి పిలకలను,గెడ్డాలను,అంగవస్త్రాలను,పీకి ఆనందించేవాడు .వానర మూకతో కలసి మునుల పవిత్ర జలాలను లాక్కునేవాడు.ఏనుగులను,సింహాలను గాలిలో గిరాటు వేసేవాడు .
ఇదంతా చూసిన ఒక మహాఋషి కోపంతో �నీ శక్తులన్నీ నీవు మర్చిపోవుగాక �అని ఆవేశంగా శపించి కొంతసేపటికి తేరుకొని బ్రహ్మజ్జ్ఞాని,శివస్వరూపుడు అయిన ఆంజనేయుని చూసి"నాయనా ఎవరైనా ,నీకు గుర్తు చేస్తే నీ శక్తులు నీకు తెలియుగాక" అని వరం ఇచ్చారు.
నారదుడు మత్యవల్లభుడితో ,"బాలక చూశావా గంభీర స్వరూపుడైన నీవు ఎప్పుడైనా ఇలాంటి అల్లరి చేష్టలు చేసేవాడివా".
"లేదు మహాముని నన్ను ఎవరైనా గేలి చేస్తే నేను వారిని గాలిలో ఎగరవేసేవాడిని ,మేము ఆడుకున్నప్పుడు ఏదైనా పాతాళ మృగం మమ్మల్ని దాడి చేస్తే స్నేహితులను కాపాడడానికి నేను దాని మట్టికరిపించేవాడిని .మిగిలిన అందరూ మాంసాహారము తినేవారు.నాకు పండ్లు తప్ప ఏమి రుచించేవికావు.తర్బూజ కాయలు,పుచ్చకాయలు,నా ఇష్టమైన ఆహారం. నా పితృసమానుడైన అహిరావణుడు నా ధైర్య సాహసాలకు మెచ్చి ద్వార నగర రక్షకునిగా నియమించారు."అని చెప్పాడు మత్యవల్లభుడు.

"స్వామి ,నారద మహర్షి మా జనకుల బాలరిష్టాలను చక్కగా వివరించారు ఇందాక మా పితృవర్యులను ఉదహరించి బ్రహ్మజ్జ్ఞాని అని అన్నారు
అదేమిటో చెప్పగలరు" అని మత్యవల్లభుడు అన్నాడు.
"స్వామి ,నారద మహర్షి మా జనకుల బాలరిష్టాలను చక్కగా వివరించారు ఇందాక మా పితృవర్యులను ఉదహరించి బ్రహ్మజ్జ్ఞాని అని అన్నారు
అదేమిటో చెప్పగలరు" అని మత్యవల్లభుడు అన్నాడు.
నారదుడు ఇలా అన్నారు "అoజన దేవి శాపగ్రస్తుడైన తన బిడ్డను చూసి ఎవరైనా మంచి గురువు వద్ద విద్యా బుద్దులు నేర్పించాలి అనుకున్నది.
ఆఖరికి జ్జ్ఞానభాండాగరం అయిన సూర్యభగవానుని వద్దకు పంపిద్దామని కేసరి,అంజన నిర్ణయం తీసుకున్నారు.
వానరునితో సహవాసానికి సూర్యుని వద్ద ఉన్న సప్తర్షి మండలం ఒప్పుకోలేదు ".అప్పుడు సూర్యభగవానుడు హనుమతో ఇలా అన్నారు "వానరోత్తమా! నేను నీకు విద్యను ఉపదేశించడానికి సముఖమే కానీ నేను విశ్వంలో చుట్టూ తిరుగుతూ ఉండాలి ఒక చోట స్థిరంగా ఉండను" అన్నారు.
అప్పుడు సూర్యుని అభిముఖంగా సూర్యునివేగంతో వెనక్కి తిరుగుతూ అంజనీపుత్రుడు విద్యను అభ్యసించారు.
కొద్ది రోజులలో సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ఆంజనేయుని చూసి ముచ్చట పడిపోయాడు .సూర్యభగవానుడు ఇంకొంత కాలంలో శివుని అంశతో గడపాలని చెప్పి నిన్నటి పాఠాన్ని గుర్తు చేసేవాడు కాదు సూర్యుడు అంజనిసుతుడు శాప ప్రభావం వల్ల గుర్తు చేసుకునేవాడు కాదు
ఇలా కొన్ని నెలల తర్వాత విద్యాభ్యాసం ముగిసింది అని అంజనా దేవి వద్దకు పంపి౦చ ఏర్పాట్లు చేసాడు సూర్యభగవానుడు.
అప్పుడు హనుమ సూర్యునికి నమస్కరించి గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు." నాకు ఏమి వద్దు కానీ నా పుత్రుడు సుగ్రీవునికి నీవు సహాయం చేయాలి.అతడు దీనావస్థలో ఉన్నాడు. అతనికి మంత్రిగా ఉండి నీవు మార్గోపదేశం చెయ్యాలి" అన్నాడు .

మకరధ్వజుడికి కబురు వచ్చింది అహిరావణుడు ఇద్దరు బందీలను కాళీకాలయంలో ఉంచారని,వారు తప్పి౦చుకోకుండా చూడాలని దాని సారాంశం .
వారు ఇద్దరూ ముని కుమారులుగా అగుపించారు.వారిని చూస్తూ వీరెవరని ప్రశ్నించాడు మకరధ్వజుడు . "వీరు అయోధ్య నగర కుమారులు రాముడు,లక్ష్మణుడు �.వారి ముఖారవిందములు చూడగానే మకరధ్వజునికి ప్రశాంతత,దైవత్వం ఉట్టిపడుతూ అగుపించాయి.
నాయనా బాలకా! ఈ రామచంద్రుడు సూర్యవంశ కోవిదుడు.సకలగుణాభిరాముడు అంతకు మించి హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి."ఆ మాట వినగానే మకరధ్వజుడు రామునికి నమస్కరించాడు.
రామచంద్రప్రభువు నారదుని అడిగారు �నారద ఈ బాలకుడు అచ్చం మన హనుమలాగా ఉన్నాడు ,ఎవరితడు."
అప్పుడు మకరద్వజుని జన్మవృత్తాంతం రామునికి వివరించారు దేవర్షి.


రాముని గురించి మకరధ్వజుడు గొప్పగా విన్నాడు .మకరధ్వజుడు తన తండ్రి గురించి రాముని నుంచే వినాలని ఇలా అడిగాడు .
�రామచంద్రప్రభు !మీకు మా తండ్రి గారికి సాంగత్యం ఎలా ఏర్పడింది మా తండ్రి గారి ప్రాణం మీరు ,ఇంత అవినాభావ సంబంధానికి పునాది ఎలా ఏర్పడిందో చెప్పండి", అన్నాడు.
అప్పుడు రాములవారు "నాయనా ,నా చిన్నతనంలో ఒక సాధువు జటఝాటదారి(సాక్షాత్ శివభగవానుడు ) వచ్చి రాజప్రాంగణంలో ఒక గారడీ ప్రదర్శన ఇచ్చారు. ఆయన ఆడించిన ఆటను చూసి మేము సమ్మోహనముతో ఆనందభరితులయ్యాము.
అతని వద్ద ఉన్న బాలుని విన్యాసాలు ఇంకా ఆకట్టుకున్నాయి.
నేను మారాం చేసి వాళ్ళిద్దరినీ ఇక్కడే ఉండిపోమన్నాను, కైకేయి మాతతో చెప్పి కానీ ఆ సాధువు ఒప్పుకోలేదు నేను మారాం చేయడంతో తన వద్ద ఉన్న బాలుడిని మాకు ఇచ్చి వెళ్ళిపోయారు.
బాలుడు తన పేరు హనుమ అని, తనది దక్షిణ దేశం అని చెప్పాడు. మూతి ఎర్రగా ఉండేది. మిగిలిన బాలురు తనను గేలి చేసేవారు. నాకు మాత్రం తాను అంటే మహా స్నేహంగా ఉండేది.
హనుమ రోజూ చిక్కుకున్న గాలిపటాలను విడదీసేవాడు, మా బంతి ఎంత దూరం వెళ్ళినా ఒక్క ఉదుటున గెంతుకుంటూ వెళ్ళి తెచ్చేవాడు. కోట గోదాల్ని అవలీలగా ఎక్కేవాడు. మంచి మంచి మామిడికాయలు, జామకాయలు, కోసుకొచ్చేవాడు.నాకు అలసట వస్తే భుజం మీద ఎక్కించుకొనేవాడు.
మా స్నేహం కాలంతో రెట్టింపయ్యింది. నా ఆంతరంగిక మందిరంలో నా పాన్పుపై శయనించేవాడు హనుమ.
అలా మాతో పెరిగేవాడు హనుమ, ఒక రోజు నేను ఎగురవేసిన గాలిపటం కిందకు రావటంలేదు. అప్పుడు హనుమ గాలిపటం కోసం ఆకాశంలోకి ఎగిరాడు.
ఇంద్రుని మేనకోడలు జయంతి విమానంలో వెళుతూ దాన్ని పట్టుకుంది. ఇంతలో హనుమ వచ్చి ఆమెను గాలిపటం ఇమ్మన్నాడు. ఆమె �ఇంతెత్తు గాలిపటం ఎగురవేసిన యోధుని నేను చూడాలి� అంటే ఆమెను తీసుకు వచ్చి రామచంద్ర ప్రభువుని చూపించాడు హనుమ. ఆమె ఆనందభరితురాలై నేను ఇంద్రలోకం వేగిరంగా వెళ్లాలి, మళ్ళీ మనం ఎప్పుడు కలవగలం అన్నప్పుడు ,రాములవారు అరణ్యవాసంలో కలుద్దాం అని మాటిచ్చారు.
వాయువేగంతో గాలిపటం తీసుకువచ్చాడు కాబట్టి �మారుతి� అని పేరు పెట్టాము.
మేము యుక్తవయస్కులం అయ్యాక హనుమ తాను గురుదక్షిణగా సూర్యునికి ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుని వద్ద రాజ్యపరిపాలనలో సాయం చేయాలని మా వద్ద నుంచి కిష్కిందకు వెళ్లిపోయాడు."
Like Reply
#5
ఇంతలో మకరధ్వజుడు ప్రమాద ఘంటికలు విని రాముని వద్ద శెలవు తీసుకుని ద్వారం వద్దకు వెళ్లారు. తనతో నారదుడు కూడా వెళ్లారు.

మకరధ్వజునికి వర్తమానం అందినది.

"ద్వారపాలకా మనకు కాపలాగా ఉన్న మహా సర్పాలు చంపబడ్డాయి. వెంటనే జాగరూకులు కండి "అన్నారు వేగులు.

తన సైన్యాన్ని అప్రమత్తం చేశాడు మకరధ్వజుడు ,నారదుని నుండి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఒక మహాకాయుడు, మహాకాలుని వలె సైన్యాన్ని మట్టికరిపించసాగాడు.

ఇక తాను రంగంలోకి దిగాలని మకరధ్వజుడు మహాకాయుని వద్దకు వెళ్ళాడు.

అప్పుడు మహాబలసంపన్నుడు అయిన ఆవీరుడు, "బాలకా ఎవరు నీవు, అచ్చ౦ నాలాగే ఉన్నావు "అని ప్రశ్నించగా?

అప్పుడు నారద మహర్షి కలుగ చేసుకుని "హనుమా! ఇతను నీ పుత్రుడు మకరధ్వజుడు అని చెప్పగా

" దేవర్షీ అదెలా సాధ్యం నేను అస్ఖలిత బ్రహ్మచారిని నాకు పుత్రుడు ఎలా కలిగాడు " అని అనగా

అప్పుడు నారద మహర్షి మకరధ్వజుని జన్మ వృత్తాంతం చెప్పారు.

"బాలకా! నేను నా ప్రాణప్రదమైన రామలక్ష్మణులని విడిపించడానికి వచ్చాను. ధర్మనిరతులైన వారిని విడిపించడానికి సహాయం చెయ్యి, రావణునితో యుద్ధానికి అంతిమ ఘడియలు చేరువయ్యాయి. లోక కళ్యాణనికి నీవంతు సాయ౦ చెయ్యి "అని అన్నారు హనుమ తన కుమారునితో.

అప్పుడు మకధ్వజుడు "తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియనప్పుడు నా ప్రభువు అహిరావణుడు నన్ను ముక్కిలి వాత్సల్యంతో చూశారు.పితృవర్యా! నేను నా స్వామిభక్తిని నిరూపించుకునే సమయం ఇది. కావున మీకు సాయం చేయలేను ",అని ధర్మయుద్ధం మాటలతో మొదలుపెట్టాడు.

"పుత్రా! నీ పేరేమి?" అడిగారు హనుమ.

నాపేరు మత్స్యవల్లభుడు అని సమాధానమిచ్చాడు .

"నీ వివేచనా జ్ఞానానికి నేను మిక్కిలి సంతసించుచున్నాను. నీ స్వామిభక్తి నా స్వామిభక్తితో సమానమయినది.

మనం మన యొక్క స్వధర్మాలను నిర్వర్తిద్దాం " అన్నారు హనుమ.

ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది.

ఎంతసేపటికీ హనుమ మకరధ్వజుని మట్టికరిపించలేకపోతారు.

అప్పుడు తన దివ్యజ్ఞానంతో చూస్తే ఐదు దిక్కులలో ఉన్న ఐదు స్తంభాల మీద ఉన్న జ్యోతి కాంతులు మకరధ్వజుని పై పడుతూ ఉంటాయి.

అప్పుడు హనుమ దీపాలపై గాలి ఊదుతారు. అవి అన్నీ ఒకసారి ఆరలేదు .

ఆగ్రహించిన హనుమంతుడు, బ్రహ్మదేవుని వరాన్ని ఉపయోగించుకుని పంచముఖి ఆంజనేయుడిగా అవతరిస్తారు.

పంచముఖాల నుండి ఒక్కసారిగా ఆ ద్వీప కాంతులని ఆర్పడంతో మకరధ్వజుని తేజస్సు సన్నగిల్లింది . వెంటనే హనుమంతుడు మకరధ్వజుని తన తోకతోనే బంధించి కాళీ ఆలయంలోనికి వెళతాడు హనుమ.

కాషాయ వస్త్రదారులైన రామలక్ష్మణులను కాళికాదేవికి బలివ్వడానికి సిద్ధం చేస్తున్నాడు అహిరావణుడు.

హనుమ కాళికాదేవి విగ్రహాన్ని ప్రక్కకు నెట్టి తానే కాళికగా కత్తితో విగ్రహంలా నిల్చున్నారు.

అప్పుడు దేవికి అహిరావణుడు పంచభక్ష్యపరమాన్నాలతో నైవేద్యం పెట్టాడు . అప్పుడు హనుమ ఆ నైవేద్యాన్నంతా ఒక్క ఉదుటన ఆరగించేశారు.

"దేవి కరుణించింది, ఆమె దీవెన మనకే, చిరుతిండికే ఇంత సంతసమైతే, రామలక్ష్మణులను బలి ఇచ్చిన తరువాత ఎన్ని కోర్కెలు తీరుస్తుందో తల్లి?" అంటూ ముందుకు సాగాడు అహిరావణుడు.

లక్ష్మణుడు రామునితో ,"అగ్రజా! మన హనుమ ఎక్కడ? "అన్నారు.

అప్పుడు రామచంద్రప్రభువు ,"ఇవాళ హనుమ నాకు దేవుని లాగ కనిపిస్తున్నాడు" అన్నారు సౌమ్యంగా.

అహిరావణుడు బలిపీఠం మీద రాముని శిరస్సు వంచి ఉంచమని ఆజ్ఞాపించాడు అప్పుడు రామచంద్రప్రభువు �నేను అయోధ్య చక్రవర్తి ముద్దుల రాకుమారుడను, నాకు తల వంచడం తెలియదు. నీవు ఒకసారి చూపినచో నేను చేస్తాను "అన్నారు. నవ్వుతూ తలవంచి చూపించాడు అహిరావణుడు.

వెంటనే హనుమంతుడు ఒక్క ఉదుటన కత్తితో అహిరావణుని శిరస్సును ఖండించాడు.

ఇక ఆలస్యం చేయకూడదని రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకుని యుద్ధ శిబిరానికి వెళ్ళసాగారు హనుమ.

వెళుతూ బందీగా ఉన్న మకరధ్వజుని చూపించి �రామా! ఇతను నా పుత్రుడు�. అని చూపించాడు. దానికి రాముడు, హనుమా !" నీకు తగిన పుత్రుడు, ముందే నేను కలిసాను. తన తండ్రి గురించి చెప్పమని నన్ను అడిగాడు నీ పుత్రిడికి మన బాల్య విశేషాలు అన్నీ చెప్పాను.

ఇప్పుడు నువ్వు ఇతన్ని ఈ పాతాళలోకానికి రాజుని చెయ్యి, మనకి యుద్ధంలో ఇద్దరు హనుమలు రాముని సేనతో పోరాడతారు."

వెంటనే హనుమ తన పుత్రుని పట్టాభిషేకం చేసి యుద్ధభూమికి ఎగిరి వెళ్ళిపోయారు.

ఏకాకి అయిన అహిరావణుని అంత్యక్రియలు మాత్య్సవల్లభుడు జరిపించారు.

బ్రహ్మాస్త్రం రావణుని వద్ద ఉంది. దాన్ని ఇద్దరు హనుమ, మకరధ్వజుడు వెళ్ళి మండోదరి వద్ద బ్రాహ్మణులులా నటించి, విభీషణుడు దాన్ని దొంగిలించడానికి కుట్ర పన్నారని చెప్పి, దాన్ని వేరే చోట చేర్చమని మండోదరికి చెప్పి, దాన్ని మారుస్తూ ఉండగా తీసుకుని మాయమై పోయారు.

యుద్ధం ముగిసింది. రావణవధ జరిగింది.
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#6
కానీ రాముని కధ మత్స్యవల్లభుడికి పూర్తిగా అర్ధం అవ్వలేదు. తన తండ్రిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. తన తండ్రి వద్దకు అయోధ్య వెళ్ళాడు మకరధ్వజుడు. సీతారామపట్టాభిషేకం చూసి ఆనందభరితుడయ్యాడు. కొని సంవత్సరాల తర్వాత అయోధ్య వెళ్లారు మళ్ళీ. అక్కడ రామచంద్రుడు ఒక్కరే ఉన్నారు. సీతాదేవి అడవులలో విడవబడినది అని తెలిసి చింతించారు. అక్కడ నుండి పవన తనయుడి కోసం వెతికాడు.
తండ్రి చింతతో ఎక్కడో పర్వతం మీద ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్ళి కలిసారు. పుత్రుని చూసి ఉప్పొంగిన హనుమ, పాలన వాటి గూర్చిన ధర్మసందేహాలను తీర్చి తనకు ఉన్న విద్యను, సూర్యభగవానుని సాక్షిగా తన కుమారునికి ఇచ్చారు.
మకరధ్వజుని దివ్యజ్ఞాన సంపన్నునిగా తీర్చిదిద్దారు హనుమ.
కానీ సీతాదేవి వనాలకెళ్లారనే చింత ఎప్పూడు హనుమ మదిని తొలిచివేసేది.
అప్పుడు రామాయణాన్ని సంస్కృతంలో తన గోళ్ళతో గాజు పలకలపై రాశారు హనుమ. దాన్ని చూస్తూ ఆనందంగా ఉండేవారు మకరధ్వజుడు. ఇద్దరు కొన్ని ధర్మ విషయాలపై తర్కించేవారు. రాసిన వాటిని కొండలోని గుహలో భద్రపరిచేవారు హనుమ.
ఇంతలో వాల్మీకి రామాయణం లవకుశుల ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. ఒకసారి ఆ కొండ వద్దకు వాల్మీకి మహర్షి వచ్చి "హనుమపుత్రా, నాన్నగారిని కలవాలి "అని అడిగాడు.
ఇద్దరూ హనుమంతుల వారి వద్దకు వెళ్ళారు. అప్పుడు వాల్మీకి, స్వామీ మీరు రచించిన రామాయాణాన్ని ఒకసారి చూడాలని మనసు కుతూహలంగా ఉంది అన్నారు. మకరధ్వజుడు ఆ రాతి పలకలను వాల్మీకికి చూపించాడు .
సూర్యభగవానుని ప్రియశిష్యుడు, జ్ఞానభాండాగారం అయిన హనుమంతుల వారి పాండిత్యం వాల్మీకిని విస్మయపరిచింది. తన రామాయణం సాదాసీదాగా అనిపించింది. వెంటనే వాల్మీకి "స్వామి నా జీవితం మొత్తం వెచ్చించి రామాయణం రచించాను కానీ మీ రామాయణంలో రెండు పద్యాలు చదివాను నా జన్మ తరించిపోయింది. దీని ముందు నా రామాయణ రచన వృధా, దీన్ని ఇక్కడే ఉంచుతాను. మీ రామాయణం ప్రజలలోకి వెళ్ళాలి ఎందుకంటే అందులో ప్రాణం ఉంది "అన్నాడు.
హనుమ మకరధ్వజునితో "వాల్మీకి మహర్షి తన సర్వస్వాన్ని ధారపోసిన ఈ కావ్యం రాశాను. నేను మామూలుగానీ ఈ కావ్య౦ రాశాను, నా రామాయణం ఉన్నా లేకపోయినా నేను సీతమ్మ వరం వల్ల రామభక్తులను కాపాడుతూ చిరంజీవిగా ఉంటాను , కాబట్టి వాల్మీకి రామాయణం ప్రజలలోకి వెళితే అతని జీవితానికి సార్ధకత వస్తుంది "అన్నారు ప్రశాంతంగా .వాల్మీకి వద్దన్నా వినకుండా హనుమ ఆ రామాయణ ఫలకాలను సముద్రునికి రాముని పేరుతో అంకితం చేశారు.
అప్పుడు వాల్మీకి "దేవా, మీరు కారణజన్ములు, నేను మళ్ళీ పుట్టి మీ రామాయణాన్ని వెలికితీసి అందరికీ ఆ మధురరసం రుచి చూపిస్తాను "అని వీడ్కోలు తీసుకున్నారు.
తన నాయనమ్మను, తాతయ్యను తన తండ్రి పుట్టిన గడ్డను చూడడానికి మకరధ్వజుడు కిష్కింధకు వెళ్ళాడు.
అక్కడనుండి పాతాళలోకం వెళ్ళి తన రాజ్యాన్ని, ప్రజలను వృద్ధి చేసి తండ్రికి తగ్గ తనయునిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇది మత్స్యవల్లభుని కధ.
Like Reply
#7
మత్స్యవల్లభుడు తన తండ్రి హనుమంతుడు గురించి ఇలా చెప్పాడు.
నా జీవితం లో మర్చిపోలేని సంఘటన ఒకటి మీకు చెబుతాను .సీతమ్మ వారిని భూదేవి తనలో తీసుకుపోయింది.రాములవారు ఆపడానికి ప్రయత్నించారు .సమయం చేదాటిపోయింది .సీతమ్మ తల్లి కురులనుండి వట్టివేర్లు మొలిచాయి .ఆమె జుట్టు నిమిరినట్టు ఆ వేళ్ళను రాములవారు శోకం తో నిమురుతున్నాడు. ప్రజలు విధి తమతో ఆడిన వింత నాటకం చూస్తూవున్నారు. ప్రజలు అంత పెద్దరాముడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు .రామునికి ఓదార్పు ఎలా అడగాలో తెలియలేదు. బాధాతప్త హృదయం తో తన పరిస్థితి కి ఎవ్వరిని నిందించక కుశ లవులకు రాజ్య విషయాలు అప్పగించి ఒంటరిగా తన మందిరం లో కూర్చున్నాడు.

మా తండ్రి నేను యమ ధర్మరాజు ఆ గదివద్ద దాగి ఉండడం చూసాము .మా తండ్రి హనుమంతుడు ఎలాగైనా యముడిని ఆపాలని బయలుదేరారు. ఇంతలో లక్ష్మణుడుని యముడు కలసి మీద చెయ్యి వేసి మా వైపు నవ్వుతూ రామమందిరం వైపు వెళ్లారు. మేము వెంబడించాము .రాముని యమధర్మరాజు నమస్కరించి మీతో ఏకాంతం గా సృష్టి రహస్యం గురించి మాట్లాడాలి .ఎట్టి పరిస్థితిలోను ఏకాంతానికి విఘాతం కలుగకూడదు,అది ప్రళయకారకం అన్నారు. అప్పుడు రాముల వారు లక్ష్మణుని ఎవ్వరైనా తమ సమావేశానికి ఆటంకం కలిగిస్తే వారికీ మరణ దండన అని ఆజ్ఞాపించారు.

చేసేది లేక మేము కాపలా కు కూర్చున్నాము .

శ్రీరాముడు మా తండ్రి ని పిలిచి భూదేవి ప్రతాపం వల్ల వచ్చిన నెరలు చూపించి ,వాటిలో తన అంగుళీకము పడిందని తీసుకు రమ్మని చెప్పారు, నేను తీసుకువస్తానని చెప్పినా వినకుండా అది సీతాదేవి ఉంగరం అవ్వటం వాళ్ళ మా తండ్రి సర్పరూపం ధరించి ఆ అంగుళీకము తీసుకురావడానికి వెళ్లారు. నేను వెంబడించాను.

ఇంతలో ఒక ఘోరం జరిగి పోయింది.

దుర్వాస మహర్షి రాముని వృత్తాంతం తెలుసుకొని కలవడానికి వచ్చారు. లక్ష్మణుడు రాముని కలవడానికి కుదరదని నచ్చచెప్పారు.దుర్వాసుడు కోపం తో ఊగుతూ అయోధ్య నగరం ఎడారి గా మారి శ్మశానం అవుతుందని శపించబోగా ఆయన్ని లక్ష్మణుడు ఆపి రాములవారికి విషయం చెప్పడానికి వెళ్ళాడు. యముడు రామునితో అవతారపరిసమాప్తి గురించి చెబుతున్నారు. అప్పుడు వారికి లక్ష్మణుని వల్ల ఆటంకం కలిగింది. విషయం రాముల వారికి చెప్పి లక్ష్మణుడు వెళ్లిపోయారు.



యముని, రాముని సమావేశానికి అడ్డు వచ్చిన వారికి మరణదండన అని రాజాజ్ఞ కాబట్టి అరణ్యం మధ్యకు వెళ్లి తనకు తాను శిరచ్చేదనం గావించుకున్నాడు లక్ష్మణుడు. అలా అనంతనాగుడు అనంతవిశ్వము లో కలిసిపోయాడు.

మేము రాముని అంగుళీకము గురించి వెతుకుతూ పాతాళ లోకం లోకి వెళ్ళాము .అక్కడ ఎన్నో భయంకర సర్పాలు మమ్మల్ని చుట్టుముట్టి నాగలోకానికి తీసుకు పోయాయి.అక్కడ నాగరాజు వాసుకి మా తండ్రిని చూసి నమస్కరించి అయ్యా దేని కొరకు మా రాజ్యానికి వచ్చారు అని అడిగారు. అప్పుడు మా తండ్రి తన రామాయణం అంతా చెప్పి జరగబోయే విషయాలు కూడా ఆయనకు తెలియకుండానే చెప్పసాగారు.తనుచెప్పే కధ విషాదాంతం అవ్వడం చూసి తేరుకుని బాధతో నేను రాముని సీత గురించి చెప్పను,ఇప్పుడు సీతారాముని అంగుళీకము గురించి చెప్పండి.

అప్పుడు వాసుకి నవ్వుతూ ఎందుకు రామునిసీత,సీతారాముడు అని కలిపి మాట్లాడుతున్నారు అని అడిగారు .

అప్పుడు మా తండ్రి ఎవరు ఎలాగ వారిని విడదీయాలని చూసినా గాని, నా నాలుక మాత్రం వారిని విడదీయ లేవు అని అన్నారు .

అప్పుడు వాసుకి ఇలా అన్నారు " నీవు సీతారాములను కలసిఉండాలనుకుంటున్నావు .మరిప్పుడు వారిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తున్న యముడిని ఎందుకు శాయశక్తులా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నావు" అన్నారు.

వాసుకి తో ఏకీభవించలేక మా తండ్రి వాసుకి ని ఆ అంగుళీకము ఎక్కడ ఉన్నదో చెప్పమని ప్రాధేయపడడ్డారు.

అప్పుడు వాసుకి ఒక పర్వతం చూపించారు .ఆ పర్వతం ఎక్కడానికి సుడులు తిరుగుతూ వెళ్లారు మా తండ్రి .పర్వతం చుట్టూ వలయాలు ఉన్నాయి .పర్వతం అంతం ఆకాశం లోకి ,ఆది సముద్రం లోకి ఉన్నాయి. ఆద్యంతాలు కనుక్కోలేక అలసిసొలసి మా తండ్రి వాసుకి వద్దకు వచ్చి వలయాలు గురించి చెప్పామన్నారు.

అప్పుడు వాసుకి మా తండ్రి తో ఇప్పుడున్న సీత మొదటి సీత కాదు ,రాముడు మొదటి రాముడు కాదు .యుగయుగాలకు హరి దివినుండి భువి కి, లక్ష్మీదేవి భువినుండి వెళుతూఉంటారు ,ఆ వలయాలు దానికి తార్కాణం.అదే కాలచక్రం అన్నారు.

అప్పుడు ఆ పర్వతం మెల్లగా మనుష్య రూపం సంతరించుకుంది. ఆయన ఎవరో కాదు. ధ్యానముద్ర లో ఉన్న పరమశివుడు.

పరమశివుని ఆయన అంశ అయిన మా తండ్రి తెలుసుకున్నారు. ఈవిధంగా మా తండ్రికి ఆత్మ సాక్షాత్కారం అయ్యింది.

అప్పుడు మా తండ్రికి వాసుకి ఒకే రకం గా ఉన్న అంగుళీకాలు చూపించి పరమశివుని మెడచుట్టూ చుట్టుకున్నారు.

ఇది అర్ధమయ్యి వచ్చే సరికి శ్రీరాముడు సరయూనది లో ఐక్యం అయ్యారు.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)