16-12-2018, 08:01 PM
సంవత్సరం పాటు స్మార్ట్ ఫోను వాడకుంటే బహుమతి !!
AndhraJyothy Dt: 2018 Dec 16 Wrote:న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా స్మార్ట్ఫోనే.
జీవితంలో ఓ భాగంగా మారిన స్మార్ట్ఫోన్ ఇప్పుడు 24X7 అయిపోయింది. చేతిలో ఫోన్ లేకుండా కనిపించేవారు ఇప్పుడు అరుదైపోయారు.
నిద్రపోతున్నా, తింటున్నా, నడుస్తున్నా, బైక్పై ఉన్నా, బస్సులో ఉన్నా, చివరికి వాష్రూములోనూ దానిని వాడుతున్నారు. స్మార్ట్ఫోన్కు
యువత ఇప్పుడు అంతగా బానిస అయిపోయింది. చార్జింగ్ అయిపోయి నిమిషం పాటు ఫోన్ స్విచ్ఛాప్ అయితే ఆక్సిజన్ అందని రోగిలా
విలవిల్లాడిపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఏడాది పాటు స్మార్ట్ఫోన్ ముఖం చూడకుండా ఉండగలరా? ఉండే ధైర్యం ఉంటే
మాత్రం ఏకంగా రూ.72 లక్షలు సొంతం చేసుకునే అద్భుత అవకాశం మీ తలుపు తడుతోంది.
కోకోకోలాకు చెందిన విటమిన్ వాటర్ అనే కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. ‘స్క్రోల్ ఫ్రీ ఫర్ ఎ ఇయర్’ పేరుతో ఈ అమెరికన్ కంపెనీ ఓ పోటీ
నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేవారు ఏడాదిపాటు స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి విటమిన్ వాటర్ సంస్థకు
చెందిన అధికారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్ లేకుండా సమయాన్ని ఏడాది సమయాన్ని ఎలా
గడపుతామనే విషయాన్ని హ్యాష్ట్యాగ్ #NoPhoneforaYear, #contest ఉపయోగించి పంపాల్సి ఉంటుంది. పోటీదారుడు ఇచ్చే సమధానంపై
సంతృప్తి చెందితే అతడిని ఎంపిక చేస్తారు. అనంతరం కాంట్రాక్ట్ పత్రాలపై సంతకం చేయించుకుంటారు.
పోటీదారులు కేవలం స్మార్ట్ఫోన్కు మాత్రమే దూరంగా ఉంటే సరిపోతోంది. ల్యాప్టాప్లు, కంప్యూటర్లను వాడుకునే వెసులుబాటు ఉంది.
అలాగే, వాయిస్ యాక్టివేటెడ్ డివైజ్లు అయిన గూగుల్ హోం, అమెజాన్ ఎకో వంటి వాటినీ వాడుకోవచ్చు. స్మార్ట్ఫోన్ కానీ, ట్యాబ్లెట్స్
మాత్రం నిషిద్ధం. అది మీదైనా, మరెవరిదైనా.
పోటీలో పాల్గొన్న వారు మొత్తం చివరి వరకు పోటీలో ఉండాలనేం లేదు. కనీసం ఆరు నెలలు స్మార్ట్ఫోన్కు దూరంగా ఉన్నా రూ.7 లక్షలు
ఇవ్వనున్నట్టు విటమిన్ వాటర్ సంస్థ పేర్కొంది. అయితే, ఇంట్లోవాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు మాత్రం 1996 నాటి ఫీచర్ ఫోన్ను
ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఇందులో ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు ఉండదు. కేవలం వాయిస్ కాల్స్కు మాత్రమే ఇది పరిమితం.
మరెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయరాదూ!